పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల కలకలం | gun firing in west godavari district sarpanch over Land disputes | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల కలకలం

Published Sun, May 29 2016 10:45 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల కలకలం - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల కలకలం

ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది.

ఏలూరు: ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. భూ వివాదం విషయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.

వివరాల్లోకి వెళ్లితే...పాలకోడేరు మండల గొల్లలకోడేరు సర్పంచ్ సూర్యనారాయణ రాజు గ్రామానికి చెందిన చెరువు స్థలంలో మూడు సెంట్ల భూమిను బ్రాహ్మణ సంఘానికి కేటాయించాడు. దీనిపై రామకృష్ణరాజు అనే వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ స్థలం రాజులకు చెందినదని, బ్రాహ్మణులకు కేటాయించడం సరికాదని ఆదివారం ఉదయం సర్పంచ్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. దీంతో మాటామాటపెరగడంతో రామకృష్ణరాజు తనదగ్గరున్న రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. కాగా, తుపాకీతో తనను బెదిరించినట్టు సర్పంచ్ సూర్యానారాయణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రామకృష్ణరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement