ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్ | head constable caught by acb in guntur district | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్

Published Mon, Jun 6 2016 6:44 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్ - Sakshi

ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్

గుంటూరు: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తాడేపల్లికు చెందిన ఓ వ్యక్తి పాస్పోర్టు కోసం అప్లై చేసుకున్నాడు. వెరిఫికేషన్ క్లియరెన్స్ కోసం కానిస్టేబుల్ వీరయ్య అతన్ని రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్న సమయంలో స్టేషన్లో లంచం తీసుకుంటుండగా వీరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement