bribery
-
క్యాడర్ను బట్టి లంచం!
సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్ఆర్ నమోదు చేయలేదని మరొక మెడికల్ ఆఫీసర్... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్ డిక్లరేషన్(రెగ్యులరైజేషన్) చేశారని ఇంకొకరు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్వో కార్యాలయం అవినీతిపై మెడికల్ ఆఫీసర్ (ఎంవో)లు అధికారిక వాట్సాప్ గ్రూప్లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్వో మంతనాలు! తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్వో... కొందరు మెడికల్ ఆఫీసర్లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్వో బతిమిలాడినట్లు సమాచారం. అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్ ఆఫీసర్లు సైతం పీహెచ్సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఎంహెచ్వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్కుమార్ సత్పతి, చేతన్కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
అన్నీ పొలిటికల్ బదిలీలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఎమ్మెల్యేల సిఫారసు లేకుండా ఏ ఉద్యోగి, ఏ అధికారి కూడా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గంలోని కార్యాలయంలోనైనా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించాలని కలెక్టర్లకు కూడా అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. సీనియారిటీ, ప్రతిభను కూడా పక్కన పెట్టి కేవలం సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరపాలని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వారే పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి మాత్రమే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలా లక్షకుపైగా సిఫారసు లేఖలు ఎమ్మెల్యేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 సిఫారసు లేఖలు ఇచ్చారని, కొందరు 250 నుంచి 300 లేఖలు కూడా ఇచ్చారని సమాచారం. జిల్లాకు సగటున 4 వేల సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 5 వేలకు పైగా సిఫారసు లేఖలు రావడంతో ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. బదిలీల్లో ఇంతటి రాజకీయ జోక్యం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎప్పుడూ చూడలేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ, పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పటికీ బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలా జిల్లాల్లో పాత తేదీలు వేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనధికారికంగా వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.‘దక్షిణ’ ఇస్తే ‘దమ్మున్న’ పోస్టింగ్ నియోజకవర్గాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో ఉంచుకునేలా ఎమ్మెల్యేలు అనువైన వారిని గుర్తించి సిఫారసు లేఖలు ఇచ్చారు. ఎక్కువ ముడుపులు ఇచ్చిన వారికి ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించారు. కుల ప్రాతిపదికన కూడా చాలామందికి సిఫారసు చేశారు. ఇందుకోసం అప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని బలవంతంగా లూప్లైన్లోకి, అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయించారు. కొందరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ పక్కన పెడుతున్నారు. కొన్నిచోట్ల బదిలీల జాబితాలో ఉన్న పేర్ల పక్కన టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థం అని రాశారు. టీడీపీకి అనుకూలమైన వారికే నియోజకవర్గాల్లో పోస్టింగ్కి అనుమతిస్తున్నారు. లేకపోతే లూప్లైన్లోకి పంపించేస్తున్నారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా తమ వారినే నియమించుకుంటున్నారు. నిబంధనలు బేఖాతరు బదిలీల్లో నిబంధనలను అసలే పట్టించుకోవడంలేదు. తహశీల్దార్లను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయకూడదనే నిబంధనను అన్ని చోట్లా తుంగలో తొక్కారు. కాగితాలపై ఆ నియోజకవర్గం కాదని చూపించి మరీ సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఇదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పనిచేస్తున్న తహశీల్దార్ తన సొంత నియోజకవర్గమైన భీమవరం వేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చినా అధికారులు కాదనలేని పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్పై ఏసీబీ కేసు ఉన్నా ప్రధానమైన పోస్టు కోసం అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేల లేఖలను తప్పనిసరిగా ఆమోదించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున నిబంధనలకు విరుద్ధమైన వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వక తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్లు కట్టబెట్టారు. పోస్టింగ్ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు
సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లకు సాక్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు విచారణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కేసును రీ ఓపెన్ చేయాలని కర్నూలు కోర్టును ఏసీబీ అధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీబీ 2014లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయవాది ఎస్ఎం సుభానీ వాదనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చెప్పలేకపోయారని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించుకోలేదన్నారు. వీఆర్వో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీబీ కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. కర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కేసులను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేçÜులో వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం సరికాదన్నారు. మూసివేసిన సాక్ష్యాలను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం కల్పిస్తోందన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవినీతి కేసులను మూసివేయకుండా న్యాయాధికారులకు ఆదేశాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను న్యాయమూర్తి ఆదేశించారు. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్ఫ్రీ నంబర్ 14400, ఏసీబీ యాప్ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్(వైఎస్సార్ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్ కరుణకుమార్ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు. తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్ (రుద్రంపేట) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్ ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్ చేశారు. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్గౌడ్లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్గౌడ్కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
అనంతపురం కార్పొరేషన్లో వసూళ్ల పర్వం
ప్రభాకర్: నమస్తే .. సార్ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. ప్రభాకర్: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్.. అధికారి: అవునా.. ఏం అర్జెంట్ పని ఉందా.. ప్రభాకర్: అవును సార్.. చాలా పని ఉంది అధికారి: అయితే నీ ఫోన్ నంబర్ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. ప్రభాకర్: ఎంత ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్ ఇస్తా. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు సెక్షన్లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. నగరంలో వేణుగోపాల్నగర్లో నివాసముంటున్న ప్రభాకర్ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్ (పేరుమార్చాం)కి బర్త్ సరి్టఫికెట్ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. ఉద్యోగుల చేతివాటం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
లంచం కేసు.. సీఐ శంకరయ్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ) -
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్కమల్, సీఐ ప్రేమ్కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్స్
సాక్షి, హైదరాబాద్ : గూడ్స్ ఆటో డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అప్జల్ గంజ్ పీఎస్కు చెందిన కానిస్టేబుల్స్ ముఖేష్, సురేష్ ఆదివారం గూడ్స్ ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్గంజ్ సీఐకి చార్జ్ మెమో జారీ చేశారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
సాక్షి, సిద్దిపేట: లంచాలు అడిగే అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా మున్సిపల్ కొత్త చట్టం లో నిబంధనలు పొందు పరిచారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలోని పలు వార్డుల్లో తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోయాయన్నారు. సిరిసిల్లకు యాభై ఏళ్ల దరిద్రం వది లిందన్నారు. కేటీఆర్ చొరవతో అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. -
ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!
జెరూసలేం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై లంచగొండితనం, మోసం, నమ్మకద్రోహం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నెతన్యాహు, ఆయన భార్య కొంతమంది బడా వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినందుకు గానూ దాదాపు 2 లక్షల అరవై వేల డాలర్లను విలాస వస్తువుల రూపంలో స్వీకరించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్ మాండెల్బ్లిట్ 63 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మూడేళ్ల దర్యాప్తులో భాగంగా నెతన్యాహు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం లంచాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ‘ వ్యక్తిగతంగా ఈ విషయం నన్నెంతగానో బాధిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రధానికి వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు.. న్యాయ వ్యవస్థపై ఇజ్రాయెల్ ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చాటిచెప్పేందుకే మీ అందరి ముందుకు వచ్చాను అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తనపై అభియోగాలను లంచగొండులైన న్యాయవాదుల తిరుగుబాటుగా ఆయన అభివర్ణించారు. ‘విచారణ జరిపిన వారి గురించి విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. స్వయంప్రతిపత్తి గల సంస్థ చేత ఇలాంటి వాళ్లపై విచారణకు కోర్టు ఆదేశించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా... ‘ ఈ దేశం కోసం నా జీవితాన్ని ధారబోశాను. యుద్ధం చేశాను. గాయపడ్డాను. అంతర్జాతీయ వేదికపైన ఇజ్రాయెల్ను ఓ బలమైన శక్తిగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేశాను. దేశ శ్రేయస్సుకై పోరాడి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను. అయితే ప్రస్తుత సంఘటనలు నన్ను, నాకు అండగా నిలిచిన వారిని అగాథంలోకి నెట్టేశాయి’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు చేయబడిన మొదటి ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. అదే విధంగా ఈ ఆరోపణలు రుజువు అయినట్లయితే తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా... కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఇజ్రాయెల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నెతన్యాహు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఖరీదైన నగలు, సిగరెట్లు తదితర వస్తువులు లంచంగా స్వీకరించారంటూ ప్రస్తుతం ఆయనపై చార్జిషీట్ నమోదైంది. ఈ క్రమంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రధానిగా సేవలు అందించిన నెతన్యాహు లికుడ్ పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1993లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వివిధ పదవులు అలకరించారు. -
రూ.లక్ష లంచం తీసుకుంటూ..
లక్ష్మీపురం (గుంటూరు): వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్ బుధవారం గుంటూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్ కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్బాబు సిబ్బందితో పట్టుకున్నారు. అదనపు ఎస్పీ సురేష్బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్) సరఫరా చేస్తుంటారు. అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరై మూడు నెలలు అవుతున్నా అనేక కొర్రీలు పెడుతూ అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ వేధిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్కు కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును బాపట్ల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు అందజేయాలని సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ వచ్చి రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. దీంతో డాక్టర్ ప్రసన్నకుమార్తోపాటు గోపీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అవినీతిని ‘కాల్’చేస్తున్నారు!
పెద్దపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.2,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. కామారెడ్డికి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్సై లంచం అడిగినందుకే క్రిమినల్ మిస్ కండక్ట్ కింద ఏసీబీ అధికారులు కేసులు బుక్ చేశారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న ఒక్కో అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తున్నారు. అవినీతిపై మీడియా ప్రచారం, ఇటు ఏసీబీ చర్యలు వెరసి ప్రజల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బాధితులు ఒక్కొక్కరు ముందు కొస్తున్నారు. బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం మొదలుకుని మిగిలిన 33 జిల్లాల కార్యాలయాలకు ప్రతీరోజూ పలువురు బాధితులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతీ కార్యాలయానికి రోజుకు ఐదు నుంచి 10 వరకు బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రజల్లో పెరిగిన చైతన్యంతో ఏసీబీ రెట్టింపు దూకుడుతో పనిచేస్తోంది. ఓ వైపు ప్రజలను వేధించే అవినీతి జలగలకు వల వేస్తూనే.. మరోవైపు అక్రమంగా దోచే సిన సొమ్ముతో ఆస్తులు కూడబెడుతున్న వారిపై దాడులు చేస్తోంది. వరంగల్ జోన్ నుంచే ఎక్కువగా.. ఏసీబీని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో వరంగల్ (కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్), హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి), రూరల్ హైదరాబాద్ (నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్) జోన్లుగా ఉన్నాయి. వీటికి డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాల అనంతరం కూడా వాటి బాధ్యతలను కూడా వారే చూసుకుంటున్నారు. ఈ మూడు జోన్లలో వరంగల్ నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో గ్రామీణ ప్రాం తాల్లో రెవెన్యూ, గ్రామ పంచాయతీ విభాగాలపై ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ జోన్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు క్లియర్ చేసేందుకు అధికారులు లంచం అడుగుతున్నారు. ఇందులో పోలీసు, ఎక్సైజ్, జీఎస్టీ, రెవెన్యూ మొదలుకుని దాదాపుగా అన్ని విభాగాలున్నాయి. ఈ మూడు జోన్లలో తక్కువ ఫిర్యాదులతో హైదరాబాద్ రూరల్ నిలిచింది. ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫోన్ కాల్స్లో 50 శాతం మాత్రమే కేసుల వరకు వెళ్తున్నాయి. ఫిర్యాదు చేసిన తరువాత చాలామంది తర్వాత పరిణామాలకు భయపడి వెనకడుగు వేయడమే దీనికి కారణం. దీంతో అధికారులు రూట్ మార్చారు. ఆడియో, వీడియోలతో చెక్.. ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏసీబీ అవినీతి అధికారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల్ని లంచాలడిగి పీడిస్తోన్న అధికారులను చాకచక్యంగా పట్టుకుంటోంది. ముందుగా లంచం అడిగే అధికారి సంభాషణలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారి ఆఖరి నిమిషంలో లంచం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోయినా, ఫిర్యాదుదారుడు వెనక్కు తగ్గినా.. లంచం అడిగిన అధికారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేయడం నేరమే. అందుకు క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 7ఏ/2018 పీసీ సవరణ చట్టం ప్రకారం కేసులు బుక్ చేస్తున్నారు. దీంతో లంచం అడిగేందుకు అధికారుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. -
పైసలిస్తే.. పట్టా చేసేస్తారు!
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): పట్టాదారు ఎవరైనా సరే.. పైసలిస్తే ఎవరి పేరుపైనైనా పట్టా ఇచ్చేస్తారు.. తమ్ముడి జైలుకి వెళ్తే.. అన్న పేరిట పట్టా చేస్తారు.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం వీఆర్ఓల బదిలీలతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీఆర్ఓలు గ్రామాల్లో రికార్డు అనుభవం ఉన్న వ్యక్తులను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులైన రైతుల భూములను రికార్డుల్లో మార్పు చేస్తున్నారు. భూ రికార్డుల్లో నమోదు చేయాలంటే భూమి కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల తర్వాత మీసేవలో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత జిరాక్స్ డాక్యుమెంట్, ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి విక్రయ పత్రాలు లేకుండానే, ఇళ్ల స్థలాల భూమిని ఏకంగా పట్టాభూమిగా మార్చి రికార్డులోకి ఎక్కించారు. ఈ విషయం విలేకరుల దృష్టికి వచ్చిందని తెలుసుకున్న అధికారులు పట్టా మార్పిడి నంబరును ఆన్లైన్లో తొలగించారు. గండేడ్ తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపడితే మరిన్ని అక్రమ భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. తేదీ లేకుండానే ప్రొసీడింగ్స్ మండలంలోని కొత్తమొల్గరలో సర్వే నంబరు 379లో ఇళ్ల స్థలాల పేరిట రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే సర్వే నంబరులో ఎకరా భూమి ప్రభుత్వం గతంలో పేదలకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఉండటంతో డిజిటల్ సైన్ ఆన్లైన్లో పెండింగ్ ఉంచారు. కొత్త మొల్గరకు చెందిన కె.తిమ్మయ్య, నర్సమ్మ పేరు మీద ఒక్కొక్కరికి గాను 0.0250 గుంటల భూమిని పట్టా చేశారు. 60073, 60074 ఖాతా నంబర్లు సైతం ఆన్లైన్లో ఎక్కించారు. భూత్పూర్ తహసీల్దార్ మహేందర్రెడ్డి కె.తిమ్మయ్య, నర్సమ్మలపై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్స్ జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండానే పట్టా మార్పు చేసినట్లు తెలిసింది. ప్రజావాణిలో ఫిర్యాదుతో.. అలాగే మండలంలోని పోతులమడుగు అనుబంధ గ్రామమైన గోపన్నపల్లిలో సర్వే నంబరు 165లో ఎకరా భూమిని కొనుగోలు చేసుకొని పట్టా చేసుకున్నారు. చెన్నయ్య 2012లో మృతి చెందడంతో భార్య మాల ఊషమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. భర్త మృతి చెందిన కొద్ది నెలలకే మాల ఊషమ్మ సైతం మృతిచెందింది. ఈమెకు మాల శంకరయ్య, వెంకటయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబరు 165లో ఉన్న ఒక ఎకరా భూమిని విరాసత్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే వెంకటయ్య భార్య మరణించిన కేసులో ఆయనకు మూడు నెలల జైలుశిక్ష పడింది. వెంకటయ్య జైలులో ఉన్న సమయంలోనే ఆయన అన్న శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, సంబంధిత అధికారులతో కుమ్మక్కై మొత్తం తన పేరిట పట్టా చేయించుకున్నాడు. జైలును శిక్ష అనుభవించి వచ్చిన వెంకటయ్య ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నేళ్లు వలస వెళ్లాడు. ఏడాది క్రితం భూమి విషయమై అన్న శంకరయ్యను అడగగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరగడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య గత నెల 24న ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్థానిక తహసీల్దార్కు శంకరయ్య ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయం చేయాలి.. నేను నా భార్య మృతి కేసులో మూడు నెలలు జైలు జీవితం అనుభవించే సమయంలో రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని మా అన్న పేరిట పట్టా చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న శంకరయ్యతో కలిసి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. పంచనామాలో ఇద్దరు పేర్లు రాసిచ్చాం. ఇద్దరికి భూమి చేయకుండా మా అన్న శంకరయ్య పేరిటే విరాసత్ చేశారు. విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. విరాసత్ ప్రకారం నా భాగం నాకు పట్టా చేయాలి. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్లోకి ఫస్ట్ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
డూప్లికెట్ మెమోకు లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి డూప్లికేట్ మెమోకు లంచం తీసుకుంటుండగా ప్రభుత్వ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్రావు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. తనకు డూప్లికేట్ మెమో జారీ చేయాలని అహ్మద్ అబ్దుల్ హసీబ్ అక్బర్ భాస్కర్రావును కోరాడు. అయితే మెమో ఇచ్చేందుకు రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కర్రావు డిమాండ్ చేశాడు. దీంతో హసీబ్ అక్బర్ ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం అక్బర్ వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా భాస్కర్రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా భాస్కర్రావు డూపికేట్ మెమోకు రూ.1,500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు తెలిపారు. మూడేళ్లలో ఇది రెండోసారని, భాస్కర్రావును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. -
లంచమిచ్చినా జైలుకే
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు. -
‘లంచం లేనిదే పని కావడం లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : నగర పాలక సంస్థ అధికారులపై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం లేనిదే ఏ పని కావడం లేదని మండిపడ్డారు. ప్రతి పేద వాడి దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అధికార టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు చెప్పినట్టు అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అందరికి ఒకేలా పని చేయాలని.. ఇలా వ్యవహరించటం తప్పని.. హితవు పలికారు. అధికారుల తీరు మారకుంటే చూస్తు ఊరుకునేది లేదని బాషా హెచ్చరించారు. -
కాటేసిన లంచం
లంచం అడిగితే చెప్పుతో కొట్టండని రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.ఇదే లంచం ఓ రైతు కుటుంబాన్నిబలి తీసుకుంది. కాసిపేట (బెల్లంపల్లి): రుణం మంజూరు కోసం లంచం ఇచ్చుకోలేక ఓ రైతు భార్యా ఇద్దరు పిల్లలకు విషం తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో వ్యవసాయం వదిలి టెంట్హౌస్ కోసం ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ను కలసి తన దీనస్థితిని వివరించగా.. స్పందించిన ఆయన యూనిట్ మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ రుణం మంజూరుకు రూ.20 వేలు లంచం అడగడంతో ఇప్పటికే అప్పుల పాలైన తాను లంచం ఇచ్చుకునే స్థితిలో లేనని, ఇక రుణం రాదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న రాత్రి భార్య భూదేవి (31), కుమార్తె కీర్తన (14), కుమారుడు శిశాంత్ (12)లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకున్నాడు. అందరూ తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం జరగలేదు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న తిరుపతి.. బుధవారం రాత్రి భార్యాపిల్లలకు యాపిల్ జ్యూస్లో క్రిమిసంహారక మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య మృతి చెందింది. ముగ్గురూ చనిపోయినట్లు భావించిన తిరుపతి.. తన అన్నయ్య శంకర్కు ఫోన్ చేయగా.. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం శంకర్ తిరిగి ఫోన్ చేయగా కొద్దిగా స్పృహలోకి వచ్చిన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మానాన్నలు చనిపోయినట్లు విలపిస్తూ చెప్పారు. దీంతో శంకర్ హుటాహుటిన వచ్చి పిల్లలను బెల్లంపల్లి ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ కోలుకుంటున్నారు. వాయిస్ రికార్డు.. సూసైడ్నోట్ తిరుపతి ఆత్మహత్య చేసుకునే సూసైడ్ నోట్, ఫోన్లో వాయిస్ రికార్డు చేశాడు. తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.6.5 లక్షల వరకు అప్పులు అయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనా దానిని ఇప్పించేందుకు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ప్రణయ్ సార్ (జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని పేర్కొన్నాడు. రుణం మంజూరు కాకపోవడం, అప్పులబాధ భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించాడు. గ్రామస్తుల రాస్తారోకో: లంచం అడిగి దంపతుల మృతికి కారకుడైన జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చొప్పరిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయా లని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మందమర్రి సీఐ రాంచందర్రావు భరోసా ఇవ్వడంతోఆందోళన విరమించారు. నాన్ బెయిలబుల్ కేసు పెడతాం: ఏసీపీ అప్పుల విషయంలో ఒత్తిడి తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిపై, లంచం అడిగిన ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. మంజూరైన రూ.5 లక్షల రుణాన్ని కలెక్టర్తో మాట్లాడి తిరుపతి కుటుంబానికి అందించేలా చూస్తామన్నారు. పిల్లలు చదువుకునేందుకు సహకరిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. డబ్బులు అడగలేదు: ఎంపీడీఓ బెల్లంపల్లి రూరల్: తిరుపతిని ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం ఎవరూ డబ్బులు అడగలేదని బెల్లంపల్లి ఎంపీడీఓ వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గతనెల 11న ఆన్లైన్లో అఫ్రూవల్ ఇచ్చామని పేర్కొన్నారు. రుణం మంజూరయ్యాక ఆ డబ్బులు అప్పులు కట్టుకోకుండా యూనిట్ పెట్టుకోవాలని చెప్పామే తప్ప కార్యాలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని ఆయన స్పష్టం చేశారు. రుణం మంజూరు చేశాం ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో తిరుపతి పేరు ఉంది. అతడి దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ సిఫారసుతో రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తూ ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చాం. రుణం మంజూరు అయిన విషయాన్ని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి ఎంపీడీఓ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేశాం. రూ.5 లక్షల రుణంలో రూ.2 లక్షలు బ్యాంకు రుణం కాగా.. మిగతా రూ.3 లక్షలు సబ్సిడీని వర్తింప చేశాం. రుణం మంజూరు కోసం డబ్బులు ఎవరడిగారో నాకు తెలియదు. రుణం మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చాక కూడా తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అర్థంకావడం లేదు. – హరినాథ్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వర్సిటీ వీసీ
సాక్షి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టు కోసం సురేశ్ అనే అభ్యర్థి వీసీ గణపతిని సంప్రదించాడు. అయితే, ఆయన రూ.35లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీనిపై సురేశ్ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.లక్ష నగదు, రూ.29 లక్షలకు చెక్కులను వీసీకి ఆయన నివాసంలో అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలపై వర్సిటీ ప్రొఫెసర్ ధర్మరాజ్పైనా కేసు నమోదు చేశారు. ఇద్దరి నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరెన్సీ నోట్లను చించివేసి డ్రైనేజీలో పడ వేసిన వీసీ భార్య స్వర్ణలతపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
విద్యాశాఖలో అవినీతి పురుగు!
కె.జమ్మయ్య..గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుండగా సస్పెండ్కు గురయ్యారు. రీపోస్టింగ్ కోసం ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన శ్రమ ఫలించింది. రీపోస్టింగ్ కోసం కావాల్సిన పత్రాలను పంపించాలని విద్యాశాఖాధికారులు సూచించారు. దీంతో డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న ఎ.విక్టర్ప్రసాద్ను ఆశ్రయించారు. అయితే చేయి తడిపితేనే ఫైల్ కదులుతోందని తెగేసి చెప్పేశాడు. దీంతో చేసేది లేక రూ. 20 వేలు ఇచ్చేందుకు జమ్మయ్య ఒప్పుకున్నారు. ఇప్పటికే ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆయన అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. వారిచ్చిన సలహా మేరకు జమ్మయ్య మంగళవారం సూపరిటెండెంట్ విక్టర్ప్రసాద్కు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్ప్రసాద్ను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. శ్రీకాకుళం సిటీ: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ స్థాయి అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడటంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నానికి చెందిన కె.జమ్మయ్య 1984 జనవరి 27న భామిని మండలం గురండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తరువాత వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహించారు. ఇతని భార్య విజేత యాగ్రోఫాం ఫైనాన్స్ సంస్థలో ఏజెంట్గా పని చేస్తుండేవారు. సంస్థకు, వీరికి మధ్య ఆర్థికపరమైన వివాదాలు తలెత్తాయి. దీంతో జమ్మయ్య కుటుంబంపై ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు 2002లో క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు జమయ్యను అరెస్టు చేశారు. ఆ సమయంలో చంగుడి ఎంపీ యూపీ స్కూల్లో ఎస్జీటీగా జమ్మయ్య పని చేస్తుండేవారు. బత్తిలి పోలీస్స్టేషన్లో ఆయనపై కేసు నమోదవ్వగా, 2003 ఆగస్టు 17ను జమ్మయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి 2010 నవంబర్ 11వ తేదీన జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. అయితే అప్పటి నుంచి గతేడాది ఆగస్టు వరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకుండా శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేశారు. దీంతో జమ్మయ్య తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇప్పటివరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలిపాలని ఆదేశిస్తూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి అతనికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్ ఫైల్ డీఈవో కార్యాలయంలో కనిపించకపోవడంతో జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ నెలలో ఆయనకు చెందిన సర్వీసు రిజిస్టరు ఫైల్ దొరికింది. అయితే అతనికి అనుకూలంగా ప్రభుత్వానికి నివేదికను పంపించేందుకు విద్యాశాఖ సూపరింటెండెంట్ ఎ.విక్టర్ప్రసాద్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేíశారు. చేసేదిలేక జమయ్య అంగీకరించారు. తరువాత ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జమ్మయ్య నుంచి సూపరింటెండెంట్ విక్టర్ప్రసాద్ లంచంగా 20 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్ప్రసాద్ను బుధవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాసరావు, రమేష్ పాల్గొన్నారు. విసిగిపోయాను రీ పోస్టింగ్ కోసం ఏడేళ్లు నిరీక్షించాను. జాప్యం జరగడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తొలుత ఫైలు కనిపించలేదని ఇక్కడి అధికారులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఫైల్ కనిపించడంతో ఊరట చెందాను. ఇప్పటికే నా కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితిలో రీ పొస్టింగ్ కోసం సూపరింటెండెంట్ విక్టర్ప్రసాద్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. – కె.జమ్మయ్య, బాధితుడు -
కోటి ఇస్తామన్నారు
గాంధీనగర్: పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బీజేపీకి పటేళ్ల బలం పెరుగుతోందనే భావన వ్యక్తమైంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.. చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించి.. శనివారం బీజేపీలో చేరిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని విమర్శించింది. అటు, పటేళ్ల సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదంటూ నిఖిల్ సవానీ అనే పటీదార్ నేత కమలం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. కోర్టు నేతృత్వంలో విచారణ జరగని పక్షంలో గుజరాత్ ఎన్నికల పవిత్రతపైనే అనుమానాలు తలెత్తుతాయన్నారు. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ భయపడుతోందని.. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేస్తోందన్నారు. ప్రధాని గుజరాత్ ప్రజలకు వరాలు ప్రకటించేందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని మనీశ్ తివారీ ఢిల్లీలో ఆరోపించారు. -
రూ.10 వేలు తీసుకుంటూ.. పట్టుబడ్డాడు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోనున్న వేసైడ్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్ కంట్రోలర్ అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. ఆ రిపోర్ట్ ఎలా ఉన్నా తాను చూసుకుంటానని, రూ.పది వేలు ఇవ్వాలని హోటల్ యజమాని వెంకటేశ్వరరావుతో శ్రీనివాసరెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఇన్స్పెక్టర్ తేజేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
♦ సాదాబైనామా’కురూ.27వేలు డిమాండ్ ♦ తన గదిలో లంచం తీసుకుంటూ ♦ పట్టుబడిన వీఆర్వో రవి వైరా : సాదా బైనామా ప్రక్రియ పూర్తి చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాం డ్ చేసిన వైరా ఇన్చార్జ్ వీఆర్వో మీనుగు రవిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాలు ఇలా.. వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన న్యా యవాది జోనబోయిన గోవిందరావు..తన 7.5 ఎకరాలు, తన సోదరుడికి చెం దిన మరో రెండు ఎకరాల భూమి నిసాదాబైనామా కింద ఆన్లైన్ చే యాలని ఏడాదికాలంగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. అష్ణగుర్తి, గొల్లెనపాడు వీఆర్వోగా చేస్తున్న రవి, వైరా ఇన్చార్జ్గా కూడా ఉండడంతో..ఆయనను కలిశారు. 1బీ, ఆన్లైన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.27వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో..బాధితుడు ఏసీబీ కార్యాలయంలో సంప్రదించారు. వారి సూచనల మేరకు డబ్బు తీసుకొని వీఆర్వోకు ఫోన్ చేయగా..బ్రాహ్మణపల్లిలోని తన గదికి రావాలని సూచించగా..అక్కడికి వెళ్లి లంచం ఇస్తుండగా..ముందగానే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, సిబ్బంది ఉన్నారు. రైతుల గోడు..: ఏసీబీ డీఎస్పీని పలువురు రైతులు కలిసి..తహసీల్దార్ కార్యాలయంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా..ఈ విషయమై బాధ్యులైన అధికారిని ఆయన ప్రశ్నించారు. విసిగిన లాయర్ తెగువతో.. ఖమ్మంలో నివాసముంటున్న న్యాయవాది జోనబోయిన గోవిందరావు సాదా బైనామా ప్రక్రియ కోసం దాదాపు ఏడాదికాలంగా..వైరాకు వచ్చి వెళుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని, వంశపారపర్యంగా వచ్చిన భూమిని నిబంధనల ప్రకారం కేటాయించాలని దరఖాస్తు చేసుకోగా..ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వీఆర్వో రవి ఎకరానికి రూ.10వేలు నుంచి రూ.20వేలు తీసుకుంటానని, లాయర్ కాబట్టి తగ్గించి తీసుకుంటున్నాని ఇబ్బంది పెట్టాడని, గతంలో రూ.6వేలు ఇచ్చానని తెలిపారు. చివరకు ఎకరానికి రూ.3వేల చొప్పున ఇవ్వాల్సిందేనని, ఆఫీసులో మిగతావారికి వాటా ఇస్తానని పట్టుబట్టడంతో.. విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. గోవిందరావు, న్యాయవాది ప్రతి పనికీ ఓ లెక్క..ఆయన గదే అడ్డా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో రవి వైరా గ్రామ పంచాయతీ ఇన్చార్జ్. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ప్రతి పనికీ ఓ లెక్క ఏర్పాటు చేసుకొని కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత మండల అధికారి కనీసం మందలించలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గది ఉన్నా..బ్రాహ్మణపల్లిలో ఓ కిరాయి గదిని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొణిజర్ల, మధిర మండలాల్లో పనిచేసిన చోట కూడా వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారనే మచ్చుంది. ఉలిక్కి పడ్డ వైరా..అప్పుడు వారిపై..ఇప్పుడు ఇతడిపై 2007లో వైరాలో మోటారు వాహనాల తనఖీ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరావు..ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. ఈ కార్యాలయంలో ఎంవీఐగా పనిచేసిన ఎండీ.గౌస్ పాషా కొత్తగూడెం ఎంవీఐగా బదిలీపై వెళ్లాక కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు రెవెన్యూ విభాగంలో వైరా ఇన్చార్జ్ వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశమైంది. ఏసీబీ అధికారుల దాడితో..కొన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రక్రియ చేపడుతుంటే..అవినీతికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూడడంతో..రైతులు, సామాన్యులు దీనిపై చర్చించుకున్నారు. -
ప్రతి పనికీ ఓ లెక్క..పత్రం ఏదైనా పక్కా..!
♦ నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో లంచావతారాలు ♦ ఉద్యోగులకు లేని రోగాలు ఉన్నట్లు సృష్టించి ధ్రువపత్రాల జారీ ♦ దళారుల సాయంతో అక్రమ దందా ♦ మనిషిని చూడకుండానే పత్రాలు అందజేత అదో ప్రభుత్వ వైద్యశాల.. జిల్లాలో పల్నాడు ప్రాంతానికి ఆయువుపట్టు.. అక్కడ లంచావతారాలెత్తిన అధికారులదే హవా.. అక్రమ సర్టిఫికెట్లకు వాళ్లు కేరాఫ్ అడ్రస్.. వారికి డబ్బులిస్తే చాలు.. మనిషిని కూడా చూడకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేంత ఘనులు.. వారి వద్ద ఎప్పుడూ ‘జీ.. హుజూర్..!’ అంటూ దళారులు. ప్రతి పనినీ చాకచక్యంగా చేసిపెట్టడం వారి ప్రత్యేకత. సొంత పనులు చూసుకుని.. అసలు పనిని పక్కన పెట్టే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫినెస్ సర్టిఫికెట్లు అందజేయడం వీళ్ల పని. సర్టిఫికెట్ను బట్టి రేటు కట్టి.. ఉద్యోగి అవసరాన్ని బట్టి ధర మార్చి డబ్బు పోగుచేసుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి..! – నరసరావుపేట టౌన్ నరసరావుపేట : వైద్యశాలలో రోగులకు వైద్యసేవలు అందించాల్సిన అధికార సిబ్బంది అక్రమ దందాకు తెరతీశారు. ఏం చేసినా అడిగేవారు లేరనే ధైర్యంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అలాంటి అక్రమ దందాకు నరసరావుపేట ఏరియా వైద్యశాల వేదికైంది. ఉద్యోగులు కోరిన రీతిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తూ రూ. వేలల్లో డబ్బు దండుకుంటూ వైద్యాధికారులు పబ్బం గడుపుకొంటున్నారు. ఈ వ్యవహారంలో దళారులదే కీలక పాత్ర. వారు చెప్పిందే శాసనంగా మారింది. ధ్రువపత్రం కావాల్సిన ఉద్యోగి లేకుండానే అతని పేరిట సర్టిఫికెట్ అందుతుందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగులు అనారోగ్యం పాలైతే తిరిగి ఉద్యోగంలో చేరడానికి యాజమాన్యాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాంటివారికి ఫిటెనెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం సబబు. అయితే.. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సొంత పనుల కోసం విధులకు హాజరు కాకుండా రోజుల తరబడి గడిపి విధుల్లో చేరాలంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ధ్రువపత్రం తప్పనిసరి. అలాంటి వారిని గుర్తించి దళారులు చక్రం తిప్పుతున్నారు. వేలకు వేలు డబ్బులు దండుకొని ఉద్యోగులకు ఏదో ఒక జబ్బు ఉన్నట్లు చిత్రీకరించడం లేదా సదరు ఉద్యోగులు ఫిట్గా ఉన్నారని సర్టిఫికెట్లు ఇవ్వడం ఆస్పత్రిలో నిత్య కృత్యంగా మారింది. కనీస విచారణ కూడా లేదు.. డబ్బు ముట్టజెప్తే ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికైనా వైద్యాధికారులు సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా దళారులను కూడా నియమించడం విశేషం. పత్రాలు అవసరమైన వారు దళారుల సాయంతో సర్టిఫికెట్లు పొందుతున్నారు. సదరు వైద్యులు కనీస విచారణ కూడా లేకుండా సంతకాలు పెట్టి పంపడం గమనార్హం. కొందరి పేర్లను కనీసం ఓపీలో కూడా రాయకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే అధికారుల ధనార్జన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ, రైల్వేశాఖ, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కువశాతం ఫిట్¯నెస్లు కోరుతుండటంతో అక్రమార్కుల దందా మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నెలలో కనీసం 30 నుంచి 40 మంది ఇలా అక్రమంగా సర్టిఫికెట్లు పొందుతారని ఓ అంచనా. గతంలోనూ విమర్శలు.. అధికార పార్టీ అండదండలతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలక్రితం నిబంధనలకు విరుద్ధంగా ఔషధాల దహనం చేసిన అధికారులు నిన్నామొన్న రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ విమర్శలపాలయ్యారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమ పద్ధతిలో ధ్రువపత్రాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా పల్నాడు ప్రాంతానికే తలమానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జరగడం గమనార్హం. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ... ఏరియా వైద్యశాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతోనే ఈ పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో శిశుమరణాలు సంభవించినా, రోగులకు బయట మందులు, స్కానింగ్ పరీక్షలు రాసినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. వైద్యశాలలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యరంగంపై దృష్టి సారించిన కలెక్టర్ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. అంతా దళారులదే హవా... వైద్యశాలలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిందే. ఒక్కో సర్టిఫికెట్కు ఒక్కో ధర నిర్ణయించి ఇక్కడి సిబ్బంది పనులు చక్కబెడుతుంటారు. వివరాలు ఇస్తే మనిషితో కూడా పని లేకుండా సర్టిఫికెట్ నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఒక్కో సర్టిఫికెట్కు ఇచ్చే రోజుల కాలవ్యవధిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి రోగిని పరీక్షించిన అనంతరం డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండగా అసలు రోగిని పరీక్షించకుండానే వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడం కొసమెరుపు. -
దినకరన్కు మరిన్ని కష్టాలు...
ఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్పై ఎన్నికల కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ వ్యవహారం కేసులో దినకరన్తో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి విజయ్భాస్కర్పైనా కేసు నమోదు అయింది. మరోవైపు దినకరన్పై ఈడీ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. విచ్చలవిడిగా సాగిన ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఈసీఎస్ అధికారులు - వారి నుంచి రూ.10 లక్షల నగదు, చెక్కులు స్వాధీనం ఉక్కునగరం (గాజువాక): ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు పడ్డాయి. కరెంటు ఫేజ్ మార్చడానికి రూ. లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. వారి వద్ద నుంచి నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పరవాడ బోనంగిలో సంస్కృతి గ్లోబల్ స్కూల్కు చెందిన టూ ఫేజ్ కరెంటును త్రీ ఫేజ్గా మార్చేందుకు పాఠశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై ఆర్ఈసీఎస్ కశింకోట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) నక్కా సురేష్, పరవాడ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) దాసరి శివశంకర్ ప్రసాద్ మొదట రూ. 14 లక్షలు డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేమని బతిమాలగా రూ. 9 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని అధికారులు చెప్పారు. దీంతో పాఠశాల చైర్మన్ పి.సూర్యనారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సలహా మేరకు గురువారం వారు అడిగిన రూ.3 లక్షలు నగదు, రూ.1.20 లక్షలు చొప్పున ఐదు చెక్కులను సిద్ధం చేయగా.. ఆ విషయం తెలిసిన ఇద్దరు అధికారులు సరాసరి స్కూల్ చైర్మన్ ఇంటికే వచ్చేశారు. అక్కడకు చేరుకున్న ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది అధికారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ అధికారులను వెంటనే అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ లంచం కేసులో పట్టుకున్న అతి పెద్ద కేసు ఇదే అన్నారు. నగదుతో పాటు చెక్కులు తీసుకోవటం ఆశ్చర్యకరమన్నారు. -
లైసెన్స్ జారీకి లంచం డిమాండ్
ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు. హైదరాబాద్లోని బడంగ్పేట్కు చెందిన సమీర్.. ‘మై టీ’ పేరుతో టీ కప్పుల బిజినెస్ ప్రారంభించాడు. అమెరికా, కెనడాలకు ఎగుమతి చేసేందుకు పైటో శానిటరీ లైసెన్స్ కోసం ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అథారిటీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న స ంబంధిత అధికారులు అతుల్ ఠాక్రే, మనోజ్.. సమీర్కు రూ.15 వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో సమీర్ ఈ విషయాన్ని సీబీఐకి ఈనెల 10న ఫిర్యాదు చేశాడు. -
ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే..
► గర్భిణిని లంచం డిమాండ్ చేసిన వైద్యుడు ► పసిపిల్లలను ఇవ్వాలన్నా సొమ్ము ఇవ్వాల్సిందే మల్కన్గిరి: మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వ లేకుండా ప్రవర్తించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఖోయిరాపుట్ సమితి బొండాçఘాట్లోని మందిలిపొడియా గ్రామంలోని బొండా తెగకు చెందిన గిరిజన మహిళ గురుసీసా రెండోసారి గర్భం దాల్చింది. కడుపులో కవలలు ఉన్నట్టు గ్రామంలో మంత్రసాని తెలిపింది. నెలలు నిండిన ఆమెను ప్రసవం కోసం మంగళవారం ఆమె భర్త, తమ్ముడు మల్కన్గిరి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో విదుల్లో ఉన్న వైద్యుడు నిర్మల్నాయక్ ఆమెను పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలి..రూ. ఐదువేలు ఇవ్వండి..లేకుంటే ఆపరేషన్ చేయనని చెప్పాడు. దీంతో ఏమీ తోచక గర్భిణితో పాటు భర్త, సోదరుడు అరగంట సేపు అలానే ఉన్నారు. గురుసీసాకు చికిత్స అందించండి అని వేడుకున్నారు. వైద్యుడు రూ.మూడు వేలు ఇవ్వమన్నాడు. ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే ఇవ్వాలని వైద్యుడు తెగేసి చెప్పాడు. దీంతో గురుసీసా తమ్ముడు అక్కడ ఎవరినో అడిగి రెండు వేల రూపాయలు ఇవ్వడంతో వైద్యుడు ఆపరేషన్ చేశాడు. పిల్లలు ఇద్దరూ క్షేమంగా∙పుట్టారు. కానీ తక్కువ బరువు ఉండడంతో పిల్లలను ఐసీయూలో పెట్టారు. అయితే మిగతా మూడు వేలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని వైద్యుడు చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే పిల్లలు చనిపోయారని సర్టిఫికెట్ ఇస్తానని బెదిరించాడు. స్పందించిన ఎమ్మెల్యే దీంతో గురుసీసా భర్త వెంటనే మల్కన్గిరి ఎమ్మెల్యే మనాస్మడకామిని కలిసి విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని సీడీఎంఓ ఉదయ్ చంద్రమిశ్రా, ఎడీఎం రఘుమణి గొమాంగోలతో కలిసి వార్డుకు వచ్చి గురుసీసా భర్తను విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను పరిశీలించారు. అనంతరం వైద్యుడు నిర్మల్నాయక్ను ఆ వార్డులో విధుల నుంచి సీడీఎంఓ తొలగించారు. అనంతరం సీడీఎంఓ ఉదయ్ చంద్ర మిశ్రో మాట్లాడుతూ నిర్మల్నాయక్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేరు. ఆయన వస్తే వైద్యుడ్ని సస్పెండ్ చేయిస్తాం..ఇకపై ఎక్కడా ఇలా ప్రవర్తించకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మానాన్మాడకమి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలన్నీ త్వరలోనే గురుసీసాకు అందజేసి వైద్యునిపై చర్య తీసుకుంటామని చెప్పారు. -
ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తమశీల్దార్..
► రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి ► భూసేకరణ డబ్బులిచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూశాఖలో అవినీతి మరో సారి కట్టలు తెంచుకుంది. ఎన్హెచ్ భూసేకరణలో భూమి కోల్పోయిన వారి కి పరిహారం అందించేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ.1.30 లక్షలు తీసుకుంటూ వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ టి.శ్రీనివాస్గౌడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, బాధితుడు మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. హన్మకొండ జులైవాడకు చెందిన రిటైర్డ్ ఎస్సై సీహెచ్ మధుసూదన్రెడ్డి 2010లో స్టేషన్ ఘన్పూర్ వద్ద ఎన్హెచ్–163 పక్కన 464 చదరపు అడుగుల స్థలం కొన్నారు. ఆ స్థలం తన కూతురు స్వాతి పేరుతో రిజిస్టర్ చేయిం చారు. ఈ భూమిలో కొంత మేరకు రోడ్డు విస్తరణలో పోయింది. ఈ భూమి ని ప్రభుత్వం సేకరించినందుకు బాధితులకు పరిహారం చెల్లించాలి. ఈ మేరకు బాధితులకు రూ.7.11లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఇవ్వడానికి వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలోని డీటీ టి.శ్రీని వాస్గౌడ్ రూ.2లక్షలు డిమాండ్ చేశారు. ముందు లంచం ఇస్తేనే ఫైల్ మీద సంతకం చేయించి ఇస్తామని చెప్పాడు. దీంతో లంచం ఇచ్చుకోలేక బాధితులు గత నెల 30న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అంతేకాకుండా బాధితులు కలెక్టర్కు, జేసీకి ఫిర్యాదుచేశారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం సు మారు 7 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు రా ఘవేందర్రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఇదే రికార్డు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంలో ఇదే రికార్డు. గతంలో కలెక్టరేట్లో పట్టుబడ్డ డీపీఓ రూ. 1లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. తొమ్మిది నెలలుగా వేధించారు.. మా భూమికి పరిహారం ఇచ్చే విషయంలో సుమారు తొమ్మిది నెలలుగా మమ్మల్ని వేధించారు. ప్రతిరోజు ఉదయం రావడం సాయంత్రం వరకు ఇక్కడే ఉండటం నాకు డ్యూటీగా అయింది. పరిహారం ఇవ్వాలంటే రూ.2లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.1.50 లక్షలకు ఒప్పుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్కు తిరిగే క్రమంలో నాకు యాక్సిడెంట్ కూడా అయింది. వేధింపులు భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశా. – మధుసూదన్రెడ్డి , బాధితుడు -
ఏసీబీ వలలో జియమ్మవలస ఎమ్మార్వో
జియలమ్మవలస: డబ్బు కో్సం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. తాజాగా ఓ రైతు నుంచి తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. విజయనగరం జిల్లా జియమ్మవలసకు చెందిన ఓ రైతు వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న తహిశీల్దార్ కొల్లి వెంకటరావును ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఆయన్ని విచారణ చేపడుతున్నారు. పార్వతీపురంలో ఉన్న తహశీల్దార్ నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ విషయంలో మనమే టాప్!
బెర్లిన్/న్యూఢిల్లీ: ప్రభుత్వాలు మారినా, అధికారం చేతులు మారుతున్నా ఇండియాలో అవినీతి రేటు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లకింద చేతులు పెట్టే ఆనవాయితీకి అడ్డుకట్ట పడడం లేదు. ఆసియా పసిఫిక్ లో అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చామని మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' నిర్వహించిన సర్వే తెలిపింది. అమ్యామ్యాలు సమర్పించుకున్నామని భారత్ లో 69 శాతం మంది చెప్పారు. ఇండియా తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. లంచాలు ఇచ్చామని వియత్నాంలో 65 శాతం మంది వెల్లడించారు. పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. జపాన్ అతి తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంతో పోలిస్తే చైనాలో 73 శాతం అవినీతి పెరిగిందని సర్వే అంచనా వేసింది. 16 దేశాల్లో 20 వేల మంది అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో 90 కోట్ల మంది గత సంవత్సర కాలంలో కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చారని ఈ సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవడంతో పోలీసులు అందరి కంటే ముందున్నారని వెల్లడించింది. 'అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలకు లంచాలు సమర్పించుకుంటున్నారు. అవినీతి కారణంగా ఎక్కువగా పేదలే నష్టపోతున్నార'ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధిపతి జోస్ ఉగాజ్ పేర్కొన్నారు. -
లంచం ఇస్తేనే మరుగుదొడ్డి బిల్లు?
మౌలిక వసతుల కోసం ఫిర్యాదులు గ్రీవెన్స్సెల్లో దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ వరంగల్ అర్బన్ : స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్డి బిల్లు రావాలంటే రూ. 2 వేల లంచం అడుగుతున్నారంటూ పైడిపల్లికి చెందిన పలువురు బాధితులు కమిషనర్ శృతిఓజాకు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్ సెల్ కార్యక్రమం జరిగింది. కమిషనర్ శృతి ఓజా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, మహిళ సంఘాల లీడర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు కమిషనర్కు వివరించడంతో అవాక్కయ్యారు. వెంటనే విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కనీస వసతులైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పైపులైన్లు కోసం ఫిర్యాదులు అందాయి. ఇంజినీరింగ్ విభాగం కోసం 25 ఫిర్యాదులు రాగా, టౌన్ప్లానింగ్కు 8, జనరల్ విభాగానికి 10, ప్రజారోగ్యంకు 3, పన్నుల విభాగానికి 3, అర్బన్ మలేరియాకు 1 చొప్పన ఫిర్యాదులు అందాయి. మడికొండ ఎంఎన్ నగర్లో మౌలిక వసతులు, 39వ డివిజన్లో శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేశారు. 52వ డివిజన్ మొయిన్ రోడ్డు బాపూజీ నగర్లో 30 వ డివిజన్లోని లోటస్ కాలనీలో డ్రైయినేజీలు దెబ్బతిని, మురుగు నీరు పారుతుందని, కొత్తగా నిర్మించాలని కోరారు. ఉర్సు డీకే నగర్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ముగ్గురు లబ్ధిదారులు కమిషనర్ శృతి ఓజాను వేడుకున్నారు. పింఛన్ ఇప్పించండి నాకు రెండు కళ్లు కనబడవు. వందశాతం అంధుడిగా ఎంజీఎం వైద్యులు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. గత ఏడాది 4వ నెలలో పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. విచారణ చేశారు. ఇంతవరకు పింఛన్ రాలేదు. ఎలాగైనా పింఛన్ డబ్బులు ఇప్పించండి. – గిరిబాబు, అంధుడు -
ఏసీబీకి పట్టుబడిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
-
ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
రూ.6 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఎస్ఈ, సూపరింటెండెంట్ ఆస్తులపై సోదాలు నల్లగొండ క్రైం: ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్ఈని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. ఇలా చిక్కారు.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన శాస్త్రీ వివేకానందరెడ్డి పుష్కరాల సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్వో ప్లాంట్లు సహా మొత్తం 39 పనులను చేపట్టాడు. టెండర్ లేకుండా కాంట్రాక్టర్కు అప్ప గించడంతో పనులు పూర్తి చేశాడు. 30 పనులకు బిల్లులు చెల్లించగా, మిగిలిన తొమ్మిది పనులకు రూ.30 లక్షల బిల్లులు రావాల్సి వుంది. ఈ బిల్లుల కోసం కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం సూపరిం టెండెంట్ లక్ష్మారెడ్డిని కలవగా రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో వివేకా నందరెడ్డి ఏసీబీ నల్లగొండ డీఎస్పీ కోటేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుం డగా అక్కడే కాపుగాసిన ఏసీబీ అధికారులు లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. బిల్లుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈని హైదరాబాద్లో.. లంచం విషయంలో లక్ష్మారెడ్డిని ప్రోత్సహిం చిన ఎస్ఈ రమణను ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆస్తుల ను తనిఖీ చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
కేజ్రీవాల్కు ఈసీ మందలింపు
ఓటుకు ‘లంచం’వ్యాఖ్యలపై మండిపాటు న్యూఢిల్లీ: గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఓటుకు లంచం వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మరోసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఆప్ గుర్తింపు రద్దుతో పాటు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని హెచ్చరించింది. ‘కాంగ్రెస్, బీజేపీలు వచ్చి డబ్బులు పంచుతాయి. వాటిని తీసుకోండి. ఓటు మాత్రం ఆప్కే వేయండి’ అని గోవాలో ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ గతంలో అన్నారు. దీనిపై ఈసీ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈసీ ఆదేశాలను కేజ్రీవాల్ తప్పుపట్టారు. దీనిపై కోర్టులో సవాలు చేస్తానన్నారు. ‘కింది కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఈసీ దాన్ని పట్టించుకోలేదు’అంటూ ఢిల్లీ సీఎం ట్వీట్ చేశారు. ఈసీకి ఇచ్చిన సమాధానంలో కూడా కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానే ఓటరుకీ లంచం ఇవ్వజూపలేదని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో వాటర్షెడ్ టీఏ
మార్కాపురం: ఇద్దరు రైతుల నుంచి లంచం తీసుకుంటున్న వాటర్షెడ్ పథకం టెక్నికల్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న వాటర్షెడ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన సీహెచ్ చిన్న సాల్మన్, పెద్దనాగులు ఈ ఏడాది మేలో తమ పొలంలో పంట సంజీవని పథకం కింద నీటి కుంటలు తొవ్వుకున్నారు. ఒక్కో కుంటకు 1.80 లక్షల రూపాయలతో వాటర్షెడ్ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (కాంట్రాక్టు ఉద్యోగి) త్రిపురారెడ్డి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలు నుంచి బిల్లులు మంజూరు చేయకుండా రైతులను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కరు తనకు 20 వేల రూపాయలు ఇస్తేనే నిధులు మంజూరు చేయిస్తానని రైతులతో చెప్పాడు. ఈ నెల 13న సాల్మన్, పెద్ద నాగులు కలిసి ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాటర్షెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన పది రూ.2 వేల నోట్లు మొత్తం రూ.20 వేలు బాధిత రైతులకు ఇచ్చారు. ఆ నగదు తీసుకున్న రైతులు నేరుగా త్రిపురారెడ్డి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన వెంటనే ఆ నగదును జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐ ప్రతాప్కుమార్ల ఆధ్వర్యంలో ఎస్ఐ కరీముల్లా, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్లు లోపలికి వెళ్లి త్రిపురారెడ్డిని అదుపులోకి తీసుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. తమను ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో విసిగి వేసారి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ వార్త పట్టణంలో క్షణాల్లో తెలిసి పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
సచివాలయంలో ఏసీబీ దాడులు
అమరావతి: ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ను వలపన్ని పట్టుకున్నారు. శ్రీనాథ్ హోంశాఖ విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలుతున్న మామూళ్ల మతాబు!
– వాణిజ్య పన్నుల శాఖ అధికారుల 'దీపావళి' దందా – పండుగ మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు.. షాపును బట్టి రేట్లు – ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో బెదిరింపులు కర్నూలు(రాజ్విహార్): దీపావళి పండగకు మామూళ్ల మతాబులు పేలుతున్నాయి. పండగ సందర్భంగా బాణా సంచా సామగ్రి అమ్మే దుకాణాల నుంచి కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులను.. తనిఖీల పేరుతో బెదిరిస్తున్నారు. ఆర్డీఓ లైసెన్స్లు ఇచ్చినా.. సాధారణంగా ప్రతి ఏటా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన స్థలంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు సంబంధిన రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) అనుమతులు ఇస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖ, పోలీసుల, అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో బాణాసంచా అంగళ్లు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే వ్యాపార లావాదేవీలను బట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు అధికారులు సందట్లో సడేమియాలా మామూళ్ల దందాకు తెరలేపారు. దీపావళి టపాసులు అమ్మే వ్యాపారుల నుంచి రూ.2వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. సామూహికంగా ఏర్పాటు చేసే షాపులతోపాటు చిన్నాచితకా కిరాణం షాపుల వద్ద బాణాసంచా సామాగ్రి తెచ్చుకునే వారి నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టారు. రూ.7.50లక్షల వరకు మినహాయింపు ఉన్నా.. చిరు వ్యాపారులు.. వాణిజ పన్నుల శాఖ లైసెన్స్లు కలిగి ఉండరు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. రూ.7.50లక్షలకు పైబడి లావాదేవీలకు ఉన్న అంగళ్ల నుంచి 14.5శాతం పన్నులు వసూలు చేస్తారు. కాని ఆ కింది స్థాయి అధికారులు ఈ నిబంధన పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేశారు. కొందరు ఏసీటీఓలకు తోడు ఉద్యోగులు జతకట్టి బాణసంచా దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కింది నుంచి పైవరకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఒక్కోక్క దుకాణం నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాదూకూడదంటే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలులోని పాతబస్టాండ్, నెహ్రూ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మామూళ్లు ఇవ్వనందుకు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ దందా లక్షల రూపాయాలకు చేరినట్లు తెలుస్తోంది. అధికారులు, వ్యాపారులకు మధ్య కొందరు అకౌంటెంట్లు, ఆడిటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి : పి. నాగేంద్ర ప్రసాద్, సీటీఓ, కర్నూలు–1సర్కిల్. పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలి. రూ.7.50లక్షల లోపు వ్యాపారం ఉంటే ట్యాక్స్ పరిధిలోకి రారు. మామూళ్లు అడుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం. -
రూ.3.5 లక్షలకు గాంధీలో ఉద్యోగం!
చిలకలగూడ: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన బాబు(30) గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన బాలానగర్కు చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అదేవిధంగా పరిచయం అయిన మరో ముగ్గురుతో కలిసి ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమకు తెలిసిన వారికి చెప్పారు. బాలానగర్కు చెందిన బాలకృష్ణ ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడని తెలుసుకున్నారు. అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.5 లక్షలకు బేరం కుదర్చుకుని పథకం ప్రకారం బాలకృష్ణ నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆరునెలలైనా ఉద్యోగం రాకపోవడం, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండడంతో అనుమానం వచ్చిన బాలకృష్ణ 20 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆరా తీయగా, ల్యాబ్ టెక్నిషియన్ బాబును విధుల్లోంచి తొలగించినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా సభ్యులు బాబు(30), శ్రీనివాస్(31), శ్రవణ్(31)లను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఎస్ఐ మోహన్ తెలిపారు. -
వీఆర్వోల లంచావతారం
పట్టాదారు పాసుపుస్తకాలు, కంప్యూటర్ అడంగళ్లు, భూముల వివరాల కోసం కొందరు వీఆర్వోలు అన్నదాతలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తాజాగా సోమవారం తెలంగాణలోని రెండు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వీఆర్వోల లంచావతారం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామ పంచాయితీలో లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గ్రామానికి చెందిన గౌడ సమ్మయ్య అనే రైతు నుంచి స్థానిక వీఆర్ఓ కొత్తూరి రవీందర్ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రందించాడు. ఈ క్రమంలో ఈ రోజు రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వీఆర్ఓ మల్లేశం, దుర్గయ్య అనే రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పెద్ద కల్వల గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతు తన భూమి మ్యుటేషన్ కోసం వీఆర్ఓకు దరఖాస్తు చేసుకోగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. 5 వేల రూపాయలు ఇదివరకే ఇచ్చినా పనిచేయకపోవడంతో పాటు మిగతా డబ్బులు కూడా ఇవ్వాలన్నాడు. చివరకు రూ.10 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ వెనక్కి..
లండన్: డోపింగ్ పరీక్షల గురించి ముందుగానే సమాచారం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలపై కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ మైకేల్ రోటిచ్ను రియో గేమ్స్ నుంచి వెనక్కి రప్పించారు. సండే టైమ్స్, జర్మనీ టీవీ చానెల్ ఏఆర్డీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో అతను దొరికిపోయాడు. 10 వేల పౌండ్లు ఇస్తే డోపింగ్ చేసిన అథ్లెట్లకు టెస్టుల గురించి ముందుగానే సమాచారం చేరవేస్తానని ఇందులో తేలింది. దీంతో రోటిచ్ను కెన్యా అథ్లెటిక్స్ సమాఖ్య వెంటనే వెనక్కి రప్పించింది. -
ఒక పిల్లి కథ
హ్యూమర్ప్లస్ మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే. తల్లి భాష వల్ల ఒక పిల్లి చిక్కుల్లో పడింది. పాలగిన్నెని చూసినప్పుడల్లా ‘మ్యామ్యా’ అని మాతృభాషలో అరవడం వల్ల దానిపై ఏసీబీ అధికారుల కన్నుపడింది. వచ్చిపోయే వాళ్లందరిని ‘అమ్యామ్యా’ అని లంచం అడుగుతూందని కేసు కట్టి జైల్లో వేశారు. మరుక్షణమే ఊచల్లోంచి దూరి పిల్లి బయటికొచ్చింది. ‘‘నేతితో తప్ప నీతి అవినీతులతో నాకు సంబంధం లేదు’’ అని జైలు అధికారిని పిల్లి ప్రశ్నించింది. అలవాటుకొద్దీ అధికారి వెంటనే ఒక నివేదిక రాశాడు ‘‘కాలం మారుతున్నా జైళ్లు మారడం లేదు. ఊచల్ని గడ్డిపోచలుగా లెక్కేసే రోజులొచ్చాయి. మనుషులతో పాటు జంతువుల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. అవి వృత్తి నేరస్తులుగా మారిపోతున్నాయి. మనుషుల్ని జంతువులుగా చూడడం అధికార ధర్మం. కానీ జంతువులను ఎలా చూడాలన్నది ధర్మ సందేహం. నేరస్తుల్ని చావబాదాలన్నా, బాది చంపాలన్నా ముందు వాళ్లు పారిపోకుండా చూడడం మన విధి. అందువల్ల ఊచల డిజైన్ మార్చాలని విన్నవిస్తున్నాను’’ అని ఒక ఫైల్ తయారుచేశాడు. అనేక అధికారుల చేతులు మారి ‘జైలు ఊచలు ఉంచా రహ్నా’ అనే నినాదంగా తయారై ఒక కమిటీ ఏర్పాటైంది. ఒక భౌతిక శాస్త్రవేత్త, నైతిక తత్వవేత్త, రాజకీయ భోక్త ఇలా పలువురితో కూడిన కమిటీ జైలుకొచ్చి ఊచల పొడవు, వెడల్పు చుట్టుకొలత, మందం, వైశాల్యం అన్నింటిని కొలతలు తీసుకుని వెళ్లింది. ఇదంతా చూసి పిల్లి పకపక నవ్వింది. ‘‘హాస్యం అంతరించిపోయి మనుషుల జీవితాలన్నీ రహస్యంగా మారిపోతున్న ఈ రోజుల్లో కూడా నవ్వుతున్నావంటే నువ్వు మామూలు పిల్లివి కాదు’’ అన్నాడు అధికారి. ‘‘నేను మామూలు పిల్లినే, అందుకే నవ్వుతున్నా. నాన్సెన్స్కి, సైన్స్కి తేడా తెలియదు మీకు. నా మెడలో ఒక గంట కడితే నేనెక్కడికి పారిపోతాను చెప్పు’’ అంది పిల్లి. ‘‘గంట కట్టాలని నాకు తెలుసు. కానీ ఈ విషయం పై అధికారికి చెప్పేదెవరు? బాస్కి ఎంత తెలుసో, అంతకంటే మనకు తక్కువ తెలిసుండాలి. బాస్కి ఏది తెలియదో, అది మనకు ఎప్పటికీ తెలియకూడదు. బాస్కి ఏబీసీడీలు రాకపోతే మనం ‘ఎ’ని గుర్తుపట్టనట్టు నటించాలి. నటన వల్లే నాలుగు వేళ్లు లోనకెళతాయి’’ అన్నాడు అధికారి. ‘‘స్వేచ్ఛగా కనిపిస్తూ బానిసల్లా జీవించేవాళ్లు మీరు. బానిసల్లా కనిపిస్తూ స్వేచ్ఛగా జీవించేవాళ్లం మేము’’ అంది పిల్లి. ‘‘నువ్వు పిల్లివి కాబట్టి ఫిలాసఫీ చెప్పడం కరెక్ట్ కాదు. స్వేచ్ఛే ముఖ్యమనుకుంటే నువ్వెందుకు పారిపోలేదు?’’ ‘‘మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే.’’ ఇతరుల్ని పనిచేయిస్తుందో లేదో తెలియదు గాని, చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. పిల్లి ప్రభుత్వ ఉద్యోగే కానప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఏసీబీ అధికారులు గ్రహించారు. విరుద్ధాన్ని సమ్మతం చేసుకోవాలంటే ముందు దానికో గవర్నమెంట్ ఉద్యోగమిచ్చి, ఆ తర్వాత కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. యూనిఫాం తగిలించి, చేతికో కర్ర ఇచ్చి ఒక ఆఫీస్లో గార్డ్ ఉద్యోగమిచ్చారు. అలెర్ట్గా వుండి ఎలుకల్ని పట్టడం డ్యూటీ. ఆశ్చర్యంగా ఒక్క ఎలుక కూడా కనిపించలేదు. ఈ విషయమై ఒక క్లర్క్ని అడిగింది. ‘‘మనుషులే కలుగుల్లో దూరుకుని ఎలుకల్లా మారిపోతున్నారు. అందువల్ల ఎలుకెవరో, మనిషెవరో కనుక్కోవడం కష్టం’’ అన్నాడాయన. ఏం చేయాలో తెలియక పిల్లి డ్యూటీలో నిద్రపోసాగింది. బెస్ట్ గార్డ్గా రివార్డిచ్చారు. నిద్ర లేవగానే ‘క్యాట్సప్’ అని అభినందించేవాళ్లు. ఒకరోజు మూడుసార్లు నిద్రపోయి లేచేసరికి ‘క్యాట్రిక్’ అని అరిచారు. ఇదంతా విసుగెత్తి డ్యూటీ మానేసి రోడ్డుమీద వెళుతుంటే ‘బెస్ట్ క్యాట్వాక్’ అని మీడియా వచ్చి ఫొటోలు తీసింది. దొరికినవాణ్ని దొరికినట్టు కరిచింది పిల్లి. ‘‘ఇంట్లో సౌండ్ సిస్టమ్ చెడిపోతే వెంటనే రిపేరు చేయిస్తారు. మనం బతుకుతున్న సిస్టమే చెడిపోతే ఎవడూ పట్టించుకోడేంట్రా’’ అని కేకలు పెట్టింది. పిల్లి నడవడిక సిస్టమాటిక్గా లేదని దాన్ని వెంటనే జైల్లో పెట్టారు. - జి.ఆర్.మహర్షి -
లంచం అడుగుతున్నారు
టీఏపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన లకిమేర గ్రామస్తులు నరసన్నపేట : ‘మేం నిరుపేద కూలీలం. ఉపాధి పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఉపాధి అధికారుల సూచన మేరకు గ్రామంలో ఫారంఫాండ్ తవ్వాం. దీనికి రోజుకు రూ.35 మాత్రమే వేతనం పడింది. ఇదేమని టెక్నికల్ అసిస్టెంట్ త్రినాథరావును ప్రశ్నించగా ఒక్కో పాండ్కు రోజుకు రూ.190 వేతనం వచ్చేలా చేస్తాను.. అందుకు రూ. 3 వేలు నాకు లంచం ఇస్తారా అని అడిగారు’ అంటూ లకిమేర గ్రామానికి చెందినపలువురు ఉపాధి వేతనదారులు శుక్రవారం నరసన్నపేట ఎంపీడీఓ విద్యాసాగర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేతనదారులు వంజరాపు అప్పలరామయ్య, ఎల్. లక్ష్మి, ఆర్.లక్ష్మి, ఎ.కాళీప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ రెండు వారాలకు చెందిన సొమ్ము రావాల్సి ఉందని చెప్పారు. వారానికి రూ. 200 చొప్పున మాత్రమే వేతనం వస్తోందని వాపోయారు. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ‘చేప’
నిజామాబాద్ క్రైం: సబ్సిడీ చెక్కు ఇచ్చేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఫిషరీస్ అధికారి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. బోధన్ మండలం సంగెం గ్రామానికి చెందిన గంగాధర్ చేపల వ్యాపారి. చేపలు రవాణా చేసేందుకు వాహనం అవసరం కావడంతో, జిల్లా కేంద్రంలోని ఫిషరీస్ కార్యాలయంలో సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు 75 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల రుణం మంజూరైంది. అయితే, సబ్సిడీ చెక్కు వాహన షోరూంకు పంపిస్తే, వాహనాన్ని అందజేస్తారు. చెక్కును పంపించాలని గంగాధర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అధికారి రూపేందర్సింగ్ను కలిశాడు. అయితే, రూ.7 వేల ఇస్తే చెక్కును పంపిస్తానని ఆయన స్పష్టం చేశాడు. చివరకు రూ.5 వేలకు బేరం కుదిరింది. లంచం ఇచ్చేందుకు మనస్సు ఒప్పుకోకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు రసాయనాలు పూసిన రూ.5 వేల నోట్లను గంగాధర్కు అందజేసి, కార్యాలయం వద్ద మాటు వేశారు. బుధవారం సాయంత్రం రూపేందర్సింగ్కు డబ్బు ఇస్తుండగా, రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్లపల్లి జైలుకు పంపించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ నరేందర్రెడ్డి తెలిపారు. మరోవైపు, అదే సమయంలో సబ్సిడీ చెక్కు కోసం మరో లబ్ధిదారుడు బోధన్కు చెందిన శ్రావణ్ కూడా లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే రూపేందర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను కూడా డబ్బు అడిగాడని శ్రావణ్ తెలిపాడు. -
లంచం కేసులో తహసీల్దార్కు మూడేళ్లు జైలు
నెల్లూరు(లీగల్) : వ్యవసాయ భూమి పట్టాకోసం లంచం తీసుకున్నాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు జిల్లా రామసముద్రం తహసీల్దార్ పనిచేసిన సీమనపల్లి రెడ్డెప్పకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.90 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నరసింహరాజు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. రామసముద్రం మండలం బోగవాడి గ్రామానికి చెందిన ఫిర్యాది దొడ్డారెడ్డిగారి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి సదరు గ్రామ పరిధిలో 8 ఎకరాల కలప, మామిడి, వివిధ రకాలచెట్లున్నాయి. వాటిని కొట్టేందుకు అనుమతి, వ్యవసాయభూమి మార్చుకునేందుకు పట్టాకోసం 24-12-2012న రామసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాడు. సంబంధిత తహశీల్దార్ రెడ్డప్ప 15-02-2013న అర్జీలను పరిశీలించి తనకు రూ.40వేలు లంచం ఇస్తే అనుమతి ఇస్తామన్నాడు. రూ.20 వేలకు అంగీకారాన్ని కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాది 20-02-2013న తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన అధికారులు మరుసటి రోజు పుంగనూరులోని తన ఇంటి వద్ద ఉన్న తహసీల్దార్ ఫిర్యాదు వద్ద నుంచి లంచం తీసుకొని పక్కన ఉన్న డ్రైవర్కు ఇచ్చాడు. డ్రైవర్ ఆ డబ్బును లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని, రెడ్డప్ప, డ్రైవర్ పొన్నాల బాలమునిరెడ్డిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో రెడ్డప్పపై నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధించారు. కారుడ్రైవర్పై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ (సర్కిల్-18) జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆడిటర్(గణాంకాధికారి)గా పనిచేస్తున్న నిత్యానంద్ లంచం తీసుకుంటూ...శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రెజిమెంటల్బజార్కు చెందిన ఉమాదేవి, పద్మావతి ఇరువురు అక్కాచెల్లెల్లు. వారసత్వంగా వారి తల్లిదండ్రుల గృహం ఇరువురు అక్కాచెల్లెల్లకు వచ్చింది. సదరు గృహాన్ని గిఫ్ట్ డీడ్ చేసుకున్న ఉమాదేవి, పద్మావతి గృహం పేరు మార్పిడి కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని పన్నుల విభాగంలో నిత్యానంద్ను సంప్రదించారు. పేరుమార్పిడి కోసం ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో ఉమాదేవి ఎసీబీ అధికారులను సంప్రదించింది. వారు ముందస్తు వ్యూహం మేరకు ఉమాదేవికి రూ. 2000 నగదును ఇచ్చి పంపించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిత్యానంద్ చాంబర్కు చేరుకున్న ఉమాదేవి వెంటతెచ్చుకున్న డబ్బును అప్పగించింది. అప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాటువేసి ఉన్న ఏసీబీ డీసీపీ అశోక్కుమార్ బృందం దాడి చేసి నిత్యానంద్ తీసుకున్న లంచం డబ్బును స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైళ్లను, ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కృపాదానంను గత మే 11న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలలలోపే ఇరువురు అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలకలం సృష్టించింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
► కలెక్టరేట్ ఆవరణలో కలకలం ► పాఠశాల భవన నిర్మాణ బిల్లు చెల్లించేందుకు రూ.5వేలు డిమాండ్ ► గతంలోనూ రూ.45వేలు తీసుకున్న ఉద్యోగి నయీంనగర్ : జిల్లా పాలనకు కేంద్రబిం దువు, సాక్షాత్తు కలెక్టర్ విధులు నిర్వర్తించే జిల్లా కలెక్టరేట్లోని ఓ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా కలకలం సృష్టించింది. కలెక్టరేట్ ఆవరణలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల నిర్మాణం, బిల్లులు చెల్లింపు ఇతరత్రా వ్యవహారాలు కొనసాగుతారుు. ఇందులో భాగంగా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణ పనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆలకుంట్ల దుర్గయ్య పూర్తిచేశాడు. ఈ మేరకు చివరి విడత రూ.26లక్షల బిల్లు కోసం కార్యాలయంలోని ఏఈ ఎం.ఏ.అజీజ్ను సంప్రదించాడు. నిధులు విడుదల చేయూలం టూ రూ.5వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అరుుతే, గతంలో మొదటి, రెండో విడత బిల్లుల కోసం కూడా అజీజ్కు రూ.45వేల వరకు ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్గయ్య ఈసారి విసిగి పోయూడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సంప్రదించగా వారు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఏ ఈ అజీజ్కు ఆయన కార్యాలయంలో దుర్గయ్య రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సారుుబాబా ఆధ్వర్యంలో రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు సాంబయ్య, రాఘవేందర్రా వు పాల్గొన్నారు. కాగా, ఈనెల 1న ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20వేలు తీసుకుంటూ గ్రేటర్ వరంగల్ కాజీపేట సర్కిల్ కార్యాలయంలో టీపీఎస్ రమణయ్య, మేడారం జాతర పనుల్లో భాగంగా చిలుకల గుట్ట వద్ద నిర్మించిన సీసీ రోడ్డు పను ల బిల్లు చెల్లించేందుకు 6వ తేదీన రూ.40వేలు తీసుకుంటూ తా డ్వాయి పీఆర్ ఏఈ జీ.పీ.కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఇలా పది రో జుల్లోనే ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి దొరకడం గమనార్హం. కలెక్టరేట్లో ఇది ఆరో కేసు హన్మకొండ: గత సంవత్సరం కాలంలో కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయూల్లో లంచం తీసుకుంటున్న ముగ్గు రు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయూంశంగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఇప్పటి వరకు ఆరు మార్లు ఏసీబీ దాడులు జరగగా ఎనిమిది మంది ఉద్యోగులు పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీకి దొరికిన ఉద్యోగుల వివరాలిలా ఉన్నారుు. ♦ కలెక్టరేట్ సమావేశ మందిరం పైభాగంలో ఉన్న చిన్నమొత్తాల పొదుపు విభాగం ప్రత్యేక తహశీల్దార్గా పనిచేసిన పంత్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి రూ.3వేలు తీసుకుంటూ 2004లో ఏసీబీకి చిక్కారు. ♦ కలెక్టరేట్ ప్రగతి భవనంలోని సాంఘిక సంక్షేమ శాఖ డీఎస్డ బ్ల్యూవో వై.గాలయ్య.. వార్డెన్ మునిరుద్దీన్కు వైద్య బిల్లుల విషయంలో రూ.4వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ♦ సాంఘిక సంక్షేమ శాఖలో గాలయ్య స్థానంలో ఇన్చార్జ్గా ఉన్న డీఎస్డబ్ల్యూవో ప్రభాకర్ కూడా అదే వార్డెన్ మునీరుద్దీన్ పదోన్నతి విషయంలో లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ♦ కలెక్టరేట్లోని ‘సీ’ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీల్ తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో 1 జూలై 2015న ఏసీబీ అధికారులు వల పన్నగా ఆయన చిక్కారు. ♦ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డీపీఓ ఈఎస్.నాయక్ కారుణ్య నియూమకం విషయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇంత నగదుతో ఏసీబీకి దొరకడం జిల్లాలో ఇదే ప్రథమం. కాగా, ఇదే అంశంలో రూ.5వేల చొప్పున లంచం తీసుకుంటున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణికి పట్టుబడ్డారు. ♦ ప్రస్తుతం కలెక్టరేట్ ఆవ ణలోని టీఎస్డబ్ల్యూఈఐడీసీ ఉద్యోగి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోనిఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి ఉమామహేశ్వర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం కూడా ఏసీబీకి చిక్కారు. అరుుతే, ఈ దాడులు కలెక్టరేట్ ఆవరణలో జరగలేదు. -
మేమే డొనేషన్ ఇస్తాం.. సమన్లు తీసుకోండి
♦ లంచం ఇవ్వబోయిననిందితురాలితో సీసీఎస్ పోలీసులు ♦ విషయం తెలిసి సిబ్బందిని ప్రశంసించిన కమిషనర్ సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానం జారీ చేసిన సమన్లు ఇవ్వొద్దు. నేను అందుబాటులో లేనంటూ నమోదు చేసుకోండి. అందుకు ప్రతిగా రూ.500 ఇస్తా’ - సీసీఎస్ పోలీసులతో ఓ నిందితురాలి వ్యాఖ్య ‘అలా కుదరదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు అందుకోవాల్సిందే. అందుకు ప్రతిగా అవసరమైతే మేమే రూ.1000 డొనేషన్ ఇస్తాం’ - స్పష్టం చేసిన సీసీఎస్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అంశం మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి దృష్టికి వచ్చింది. జరిగిన విషయం ఆరా తీసిన ఆయన లంచం తిరస్కరించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఇదీ కేసు నేపథ్యం... నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ డెరైక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు 2013లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో కుమార్తెల ఫిర్యాదు మేరకు తల్లిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ సంస్థకు సీఎండీ వ్యవహరించిన యజమాని మరణానంతరం ఆయన కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యతలు స్వీకరించారు. మరో ఇద్దరు కుమార్తెలు బోర్డులో డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ కుటుంబానికే చెందిన మరో సంస్థకూ డెరైక్టర్. యజమాని భార్య సైతం అప్పటికే ఆ బోర్డులో డెరైక్టర్గా కొనసాగుతున్నారు. 2013లో ‘మరో సంస్థ’కు చెందిన కీలక డాక్యుమెంట్లు దాని కార్యాలయం నుంచి పోయాయని, అందులో తమ తల్లి ప్రమే యం ఉందని ఆరోపిస్తూ కుమార్తెలు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఏం జరిగిందంటే... సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసులో నిందితురాలి గా ఉన్న మహిళకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీటిని అందించడానికి సీసీఎస్ సిబ్బంది వెళ్లారు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించిన నిందితురాలు... పోలీసులకు రూ.500 లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. సదరు చిరునామాలో తాను అందుబాటులో లేనంటూ సమన్లు జారీ చేయవద్దని కోరారు. దీంతో సీసీఎస్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ... సమన్లు స్వీకరించాలని, వాటితో పాటు తామే రూ.1000 డొనేషన్గా ఇస్తామంటూ ఆమెకు స్పష్టం చేశారు. అప్పటికీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ సమన్లను ఆమె ఇంటి గేటు వద్ద అతికించి, ఆ ఫొటోలు తీసుకుని వచ్చా రు. ఈ కేసులో ఫిర్యాదుదారులు రెండు రోజుల క్రితం నగర కొత్వాల్ను కలిసి ‘రూ.500’ విషయంపై ఆయన కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆరా తీయగా... జరిగిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. లంచం తిరస్కరించడంతో పాటు సమన్ల జారీ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన సీసీఎస్ సిబ్బందిని ప్రశంసించారు. -
ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
గుంటూరు: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాడేపల్లికు చెందిన ఓ వ్యక్తి పాస్పోర్టు కోసం అప్లై చేసుకున్నాడు. వెరిఫికేషన్ క్లియరెన్స్ కోసం కానిస్టేబుల్ వీరయ్య అతన్ని రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్న సమయంలో స్టేషన్లో లంచం తీసుకుంటుండగా వీరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు
రాజమహేంద్రవరం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన భూగర్భ జలాలు, మైన్స్ శాఖ ఏడీ రౌతు గొల్ల కేసు విచారణలో అనేక ఆస్తులు బయట పడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడిలో శుక్రవారం ఏడీ రౌతు గొల్ల పట్టుబడిన విషయం విదితమే. రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన తాళ్ల చిరంజీవిరావు 7.50 ఎకరాల భూమిని గ్రావెల్ తవ్వుకునేందుకు లీజుకిచ్చే విషయంలో ఎకరానికి రూ.15 వేల చొప్పన రూ.1.50 లక్షలు లంచం అడిగారు. ఈ నేపథ్యంలో రైతు చిరంజీవిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రూ.75 వేలకు బేరం కుదిర్చి, ఏడీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదేరోజు ఏడీ ఇంటి వద్ద సోదాలు చేయగా, రూ.4.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో ఉన్న ఏడీ ఇంట్లో లాకర్ తాళం స్వాధీనం చేసుకున్నారు. ఈ లాకర్ను సోమవారం తెరవగా, అందులో 1,100 గ్రాముల బంగారం, విజయ వాడలో రెండు ఇళ్లకు సంబంధించిన పత్రాలు, రెండు భూములకు సంబంధించిన పట్టాలు లభ్యమయ్యాయి. అలాగే ఏడీ సొంత గ్రామమైన శ్రీకాకుళంలో అర ఎకరం భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. -
ఫోకల్ అధికారి.. అవినీతి సవారీ!
ఆర్డబ్ల్యూఎస్లో హల్చల్ అధికార పార్టీ నేతల అండ కాంట్రాక్టర్ల గగ్గోలు రూ.22 కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు ఆర్డబ్ల్యూఎస్లో ఆయనో అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితేనేం అధికార పార్టీ నేతల అండదండలతో ఫోకల్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్ల కోసం కాంట్రాక్టర్లను కాల్చుకుతింటున్నాడు. అయ్యగారి ‘ఆనందం’ కోసం ముడుపులు సమర్పించుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో పనంటే.. అయ్య ‘బాబో’య్ అనే పరిస్థితి నెలకొంది. విజయవాడ : అధికార పార్టీ నేతల అండతో ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం)లో ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్డంగా దోచేస్తున్నారు. పర్సంటేజీ డబ్బు కోసం కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తూ, బిల్లులు చేయటంలో ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్నా అధికార పార్టీ నేతలు ఆ బాబుపై వల్లమాలిన అభిమానం చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2014లో ఏసీబీ ట్రాప్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ అధికారి, తాను పనిచేసే శాఖ ముఖ్య ప్రజాప్రతినిధికి లక్షలు కుమ్మరించి ఆదాయం దండిగా వచ్చే గన్నవరం నియోజకవర్గంలో ఫోకల్ పోస్టింగ్ పొందారు. అంతేకాదు.. పామర్రు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతను కూడా అధికార పార్టీ నేత అండతో కైవసం చేసుకున్నారు. గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో రెండు ఫోకల్ పాయింట్లను దున్నేస్తూ, కాంట్రాక్టర్లను, ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడాదికాలంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు విలువైన బిల్లులకు ఆయన చెక్ మెజర్మెంట్ చేయటం గమనార్హం. ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న అధికారికి బిల్లులు, చెక్ మెజర్మెంట్ చేసి ఎంబుక్లు రికార్డు చేసే అధికారం లేదని, ఉయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని ఫోకల్ పోస్టింగ్ నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు. సదరు అధికారి తీరుతో పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.4 కోట్ల పనులకు ముగ్గురు కాంట్రాక్టర్లు... గన్నవరం నియోజకవర్గంలో పదిరోజుల క్రితం పైపులైన్ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. బాపులపాడులో జాతీయ రహదారి అధికారులు రోడ్ల విస్తరణకు సంబంధించి తాము చెల్లించాల్సిన రూ.4 కోట్ల పనులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా టెండర్లు పిలిపించారు. వీటికి కనీసం 30 మంది కాంట్రాక్టర్లు పోటీపడి 20 శాతం తక్కువకు టెండర్లు వేయాల్సి ఉందని, కేవలం ముగ్గురే టెండర్లు వేయటం, మిగిలినవారు వెనకడుగేయటం సదరు అధికారికి భయపడటం వల్లేనని ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడిందని తెలుస్తోంది. ఫిర్యాదులు ఇలా... ఇటీవల పామర్రు నియోజకవర్గంలో జరిగిన రూ.22 కోట్ల విలువైన పైపులైన్ పనులపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విజయవాడ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 కోట్లతో చేపట్టిన అయ్యంకి నుంచి మొవ్వ స్కీమ్, రూ.16 కోట్లతో అయ్యంకి వయా యలమర్రు మీదుగా వెంట్రప్రగడకు చేసిన వాటర్ స్కీమ్లపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. కొద్ది మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలోని యలమర్రు గ్రామ పంచాయతీలో ఓ బోరులో పాత మోటారు బిగించి కొత్తది కొన్నట్టు బిల్ చేశారు. దీనిపై రగడ జరగటంతో అధికార పార్టీ ముఖ్య నేత సహాయంతో బయటపడ్డారు. బాపులపాడు మండలంలోని పెలైట్ ప్రాజెక్టులో మోటార్లు లేకుండానే బిల్లులు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.నెల రోజుల క్రితం భూపతిరెడ్డి అనే కాంట్రాక్టరు పామర్రులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అందరూ ఉండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కనున్నవారు అతన్ని వారించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో సదరు అధికారి పెడుతున్న ఇబ్బందులే కారణమని అతను ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. నాలుగు మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలో బిల్లుల పెండింగ్ అంశంపైనే తీవ్ర ఆవేదనతో వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టరు తాను నిర్మించిన ట్యాంకు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కిందిస్థాయి అధికారులు జోక్యం చేసుకుని అతని సమస్య పరిష్కరించారు. -
కార్పొరేట్ కంపెనీల్లోనూ లంచాలు
లండన్ : కార్పొరేట్, ప్రముఖ కంపెనీల్లో లంచగొండితనం, అవినీతి పెరుగుతున్నాయి. ఈ నిజాన్ని ఆ కంపెనీల్లో పనిచేసే 80శాతం మంది ఎగ్జిక్యూటివ్ లే ఒప్పుకున్నారని యూకే న్యాయసంస్థ ఎవర్ సెడ్స్ సర్వే వెల్లడించింది. కంపెనీల్లో అవినీతి నిరోధక విధానాల అమలును పట్టించుకునే దిక్కే లేదని ఈ సర్వే పేర్కొంది. మొత్తం 12 దేశాల్లో 500 మంది బోర్డు లెవల్ ఎగ్జిక్యూటివ్ లపై జరిపిన సర్వేలో కంపెనీల్లో అవినీతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైయ్యాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసిన లంచం వ్యతిరేక విధానాలు సరిగ్గా పనిచేయడం లేదని 59శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కంపెనీలో మరో కంపెనీ విలీనం చేసేటప్పుడు, ఒక కంపెనీని మరో కంపెనీ స్వాధీనం చేసుకునేప్పుడు అవినీతి వ్యతిరేక విధానాలపై అసలు శ్రద్ధ వహించడం లేదని 33శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు చెప్పినట్టు సర్వే వెల్లడించింది. లంచం తీసుకోవడం, అవినీతికి పాల్పడటం వంటివి యూకేలో రాజకీయ సమస్యగా మారాయి. ఇవి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చట్టసభ సభ్యులు గుర్తించారు. ఈ సమస్యను రూపుమాపడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న స్పందనలపై చర్చించడానికి ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరూన్ వచ్చే వారంలో అవినీతి వ్యతిరేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరొందిన ప్రముఖులు, వ్యాపారస్తులు ప్రభుత్వాలకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు ఎగొట్టి, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ బిలియన్ ధనాన్ని దొంగ ఖాతాల్లో దాచుకున్నారని పనామా పేపర్ల కుంభకోణంతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిపిన సర్వేలో అసలు కంపెనీల్లో ఈ లంచగొండి వ్యతిరేక విధానాలు అమలుకావడం లేదని వెల్లడైంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు యూకే, ఇటలీ, బ్రెజిల్, హాంగ్ కాంగ్, చైనా కంపెనీల్లో 500 ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టారు. -
మహిళా తహశీల్దార్ అరెస్ట్...
- రూ.4.6లక్షలు స్వాధీనం ఎ.కొండూరు కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం తహశీల్దార్ ప్రశాంతిని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. పట్టాదారు పాసు పుస్తకం జారీకి గానుగురువారం రాత్రి బాణోతు గోపిరాజు అనే రైతు నుంచి ఆమె రూ.8వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రూ.4.60 లక్షలను గుర్తించారు. వాటికి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
ఆరు సార్లు దొరికి పోయాడు..
ఆదిలాబాద్ జిల్లా దహేగామ్ తహశీల్దార్ విశ్వంబర్ ఓ రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్లోని బాలాజీ నగర్ ప్రాంతంలో తహశీల్దార్ నివాసం వద్ద ఈ ఘటన చేసుకుంది. సోమయ్య అనే రైతుకు చెందిన భూమి పత్రాల్లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో వలవేసి పట్టుకున్నారు. తహశీల్దార్ ని అదుపులోకితీసుకుని విచారిస్తున్న అధికారులు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. తహశీల్దార్ విశ్వంబర్ కి ఇలా లంచం తీసుకుంటూ పట్టు బడటం లో బాగానే అనుభవం ఉంది. గతంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సార్లు ఏసీబీకి పట్టుపడ్డాడీ అధికారి. దీంతో షాక్ తిన్న అధికారులు.. పాత కేసులను సైతం తిరగతోడే పనిలో ఉన్నారు. మరో వైపు ఈ కార్యలయం అవినీతి అధికారులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతంలోనూ దహేగామ్ తహశీల్దార్గా పనిచేసిన అమృతరావు అనే అధికారి కూడా ఇదే రీతిలో ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. -
దొరికిపోయాడు
► లంచం తీసుకుంటూఏసీబీకి చిక్కిన ► అనంతగిరి రేంజ్ అటవీ అధికారి శృంగవరపుకోట/ అనంతగిరి : విశాఖ జిల్లా అనంతగిరి రేంజ్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న శోభా సుబ్బారావును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ అందించిన వివరాలిలాఉన్నాయి. అనంతగిరి మండలం టోకురు గ్రామ పంచాయతీ పరిధి జాకరవలస గ్రామానికి చెందిన నరాజి ప్రసాద్ తన ఇంట్లో ఫర్నీచర్ తయూరీ కోసం హుద్హుద్ సమయంలో కూలిన టేకుచెట్లను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి శోభా సుబ్బారావు నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ చేయడం నేరమని ప్రసాద్ను బెదిరించారు. కేసు లేకుండా చూడాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 11 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ప్రసాద్ సెక్షన్ ఆఫీసర్కు రూ. 2 వేలు ఇచ్చాడు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలకు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎస్.కోట రైల్వేస్టేషన్ రోడ్డులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుబ్బారావు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి ప్రసాద్ రూ. 9 వేలు సుబ్బారావుకు అందించాడు. సొమ్ము తీసుకుంటున్న సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని విచారించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతనిని అనంతగిరి మండలం ముళియాగూడ జంక్షన్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ విషయమై రేంజర్, గార్డులను కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఇంజినీర్
రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు మాడుగుల/ఎన్ఏడీ జంక్షన్ : రోడ్డు పనుల బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వల లో చిక్కుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.వి.ఆర్.కె.ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. వి.మాడుగుల మండల పరిధిలోని ముకుందపురం-బంగారుమెట్ట మధ్య రూ.35 లక్షల విలువైన రోడ్డు పనులను విజయనగరం జిల్లా ఎస్. కోటకు చెందిన పోలినాయుడు అనే కాంట్రాక్టర్ చేపట్టారు. తొలి విడతగా రూ.28 లక్షల బిల్లు పొంది పని పూర్తి చేశారు. మిగిలిన మొత్తం కోసం బిల్లు పెట్టుకున్నారు. అయితే దాన్ని మంజూరు చేయాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల పంచాయతీరాజ్ ఇంజినీరు సీహెచ్ అంబేద్కర్ బిల్లును తొక్కిపెట్టారు. బిల్లు కోసం గతంలోనే కొంత ముట్టజెప్పానని.. ఇప్పుడు అంత ఇవ్వలేనని తగ్గించాలని కాంట్రాక్టర్ కోరినా ఆయన అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మళ్లీ ఇంజీనీర్ అంబేద్కర్ వద్దకు వెళ్లి రూ.42 వేలు ఇవ్వడానికి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సొమ్ము తీసుకొని తాను ఉంటున్న విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డు ప్రాంతానికి రమ్మని ఇంజినీరింగ్ అధికారి సూచించారు. ఆ ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎన్ఏడీ కూడలిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు తీసుకుంటున్న ఇంజినీర్ అంబేద్కర్ను అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తి, రమేష్ పాల్గొన్నారు. ఆ ఏఈ తీరే అంత..! పంచాయతీరాజ్శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తూ గతేడాది ఆగస్టులో మాడుగుల మండల ఇంజినీరుగా బదిలీపై వచ్చినప్పటి నుంచీ అంబేద్కర్ వివాదాస్పదంగానే మసలుకుంటున్నారు. మండలంలో చేపట్టే అన్ని పనుల్లోనూ ఈ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు విశాఖ నుంచి మండలపరిషత్ కార్యాలయానికి రాకపోకలతో బిల్లులకు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడేవారు. స్వచ్ఛభారత్లో భాగంగా మండలంలోని ప్రతి గ్రామానికి రూ.కోట్లతో సీసీ రోడ్లు మంజూరయ్యాయి. వీటిని నిర్మించిన సర్పంచ్లు, కాంట్రాక్టర్లు బిల్లులుకాకపోవడంతో లబోదిబోమనేవారు. దీంతో సీసీ రోడ్ల నిర్మాణంలో మాడుగుల మండలం జిల్లాలో వెనుకబడింది. -
ఏసీబీ వలలో జీఎన్ఎస్ఎస్ ఉద్యోగిని
కడప అర్బన్: కడప నగరం శంకరాపురంలో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) పథకం కింద మంజూరైన పరిహారాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు రూ.4వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం గుర్రంగుంపు తాండాకు చెందిన ఇస్లావత్ కిశోర్నాయక్, అతని అమ్మమ్మ లక్షుమ్మకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని, గుడిసెను నిర్మించుకున్నారు. మొత్తం స్థలం, వారు ఆశ్రయం పొందుతున్న ఇల్లు, గుడిసె కెనాల్ కింద ముంపునకు గురవుతుందని ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తం రూ. 4,22,000 వారికి పన్నుల మినహాయింపు తర్వాత రావాల్సి ఉంది. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు దాదాపు నెలన్నర రోజుల నుంచి జీఎన్ఎస్ఎస్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రమీలమ్మ ఇస్లావత్ కిశోర్నాయక్ను తిప్పుకుంటోంది. ఆ మొత్తాన్ని జమ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. వారి సూచన మేరకు రూ. 4 వేలను మంగళవారం కార్యాలయంలోనే బాధితుడు జూనియర్ అసిస్టెంట్కు ఇస్తుండగా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రమీలమ్మను అరెస్టు చేసి బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
లంచమిస్తేనే ‘రుణం’
ఇందూరు : జిల్లా కలెక్టర్ యోగితారాణా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్తో అక్రమార్కుల చిట్టా బట్టబయలవుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు అందించే రాయితీల్లో పర్సంటేజీల కోసం పాకులాడుతున్న కొంతమంది రాజకీయ నేతలు,సంబంధిత ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... లంచాలకు తావులేకుండా అసలైన పేదవాడికి ఎస్సీ,ఎస్టీ,బీసీ రుణాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులకు అన్యాయం జరిగినా.. ఎవరైనా డబ్బులు ఆశించినా లబ్ధిదారులు నేరుగా ఫోన్చేయాలని కాల్సెంటర్ను ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నంబర్ 18004256644 ను అందుబాటులోకి తెచ్చారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం ఫోన్ నెంబరును కూడా ఇచ్చారు. దీంతో కాల్ సెంటర్తో పాటు ఏజేసీకి ఫోన్కాల్స్ల మోత ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 28 వరకు కాల్ సెంటర్కే 62 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఫోన్కాల్స్లలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో పని చేసే ఉద్యోగుల పైనే ఉన్నాయి. ఏజేసీ రాజారాంకు కూడా వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో కూడా కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులపై ఎక్కువ వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్లలో పని చేస్తున్న ఒక ఉద్యోగి రుణాల మంజూరు కోసం డబ్బులు అడుగుతున్నాడని... బీసీ కార్పొరేషన్లో ఓ అధికారి డబ్బులు ఆశిస్తున్నాడని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వచ్చే రుణం రాయితీలో 30 శాతం ఇస్తే చాలు బ్యాంకు కాన్సెంట్తో సహా రుణం మంజూరు చేయిస్తానంటూ బేరం చేస్తున్నాడని చాలామంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఆశ్రీతులకు రుణాలు ఇప్పించడానికి పావులు కదుపుతున్నారని, అసలైన పేదలు నష్టపోతున్నారని బాధితులు పేర్కొన్నారు. అయితే కాల్ సెంటర్కు, ఏజేసీకి ఫిర్యాదులు చేసిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నప్పటికీ వారి పేర్లు బయటకు పొక్కకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాది దారుల సమస్యను నోట్ చేసుకుని రోజు వారీగా కలెక్టర్కు నివేదిక అందజేస్తున్నారు. నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కలెక్టర్ ఎక్కువగా ఎవరిపై ఫిర్యాదులు వస్తున్నాయో గమనిస్తున్నారు. ఈ మేరకే బీసీ కార్పొరేషన్ అధికారిగా పని చేసిన సాయిలు, ఎస్సీ కార్పొరేషన్లో నీలకంఠం అనే ఉద్యోగిని సరెండర్ చేశారని చెప్పుకుంటున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో మరో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు ఉన్నాయి. వారిని కూడా త్వరలో సరెండర్ చేయనున్నట్లు విశ్వనీయ సమాచారం. పెరిగిన పోటీ.. జిల్లాలో రెండు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులు ఆన్లైన్ చేసుకున్న వారికి ఐడెంటిఫికేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 4,777 మందికి రుణాల లక్ష్యానికి గాను 20,651 మంది దఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష వరకు 80 శాతం సబ్సిడీని, రూ.2 లక్షల లోపు ఉంటే 70 శాతం, రూ. 2 లక్షల నుంచి నుంచి రూ. 5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ, 5 నుంచి 10 లక్షల వరకు యాభై శాతం సబ్సిడీని అందిస్తున్నట్లు తెలుపడంతో జిల్లా వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడాయి. యూనిట్ల సంఖ్య తక్కువగా... దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో రావడంతో రుణాలకు పోటీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు ఉద్యోగులు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకోవడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే వచ్చే రుణంలో ముందే పర్సంటేజీలు మాట్లాడకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రుణాలు గ్రౌండింగ్ అవుతున్నాయి. -
సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ఆదాయపన్ను శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. స్ధానిక ఒకటో వార్డు ఆదాయపన్ను అధికారిణి జయశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయరామ్ నుంచి రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
♦ రూ.6వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ♦ బిల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఖమ్మం : కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్ను ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా బృందం శుక్రవారం వల వేసి పట్టుకుంది. అనంతరం నగరంలోని శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేయడంతోపాటు ఆస్తులను సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. నగరంలోని విలీన పంచాయతీ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం తన అత్తమామల నుంచి పొందిన 80 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నాడు. విలీన పంచాయతీ కావడంతో కార్పొరేషన్ రికార్డుల్లో నమోదు చేసి.. ఇంటి నంబర్ ఇస్తేనే నీటి పంపు, విద్యుత్ కనెక్షన్ వస్తుంది. దీంతో తనకు ఇంటి నంబర్ ఇవ్వాలని బిల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కోరగా.. దీనికోసం రూ.22వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తంలో ఇవ్వలేని ఖాసీం బతిమిలాడటంతో.. చివరకు రూ.12వేలకు అంగీకారం కుదుర్చుకొని.. మూడు నెలల క్రితం రూ.6వేలు లంచం తీసుకున్నాడు. అయినా నంబర్, పంపు కనెక్షన్ ఇచ్చేందుకు జాప్యం చేయడంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రూ.6వేలు ఖాసీంకు ఇచ్చి.. శ్రీనివాస్రెడ్డికి లంచంగా ఇచ్చేందుకు ఫోన్ చేశారు. రెండు బృందాలుగా ఏసీబీ అధికారులు విడిపోయి.. ఒక బృందం ముస్తఫా నగర్, మరో బృందం శ్రీరాంనగర్లోని శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్ద పాగా వేసింది. ఈ క్రమంలో లంచం డబ్బుల కోసం ముస్తఫా నగర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని చెప్పడంతో.. ఖాసీం అక్కడికి వెళ్లి శ్రీనివాస్రెడ్డికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అనంతరం నగరంలో శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఖమ్మం ఎస్సై జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎస్సైలు సాంబయ్య, శ్రీనివాసరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్
♦ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం ♦ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ ♦ కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో ♦ రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం పిడుగురాళ్ళ : సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని నాగబాలాజీ లేడీస్ కార్నర్ ఫిబ్రవరి 14న షార్ట్సర్య్కూట్తో కాలిపోయింది. దుకాణానికి బీమా ఉండడంతో ఫైర్ సర్టిఫికెట్ కోసం లేడీస్ కార్నర్ యజమాని జమ్మిగుంపుల నరేంద్ర పిడుగురాళ్ళ ఫైర్ ఆఫీసర్ కె. శివశంకర్రావును కలవగా రూ.30 వేలు డిమాండ్ చేశారు. నరేంద్ర రూ.20 వేలకు బేరం కుదుర్చుకుని బుధవారం గుంటూరులోని ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాంతోను సంప్రదించారు. ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు గురువారం సాయంత్రం నరేంద్ర ఫైర్ ఆఫీసర్ను కలిసి రూ.20 వేలు ఇవ్వగానే, ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఫైర్ ఆఫీసర్ గదిలోకి ప్రవేశించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అగ్నిమాపక అధికారి శివశంకర్రావుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శాంతో తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నేరుగా తమను సంప్రదించాలని, వివరాలకు 94913 05638ను సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా ఫైర్ ఆఫీసర్ శివశంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర అసలు దరఖాస్తు చేసుకోలేదని, దరఖాస్తు చేసుకోకుండా సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ నగదును కూడా తీసుకోలేదని, తన గదిలోకి ఆ నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. -
లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డుసెక్కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు. -
వ్యవసాయశాఖలో కలుపు మొక్క
► జేడీ కార్యాలయంలో సంచలనం ► రూ.పది వేలు లంచం తీసుకున్న సూపరింటెండెంట్ ► అటెండర్ పీఆర్సీ బిల్లు ఇచ్చేందుకు డిమాండ్ ► ఏసీబీకి చిక్కిన వైనం మచిలీపట్నం : జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్వీ రంగారావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఆర్.దివ్యమణిని పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇవ్వాలంటే రూ.పది వేలు ఇవ్వాలని రంగారావు రెండు నెలలుగా ఆమెను వేధిస్తున్నాడు. చేసేది లేక ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సంఘటనకు సంబంధించి గుంటూరు ఏసీబీ డీఎస్పీ, జిల్లా ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ సీహెచ్ దేవానంద్శాంతో తెలిపిన వివరాలు.. జేడీ కార్యాలయ సూపరింటెండెంట్గా రంగారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ దివ్యమణి తనకు పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇప్పించాలని కొద్ది కాలంగా ఆయన్ని కోరుతోంది. రూ.పది వేలు లంచంగా ఇస్తేనే బిల్లు మంజూరవుతుందని రంగారావు తెగేసి చెప్పారు. విషయాన్ని దివ్యమణి వ్యవసాయశాఖ జేడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితం దక్కలేదు. దివ్యమణి ఏసీబీ అధికారులను మంగళవారం ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా వ్యూహంతో.. దివ్యమణి ఫిర్యాదుతో వ్యవసాయశాఖ జేడీ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వ్యవహరించారు. ఏసీబీ సిబ్బంది, అధికారులు సూపరింటెండెంట్తో పాటు ఇతర అధికారుల పనితీరు పైనా నిఘా ఉంచారు. దివ్యమణి తన వద్ద రూ.పది వేలు రంగారావుకు అందజేసింది. టేబుల్ సొరుగులో నగదును రంగారావు పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రసాయనాలతో పరీక్షించి నగదు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. సమాధానమే చెప్పలేదు.. తన బిల్లులపై రంగారావు సమాధానమే చెప్పే వారు కాదని దివ్యమణి విలేకరులకు తెలిపారు. డబ్బులు ఇస్తేనే బిల్లులు మంజూరవుతాయని ఆయన చెబుతున్నారని వివరించింది. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు. -
అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా?
విశ్లేషణ: లంచగొండితనంపై పోరాడ డానికి ప్రభుత్వాలకు ఇష్టం లేదేమోనని ఎన్నో సార్లు అను మానం వస్తూ ఉంటుంది. తాము నీతివంతమైన ప్రభు త్వాన్ని ఇస్తామని అందరూ అనే వారే. తీరా ఫిర్యాదు ఇస్తే తీసుకునే వారుండరు. కనీసం ఫిర్యాదు ఎక్కడ చేయాలో చెప్పరు. లంచం తీసుకుంటూ పట్టుబడినా సరే న్యాయ పోరాటంలో వారే గెలిచే స్థితి ఉంటే దాన్ని ఏమనాలి? నిజానికి సమాచార హక్కు కింద ప్రశ్నలకు సమా ధానం దొరకదు. ప్రభుత్వ రికార్డుల్లో దాగిన లేదా దాచిన సమాచారాన్ని దాని ప్రతి రూపంలో పొందడం అనే అత్యంత ప్రధాన హక్కును మాత్రమే ఈ చట్టం ఇస్తున్నదని చాలా మంది గమనించడం లేదు. ఢిల్లీలో ఎవరైనా లంచం తీసుకుంటూ ఉంటే మేం ఎక్కడ ఫిర్యాదు చేయాలండీ అని ఒక పౌరుడు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించాడు. సమాచారం ఇవ్వన వసరం లేదని తిప్పి కొట్టొచ్చు. కొడతారు కూడా. కాని ఈ కేసులో అడిగిన వ్యక్తి ప్రశ్నించడం తెలిసిన న్యాయ వాది. అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపే అధి కారం ఫలానా అధికారికి ఉందని, ఎవరికి ఫిర్యాదు ఏ విధంగా చేయాలో వివరించే ఆఫీస్ మెమొరాండం ప్రతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రులలో ఎవరికి ఏయే అధికారాలున్నాయో తెలిపే పత్రాలు కావాలని అడిగారు. నిర్ణయాధికారాలు ఎవరికి ఉన్నా యనేది మరో ప్రశ్న. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనా, దానికి ఒక శాసనసభ, మంత్రి మండలి ఉండడం, భూములు, శాంతి భద్రతలపై అధికారాలు కేంద్రం పరిధిలో ఉండడం వల్ల ఈ సందేహాలు తలెత్తాయి. మీరడిగిన రూపంలో మా దగ్గర ఏ పత్రాలూ సేక రించి సిద్ధంగా లేవని విజిలెన్స్ విభాగం పీఐఓ సమా ధానం చెప్పారు. 38 రూపాయలు చెల్లించిన తర్వాత 19 పేజీల నియామక నియమాల సమాచారం ఇచ్చారు. మొత్తం ఏసీబీ కార్యాలయంలో 116 పోస్టులు ఉన్నా యని, అందులో 28 ఖాళీగా ఉన్నాయని వివరించారు. కానీ అధికారాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. న్యాయవిభాగం నుంచి ఏ సమాచారమూ లేదు. వీకే గర్గ్ అనే న్యాయవాది మూడు ఫిర్యాదులు దాఖలు చేశారు. సమాధానం తెలిసి చెప్పకపోవడం, సమాచారం ఉన్నా ఇవ్వకపోవడం అనే తప్పిదాలకు మాత్రమే జరిమానా విధించవలసి ఉంటుంది. న్యాయవాదికే చట్టాల పరిధి, విచారణ పరిమితుల సమాచారం స్పష్టంగా లేనపుడు ఒక ిపీఐఓ సమాచారం ఇవ్వలేకపోయాడని తప్పు బట్టడం సరికాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాకు ఏ అధికారాలున్నాయో చెప్పండి అని ఢిల్లీ హైకోర్టును వీరంతా అడుగుతున్నారు లేదా మాకే అధి కారాలున్నాయని, వాటిని మరొకరు తీసుకొనే ప్రయ త్నం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేస్తున్నారు. న్యాయ వాది అయిన సమాచార అభ్యర్థి లేవనెత్తిన సందేహం చాలా సమంజసమైనదే. ఎందుకంటే ఢిల్లీ ప్రజలకు లంచగొండులపైన ఫిర్యాదు ఎవరికి చేయాలో అర్థం కావడం లేదు. పాపం సాధారణ అధికారి అయిన పీఐఓ గానీ, కొంత సీనియారిటీ ఉన్న మొదటి అప్పీలు అధికారి గానీ, సమాచార కమిషనర్ గానీ తేల్చేంత సామాన్య విషయం కాదిది. అయితే న్యాయవాది అభ్యర్థనలు అన్నీ పరిశీలించి వారి ప్రశ్నలన్నీ క్రోడీకరించిన తరువాత కొంత అయో మయం ఉన్న విషయం స్పష్టమైంది. కానీ దానికి జవాబు పీఐఓ చెప్పడం సాధ్యం కాదు. ఒక కానిస్టేబుల్ ఢిల్లీలోని దుకాణదారుడినుంచి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అతను 10 వేలు మాత్రం ఇవ్వగలనని ఇచ్చాడు. కానిస్టేబుల్ మిగిలిన డబ్బు కోసం వేధించసాగాడు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వారు వల పన్ని అతడిని అరెస్టు చేశారు. అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ తన అవినీతిని విచారణ చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీకి లేదని. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం తనపై వచ్చిన ఆరోపణలను పరిశోధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని వాదించాడు. దానిపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల మధ్య ఉన్నత స్థాయి న్యాయ వాదం సాగింది. సంవిధానం, చట్టాలు, జీవోలు తమ తెలివితేటలు కలిపి బోలెడు వాదోపవాదాలు చేశారు. ఢిల్లీలో 40 ఏళ్ల నుంచి అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్నది. ఆప్ సర్కారు 49 రోజుల పాటు సాగిన దశలో, ఒక పెద్దాయన పైన ఏసీబీ కేసు నమోదుచేశారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన తరువాత కేంద్ర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైన విచారణ జరిపే అధి కారం ఢిల్లీ ఏసీబీ అధికారులకు లేదంటూ కేంద్ర ప్రభు త్వం ఒక జీవో జారీ చేసింది. దాన్ని ఢిల్లీ ప్రభుత్వం సవాలు చేసింది. మే 25, 2015 న ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ ఢిల్లీ ఏసీబీ విచారణాధికారంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ప్రకటించింది. పౌరులు తమను వేధించే లంచగొండి అధికారుల పైన ఫిర్యాదు చేయాలనుకుంటే ఎవరికి చేయాలో తెలియజేయవలసిన బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రిలకు ఉంది, ఈ విషయాలు వివరంగా వారంతట వారే సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంటుంది, ఆర్టీఐ ద్వారా అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేకపోవడం న్యాయం కాదు. అవినీతిపై పోరాట అధికార వివాదాన్ని నానబెడుతూ ఉంటే అవినీతి వర్ధిల్లుతుంది కనుక ఈ విషయాలు తెల పాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు, గవర్నర్ కార్యాల యానికి కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. (సీఐసీఎస్ఏ, ఎ, 2015, 000238 వి.కె. గర్గ్ వర్సెస్ డెరైక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ లా కేసులో 29 ఫిబ్రవరిన కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్రిజిస్ట్రార్
పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. తనకున్న 70 సెంట్ల భూములను రిజిస్టర్ చేయించుకునేందుకు శరత్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..సబ్రిజిస్ట్రార్ రిజిస్టర్ చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో ఏసీబీ దాడులు
నరసరావుపేట: గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్ బిల్లు మంజూరుకు లంచం అడగటంతో సదరు చిరుద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏరియా వైద్యశాలలో జూనియర్ శానిటరీ వర్కర్గా విధులు నిర్వహించే తలమాల దుర్గారావుకు పది రోజుల క్రితం రూ.62,500లు ఇంక్రిమెంట్ ఎరియర్స్ కింద మంజూరయ్యాయి. వాటికి సంబంధించి బిల్లు పాస్చేసి చెక్కు ఇచ్చేందుకు వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ కె.నరేంద్రబాబు రూ.15వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో దుర్గారావు రూ.5వేలకు బేరం కుదుర్చుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్రబాబు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
విశాఖపట్నం: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెందుర్తిలోని ర్యాట్టిక్ షాపు నిర్వాహకుల నుంచి స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి దొర రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో షాపు నిర్వహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం అప్పలస్వామి లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భక్తులిచ్చే దక్షిణను కూడా లంచమంటారా?
చంద్రబాబుపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: భక్తులు పూజారులకు సమర్పించుకునే దక్షిణను కూడా సీఎం చంద్రబాబు లంచంగా అభివర్ణించడంపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాకుళంలో జరిగిన ఏపీఎన్జీవోల సభలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రతినిధులు పద్మనాభశర్మ, సుధీర్ ఫణిగోపాల్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూజారులకు, అర్చకులకు దక్షిణ సమర్పించడం సంప్రదాయంలో భాగమని.. దానిని లంచంగా, అవినీతిగా చిత్రీకరించడం తగదన్నారు. అధికారంలోకి వస్తే అర్చకులకు అనేక మేళ్లు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నేడు ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి వల్లే ఈరోజు అర్చకులు ఆలయాల్లో సేవలు చేయగలుతున్నారని వివరించారు. -
న్యాయస్థానంలోనే లంచం
మెదక్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన బెంచ్క్లర్క్ మెదక్: సాక్షాత్తూ న్యాయస్థానంలోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం సంచలనం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన లాల్సింగ్కు సంబంధించి ఓ భూవివాదం(సివిల్) కేసు మెదక్లోని మూడో అదనపు జిల్లా కోర్టులో 2009 నుంచి కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ప్రత్యర్థికి సమన్లు పంపించడానికి ఈ కోర్టులో దశాబ్దకాలంగా సూపరింటెండెంట్(బెంచ్ క్లర్క్)గా కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటరమణారెడ్డి.. లాల్సింగ్ను రూ.5 వేల లంచం ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో లాల్సింగ్ మెదక్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లాల్సింగ్ నుంచి వెంకటరమణారెడ్డి లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం తిరుపతి క్రైం: ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఏఈఈ రూ.15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఎర్రావారిపాళెం మండలం చింతగుంటకు చెందిన మురళీ మోహన్ ప్రభుత్వం వద్దనుంచి చెరువుల్లో పూడిక తీసే పనులకు కాంట్రాక్టు పొందాడు. ఈ పనులకు సంబంధించి రూ. ఒక లక్షా నాలుగు వేలకు బిల్లులు పెట్టాడు. ఆ బిల్లులు చెల్లించాలంటే రూ.21 వేల లంచం ఇవ్వాలని ఇరిగేషన్ ఏఈఈ గిరిబాబు డిమాండ్ చేశాడు. తాను కోరిన మొత్తం ఇవ్వకుంటే కాంట్రాక్టు రానివ్వకుంటా చేస్తానని బెదిరించాడు. దీంతో మురళీ మోహన్ ఏఈఈకి మొదట రూ.6 వేలు ఇచ్చాడు. రెండు రోజుల క్రితం కాంట్రాక్టు బిల్లు పాసై మురళీమోహన్ అకౌంట్లో జమైంది. అప్పటి నుంచి మిగిలిన రూ.15వేలు ఇవ్వాలని ఏఈఈ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితుడు తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం తిరుపతిలోని బాలాజీ కాలనీ వద్ద ఏఈఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. -
జిల్లా కలెక్టర్కే రూ. 100 లంచం!
ఏలూరు: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’లో ఓ వ్యక్తి తన ఫిర్యాదుతో పాటు కలెక్టర్ కె.భాస్కర్కు రూ.100 లంచం ఇవ్వబోయిన ఘటన చిన్నపాటి కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం జల్లికొమ్మర గ్రామానికి చెందిన అడ్డగర్ల సత్యనారాయణ జల్లికొమ్మర విశాల సహకార పరపతి సంఘంలో సభ్యునిగా ఉన్నాడు. అయితే సహకార సంఘంలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. ఈ అవకతవకలపై ఫిర్యాదుతో పాటు 100 రూపాయలు అందించడాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో సమస్యలు పరిష్కారం కావాలంటే ఫిర్యాదుతో పాటుగా ఎంతో కొంత లంచం ఇవ్వాలని ఒక వ్యక్తి చెప్పాడని సత్యనారాయణ తెలిపాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఫిర్యాదుదారునిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్థానిక మూడో పట్టణ పోలీసులు అడ్డగర్ల సత్యనారాయణను అరెస్ట్ చేశారు. -
రే టుగాళ్లు!
ప్రతి పనికీ ఓ ‘లెక్క’ యథేచ్ఛగా వసూళ్లు ఏళ్ల తరబడి ఇదే తంతు ఇదీ డీఈఓ కార్యాలయం తీరు ఏసీబీ దాడులతో కలకలం సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. ఏ పనికైనా అక్కడి సిబ్బందికి చేయి తడపాల్సిందే. ముఖ్యంగా స్కూళ్లకు గుర్తింపునివ్వడం... కొనసాగించడం వంటివి కార్యాలయ అధికారులు, సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఏసీబీ దాడులతో డీఈఓ కార్యాలయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రె డ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీన్నిబట్టి అక్కడ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి వారి దృష్టికి వచ్చినా...చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పెద్ద సార్లకు వీటిలో వాటాలు ఉంటాయి. మీరిచ్చేది మాకు ఒక్కరికే కాదు’ అని సిబ్బందే నేరుగా వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారితో చెబుతుండడం గమనార్హం. ‘తిలా పాపం.. తలా పిడికె డు’ అన్నట్లుగా వసూళ్లలో అందరి భాగస్వామ్యం ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం ఇది రెండోసారి. పైసలు లేనిదే పని కాదు ప్రభుత్వ స్కూళ్లు కొనసాగుతున్న అద్దె భవనాలకు బిల్లులు చెల్లించడం నుంచి ఉపాధ్యాయుల సర్వీస్ విషయాల వరకూ ప్రతి పనిలోనూ సిబ్బంది ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిడెడ్ టీచర్ల వేతన బకాయిల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బకాయిల మొత్తంలోంచి పది శాతాన్ని ముక్కు పిండి వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ వసూళ్లకు ప్రత్యేకంగా దళారులను ఏర్పాటు చేసుకున్నారంటే.. అవినీతి దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. సర్వీస్ బుక్లో ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయడానికి డిమాండ్ చేసి మరీ దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలంటే ఆ శాఖ ఉద్యోగులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఈ తనిఖీ బృందాల్లో సభ్యులుగా ఉండటానికి పోటీ పడుతుంటారు. ప్రైవేటు పాఠశాలల్లో చిన్నపాటి లోటునూ భూతద్దంలో పట్టి చూపి.. రేటు ఫిక్స్ చేస్తారు. చేసేదేమీ లేక యాజమాన్యాలు ఎంతో కొంత చెల్లించుకోవాల్సి వస్తోంది. ‘హెడ్ క్వార్టర్ లివింగ్’కి టీచర్లు దరఖాస్తు చేసుకుంటే రోజుల తరబడి వేచిచూడక తప్పని పరిస్థితి. దరఖాస్తులు అందజేసి రోజులు గడిచినా ఫైల్ ఇన్వార్డు గడప దాటదు. దీని అనుమతికి ఉద్యోగులుఎంతో కొంత ఆశించడమే లోగుట్టు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు తాత్కాలిక గుర్తింపును కొనసాగించేందుకు ఇచ్చే అనుమతుల విషయంలోనూ ముడుపులు చెల్లించాల్సిందే. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ తయారీ కూడా కాసులు కురిపిస్తోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఒక్కో విద్యార్థి పేరిట రూ. 50 నుంచి రూ.100 వరకు అదనంగా డీఈఓ కార్యాలయ ఉద్యోగులకు ఇవ్వక తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇలా ప్రతి అవకాశాన్నీ ‘డబ్బు’ చేసుకోవడంలో ఆ శాఖ ఉద్యోగులు పోటీ పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇష్టారాజ్యం డీఈఓ కార్యాలయం ఆది నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ప్రతి పనికో రేటు నిర్ణయించడంతో పాటు.. విధి నిర్వహణలోనూ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు కలెక్టర్గా పనిచేసిన నిర్మల ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులైలో ఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్... ఉద్యోగుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగి ఎప్పుడు వస్తారో.. పోతారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంటోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆమె గ్రహించారు. దీన్ని కట్టడి చేయడానికి కార్యాలయంలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు. ఇలా అన్నిటా ఈ కార్యాలయం తరచూ వార్తల్లోకెక్కడం గమనార్హం. -
లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు
-
లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు
మరో అవినీతి చేప ఏబీసీ వలలో చిక్కింది. వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఉద్యోగం కోసం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. సోమ్లా నాయక్ తో పాటు.. సీనియర్ అసిస్టెంట్ అలీ, అటెండర్ సారంగ పాణిలను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి
విశాఖపట్టణం: ఇంటి నంబరు కేటాయించేందుకు లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ నగరం కంచరపాలేనికి చెందిన వెంకట బాలసూర్యప్రకాశ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి నంబరు కేటాయించాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టర్ జి.కోటేశ్వరరావు రూ.6,500 డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల క్రితం సూర్యప్రకాశ్ రూ.4 వేలు ఇచ్చారు. మిగతా రూ.2,500 ఇచ్చే క్రమంలో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం సాయంత్రం కోటేశ్వరరావుకు ఆయన కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని అధికారులు వలపన్ని పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
పట్టాదారుపాసుబుక్కుల మంజూరుకు లంచం డిమాండ్ రూ. 35వేలు తీసుకుంటూ పట్టుబడిన పీలేరు తహశీల్దార్ పీలేరు : ఉచితంగా సేవలందించాల్సిన ఆ అధికారి అడ్డుగోలు సంపాదనకు అలవాటు పడ్డాడు. పట్టాదారుపాసుబుక్కుల కోసం లంచం డిమాండ్ చే శాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాదేయపడినా జాలి లేకుండా కాదుపొమ్మన్నాడు. చేసేదేమి లేక ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అతన్ని రెడ్హ్యాండెడ్గా పట్టించాడు. పీలేరు తహశీల్దార్ వీ.సురేష్బాబు శుక్రవారం లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి వివరాల మేరకు.. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ కృష్ణారెడ్డిగారిపల్లెకు చెందిన శంకరయ్య కాకులారంపల్లె వద్ద 1.31 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. భూమిని తనపేరిట మార్చుకుని పాసుబుక్కుల కోసం తహశీల్దార్ సురేష్బాబు వద్దకు వచ్చాడు. ఆయన సూచన మేరకు గత ఏప్రిల్లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తహశీల్దార్ను కలవగా రూ. 50వేలు డిమాండ్ చేశాడు. తాను దళితుడినని, అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి నా తహశీల్దార్ మాత్రం కరుణించలేదు. అనంతరం రెండునెలలుగా పలుమార్లు కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం రూ. 35వేలకు ఒప్పందం కుదుర్చుకుని గురువారం తిరుపతి రేంజ్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు రూ. 35వేలు శంకరయ్యకు ఇచ్చి తహశీల్దార్కు ఇవ్వాలని సూచించి పంపించారు. శుక్రవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన 20 నిమిషాల్లో రైతు నగదు ముట్టజెప్పాడు. అక్కడే మాటువేసిన అధికారులు వెంటనే తహశీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్టాప్, రికార్డులు సీజ్ చేశారు. కార్యాలయ సిబ్బంది సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేయించి గేట్లు మూసి తనిఖీలు నిర్వహించారు. పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి సం బంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లలోని డేటా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్రెడ్డి తెలిపారు. దాడిలో ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే కార్యాలయంలో కులధృవీకరణ పత్రం మంజూరు కోసం జూనియర్ అసిస్టెంట్ రూ. 500 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. -
ఏసీబీ వలలో వీఆర్వో
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు వీఆర్వో సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుచ్చిరెడ్డి అనే రైతు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత వీఆర్వో పర్వతాలు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా బుచ్చిరెడ్డిని తరచూ తిప్పుతున్నాడు. చివరకు రూ.2 వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. పర్వతాలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగానికి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం గోపాలపట్నం: గోపాలపట్నంలోని 66వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగం కోసం రూ. 30 లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు. వివరాలివీ... వార్డులో కన్నమ్మ అనే కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కొడుకు శివ కి ఆ ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తరుణంలో కొంతకాలంగా శివ ఇక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ.30 వేలు ఇస్తేనే ఉద్యోగం అని శానిటరీన్స్పెక్టర్ తెగేసి చెప్పాడు. దీంతో శివ మొదటి సారి అప్పు చేసి రూ.10 వేలిచ్చాడు. తర్వాత స్థోమత లేదని చెప్పినా తాను చెప్పినంత ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఒత్తిడి చేశాడు. ఏం చేయాలో పాలుపోక శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇక్కడి కొత్తపాలెంలో ఉన్న వార్డు కార్యాలయంలో ఈశ్వర్రావుకి శివ రూ.10 వేలు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని ఇక్కడ పనిచేస్తున్న రమణి ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకున్న వెంటనే ఏసీడీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్తో పాటు సీఐలు రామకృష్ణ, రమేష్, రమణమూర్తి దాడి చేసి పట్టుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు రమణిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించారు. రికార్డులు పరిశీలించారు. ఈశ్వర్రావుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం ఇస్తేనే ఇళ్ల పట్టా
ఇళ్లపట్టా కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ.. నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్రయించారు. ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఇళ్ల పట్టా కోసం రూ200 డిమాండ్ చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం డివిజన్ సుందర్ నగర్ లో సోమ వారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇళ్ల పట్టా కోసం వీఆర్వో డబ్బు డిమాండ్ చేయడంతో మహిళలు వైఎస్పార్ సీపీ నేత సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మారండయా..!
ఊహించని లేని స్థాయిలో వేతనాలు.. విధుల నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా అన్నీ సౌకర్యాలు.. బాధ్యతల నిర్వర్తింపులో స్వేచ్ఛ.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడిలేని వరాలు కురిపిస్తోంది. ఇలా ఎన్ని వరాలు.. వసతులు కల్పించినా జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల బుద్ధి మారడం లేదు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపైనా వేటుపడింది. అయినా.. జిల్లాలో అవినీతి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలన్న సీఎం ఆశయానికి స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులు తూట్లు పొడుస్తున్న సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. - సాక్షి, మంచిర్యాల జీతాలు రెట్టింపైనా బుద్ధిమార్చుకోని ఉద్యోగులు - చేతులు తడిపితేనే పని - క్షేత్రస్థాయిలో పెచ్చుమీరుతున్న అవినీతి - మార్చి నెలాఖరు నుంచి ఏసీబీకి చిక్కిన వారి సంఖ్య పది - సామాన్యులకు తప్పని ఇబ్బందులు సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ ఉద్యోగులకు సరిపడా వేతనాలు ఇస్తేనే మరింత పారదర్శకంగా.. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తారని భావించిన సీఎం ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగుల వేతనాలు రూ.3 వేల నుంచి రూ.16 వేల వరకు పెరిగాయి. జీతాలు భారీగా పెరిగినా జిల్లాలో పలు శాఖల్లో లంచాలకు అలవాటు పడ్డ కొందరు ఉద్యోగులు మాత్రం చేయి తడపందే పనిచేయడం లేదు. లంచమిచ్చినా పని సకాలంలో అవుతుందంటే అదీ లేదు. చివరకు విసిగివేసారి బాధితులు ఏసీబీకి ఆశ్రయించక తప్పని పరిస్థితులు వచ్చాయి. అధికారులు, సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నా.. అవినీతి ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు. కనీసం వారిలో ఒకింత భయం కూడా కనిపించడం లేదు. గడిచిన ఐదు నెలల్లో జిల్లాలో పది మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ఉదయం మంచిర్యాలకు ఆనుకుని ఉన్న లక్షెట్టిపేటలో ఆస్పత్రి వైద్యుడు లకావత్ రవీందర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సాయంత్రం మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో పనిచేస్తున్న లింగమూర్తిని లంచం తీసుకుంటూ పట్టుకోవడం చర్చనీయాంశమైంది. పని కావాలంటే.. ఇచ్చుకోవాల్సిందే..! జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలిపి 73 వరకు ఉన్నాయి. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 50 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. లక్షలాది మంది జిల్లా ప్రజలు ఈ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. అయితే.. వీటిలో పలు శాఖలు అమలు చేస్తున్న పథకాల లబ్ధిపొందాలంటే సిబ్బందిని ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి. చేతులు త డిపితేనే తప్ప కార్యాలయంలో ఫైలులో కదలిక రాదు. ఒకవేళ చెప్పినంత ఇచ్చుకోకపోతే త క్కువ సమయంలో జరగాల్సిన పనికి నెలలు పడుతుంది. అదీ సంబంధిత శాఖ కార్యాలయాలు.. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తేనే వారి ఆదేశాల మేరకు పూర్తవుతుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జిల్లాలో పలువురు అవినీతి ఉద్యోగులు జాగ్రత్త పడుతున్నారు. ఏసీబీకి పట్టుబడ్డప్పుడే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాస్తులపై ఏసీబీ ఆరా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులూ అక్రమార్కుల ఆస్తులపై దృష్టిసారించారు. పలు శాఖల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు సైతం కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. దీంతో వీరి ఆస్తులు, వాటి వివరాలు రాబట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అవినీతికి మారుపేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారం అత్యధికంగా జరుగుతున్న తూర్పు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. భూములకు సంబంధించిన రికార్డుల నిర్వహణ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతుండడం గమనార్హం. -
జేఈ లంచావతారం
బిల్లు మంజూరుకు రూ.23వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ రాజ్ జేఈ రేపు కోర్టుకు హాజరుపర్చనున్న ఏసీబీ నర్సీపట్నం: పంచాయతీరాజ్ నర్సీపట్నం మండల ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారుల వలలో చిక్కారు. కాం ట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడ్డారు. ఏసీబీ డిఎస్పీ రామకృష ్ణప్రసాద్ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మండలంలోని కొత్తలక్ష్మిపురంలో రూ.5 లక్షలతో కాంట్రాక్టర్ రాజుమల్లు రోడ్డు, డ్రైనేజీ పను లు చేశారు. రూ.2లక్షలకు పైగా మొదటి బిల్లు చెల్లించారు. రెం డో బిల్లు మంజూరు చేయడానికి పంచాయతీ రాజ్ జేఈ సిహెచ్.వేణుగోపాల్ లంచం కావాలని రాజుమల్లును డిమాండ్ చేశారు. రూ.23,600లు చెల్లిస్తే కానీ బిల్లు మంజూరు కాదని చెప్పడంతో రాజుమల్లు ఏసీబీ అధికారులకు విషయం నివేదించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నాగం వేశారు. అందులో భాగంగా ఉదయం ఫోన్ చేయగా మండల సర్వసభ్య సమావేశంలో ఉన్నానని, సాయంత్రం శారదనగర్లో ఉన్న ఇంటికి రావాలని రాజమల్లుకు జేఈ సూచించారు. జేఈ తన వద్ద అనధికారికంగా పని చేస్తున్న అసిస్టెంట్ కురచా నర్సింగరావు(శ్రీను) ద్విచక్రవాహనంపై సాయంత్రం ఇంటికి చేరుకున్నారన్నారు. రాజుమల్లు ఇచ్చిన డబ్బును నర్సింగరావు జేబులో పెట్టుకుంటున్న దశలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. జెఈ వేణుగోపాల్, నర్సింగరావులను విచారించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు. -
అయినా మారలే!
అక్రమాలకు విధేయుడు ! కలెక్టరేట్లో వసూల్ రాజా కలెక్టర్, జేసీ పేరు చెప్పి బెదిరింపులు అధికారులకు బాధితుల ఫిర్యాదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యో గి ఏసీబీకి పట్టుబడి 20 రోజులు కాలే దు. ‘మ్యాటర్ సెటిల్ చేస్తా’నని సదరు ఉద్యోగి తన పంథాలోనే సాగుతున్నాడు. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారు. అవినీతి, అక్రమ వసూళ్ల విషయంలో ఉన్నతాధికారులు ఎన్ని హితబోధలు చేసినా సిబ్బంది మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లా పాలనా కేంద్రం కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడి సరిగ్గా 20రోజులు కాకముందే అదే కలెక్టరేట్లోని ఒక ఉద్యోగిపై ఉన్నతాధికారులకు బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. జేసీ కోర్టులో ఉన్న కేసుల వ్యవహారంలో తాను అడగినంత ఇస్తే తీర్పు అనుకూలంగా ఇప్పిస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవని తమను వేధిస్తున్నాడని సదరు ఉద్యోగిపై బాధితులు ఫిర్యాదు చేశారు. గతం నుంచి వృత్తిపరమైన విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి అక్రమ వసూళ్ల వ్యవహారం ప్రస్తుతం కలెక్టరేట్లో చర్చనీయాంశగా మారింది. కలెక్టర్, జేసీల పేరు చెప్పి... ఫిర్యాదు దారులు అధికారులు ఇచ్చిన సమాచా రం ప్రకారం కలెక్టరేట్లో ఒక విభాగంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ తన సెక్షన్కు సంబంధించి పనులపై వచ్చే వారి నుంచి కలెక్టర్, జేసీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. తన వద్ద ఉన్న భూములకు సంబంధించి ఫైళ్ల విషయంలో భూముల ధరను బట్టి బాధితులను లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇతని వసూళ్ల లెక్క ఒక్కోక్కరి వద్ద అరలక్షకు తక్కువ కాకుండా ఉంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు ఇచ్చే దాంట్లో సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి ఉన్నతాధికారులందరికీ ఇస్తానని వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలుకుతున్నాడు. జేసీ కోర్టులు పెండింగ్లో ఉన్న భూముల సంబంధించిన కేసుల ఇరు పక్షాల వారికి ఫోన్చేసి ‘మ్యాటర్ సెటిల్చేస్తా’ నంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అధికారులను తప్పుదోవ... భూ వివాదాల పరిష్కారం విషయంలో సహజంగా ఉన్నతాధికారులు సంబంధిత అధికారి వివరాలు తెలుసుకుంటాడు. ఈ సమయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చీ మరి తన పని తాను చేసుకున్న సందర్భాలూ ఉన్నారుు. సదరు ఉద్యోగిపై గతంలో చేర్యాలకు సంబంధించి ఒక భూమి విషయంలో బాధితులను వేధించినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇతని ఆగడాలు శృతి మించడంలో బాధితులు తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై అధికారులు సీరియస్గా తీసుకుని సదరు ఉద్యోగిని సంజాయిషీ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా పదోన్నతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉద్యోగి ప్రస్తుతం పదోన్నతులు పొందుతున్న రెవెన్యూ ఉద్యోగుల జాబితాలో పేరున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జారీ చేసిన క్రమ సంజాయిషీ నోటీసును పక్కన పెట్టిన అధికారులు సదరు ఉద్యోగికి పదోన్నతి పత్రం అందజేయడం ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది. -
అధికారిపై ఏసీబీ ‘ఫైర్’
ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ అగ్నిమాపక అధికారి {బోకర్ ద్వారా అవినీతికి ద్వారాలు ఫైర్ సర్టిఫికెట్కు లంచమివ్వాల్సిందే ఏసీబీ దాడితో పట్టుబడిన వైనం విశాఖపట్నం సిటీ : ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచమడిగిన అవినీతి తిమింగలం ఒకటి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. నగరంలోని ఓ పాఠశాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ. 35 వేలు లంచం తీసుకుంటూ జీవీఎంసీ జిల్లా అగ్నిమాపక అధికారి(డీఎఫ్ఓ) ఎం. శ్రీహరి జగన్నాథరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలిలా వున్నాయి. షీలానగర్కు చెందిన ఏపీఎంపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు ఫైర్ నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. గతనెలలో దరఖాస్తు చేసుకున్న ఆ పాఠశాల ఉద్యోగులను కొద్ది రోజులుగా తిప్పించుకుంటూ ఎన్ఓసీ ఇవ్వడం లేదు. ఫైర్ కార్యాలయ ఉద్యోగినంటూ ఓ ప్రైవేట్ వ్యక్తి లందా తారక రామకృష్ణ ఆ స్కూల్ యాజమాన్యంతో బేరానికి దిగాడు. రూ. 35 వేలు ఇస్తే పని చేసేస్తామని రామకృష్ణ చెప్పడంతో స్కూలు యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ అధికారులు ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆ మొత్తం స్కూలు ఉద్యోగి ద్వారా బుధవారం రాత్రి జీవీఎంసీలోని డీఎఫ్ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తి అయిన లందా తారక రామకృష్ణకు రూ. 35 వేలు అందజేశారు. ఆ మొత్తాన్ని డీఎఫ్ఓకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్తో పాటు ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, రవణమూర్తి పాల్గొన్నారు. డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పట్టుబడ్డ డీఎఫ్ఓ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చక్రం తిప్పుతున్న బ్రోకర్లు..!: జీవీఎంసీలో అధికారులకు ప్రజలకు మధ్య బ్రోకర్లు చక్రం తిప్పుతున్నారు. కమిషనర్గా ప్రవీణ్కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ దళారీ వ్యవస్థను మాత్రం నిలువరించలేకపోయారు. అగ్నిమాపక అధికారి ఛాంబర్లో కూర్చొని మరీ తామే షాడో అధికారులుగా వ్యవహరిస్తూ చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. బుధవారం పట్టుబడ్డ బ్రోకర్ లందా తారక రామకృష్ణ ఆ వృత్తిలో ఆరితేరిపోయాడు. నేరుగా లంచం తీసుకుంటే సమస్యలొస్తాయని భావించే అధికారులకు ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంటాడు. ఇతను బ్రోకర్ అని చాలా మందికి తెలీదు. జీవీఎంసీలో ఇతనూ ఓ ఉద్యోగి అనే అంతా భావించేంతలా అక్కడ పాగా వేశాడు. ప్రతీ దీపావళికి లెసైన్సులు జారీ చేస్తూ అధికారులందరికీ డీఎఫ్ఓ పేరిట టపాసులను అందిస్తుంటాడు. ఏసీబీకి చిక్కిన తర్వాతే అసలు గుట్టు బయటపడడంతో అంతా ముక్కున వే లేసుకుంటున్నారు. పదోన్నతిపై వచ్చి..!: రాజమండ్రి అగ్నిమాపక అధికారి పోస్టు నుంచి డీఎఫ్ఓగా పదోన్నతి పొంది డె ప్యుటేషన్పై జీవీఎంసీకి 2013లో వచ్చారు. అప్పటి నుంచీ నగరంలోని ఆనూపానూ అంతా పసిగట్టారు. జీవీఎంసీ కమిషనర్గా ప్రవీణ్కుమార్ వచ్చినప్పటి నుంచీ ఫైర్ ఎన్ఓసీలు, పట్టణ ప్లానింగ్పై దృష్టి సారించడంతో అగ్నిమాపక అధికారి కార్యాలయానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ లోగా బీపీఎస్ కూడా తోడవడంతో కాసుల పరంపర మొదలైంది. ప్రతీ బీపీఎస్ దరఖాస్తుకు అగ్నిమాపక ఎన్ఓసీ ఉండాలనే నిబంధన ఉండడంతో ఈ శాఖకు డిమాండ్ పెరిగింది. ఇద్దరు ఉద్యోగులతో నడుస్తున్న ఈ శాఖ పగలంతా తలుపు మూసి వుంటుంది. సాయంత్రమైతే కళకళలాడుతుంది. -
ఏసీబీ దాడి.. నాలుగోసారి
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కడం ఇది నాలుగోసారి. సుమా రు పదేళ్ల కిత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంపై ఉన్న చిన్నమొత్తాల పొదుపు ప్రత్యేక తహసీల్దార్గా పనిచేసిన పంత్ ఒక ఏజెంట్ నుంచి లెసైన్స్ రెన్యూవల్ విషయంలో లంచం డిమాండ్ చేసి డబ్బు లు తీసుకుంటూ కలెక్టరేట్లోనే ఏసీబీకి చిక్కాడు. 2010లో కలెక్టరేట్ ప్రగతి భవనంలో సోషల్ వెల్ఫేర్ డీఎస్డబ్ల్యూవోగా పనిచేసిన వై.గాలయ్య ఒక వార్డెన్కు సంబంధించి వైద్య ఖర్చుల బిల్లులు మంజూరు విషయంలో సంతకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా రు. ఇదేశాఖలో గాలయ్య తర్వాత ఇన్చార్జ్ డీఎస్డబ్ల్యూవోగా బాధ్యతలు స్వీకరిం చిన ఏఎస్డబ్ల్యూఓ ప్రభాకర్ అదే వార్డెన్కు గ్రేడ్వన్ పదోన్నతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుడ్డారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
అమరవీరుల పరిహారానికి రూ.10 వేల డిమాండ్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కలెక్టరేట్లో కలకలం హన్మకొండ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిచే విషయంలో బాధి త కుటంబ సభ్యుల నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న కలెక్టరేట్ ’సీ‘ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ సునీల్కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కలెక్టరేట్లో ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి, అట వీశాఖ మంత్రి జోగురామన్న హరితహంరంపై బుధవారం సమీక్ష జరుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో కలెక్టరేట్లో అధికారులు, ఉద్యోగులు ఒ క్కసారిగా ఉలిక్కి పడ్డారు. అప్పటికే భోస జనవిరామ సమయం కావస్తుండటంతో ఎక్కడివారక్కడ ఇంటిదారి పట్టారు. క్యాంటీన్ వద్దే అదుపులోకి.. ఏసీబీ డీఎస్పీ సారుుబాబా కథనం ప్రకా రం... రాష్ట్ర ప్రభుత్వం తొలిజాబితా లో ప్రకటించిన 99 మంది అమరవీరుల్లో సంగెం మండలం పల్లారిగుడాకు చెందని అలావత్ రాజేందర్ పేరుంది. రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏప్రిల్ 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీం తో తెలంగాణ ప్రభుత్వం రాజేందర్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన డబ్బుల కో సం కలెక్టరేట్కు వస్తున్నారు. కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీ ల్కుమార్ వారిని రూ.10 వేలులం చం డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు బుధవా రం కలెక్టరేట్లోని క్యాంటీన్ వద్ద బాధితుడు భద్రు నుంచి తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారు లు సునీల్ను అదుపులోకి తీసకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్లోని ఆయన సెక్షన్ వద్దకు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. సునీల్ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇటీవలే డీటీగా పదోన్నతి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం లో చేరిన సునీల్ నర్సంపేటలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ కొద్ది నెలల క్రితం డిప్యూటేషన్పై కలెక్టరేట్కు వచ్చారు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్గా సునీల్కు పదోన్నతి కూడా లభించింది. పదోన్నతుల ఫైల్ ఇటీవల కలెక్టర్ ఆమోదం లభించింది. ఒకటి రెండు రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్గా వెళ్లాల్సిన అతడు ఏసీబీకి చిక్కడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా సునీల్ గతంలో ఆత్మకూరు మం డలంలో పనిచేస్తున్న క్రమంలో ఓసారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
విద్యుత్ ఏఈకి ఏసీబీ షాక్
రూ.20వేలు లంచం తీసుకొని.. చిక్కిన వైనంఅదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వనస్థలిపురం: విద్యుత్ శాఖ ఏఈకి ఏసీబీ అధికారులు షాకిచ్చారు. అపార్ట్మెంట్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం తీసుకున్న వనస్థలిపురం సబ్స్టేషన్ ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే... వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీలో కె.భానుమూర్తి ఆరు ఫ్లాట్లతో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన విద్యుత్ పనులను కాంట్రాక్టర్ కర్రి వెంకటేశ్వరరావుకు అప్పగించారు. 2014 మే నెలలో విద్యుత్ కనెక్షన్ (6 సింగిల్ ప్య్యానల్ బోర్డు) కోసం వనస్థలిపురం సబ్ స్టేషన్ ఏఈ వర్యాల అశోక్ కుమార్కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ అంచనాల కోసం ఏఈ రూ.30 వేలు డిమాండ్ చేయగా... వర్క్ఆర్డర్ ఇచ్చే సమయంలో చెల్లిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.30 వేలు చెల్లిస్తేనే వర్క్ ఆర్డర్ ఇస్తానని ఏఈ తిప్పుతుండడంతో... రూ.20 వేలు ఇస్తానని వెంకటేశ్వరరావు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ డీస్పీ ఎం.ప్రభాకర్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం పథకం ప్రకారం తాము ఇచ్చిన నోట్లను వెంకటేశ్వరరావు ద్వారా సబ్స్టేషన్ కార్యాలయంలో ఏఈ అశోక్ కుమార్కు ఇప్పించారు. ఆ నోట్లను ఏఈ చేతితో తాకకుండా తన నోట్బుక్లో పెట్టించి...దానిని బ్యాగ్లో పెట్టాడు. అనంతరం తనను భోజనానికి తీసుకెళ్లడానికి వచ్చిన కుమారుడు రాఖీకి బ్యాగ్ ఇచ్చి... ‘నువ్వు ఇంటికి వెళ్లు... నేను తర్వాత బస్సులో వస్తా’నని చెప్పాడు. రాఖీ బ్యాగును తమ కారు (ఏపీ 13ఏబి 8176)లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుండగా... ఏసీబీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నోట్బుక్లో ఉన్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్స్టేషన్లో సోదాలు నిర్వహించారు. బ్యాగులో నగదు ఉన్న విషయం ఏఈ కుమారుడు రాఖీకి తెలుసా? లేదా అనే విషయమై విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. నగరంలోని హైదర్షాకోటలో గల ఏఈ ఇంటిలోనూ సోదాలు నిర్వహిస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎస్.వెంకట్రెడ్డి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
మసిపూసి..
రిమ్స్లో ‘లంచం ఇస్తేనే కొత్త పీఆర్సీ వ్యవహారం’ విచారణకు కమిటీ వేసేందుకు వెనకంజ పెద్ద తలలే సూత్రధారులన్న అనుమానాలు..! మౌఖికంగా విచారణ చేశాం, అవినీతి లేదు : రిమ్స్ డెరైక్టర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం : రిమ్స్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్ :రిమ్స్లో లంచం వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ఉన్నతాధికారులే శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పలువురు పెద్ద తలలే సూత్రధారులు కావడంతో వ్యవహారాన్ని మసిపూసి మారెడుకాయ అన్న చందంగా తమకు అనువుగా మలచుకుంటున్నారు. కొంత మంది హెడ్ నర్సులతో లంచం ఇవ్వలేదని చెప్పిస్తూ దీన్ని తేలికపరుస్తున్నారు. దీంట్లో పలువురు ఉన్నత స్థానాల్లో ఉన్నవారే పాత్రధారులు కావడంతో విచారణకు వెనుకంజ వేస్తున్నారు. మౌఖికంగా విచారణ చేశామని, లంచం ఇవ్వలేదని నర్సులు చెబుతున్నారని రిమ్స్ డెరైక్టర్ హేమంత్రావు పేర్కొనడం గమనార్హం. మరోపక్క ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని సూపరింటెండెంట్ అశోక్ చెబుతుండడం మరో కోణం. కమిటీకి వెనుకంజ.. సాధారణంగా ఒక శాఖలో అవినీతి జరిగితే ఉన్నతాధికారులు కమిటీ ఏర్పాటు చేసి దానిపై విచారిస్తారు. ఈ వ్యవహారంలో ఉన ్నతాధికారులే సూత్రధారులు కావడంతో రి మ్స్లో లంచం ఇస్తేనే కొత్త పీఆర్సీ విచారణ అటకెక్కే పరిస్థితి నెలకొంది. నామమాత్రం గా మౌఖికంగా విచారణ చేశామని, అందు లో లంచం ఇచ్చినట్లు ఎవరూ చెప్పలేదని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సులు లంచానికి సంబంధించి వ్యక్తిగతంగా రాతపూర్వకంగా ఫిర్యా దు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా తమను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వేధించే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. అసోసియేషన్ ఆధారంగా ఫిర్యాదు చేయాలన్నా.. అందులోనూ రిమ్స్ ఉన్నతాధికారులకు చెందిన వ్యక్తులదే ముఖ్య భూమిక ఉండడంతో వెనుకంజ వేస్తున్నారు. లంచానికి సంబంధించి ఇతర శాఖల అధికారులతో విచారణ జరిపిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. మొదట రూ.500 చొప్పున రూ.లక్షా 30 వేలు వసూలు చేసిన అధికారులు అవి సరిపోవంటూ మరో రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని వేధించారని నర్సుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన మరో రూ.2 లక్షల 60 వేలు వసూలుకు అధికారులు కన్నేశారు. ‘సాక్షి’లో కథనంతో.. ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో కథనం రావడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. పీఆర్సీ విషయంలో పలువురు నర్సులను పిలిపించి అధికారులు వ్యవహారాన్ని సద్దుమణిగేలా ప్రయత్నించారని స్పష్టమవుతోంది. మొదట వసూలు చేసిన డబ్బులను కూడా తిరిగి ఇస్తామని, విషయం బయటకు ఎవరికీ చెప్పవద్దని నర్సులను ప్రాధేయపడినట్లు సమాచారం. ఒక ఏవో సెలవుపెట్టి వెళ్లిపోయారు. కాగా.. రిమ్స్ ఉన్నతాధికారితోపాటు ముఖ్య స్థానాల్లో ఉన్న పలువురికి ఇందులో వాటా ఉండడంతో బయటకు పొక్కకుండా అంతా గప్చుప్ చేసేస్తున్నారని వినికిడి. ఇదిలా ఉంటే రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి చైర్మన్గా ఉన్నారు. కలెక్టర్ ఎం. జగన్మోహన్ కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎంపీ సభ్యులుగా ఉన్నారు. కో చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి విచారణకు కమిటీ వేసి.. అందులోనూ ఇతర శాఖ అధికారులతో విచారణ జరిపితే పూర్తిస్థాయిలో వ్యవహారం బయటకు వస్తుందని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే రిమ్స్లో సంచలనం రేపిన ఈ కథనంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హైదరాాబాద్ నుంచి మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన రిమ్స్ డెరైక్టర్ హేమంత్రావు నర్సుల పీఆర్సీ డాక్యుమెంట్లను తెప్పించుకుని మరీ సంతకాలు పెట్టారు. సెక్షన్ సిబ్బంది కూడా పనిని వేగవంతం చేశారు. -
ఖైదీ నంబర్ 1779
చంచల్గూడ జైలుకు రేవంత్ తరలింపు ఓటుకు నోటు కేసులో 14 రోజుల రిమాండ్ మరో ఇద్దరికీ విధించిన ఏసీబీ కోర్టు.. చంచల్గూడ జైలుకు నిందితులు హైసెక్యూరిటీ బ్యారక్ను కేటాయించిన అధికారులు జడ్జి అనుమతితో ఎమ్మెల్సీ పోలింగ్కు హాజరు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి జైలుపాలయ్యారు. రేవంత్, ఇతర నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డి, బిషప్ సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్సింహను సోమవారం ఉదయం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట ఆయన నివాసంలో హాజరుపరిచారు. వీరికి రిమాండ్ విధించిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జడ్జి అనుమతితో రేవంత్రెడ్డిని అసెంబ్లీకి తీసుకెళ్లగా, మిగతా ఇద్దరినీ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు రెండు గంటలపాటు అసెంబ్లీలో గడిపిన రేవంత్ పోలీసుల ఒత్తిడి మేరకు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన్ని కూడా జైలుకు తరలించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తోపాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 120(బి), 34 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ తరఫు న్యాయవాదులు సోమవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు తమకు గడువు కావాలని ఏసీబీ తరఫు న్యాయవాది కోరడంతో జడ్జి లక్ష్మీపతి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆధారాలు మాయం చేస్తారు: ఏసీబీ రేవంత్రెడ్డిసహా ఇతర నిందితులు బయట ఉంటే ఆధారాలను తారుమారు చేయడంతోపాటు వాటిని మాయం చేస్తారని, అలాగే సాక్షులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశముందని ఏసీబీ డీఎస్పీ అశోక్కుమార్ రిమాండ్ రిపోర్టులో అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అనేక మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులను 15 రోజులపాటు రిమాండ్కు తరలించాలని కోరారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ రేవంత్రెడ్డి తనను ప్రలోభాలకు గురిచేస్తున్నారనంటూ స్టీఫెన్సన్ గత నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు ఫిర్యాదు చేశారు. మతియాస్ జెరూసలేం అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చి... రూ. 2 కోట్లు తీసుకుని ఎవరికీ ఓటు వేయకుండా ఉండాలని, ఎన్నికల సమయంలో దేశంలో ఉండొద్దని లేదా రూ. 5 కోట్లు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని కోరినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో సౌత్ లాలాగూడలోని పుష్పనిలయం దగ్గర ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మాటువేశాం. 4.40 గంటలకు ఏపీ 09 సీవీ 9939 వాహనంలో రేవంత్రెడ్డి, బిషప్ సెబాస్టియన్ వచ్చారు. కొద్దిసేపటి తర్వాత రుద్ర ఉదయ్సింహ మరో వాహనంలో డబ్బు సంచితో అక్కడికి చేరుకున్నారు. రేవంత్రెడ్డి సూచన మేరకు డబ్బు సంచిని తెరిచి రూ. 50 లక్షలను టీపా య్పై పెట్టారు. మిగిలిన రూ.4.50 కోట్లను ఓటు వేసిన తర్వాత ఇస్తామని తెలిపారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. మధ్యవర్తుల సమక్షంలో లంచం సొమ్ము రూ. 50 లక్షలు, రెండు ఐ-ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. న్యాయవాదుల మధ్య ఘర్షణ ఈ వ్యవహారంలో రేవంత్రెడ్డిని ఇరికించడం వెనుక ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర ఉందని, వీడియో ఫుటేజీని మీడియాకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని ఆయన తరఫు న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో అన్నారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత కొంతం గోవర్ధన్రెడ్డి ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం కుట్ర చేశారనడం సరికాదని, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది.బాబు ఆదేశాల మేరకే డబ్బు ఇచ్చేందుకు వచ్చినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేసినందున చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ డిమాండ్ చేశారు. చర్లపల్లికి తరలించండి... రేవంత్రెడ్డి సహా ఇతర నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ నివేదించారు. ఈ మేరకు సోమవారం కోర్టుకు లేఖ రాశారు. సాధారణంగా ఏసీబీ కేసుల్లో నిందితులను రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలిస్తారని వివరించారు. చంచల్గూడ జైలులో పాత వాటి స్థానంలో కొత్తగా బ్యారక్ల నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుతానికి మూడు బ్యారక్లు మాత్రమే ఉన్నాయని నివేదించారు. కాగా, బంజారాహిల్స్లో రేవంత్రెడ్డి నివాసం వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది. జైలులో రేవంత్ సోమవారం ఉదయం 11.44 గంటలకు రేవంత్రెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు యూటీ నంబర్ 1779 కేటాయించారు. స్పెషల్ కేటగిరీ ఉత్తర్వులు అందేవరకు రేవంత్ను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని, ఎమ్మెల్యే కావడంతో హై సెక్యూరిటీ బ్యారక్లో ఉంచినట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో జైలు ములాఖత్లో భాగంగా రేవంత్ను ఆయన న్యాయవాది కలసి వెళ్లారు. కాగా, ఆయన్ని జైలుకు తీసుకువస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు జైలు వద్ద సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉదయం జడ్జి ఎదుట హాజరుపరిచే ముందు నిబంధనల ప్రకారం నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ సాధారణ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వారిని బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కంగుతిన్న రేవంత్ ఈ కేసులో తాను ఇరుక్కుపోయిన తీరు తెలుసుకుని రేవంత్ కంగుతిన్నారు. ఆదివారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయనను ఉంచిన గదిలో ఓ టీవీ కూడా ఉంది. రాత్రి 9 గంటలకు దాదాపు అన్ని న్యూస్ చానళ్లలో రేవంత్రెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ప్రసారమయ్యాయి. అప్పటిదాకా మామూలుగా ఉన్న రేవంత్రెడ్డి టీవీలో వస్తున్న దృశ్యాలను చూసి కంగుతిన్నారు. తన సోదరుడు తనను కలిసేందుకు అనుమతించాలంటూ ఏసీబీ డీజీ ఖాన్ను కోరారు. అందుకు ఆయన సమ్మతించడంతో తెల్లవారుజామున 3 గంటలకు కొండల్రెడ్డి వచ్చి రేవంత్ను కలిశారు. అరగంట పాటు మాట్లాడారు. -
సాక్ష్యముంటే ‘బాస్’ కూడా నిందితుడే
అభిప్రాయం కేసీఆర్కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ కనుక ‘గేమ్’ అని రేవంత్రెడ్డి అనడంవల్ల చంద్రబాబే లంచాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతనూ నిందితుడయ్యే అవకాశం ఉంది. ఎంఎల్సీ ఎన్నికల నేప థ్యంలో యాభై లక్షల రూపా యల నోట్లు ఇస్తూ తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికి, లం చం ఇచ్చిన నేరానికి అరెస్ట య్యారు. ఈ ఘటనను రహస్య కెమెరాల ద్వారా విభిన్న కోణాల నుంచి చిత్రీక రించిన దృశ్యాలూ, దొరికిన డబ్బు మూట, పంచిన సహాయకుడు, వెంట వచ్చిన వ్యక్తి గట్టి సాక్ష్యాలే కనుక పోలీసు అధికారులు ఆయన్ను అరెస్టు చేసే నిర్ణయం తీసుకున్నారు. నేరగాడని అనుమానించడానికి తగిన సాక్ష్యాలు ఉండడం వల్లనే రేవంత్రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ చే శారు. ఏదైనా రుజువైతేనే... నేరం జరిగిందని మామూలు వ్యక్తులు, పోలీసు అభి యోగపత్రాలు, మీడియా భావిస్తే సరిపోదు. ఓట్లు కొనుగోలు చేస్తున్నారనీ, అమ్ముకుంటున్నారనీ అంద రూ అనుమానిస్తున్నారు. కాని తగిన సాక్ష్యం ఉంటేనే కేసు నమోదవుతుంది. ప్రాధమిక సాక్ష్యాలుంటేనే అరెస్ట్ సాధ్యం. రుజువైతేనే జైలు. నేరగాడని రుజువైన తరు వాత కూడా బెయిల్ సాధ్యమే. అప్పీలులో కేసే కొట్టి వేస్తే ఏమీ ఉండదు. లంచం ఇవ్వడం, ఇవ్వజూపడం కూడా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద నేరం. అంగీకరించడం, తీసుకోవడం, అడగడం కూడా నేరమే. ఈ నేరానికి సహకరించిన వారు, ఆర్థిక సాయం చేసినవారు, ఇత రత్రా సహకారం అందించిన వారు అంతా నేరగాళ్లే అవుతారని భారతీయ శిక్షాస్మృతి, నేరశాస్త్ర సూత్రాలు వివరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడితే అందులో భాగస్థులంతా సమాన బాధ్యులై శిక్ష అనుభవిస్తారు. కాని వారికి ఉమ్మడి నేర ఉద్దేశం ఉందని రుజువు చేయాలి. ఐపీసీ సెక్షన్ 34 ఈ సూత్రాన్ని వివరిస్తున్నది. కలసి ఆలోచించినవారు నేరగాళ్లే... మరొక కీలకమైన నేర న్యాయసూత్రం సెక్షన్ 120 బి. క్రిమినల్ కుట్ర చేసిన వారు, అంటే నేరం చేయడానికి కలసి ఆలోచించి ఆచరించిన వారంతా నేరగాళ్లే. కానీ ఇక్కడ కూడా కుట్ర రుజువు కావాలి. కాన్స్పరసీ అంటే కలసి శ్వాసించడం. అంత దగ్గరగా కలసి నేరానికి ప్లాన్, ప్లాట్ రచించిన వారు, అందుకు సంబంధించిన సాక్ష్యాలుంటేనే నేరగాళ్లవుతారు. ఇంతకీ ఉమ్మడి ఉద్దే శాలు, కుట్రలు రుజువవుతాయా? కీలక సాక్ష్యం... ఓట్లు అమ్ముకున్నా నేరమే కనుక, వెంటనే ఓటర్లం దరినీ జైలుకు పంపడం న్యాయం కాదు, సాధ్యం కాదు. ఓట్లు అమ్ముకున్న నేరం రుజుైవైతే ైజైళ్లు సరిపోక పోయినా, సరిపోయినా వారు ఎన్ని లక్షల మంైదైనా సరే జైలుకు పంపడమే సమన్యాయం. కాని దొరికితేనే దొంగలు. రేవంత్రెడ్డి కేసులో వీడియో చిత్రాలతో పాటు, కీలకమైన సాక్ష్యం- నియమిత ఎమ్మెల్యే స్టీఫెన్ సన్దే అవుతుంది. వీడియోలు, డ బ్బుమూటలు, నోట్ల లెక్కల వివరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, వచ్చిన సమ యం, సంచి పైకి మోసిన సమయం, నోట్లు తీసి బల్ల మీద పెట్టిన సమయం, స్టీఫెన్సన్ చెప్పిన ప్రతి మాటకు సమర్థన అయితేనే, ఆ మాటలను బలోపేతం చేసే మరికొన్ని సాక్ష్యాలు జత కూడితేనే నేరం రుజువ వుతుంది. ప్రస్తుతం మనముందు, కోర్టుల ముందు, మీడియా ముందు సమాచారమే ఉంది. అవి సాక్ష్యా లవుతాయో లేవో తెలియదు. మీడియాలో వచ్చిన వీడియో ఫుటేజ్ సమాచారం, ఏసీబీ తీసిన వీడియో చిత్రాలు, అసైలైనవనీ, వాటిని ఎవరూ మార్చలేదని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో తేలితేనే సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదు. ఆ సాక్ష్యం రేవంత్రెడ్డి నేరాన్ని రుజువుచేసే అవకాశం ఉంది కనుక అతను నిందితుడై అరెస్టయినాడు. ఆయన కారు నడి పిన వాడు, డబ్బు సంచి పట్టుకొచ్చినవాడు, కట్టలు లెక్కపెట్టి బయట పెట్టినవాడు నేరంలో సహకరించి నట్టు సాక్ష్యం ఉండడం వల్ల వారు యజమాని (రేవంత్రెడ్డి)తో కలసి నేరగాళ్లుగానే ఉండిపోతారు. ‘బాస్’ మాటేమిటి? రేవంత్రెడ్డి కేసులో తనకు ‘బాస్ చెప్పాడ’ని అన్నట్టు రికార్డ్ అయింది. బాస్ ఎవరో అందరికీ తెలుసు కనుక, ఆ బాస్కూ శిక్ష పడాలని ఆశించడం ఆకాంక్షే అవుతుంది కాని సాక్ష్యం కాదు, సాక్ష్యం లేకుంటే శిక్ష సాధ్యం కాదు. కేసీఆర్కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ ఉంది కనుక ‘గేమ్’ అని రేవంత్రెడ్డి అనడం వల్ల చంద్రబాబే లం చాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతను కూడా నిందితుడయ్యే అవకాశం ఉంది. అది పరిశోధనలు, సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణ , ఆంధ్ర పోలీసులు కాకుండా నిష్పాక్షికమైన వారు, సీబీఐ లేదా ఇతర పోలీసు దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేయాలని కూడా కోరవచ్చు. పోలీసులకు సవాలే! రాజకీయాల మాటెలా ఉన్నా పోలీసులకు మాత్రం ఇటువంటి కేసులు సవాళ్ల్లే. స్టీఫెన్సన్ అయిదు కోట్ల రూపాయలు రహస్యంగా అందుకుని ఉంటే పోలీ సులసమస్య ఇంకా జటిలంగా మారి ఉండేది. ఆయన పోలీసులకు చెప్పడం వల్ల, ఏసీబీ కెమెరాలతో సమర్థ వంతంగా వ్యవహరించడం వల్ల ఈ సాక్ష్యాల సేకరణ జరిగింది. విచిత్రమేమంటే అబద్ధాలను అబద్ధాలని రుజువుచేసే అవకాశాలు ఈ దేశంలో కనిపించడం లేదు. ఇంతగా కెమెరాల్లో చిక్కిన తరువాత కూడా డబ్బు నేనివ్వలేదు, అంతడబ్బు నాకెక్కడిది, అయినా నేనెందుకు ఇస్తాను అనే అబద్ధాలను, ఇంకా పోలీ సులను లేదా ఇంకెవరినో బట్టలిప్పించి కొడతాను అనే మాటలకు ఏ పర్యవసానాలూ లేకపోవడం మరొక విచిత్రం. దర్యాప్తులు సమర్థవంతంగా ైనైపుణ్యంతో నిర్వహించి, బలమైన సాక్ష్యాలు దొరికి, విచారణ సకాలంలో జరిగితేనే కుట్రదారులంతా దొరుకుతారు, జైలుకు వెళతారు. అవినీతి కేసుల దర్యాప్తు, విచారణ, ప్రాసిక్యూషన్లో అవినీతి లేకుండా ఉంటేనే అవినీతి అంతమవుతుంది. professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈ
హుజూర్నగర్: నల్లగొండ జిల్లా మట్టపల్లి ట్రాన్స్కో ఏఈ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. శనివారం హుజూర్నగర్లోని ఏడీఈ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన సబ్రిజిస్ట్రార్
- రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం - మరో ఇద్దరిపైనా కేసు - డీఎస్పీ ఆర్కెప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నక్కపల్లి: ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ నక్కపల్లి సబ్రిజిస్ట్రార్ ఐ.ఉమామహేశ్వరరావు శుక్రవారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోయారు. రాంబిల్లికి చెందిన లక్ష్మీనరసింహ తన సోదరి విజయలక్ష్మికి ఉపమాకలో ఉన్న రెండు ఎకరాలను ఆమె కుమారైతసునీత పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం సబ్రిజిస్ట్రార్ను సంప్రదించాడు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపుడ్యూటీ చెల్లించడంతోపాటు అదనంగా రూ.పదివేలు లంచం సబ్రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని లక్ష్మీనరసింహ వాపోయాడు. ఇస్తేతప్ప రిజిస్ట్రేషన్ చేయనని సబ్రిజిస్ట్రార్ తెగేసి చెప్పాడు. దీంతో శుక్రవారం రూ.10వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. డబ్బు ఇచ్చిన రోజునే రిజిస్ట్రేషన్ చేద్దామని రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు బాధితునికి నగదు ఇచ్చి పంపారు. లక్ష్మీనరసింహ సబ్రిజిస్ట్రార్కు రూ. పదివేలు ఇవ్వబోగా టేబుల్ సెల్ఫ్లో పెట్టాలని సూచించారు. ఆమేరకు సెల్ఫ్లో పెట్టిన అనంతరం అక్కడే ఉన్న మరోవ్యక్తి యర్రాసత్తిబాబుని పిలిచి రూ. పదివేలు నగదు సరిపోయిందో లేదో చూడాలని రిజిస్ట్రార్ చెప్పారు. సరిచూసిన అనంతరం ఆ సొమ్మును కొత్త సందీప్ అనే వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. లంచం తీసుకున్న సబ్రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుతోపాటు, ఈవ్యవహారంతో ప్రమేయం ఉన్న యర్రాసత్తిబాబు, కొత్తసందీప్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసినట్లు డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. అధికారుల గుండెల్లో రైళ్లు ఈ సంఘటనతో పాయకరావుపేట నియోజకవర్గంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. ఈ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చిన్నపనికి రూ.వేలల్లో గుంజుతారన్న వాదన వ్యక్తమవుతోంది. గతంలోనూ పలువురు మండలస్థాయి అధికారులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు ఉన్నాయి. రెండేళ్లక్రితం పాయకరావుపేట తహశీల్దార్ లింగయ్య, ఆర్ఐ మురళిలు చనిపోయిన వీఆర్వో కుటుంబానికి వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నాలుగేళ్ల క్రితం నక్కపల్లి ఈవోఆర్డీగా పనిచేసిన కృష్ణ వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం రూ.వెయ్యి తీసుకుంటూ దొరికిపోయారు. రెండేళ్ల క్రితం ఎస్.రాయవరం మండలానికి చెందిన పంచాయతీరాజ్ వర్క్ఇన్స్పెక్టర్, వీఆర్వోలు ఇలానే ఏసీబీకి చిక్కారు. -
అవినీతి అంతమే లక్ష్యం
- అప్పుడే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది - జీహెచ్ఎంసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతాం - నెలకోసారి బస్తీలకు వెళదాం - సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో ఎవరూ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పని చేయాలనేది తన ధ్యేయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. అలా పని చేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతానని తాను ఇచ్చిన హామీని అమలు చేస్తానని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి అయినా వేతనాలు పెంచుతామన్నారు. ఉద్యోగులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి... నైపుణ్యాలు పెంచాలని అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అమలు తీరుపై హెచ్ఐసీసీలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీహెచ్ఎంసీ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పరిస్థితులు మెరుగుపడాలన్నారు. వంద మార్కెట్లు, 50 నుంచి 60 చోట్ల మల్టీలెవెల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూరగాయలు, మాంసం మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కులు, బస్బేల పరిస్థితి బాగుపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుత.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెలకోసారి మళ్లీ బస్తీలకు వెళదామని... 15 మంది సభ్యులతో బస్తీ కమిటీలు వేసుకుందామని పిలుపునిచ్చారు. డెబ్రిస్పై ప్రత్యేక దృష్టి సమీక్షలో పలువురు అధికారులు తమ అనుభవాలు వివరించారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఏళ్ల తరబడి వేసిన డెబ్రిస్ గుట్టలుగా పేరుకుపోయిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్చంద్ర అభిప్రాయపడ్డారు. బస్తీ వాసులు మొక్కల పెంపకం, పార్కుల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చెత్త వేయడానికి ప్రజలకు స్థలం చూపించని పక్షంలో ఎంత శుభ్రం చేసినా సమస్య పునరావృతమవుతుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. ఎక్కడ వేయాలో తెలియక రోడ్డుపై వేస్తున్నట్టు జనం చెబుతున్నట్టు తెలిపారు. మరో పోలీసు అధికారి ఏకే ఖాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీ వంటి సంపన్న ప్రాంతాల్లో సైతం చెరువుల్లో రాత్రివేళ డెబ్రిస్ వేస్తున్నారని చెప్పారు. స్థలం లేనందునే అలా వేస్తున్నామని ప్రజలు చెప్పారని తెలియజేశారు. అధికారుల అనుభవాలు విన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైటెక్ి సటీ పాతబస్తీకి తీసిపోదని... ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ జగద్గిరిగుట్టలోని నివాస గృహాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. 15 రోజులకోమారు బస్తీ ప్రజలతో సమావేశమైతే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. వీకే అగర్వాల్, తేజ్దీప్కౌర్, సురేష్చంద్ర, ఎన్వీఎస్రెడ్డి, కళ్యాణ్చక్రవర్తి, బీఆర్ మీనా, చంద్రవదన్, శ్రీనివాసరెడ్డి, యాదగిరి తదితర అధికారులు తమ అనుభవాలు వివరించారు. ఈ సందర్భఃగా స్వచ్ఛ హైదరాబాద్పై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ గొప్పదనాన్ని సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాట ద్వారా వివరించారు. -
కృష్ణ.. కృష్ణ..!
ఏసీబీ వలలో కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కృష్ణమూర్తి ఏసీబీ అధికారులకు గురువారం కో-ఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న టి.కృష్ణమూర్తి చిక్కాడు. హన్మకొండ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నుంచి రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. - వరంగల్ క్రైం -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
వెల్దుర్తి : ఫౌతీలో పేరు మార్పునకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన వీఆర్వో.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు.. యశ్వంతరావుపేటకు చెందిన నరసింహులు మృతి చెందాడు. నరసింహులు పేరుతో ఉన్న 1.30 ఎకరాల భూమిని, మరో 9 గుంటల భూమిని తన తల్లి అనసూయ పేర ఫౌతీ చేయాలని ఆమె కుమారుడు జనార్దన్ రెండు నెలల క్రితం వీఆర్వోకు దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే సదరు వీఆర్వో రూ. 2,500 ఇస్తే ఫౌతీ చేయిస్తానని యువ రైతును డిమాండ్ చేశాడు. అయితే రూ. 2 వేలు లంచం ఇచ్చే విధంగా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో జనార్దన్ ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు జనార్దన్ నుంచి లంచం తీసుకుంటుండగా.. వల పన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ శాఖకు చెందిన టోల్ఫ్రీ నంబర్ మారిందని, మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు, పోన్ నంబర్లతో కూడిన బోర్డులను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే నేరుగా ఈ నంబర్ 94404 46149 కు ఫోన్ చేయాలని సూచించారు. దాడుల్లో సీఐలు ప్రతాప్కుమార్, నవీన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
లంచం ఇస్తే...నిబంధనలు ఉండవా ?
శ్రీకాళహస్తిలో టీడీపీ కౌన్సిలర్ల మండిపాటు దేవస్థానం టెండ ర్ల వ్యవహారంపై నిలదీత శ్రీకాళహస్తి: లంచం ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కేస్తారా...అంటూ కౌన్సిలర్లు శరవణ్కుమార్,చిర్రి నాగేశ్వరరావు సోమవారం దేవస్థానం పరిపాలన భవనం లో వీరంగం సృష్టించారు. నాలుగు రోజుల క్రితం ఆలయ పరిపాలన భవనంలో సెక్యూరిటీ,అన్నదానం సిబ్బంది కోసం టెండర్లు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఆ టెండర్లు హెదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్కు దక్కినట్లు ఆలయాధికారులు లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టెండర్లు వేసిన టీడీపీ ము న్సిపల్ కౌన్సిలర్లు శరవణ్కుమార్,చిర్రి నాగేశ్వరరావు తమ అనుచరులతో ఆలయ పరిపాలన భవనంలోని ఎస్టాబ్లిస్మెంట్ విభాగ అధికారి రవిశంకర్తో వాగ్వివాదానికి దిగారు. నిబంధనల ప్రకారం తామే తక్కువగా కోడ్ చేసినా స్థానిక నాయకుల ఒత్తిళ్లతో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి టెండర్ కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలా చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. మార్చిలో ఇదే టెండర్లలో తామే తక్కువగా కోడ్ చేస్తే రాజకీయాలు చేసి వాటిని రద్దు చేసి ఏప్రిల్లో మరోసారి టెండర్లు నిర్వహించారని, రెండోసారి తామే తక్కువకు కోడ్ చేసినా నాయకుల ఒత్తిళ్లతో,ముడుపులకు ఆశపడి హైదరాబాద్వాసికి టెండర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారి రవిశంకర్ మాట్లాడుతూ ఆలయానికి ఏసీబీ,విజిలెన్స్ దాడులు కొత్తేమీకాదని, టెండర్ల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సమాధానమిచ్చారు. టెండర్లు ఇక్కడ ఖరారు చేయడంలేదని,హెదరాబాద్లోనే దేవాదాయశాఖ కమిషనర్కు పంపుతున్నామని, ఏదైనా ఉంటే కమిషనర్కు చెప్పుకోవాలని చెప్పా రు.ఇలాంటి రాజకీయాలు సిగ్గుచేటని, ఎలా టెం డర్లు దక్కించుకోవాలో తెలుసని కౌన్సిలర్లు వెళ్లిపోయా రు. రెండు వర్గాలుగా చీలిన తెలుగుతమ్ముళ్లు దేవస్థానం టెండర్లతో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. దేవస్థానంలో సెక్యూరిటీ, అన్నదానం సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడానికి టెండర్ల నిర్వహణకు మార్చి 23న ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో ఎనిమిది టెండర్లు వేశారు. అయితే పట్టణంలోని ప్రధాన టీడీపీ నాయకుడి అనుచరుడికి టెండర్ దక్కకపోవడంతో వారు ఈవో కార్యాలయం వద్ద బీభత్సం సృష్టించారు. తమవాళ్లకే టెండర్లు ఇవ్వాలి...లేదంటే ఎంతటి అధికారికైనా బదిలీ తప్పదని హెచ్చరిం చారు.దీంతో టెండర్లు దేవస్థానంలో ప్రకటించకుండా కమిషనర్కు పంపించారు. వాటిని ఆయన రద్దు చేసి మరోసారి టెండర్లు నిర్వహించాలని ఈవోనుఆదేశించారు. దీంతో ఏప్రిల్ 23న ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు ఆరుగురు టెండర్లు వేశారు. అయితే రెండోసారి టెండర్లలో టీడీపీకి చెందిన మరో వర్గానికి దక్కే లా లేకపోవడంతో వివాదాలు చోటుచేసుకున్నాయి. టెండర్లలో పోటీపడిన తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్టేననే విమర్శలు చేస్తున్నారు. -
ఆ డీసీటీవోకు లంచాల దాహం
జ్యూయలరీ షాపు యజమాని నుంచి లంచం డిమాండ్ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి, ఇంట్లో సోదాలు ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు విశాఖపట్నం : ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. జ్యూయలరీ షాప్ యజమాని శ్రీనివాసరావు నుంచి రూ.లక్షా 50 వేల లంచం తీసుకుంటుండగా ఉప వాణిజ్య పన్నుల అధికారి కమలారావును సోమవారం ఉద యం పట్టుకున్నారు. లంచం కేసే కాకుండా కమలారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతనికి ఐవోబీలో రెండు లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. లాకర్లు తెరిస్తేనే అతడి ఆస్తులు విలువ తేలుతుందని అధికారులు భావిస్తున్నారు. వాటిని తెరవడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు రోజుల కిందటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన డి ప్యూటీ తహశీల్దారు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.పది కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేశారు. రూ.లక్షా 50 వేల డిమాండ్: వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్-2 పరిధి వన్టౌన్లో శ్రీనివాస్ జ్యూయలరీ షాప్ను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. స్టీల్ప్లాంట్ సర్కిల్ కార్యాలయం ఉప వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తున్న పి.కమలారావు ఫిబ్రవరిలో శ్రీనివాస జ్యూయలరీ షాప్పై దాడులు చేశారు. అప్పటి నుంచి ఎసెస్మెంట్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అవి ఇవ్వాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని జ్యూయలరీ షాప్ యజమాని తెలపగా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొత్తం సోమవారం ఉదయం అప్పుఘర్ కైలాసగిరి రోప్వే వద్ద ఉన్న తన నివాసానికి తీసుకురావాలని శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు నగదు తీసుకుని కమలారావు ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కమలారావును పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి అతడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. స్థలాలు, నగదు, బంగారంతోపాటు బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. కమలారావుపై ఆరోపణలు: సహ వాణిజ్య పన్నుల అధికారిగా ఉన్నప్పటి నుంచి కమలారావుపై ఆరోపణలున్నాయి. షెక్పాయింట్ వద్ద విధులు నిర్వహించినప్పుడు లారీల యజమానుల వద్ద లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. లారీలు నిలిపి సోదాలు చేసిన విషయంలో ఓ పంజాబ్ లారీ డ్రైవర్ కమలారావును కొట్టి రూమ్లో బంధించడం అప్పట్లో రాద్దాంతమైంది. సిరిపురం డివిజన్ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వహించినప్పుడు మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘన్పూర్ వీఆర్ఓ స్టేషన్ఘన్పూర్టౌన్ : పట్టా భూమికి ఆన్లైన్ పహణీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ స్టేషన్ఘన్పూర్ వీఆర్ఓ మడిపల్లి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయూడు. మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ప్రభుత్వాధికారుల్లో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన బజ్జూరి భాస్కర్కు స్టేషన్ఘన్పూర్లో సర్వే నంబర్ 682/ఏ2లో ఎకరం గుంటన్నర, 682/ఏ1లో ఎకరం గుంటన్నర భూమి ఉంది. ఆ భూములకు సంబంధించి అతడికి పాస్పుస్తకాలు ఉన్నారుు. 682/ఏ1 సర్వే నంబర్లోని అతడి భూమికి ఆన్లైన్ పహాణీ రాగా, 682/ఏ2లోని భూమికి ఆన్లైన్ పహాణీ రావడం లేదు. ఆన్లైన్ పహాణీ కోసం భాస్కర్ ఘన్పూర్ వీఆర్ఓ మడిపల్లి శ్రీనివాస్ను ఫిబ్రవరిలో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల్సిన పహాణీని ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పుకుంటున్నాడు. చివరికి రూ.3వేలు లంచం ఇస్తేనే ఆన్లైన్ పహాణీ చేస్తానన్నాడు. ఈ మేరకు రూ.2 వేలు ఇస్తానని భాస్కర్ చెప్పడంతో మంగళవారం స్థానిక తన ప్రైవేటు ఆఫీస్కు రావాలని వీఆర్ఓ సూచించాడు. ఈ విషయమై ముందస్తుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని వీఆర్ఓ ప్రైవేటు కార్యాలయంలో వీఆర్ఓ శ్రీనివాస్కు రూ.2 వేలు ఇచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే వీఆర్ఓను అదుపులోకి తీసుకుని డబ్బులు రికవరీ చేశారు. అనంతరం వీఆర్ఓను, ఫిర్యాదుదారుడిని స్థానిక తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. దాడుల్లో డీఎస్పీ సారుుబాబాతోపాటు ఏసీబీ సీఐలు పి.సాంబయ్య, ఎస్వీ రాఘవేంద్రరావు, జి.వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. లంచావతారులపై ఫిర్యాదు చేయండి.. అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడితే ఏసీబీ అధికారులను ఫిర్యాదు చే యాలని ఏసీబీ డీఎస్పీ ప్రజలకు సూచించారు. 9440446146(ఏసీబీ డీఎస్పీ-సాయిబాబా), 9440446202(సీఐ-సాంబయ్య), 9440446192(సీఐ-రాఘవేంద్రరావు), 9440446148(సీఐ-శ్రీనివాసరాజు), 9440446147(ఖమ్మం ఏసీబీ సీఐ-వెంకటేశ్వరరావు) నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఐదు నెలలుగా తిరుగుతున్నా : ఫిర్యాదుదారుడు బజ్జూరి భాస్కర్ నా పట్టా భూమికి ఆన్లైన్ పహాణీ కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ ఐదు నెలలుగా తిరుగుతున్నా. డిసెంబర్ 2014లో ఈ విషయమై తహసీల్దార్ రామ్మూర్తిని కలిసిన. ఆయన వీఆర్ఓ శ్రీనివాస్ను సంప్రదించాలని సూచిం చారు. వీఆర్ఓ చుట్టూ దాదాపు 30 సార్లు తిరిగిన. మొదట రూ.5 వేలు లంచం అడిగా డు. ఈ నెల 25న చివరికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తానని చెప్పి అదేరోజున ఏసీబీ అధికారులను కలిసిన. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ మేనేజర్
ఉయ్యూరు:స్థానిక మున్సిపల్ మేనేజర్ పి. రాధాకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 8 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ వి. గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. పారిశుధ్య కార్మికుడు బొత్స ఏసు ఫిర్యాదు మేరకు దాడి చేయడంతో రాధాకృష్ణ లంచం తీసుకుంటూ చిక్కాడు. 2001 నుంచి ఏసు పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. డెప్యుటేషన్పై పర్మినెంట్ ఉద్యోగి అయిన ఏసు మేస్త్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మేస్త్రి పోస్టు ఖాళీగా ఉండటంతో తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలుగా ఫైలు కదలడంలేదు. దీంతో లంచం ఇస్తేనే ఫైలుపై సంతకం చేస్తామని చెబుతున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐలు బి. శ్రీనివాస్, కె. వెంకటేశ్వర్లు, ఎస్.ఎస్.వి. నాగరాజు సిబ్బందితో కార్యాలయంపై దాడిచేశారు. ఏసు రూ. 8 వేలు మేనేజర్కు ఇస్తుండగా పట్టుకున్నారు. రాధాకృష్ణ చేతులకు రంగు అంటుకోవడం, ఫ్యాంట్ వెనుక జేబులోడబ్బు దొరకడంతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. లంచం కోసం పీడించారు మా అమ్మ చనిపోవడంతో 2001లో ఉద్యోగంలో చేరా. కొన్నేళ్లుగా డెప్యుటేషన్పై మేస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. సూపర్వైజర్ పోస్టు ఖాళీ అవడంతో దరఖాస్తు చేసుకున్నా. అందుకు సంబంధించి జీవో కాపీకూడా ఇచ్చా. లంచం ఇస్తేగాని సంతకం పెట్టనన్నారు. దీంతో ఏసీబీని ఆశ్రయించా. - బొత్స ఏసు, పారిశుధ్య కార్మికుడు చెయ్యి తడిపితేనే సంతకం మున్సిపాలిటీలో అవినీతి కంపుకొడుతోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులు, సిబ్బంది ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. చేయి తడపందే ఫైలుపై సంతకం పడటంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడిచేసి అవినీతి అధికారి భరతం పట్టడంతో మున్సిపాలిటీలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మున్సిపాలిటీలో అస్థవ్యస్థ పాలన, అవనీతిపై ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. మూడు రోజులుగా వరుస కథనాలు ప్రచురించి ప్రజల పక్షాన పోరాడుతోంది. ఈ కథనాలు అధికారుల్లో కదలిక తెచ్చాయి. ప్రతిపనికీ ఓ రేటు మునిసిపాలిటీలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. అలా చెల్లించకుంటే నెలలు గడిచినా పని జరగదు. జనన,మరణ ధ్రువీకరణ పత్రానికి రూ. 500 నుంచి రూ. 5 వేలు (వ్యక్తి అవసరాన్నిబట్తి), కొత్త ఇంటిపన్నుకు రూ. 5 వేల నుంచి 7 వేలు, నూతన భవన నిర్మాణ అనుమతులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష, లేఅవుట్కు ఎకరానికి రూ. 2 లక్షలు, అనుమతి లేకుండా శ్లాబ్ వేసుకునేందుకు రూ. 25 నుంచి 50 వేలు, వ్యాపార లెసైన్స్కు రూ. 2 వేలు, అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజిల రూపంలో అధికారి స్థాయిని బట్టి శాతాన్ని వసూలు చేస్తున్నారు. వరుస కథనాలు ... మున్సిపాలిటీలో అస్తవ్యస్థ పాలన, విధాన పరమైన లోపాలు, అవనీతిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తూ ప్రజా పక్షాన పోరాడుతూ అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపింది. ఈ నెల 18న ‘ఆరని వివాదాల కుంపటి’ 19న వివిదాస్పద ‘పన్ను పో(నో) టు’!, 20న సామాజిక స్థలాలు అన్యాక్రాంతం శీర్షికన కథనాలు ప్రచురించింది. దీంతో మన్సిపల్ శాఖ డెరైక్టర్ వాణీ మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్లు ఆరా తీశారు. ఈ కథనాలను సామాజిక కార్యకర్తలు అధికారులకు అందించి ఫిర్యాదులు చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రేమ్కుమార్ బిచ్కుంద : బిచ్కుంద ట్రాన్స్కో ఏఈ ప్రేమ్కుమార్ ఓ రైతు వద్ద నుంచి రూ.ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిచ్కుంద మండలం తక్కడ్పల్లి గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి ఏఈ 8 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. రూ.30 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పా డు. రైతు ఎంత బతిమాలినా ఏఈ వినకపోవడంతో చివరకు రూ.10 వేలు ఇచ్చేలా రైతు ఒ ప్పందం చేసుకున్నాడు. అనంతరం గంగా రాం ఏసీబీని ఆశ్రయించడంతో డబ్బు నోట్ల కు కెమికల్ అంటించి, ఆ నోట్లను రైతుకు ఇ చ్చామని డీఎస్పీ చెప్పారు. దీంతో రైతు ఆ డబ్బును బస్టాండ్ సమీపంలోని ఓ టీస్టాల్ వద్ద ఏఈకి ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని వివరించారు. వెంటనే ప్రేమ్కుమార్ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఈ దాడిలో ఏసీబీ సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, చంద్రశేఖర్, ఖుర్షిద్ అలీ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్ఏ
పాములపాడు: మండలంలోని మిట్టకందాల గ్రామానికి చెందిన వీఆర్వో శశికళ, వీఆర్ఏ హనీఫ్లు రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరులకు తెలిపారు. నంద్యాలకు చెందిన నారాయణకు మిట్టకందాల గ్రామంలో సర్వే నంబరు 202లో 3.70 ఎకరాల భూమి ఉంది. అందులో బోరు వేయించాడు. విద్యుత్ మోటారు ఏర్పాటు చేసుకునేందుకు విద్యుత్శాఖ అధికారులకు పొలం, బోరు ఉన్నట్లు వీఆర్వో ధ్రువీకరించిన పత్రం ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం వీఆర్వో శశికళను రైతు నారాయణ సంప్రదించగా రూ.15వేలు లంచం అడిగారు. అయితే రూ.12వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రైతు తెలిపారు. సోమవారం పాములపాడు తహశీల్దార్ కార్యాలయం పక్కన ప్రైవేట్ బిల్డింగ్లో వీఆర్వోకు రైతు రూ.12 వేలు ఇచ్చాడు. ఆమె వెంటనే ఆ డబ్బును వీఆర్కు ఇచ్చారు. మాటు వేసిన ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొదటి ముద్దాయిగా వీఆర్వో, రెండో ముద్దాయిగా వీఆర్ఏలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. లంచం అడిగితే సమాచార మివ్వండి ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లైతే తమకు సమాచారమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారను కోర్టుకు రావాల్సిన పని లేదని, వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు తమకు సహకరించి అవినీతిని అంతమొందించాలని పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజలింగు
♦ రూ.50 వేలు తీసుకుంటూ దొరికాడు ♦ ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ♦ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ఓంజీ ♦ ఏసీబీ కోర్టుకు కమిషనర్ తరలింపు మున్సిపల్ కమిషనర్ రాజలింగు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మానుకోటకు చెందిన ఓంజీ తన ఇంటి నిర్మాణం అనుమతి విషయంలో రాజలింగును కలిశాడు.. రూ.1.50 లక్షలు ఇస్తే అనుమతి ఇస్తానని తెలిపాడు. ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. పక్కా ప్రణాళికతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఓంజీ నుంచి రూ.50 వేలు కమిషనర్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. మహబూబాబాద్ : ఏసీబీ వలకు పెద్ద చేప చిక్కింది. మానుకోటకు చెందిన ఓ వ్యక్తి వద్ద ఇంటి నిర్మాణ అనుమతి విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ మునిసిపల్ కమిషనర్ రాజలింగు రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. కొన్నాళ్లుగా ఈయన అవినీతి వ్యవహారంపై పట్టణంలో చర్చ సాగుతున్నప్పటికీ.. ఈ ఘటనతో అతడి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన భూక్య ఓంజీ నాయక్ పట్టణ శివారు కురవి రోడ్డు సర్వే నంబర్ 307/2లో 240 గజాల స్థలంలో 3 గదుల నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్లుగా మునిసిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అరుుతే అధికారులు మాత్రం ఆ స్థలం ఎఫ్టీఎల్లో ఉందని, అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఓంజీ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతో హైకోర్టును ఆశ్రయించాడు. అందుకు హైకోర్టు నుంచి సంబంధిత అధికారులకు నోటీసులు వచ్చాయి. దీంతో మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగు, టీపీఓ ఖుర్షిద్ ఒత్తిడి మేరకు అతడు కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. హైకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామన్న మునిసిపల్ అధికారుల హామీతోఓంజీ ఆరు నెలల క్రితం ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. స్లాబ్ వరకు భవనం నిర్మాణం జరిగింది. అరుుతే అధికారులు మాట తప్పి మళ్లీ పనులు నిలిపివేయడంతో అతడు కమిషనర్ను కలిశాడు. ఆయన రూ.30 వేలు డిమాండ్ చేయగా, వెంటనే రూ.25 వేలు ఇచ్చాడు. పనులు మొదలు పెట్టిన కొద్దిరోజులకే మళ్లీ అధికారులు వచ్చి ఆపేశారు. అదే రోడ్డులో మరో వ్యక్తి ఇంటి అనుమతి కోసం లక్షా 50 వేలు ఇచ్చాడని, నువ్వు కూడా అంతే ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.75 వేలు తీసుకొని రమ్మని గురువారం ఓంజీకి చెప్పాడు. గత రెండేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న ఓంజీ విసిగి వేసారి చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కమిషనర్ చెప్పిన విధంగానే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడు జనం ఉండడంతో కమిషనర్ సూచన మేరకు 10 నిమిషాలు ఆగి మళ్లీ వెళ్లాడు. ఒంటరిగా ఉన్న కమిషనర్కు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులను కమిషనర్ తన టేబుల్ డెస్కులో వేసుకోగానే అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, సీఐలు రాఘవేందర్రావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఆ చాంబర్లోకి వెళ్లి ఆ డెస్కులోని డబ్బులను తీసి కమిషనర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కమిషనర్ రాజలింగుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓంజీ దరఖాస్తు చేసుకున్న పత్రాలు, ఆఫీసులోని ఇతరత్రా రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలో తని ఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే కమిషనర్ మానుకోటలో అద్దెకు ఉంటున్న ఇంట్లో, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఆయన నివాస గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. కమిషనర్ దగ్గరి నుంచి రూ.50 వేలు రికవరీ చేశామని, ఆయనను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సారుుబాబా తెలిపారు. నిజమైన ఆరోపణలు.. కొంతకాలంగా మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగుపై సీపీఎం పలు ఆరోపణలు చేస్తోంది. కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నాడని, లక్షలాది రూపాయలు గడించాడని విలేకరుల సమావేశంలోనూ వెల్లడించారు. కొంతకాలంగా మునిసిపాలిటి అవినీతిపై జరుగుతున్న ప్రచారానికి నేడు ఏసీబీ దాడుల్లో కమిషనర్ చిక్కడంతో తెరపడినట్లయింది. కాగా రాజలింగు 2014, ఫిబ్రవరిలో మునిసిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్టీసీ అధికారి
రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం అనకాపల్లి రూరల్:లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న టి.సత్యనారాయణ ఓ కాంట్రాక్టర్ నుంచి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన బేడజంగం సొసైటీ ప్రతినిధి ఎస్.శ్రీనివాసరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, డిపోలో పారిశుధ్యం కాంట్రాక్టును 2011-13లో దక్కించుకుని పనులు చేపట్టారు. ఈ కాంట్రాక్టు కోసం అప్పట్లో ఈఎంఐగా రూ.1,41,646లు డిపాజిట్ చేశారు. గడువు ముగియడంతో దానిని తిరిగి పొందేందుకు డిపోమేనేజర్ కార్యాలయ వారు నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలి. దాని కోసం ఏడాదిగా డిప్యూటీ సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. చివరకు అతనికి రూ.8వేలు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను శ్రీనివాసరావు ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సూచనమేరకు శనివారం ఉదయం డిప్యూటీ సూపరింటిండెంట్కు రూ.8 వేలు ఇచ్చాడు. అప్పటికే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా అతనిని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ నిందితుని విశాఖ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రమణమూర్తి, రామకృష్ణ, గణేష్ లు పాల్గొన్నారు. -
లంచం తీసుకున్న ఖాకీపై వేటు
హాక్-ఐ ద్వారా ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సస్పెండ్ చేసిన పోలీసు కమిషనర్ సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం తీసుకుంటాం..మీకేంటీ నొప్పి’’ అంటూ నడిరోడ్డుపై జర్నలిస్టుపై దౌర్జనం చేసిన పంజ గుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ధనుంజయను నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి సస్పెండ్ చేశారు. వివరాలు... జనవరి 22న పంజగుట్ట ట్రా ఫిక్ పోలీసుస్టేషనకు చెందిన కానిస్టేబుల్ ధనుంజయ రాజ్భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. నగ దు రహిత చలానా విధానం అమలులో ఉన్నా..అవేమీ పట్టని దనుంజ య.. వచ్చిపోయే కార్లను తనిఖీ చేస్తూ.. అందిన కాడికి డబ్బు వసూ లు చేసుకొని జేబులో వేసుకుంటున్నాడు. ఈ దృశ్యం సైదాబాద్కు చెందిన జర్నలిస్టు జావెద్ కంట పడింది. వెంటనే తన సెల్ఫోన్లో ధనుంజ య వాహనదారుల నుంచి లంచం తీసుకున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఇది గమనించిన కానిస్టేబుల్ ‘‘ వాహనదారుల నుంచి లంచం తీసుకుంటే నీకేంటి నొప్పి’ అంటూ జావెద్ ను దూషించి, దౌర్జన్యం చేశాడు. ధనుం జయ లంచం తీసుకున్న దృ శ్యాలను జావెద్ హాక్-ఐ యాప్ ద్వా రా నగర పోలీసు కమిషనర్కి ఫిర్యా దు చేశాడు. దీనిపై కమిషనర్ పంజ గుట్ట ఏసీపీకి విచారణకు ఆదేశించా రు. విచారణలో కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతడి ని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మహేం దర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అన్యాయాన్ని సహించేది లేదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అన్యాయాల్ని సహించేది లేదు.. లంచాన్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు.. ప్రజలకు సేవలందించేప్పుడే మంచి అధికారిగా గుర్తింపు ఉంటుంది. మాటలు మాని చేతలు చూపాలి’అని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. జిల్లాకు కలెక్టర్గా వచ్చి నెలన్నరవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నానని.. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. జిల్లాను కరప్షన్ ఫ్రీగా చూడాలన్నది లక్ష్యమన్నారు. పేదలకు సాయం చేసేందుకు ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంగా భావించాలని వ్యాఖ్యానించారు. లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై దృష్టిసారించాలన్నారు. రూ.15 వేలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అడుగు వేసిందని, గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఇప్పుడు లక్ష్యం కేవలం మూడు నెలలే ఉందన్నారు. దీనిపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షించామన్నారు. 2,300 గ్రామాల్లో ఇసుక, రేకులు, మరుగుదొడ్ల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ కూడా సిబ్బందికి పలు అంశాల్ని సూచించారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే వెళ్తాయని, వర్క్స్ కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయన్నారు. గుడిసెలున్న ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో మరుగుదొడ్లు కని పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఒకే ప్రాంతంలో పది మరుగుదొడ్లు కట్టించి తాళాలు కూడా లబ్ధిదారుడి చేతికే అందేలా చూస్తున్నామన్నారు. స్పందిస్తా కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన లబ్ధిని ఎవరైనా దిగమింగితే ఊరుకునేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా -
అవినీతి ‘చక్రం’
రూ. 40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ఏసీబీ అధికారులు తమ మార్క్ చూపించారు. ఉనికి లేదనుకునే సమయంలో జూలు విదిల్చారు. భూపాలపల్లి తహసీల్దార్ మార్క చక్రధర్ను సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూ ఆసామి నుంచి రూ.40వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. - భూపాలపల్లి భూపాలపల్లి : ప్రభుత్వ భూమి విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు కబ్జాదారుడి నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ భూపాలపల్లి తహ సీల్దార్ మార్క చక్రధర్ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి పట్టణంలోని 194 సర్వే నంబర్లో ముత్యంరావు అనే భూస్వామికి చెందిన భూమిని 1975 సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భూమిలోని ఎకరం 2 గుంటల స్థలంలో పట్టణానికి చెందిన కంభం రమేష్, చల్ల జక్కిరెడ్డి 2005లో భారత్ ఫంక్షన్హాల్ను నిర్మించారు. అయితే సదరు భూమి కేసు హైకోర్టులో ఉంది. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు ఇటీవలే తహసీల్దార్కు సూచించింది. దీంతో ఫంక్షన్హాల్ను సీజ్ చేయకుండా అనుకూలంగా వ్యవహరించాలంటే రూ. 50 వేలు ఇవ్వాల్సిందిగా రమేష్, జక్కిరెడ్డిని తహసీల్దార్ మార్క చక్రధర్ డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని రమేష్ కొద్ది రోజుల క్రితం ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు సూచించిన విధంగా సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రూ. 40 వేలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ చక్రధర్కు అందజేశాడు. ఆ డబ్బును తహ సీల్దార్ ఒక ఫైలు కింద దాచిపెడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. తహసీల్దార్ను విచారించిన అనంతరం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. డిసెంబర్ నుంచే ప్లాన్... భూపాలపల్లి రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెట్రేగినట్లు ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ అధికారి సూచన మేరకు తహసీల్దార్ చక్రధర్ గత డిసెంబర్ నెలలో భారత్ ఫంక్షన్హాల్ యజమాని రమేష్ను లంచం అడిగినట్లు తెలిసింది. అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రమేష్ ఏసీబీని ఆశ్రయించాడు. కాగా తహసీల్దార్కు సూచనలిచ్చిన అధికారిని సైతం పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించగా విఫలమైనట్లు సమాచారం. మూడు నెలల్లోనే ఇద్దరు.. మూడు నెలల కాల వ్యవధిలోనే భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. 2013 నవంబర్ 18న భూపాలపల్లి ఉత్తర అటవీ విభాగం డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ మాధవరెడ్డి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అనంతరం గత ఏడాది నవంబర్ 14న మండలంలోని జంగేడు వీఆర్వో జాకీర్హుస్సేన్ పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఓ రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వీఆర్వో పట్టుబడి సరిగ్గా మూడు నెలలు గడుస్తున్న క్రమంలోనే తహసీల్దార్ మార్క చక్రధర్ ఏసీబీ వలకు చిక్కాడు. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేను డబ్బులు తీసుకోలేదు : మార్క చక్రధర్, భూపాలపల్లి తహసీల్దార్ ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఫంక్షన్హాల్ నిర్మించుకున్నందున రెగ్యులరైజేషన్ కోసం జీఓ నంబర్ 59 కింద దరఖాస్తు చేసుకోవాలని యజమాని రమేష్కు సూచించా. నేను వద్దని చెప్పినా వినకుండా రూ.40 వేలు నా టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. ఆ డబ్బులను నేను ముట్టుకోలేదు. నాకు ఏ పాపం తెలియదు. మూడు నెలలుగా వేధిస్తున్నాడు : కంభం రమేష్, బాధితుడు 2005లో భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్హాల్ నిర్మించుకున్నాను. అయినప్పటికీ లంచం ఇవ్వకుంటే ఫంక్షన్ హాల్ను సీజ్ చేస్తానని తహసీల్దార్ మూడు నెలలుగా బెదిరిస్తున్నాడు. దీంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. -
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన రైల్వే సీఐ
ఏలూరు (వన్ టౌన్) : ఏలూరులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీఐ కె.జోజి తినుబండారాల విక్రేత నుంచి రూ.6 వేల లంచం తీసుకుంటూ సీబీఐ వలలో చిక్కారు. విశాఖపట్నంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం-ఏలూరు మధ్య రైళ్లలో తిరుగుతూ తినుబండారాలు అమ్ముకునే వారికి ఓ వ్యక్తి వాటిని సరఫరా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అతనికి తగిన అనుమతులు లేకపోవడంతో ఏలూరులో రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీఐగా పనిచేస్తున్న కె.జోజి నెలకు రూ.6 వేల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గత నెలలకు సంబంధించి కూడా అదే మొత్తంలో ఇవ్వాలని కోరాడు. అంత ఇచ్చుకోలేనని సదరు వ్యాపారి చెప్పడంతో గత నెలలు, ప్రస్తుత నెలకు సంబంధించి రూ.6 వేలు ఇవ్వాలని అడిగాడు. దీంతో బాధితుడు సీబీఐ అవినీతి విభాగం అధికారులను ఆశ్రరుుంచాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి ఫిర్యాదు దారునుంచి రూ.6 వేల లంచం తీసుకుంటున్న సీఐ కె.జోజిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్లోని సీఐ కార్యాలయూన్ని, అనంతరం అతని ఇంటిని తనిఖీ చేసి వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జోజిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, ఈనెల 27 వరకు అతడికి రిమాండ్ విధించారని సీబీఐలోని ఏసీబీ విభాగం ఎస్పీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారెవరైనా లంచం అడిగితే 1800 425 00100 నంబర్కు ఫోన్ చేయూలని, లేదంటే ఈమెరుుల్ ఐడీ జిౌఛ్చఛిఠిటజుఞఃఛిఛజీ.జౌఠి.జీ కి ఫిర్యాదు చేయూలని ఆయన సూచించారు. -
ఆయన రూటే సెప‘రేటు’
పక్కదారిపడుతున్న అకౌంట్స్ లెక్క అయ్యగారి నిర్వాకంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కాసులివ్వకుంటే కొర్రే విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగం లెక్క పక్కదారి పడుతోంది. లంచాల కోసం ఓ అధికారి జలగలా పీడుస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి పైసలివ్వనిదే ఫైల్పై సంతకం చేయడం లేదని ఉన్నతాధికారి చెవిన పడటంతో వారంరోజుల క్రితం పిలిచి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆ అధికారిలో మార్పులేదు. దీంతో ఉన్నతాధికారి.. అయ్యగారి మామూళ్ల వ్యవహారంపై స్టేట్ ఆడిట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పేరుకుపోయిన ఫైళ్లు : రవిబాబు కమిషనర్గా పనిచేసిన సమయంలోనూ ఈ అధికారి వ్యవహారశైలిపై స్టేట్ ఆడిట్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇక్కడ నుంచి బదిలీ చేశారు. రెండేళ్ల క్రితమే తిరిగి ఇక్కడ పోస్ట్ దక్కించుకున్నారు. ఇటీవల మామూళ్ల ఆశ ఎక్కువవడంతో ఫైళ్లపై అడ్డగోలుగా కొర్రీలు రాస్తున్నారని ఆ సెక్షన్ ఉద్యోగులే అరోపిస్తున్నారు. పద్ధతి మార్చుకోమని చెప్పినందుకు ఉన్నతాధికారిపైనే ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. ఆ సెక్షన్లో పేరుకుపోయిన ఫైళ్లపై విచారణ చేస్తే అయ్యగారి అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బకాయిలపై ఫిర్యాదు : నగరపాలక సంస్థలో అకౌంట్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న దేవి మంగకు తొమ్మిది నెలలుగా జీతం చెల్లించడం లేదు. ఈ విషయమై ఫిర్యాదు చేద్దామంటే కమిషనర్ అపాయింట్మెంట్ దొరక్కుండా ఓ అధికారి అడ్డుపడుతున్నారని ఆమె కన్నీటి పర్యం తమయ్యారు. ఇటీవలే మేయర్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. గతేడాది మే 6తో తన అగ్రిమెంట్ పూర్తయిందని, రెన్యువల్ చేస్తామని చెప్పిన అధికారులు తనతో పనిచేయించుకుంటున్నారని పేర్కొన్నారు. రూ.3 లక్షల జీతం తనకు రావాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. జీతం అడిగితే అసలు తాను పనే చేయడం లేదని వింతవాదన వినిపిస్తున్నారని మేయర్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన మేయర్... సమస్యను పరిష్కరించాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండ్యన్కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆడిట్ అధాకిరుల అసంతృప్తి : అకౌంట్స్ విభాగ అధికారుల పనితీరుపై స్టేట్ ఆడిట్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అధికారులు అక్రమ ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్నారని వారికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. -
దొరికితే దొంగలు.. లేకుంటే దొరలు..
కానూరు అపార్ట్మెంట్ ఫ్లాట్లో తనిఖీలు పాపం పండి పట్టుబడిన గుడివాడ సీటీవో నగరంలోనూ కొందరు అధికారుల చేతివాటం విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో కొంద రు అధికారులు తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. జిల్లా లోనూ, నగరంలో కూడా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమ వసూళ్ల దందాలు ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు చెపుతున్నారు. గుడివాడలో సీటీవో వి.వి.ఎస్.ఎల్. ప్రసాద్ ఓ రైస్మిల్లుకు వ్యాట్ లెసైన్స్ రద్దు కోసం దాని యజ మాని నుంచి రూ. 25వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ అధికారి అక్రమ వసూళ్లలో సిద్ధహస్తుడని డీలర్లు ఆరోపిస్తున్నారు. గత నాలుగేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఆయన తమను నానా అగచాట్లకు గురిచేసి డబ్బు వసూలు చేశారని చెపుతున్నారు. చివరకు పాపం పండి పట్టుబ డ్డా డంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు ఇలా అక్రమ వసూళ్లు చేస్తున్నారని పలు ప్రాంతాల డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీటీవోలే నేరుగా బేరాలు కుదుర్చుకు ని సొమ్ము వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో కొందరు సీటీవోలు డీలర్లను బెదిరించి డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణ లు వస్తున్నాయి. ఆడిట్లు, వాహనాల తనిఖీల్లోనూ దోపిడీ ప్రధానంగా విజయవాడలో ఆడిట్ల పేరుతో వేధింపులు పెచ్చు పెరిగాయంటున్నారు. ఆడిట్లో స్టాక్ వెరిఫికేషన్లో వ్యత్యాసం, అనామ తు స్లిప్పులు దొరికితే డిపార్టుమెంటులో పైనుంచి కింద వరకు అధికారులు రకరకాలుగా డబ్బు గుంజుకుని జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అధికారులు తమకు డబ్బు ఇవ్వని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. వి.టి.సి. (వెహికల్ ట్రాఫిక్ చెకింగ్)లో అక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. జీరో వ్యాపారులతో పలువురు సీటీవోలు, ఏసీటీవోలు చేతులు కలిపి వాహనా ల తనిఖీలను తూతూ మంత్రంగా చేస్తున్నట్లు సమాచారం. పప్పుధాన్యాలు, పంచదారను ఇతర రాష్ట్రాల వేబిల్లులతో విజయవాడలో రోజుకు వందల టన్నులు సరుకుని దింపి జీరో వ్యాపారం ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు గాను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పచ్చజెండా ఊపి జీరో వ్యాపారుల నుంచి ఆరునె లలకు, ఏడాదికి ఇంతని ఒప్పందం కుదుర్చుకుని లక్షల్లో సొమ్ము తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక వేబిల్లుల జారీలో కూడా సీటీవోల చేతివాటం పెచ్చుమీరిందని డీలర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయం ద్వారా రోజు దేశంలోని వివిధ పట్టణాల నుంచి రకరకాల వస్తువులు అనామతుగా తరలి వస్తున్నా వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలో అధికారులు, ఉన్నతాధికారులు సైతం కొందరు అటెండర్లను ఏజెంట్లుగా పెట్టుకుని డబ్బు వసూళ్లు దండిగా చేయిస్తున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. పెనమలూరు : గుడివాడలో ఏసీబీ వలలో చిక్కిన కమర్షియల్టాక్స్ అధికారి(సీటీవో)ప్రసాద్బాబుకు మండలంలోని కానూరులో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐ కె.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ సీటీవో ప్రసాద్బాబు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు కానూరులో సీటీవో ప్రసాద్బాబు ఉంటున్న మనీష్ అపార్టుమెంట్ 401 ఫ్లాట్లో ఆ శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉండటాన్ని గుర్తించారు. ఎల్ఈడీ టీవీలు, బెడ్రూముల్లో విలువైన డబుల్కాట్ మంచాలు, లక్షలాది రూపాయ లు విలువచేసే సోఫాసెట్లు ఇలా అనేకం గుర్తించారు. పది బ్యాంక్ పాస్బుక్లు, రూ 65. వేల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలు, తెనాలిలో ఎకరంన్నర పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అపార్టుమెంట్, అందులో వస్తువుల విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఏసీటీవో భార్య వరలక్ష్మి సమక్షంలో పంచనామా చేసి వివరాలు నమోదు చేశారు. ప్రసాద్బాబు ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్దకుమారుడు ఈ ప్రాంతంలోనే ఎంబీబీఎస్, రెండో కుమారుడు కానూరులోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏసీబీ వలలో రొంపల్లి వీఆర్ఓ
బంట్వారం: భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటూ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రొంపల్లి గ్రామానికి చెందిన దరిపురం నర్సింలు గతేడాది మే నెలలో రెండెకరాల 32 గుంటాల పొలాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి తన భార్య శశికళ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. భూమి మ్యుటేషన్(మార్పిడి) కోసం ఆయన అదే నెల 30న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన పత్రాలను బంట్వారం తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించా డు. దీనిపై విచారణ జరిపి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్కు సూచించారు. వీఆర్ఓ శివకుమార్ 6 నెలలుగా రైతు నర్సింలును కార్యాలయానికి తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన నర్సింలు ఈనెల 27న వీఆర్ఓను గట్టిగా ప్రశ్నించగా.. డబ్బులు ఇవ్వందే పనులు ఎలా చేస్తారు..? అంటూ సమాధానమిచ్చాడు. రూ. 6 వేలు లంచంగా ఇస్తే పని అవుతుందని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని నర్సింలు వీఆర్ఓను బతిమాలాడు. చేసేది లేక చివరికి రూ.4 వేలు ఇస్తానని అంగీకరించాడు. వీఆర్ఓ తీరుతో విసుగు చెందిన రైతు రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు గురువారం నర్సింలు వీఆర్వోకు డబ్బులిచ్చేందుకు బంట్వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఓ గదిలో ఉన్న వీఆర్ఓ శివకుమార్ దగ్గరకు వెళ్లగా జనాలు ఎక్కువగా కనిపించారు. కొద్దిసేపు నిరీక్షించమంటూ వీఆర్ఓ రైతు నర్సింలుకు కనుసైగ చేశాడు. అందరూ వెళ్లిపోయాక నర్సింలు రూ. 3 వేలు వీఆర్ఓ శివకుమార్ చేతికిచ్చాడు. రూ. 4 వేలు చెప్పాను కదా అంటూ వీఆర్ఓ నర్సింలును గద్దించాడు. ‘నా దగ్గర ఇంతే ఉన్నాయి సార్..’ అంటూ నర్సింలు ప్రాధేయపడడంతో వీఆర్ఓ డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మాటువేసిన హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, సునీల్లు వీఆర్ఓ శివకుమార్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో చేతులను కెమిక ల్తో పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది. కోర్టులో హాజరుపరుస్తాం.. వీఆర్ఓ శివకుమార్ రైతు నర్సింలు నుంచి రూ.3 వేలు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. లంచగొండి వీఆర్ఓను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అవినీతి అధికారుల గురించి 9440446140 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడడం స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడ చూసినా జనం ఈ విషయమే చర్చించుకుంటూ కనిపించారు. -
ముగ్గురిపై వేటు
మహబూబ్నగర్ వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో హడలిపోతున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్న ముగ్గురు ఆస్పత్రి నాలుగో తరగతి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి బుధవారం వెల్లడించారు. సంబంధిత మెటర్నిటీ వార్డు ఇన్చార్జి వైద్యుడికి మెమో జారీచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో కొడుకు పుడితే రూ.వెయ్యి, కూతురు పుడితే రూ.500 వసూలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. కాగా, ఇటీవల జిల్లా ఆస్పత్రిలో సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన జడ్చర్లవాసి చెన్నకేశవులు హత్యోదంతంతో జిల్లా అధికారయంత్రాంగం కదిలింది. విచారణ కోసం ప్రత్యేకాధికారిగా ఇన్చార్జి జేసీ డాక్టర్ రాజారాంను కలెక్టర్ టీకే శ్రీదేవి నియమించారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం రెండురోజుల పాటు జిల్లా ఆస్పత్రిలో విచారణ జరిపింది. ఆత్మహత్యకు దారిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆస్పత్రి సిబ్బంది డబ్బుల కోసం వేధించడం వల్లే చెన్నకేశవులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా దుమారం లేవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సిబ్బంది సస్పెన్షన్ వివరాలను డీసీహెచ్ పద్మజా, డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మోరే, సూపరిటెండెంట్శామ్యూల్ వెల్లడించకపోవడం గమనార్హం. -
తమ్ముళ్ల దందా
రాజంపేట: అక్కడ అధికారులు తమ్ముళ్లకు తలవంచి పనిచేయూల్సిందే... చట్టం, నిబంధనల గురించి ఆ ప్రాంతంలో మాట్లాడకూడదు... తమ్ముళ్లు చెప్పిన మాటలకు తలూపాల్సిందే. ఏదో సొంత పనిచేసిపెట్టమని ఒత్తిడి చేస్తే అధికార పార్టీ వారు కదా అని సరిపెట్టుకోవచ్చు. అరుుతే వారు అడుతున్నది మనీ... ఏ అభివృద్ధి పని చేపట్టిన తమ మామూళ్లు ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే పని ఆగిపోవాల్సిందే. కొందరు అధికారులు సైతం వారికి సహకరిస్తుండడంతో వారి పని సులువు అవుతోంది. ఇలాంటి అధికారులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఈ శాఖ..ఆ శాఖనికాదు.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆగిపోరుున పనులే ఇందుకు నిదర్శనం. వారు చెప్పినట్లు చేయకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి పని సాగకుండా అడ్డుకుంటారు. పార్టీకి ఆది నుంచి పనిచేసిన కరుడుకట్టిన తెలుగుతమ్ముళ్లు దందా తమ్ముళ్ల వ్యవహారాన్ని బహిరంగగానే విమర్శిస్తున్నారు. నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల, మైన్స్ అండ్ జియాలజి, రెవిన్యూ, ఐసీడీఎస్, మున్సిపాలిటి, వైద్యఆరోగ్యశాఖ, పోలీసుశాఖ పంచాయతీరాజ్ శాఖలలో దందా తమ్ముళ్ల జోక్యం అధికం కావడంతో ఆ శాఖల అధికారులు జీర్ణించుకోలేకున్నారు. అభివృద్ధి, సంక్షేమం అమలు విషయంలో అడ్డుగోలుగా వ్యవహారించాలని చేస్తున్న ఒత్తిడిలతో ఇక్కడి నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నారు. మరికొందరు అధికారులు అరుుతే వారితో కలిసిపోయూరు. ఇలాంటి వారిపై గవర్నర్, ప్రభుత్వకార్యదర్శికి పిర్యాదుచేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పారంటే రాజంపేట డివిజన్లో పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. నిలిచిపోయిన రూ.10కోట్ల రోడ్డు రాజంపేట డివిజన్ పరిధిలో రాజంపేట-వత్తలూరు రోడ్డు విస్తరణలో భాగంగా సీఆర్ఎఫ్ కింద రూ.10కోట్లతో పనులు చేపట్టారు. 14 కిలోమీటర్ల తారురోడ్డు విస్తరణ పనులు చేయాల్సి ఉంది. ఈ పనుల దక్కించుకున్న కాంట్రాక్టరు అన్ని సమస్యలను అధిగమించి చేపట్టేసరికే ‘లోకల్’ పేరుతో వాటాలు ఇవ్వాలని మిట్టమీదపల్లెకుచెందిన తమ్ముళ్ల బృందం తేల్చి చెప్పింది. తమదైనశైలిలో బెదిరించడంతో కాంట్రాక్టరు పని నిలిపివేశారు. అయితే స్ధలం వివాదం వల్ల పనులు ఆపేయాల్సి వచ్చిందని డీఈఈ చలపతి చెబుతున్నారు. పని ఆపడం వెనుక స్ధల సమస్య ఉన్నా... అది పుట్టింది వాటాల కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దినెలల కింద బోయనపల్లె-బ్రహ్మణపల్లె రోడ్డు విషయంలో కూడా వాటాలు రాలేదని.. తమకు కాకుండా మరొకరి గుడ్విల్ ఇచ్చారని పనులు అడ్డుకున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిటి వాటాల కోసం తమ్ముళ్లు కీచులాడుకుంటున్నారు. వాటాలు.. కమీషన్లు ఇస్తే చివరికి పనుల్లో నాణ్యత ఏ పాటి ఉంటుందో తెలిసిన విషయమే. తమ్ముళ్ల కనుసన్నల్లో.. రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లె, వీరబల్లి, రాజంపేట మున్సిపాలిటిలో అధికారపార్టీ తమ్ముళ్ల తమ కనుసన్నలో అభివృద్ధి పనులు జరగాలని వివిధ శాఖల అధికారులపై స్వారీ చేస్తున్నారు. చౌకదుకాణం డీలర్లు నియామయకం, ఐసీడీఎస్ అంగన్వాడీ పోస్టులు, ఏరియా ఆసుపత్రి, మున్సిపాలిటిలో ఔట్సోర్సింగ్ పోస్టులు లాంటివి తమ్ముళ్ల చెప్పిన వారికే కట్టుబెడుతున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో అధికారులు ఉన్నారు. అధికారులు, అధికార పార్టీ, లంచం, Authorities, the ruling party, bribery -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత అరెస్టు చేసిన అధికారులు కె.కోటపాడు: పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ మేడిచర్ల వీఆర్వో యాదగిరి కన్నయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలిలావున్నాయి. మేడిచర్ల గ్రామానికి చెందిన రైతు కొల్లి సత్యనారాయణ గతేడాది సెప్టెంబరు 13న ఎకరా భూమికి పట్టాదారు పాసు పుస్తకానికి మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఇందుకోసం అతని తండ్రి సూర్యనారాయణ వీఆర్వో కన్నయ్య చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం మంజూరుకు వీఆర్వో రూ.9 వేలు డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు సూర్యనారాయణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సొమ్మును మంగళవారం కె.కోటపాడులోని ఇంటికి తెచ్చి ఇవ్వాలని వీఆర్వో కన్నయ్య సూచించాడు. ఈ మేరకు రూ. 5వేలు లంచం ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం వేధించే ఉద్యోగుల సమాచారాన్ని 9440446170, 0891-2552894 నంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎంవీ గణేష్, రమణమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలెన్నో : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ మేడిచర్ల వీఆర్వోపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. హుద్హుద్ తుపానుకు సంబంధించి మేడిచర్ల, ఎ. భీమవరం, సూరెడ్డిపాలెం పంటనష్టం నమోదులో అనర్హులకు నష్టం పరిహారం అందేలా తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు వినవస్తోంది. పంట నష్టం మంజూరులో అవకతవకలపై మేడిచర్ల రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
లంచం తీసుకుంటాం..నీకేంటీ నొప్పి...
జర్నలిస్టుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందులు సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం డబ్బులు తీసుకుంటాం..నీకేంటి నొప్పి’’ అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. అంతటితో ఆగకుండా ఆ జర్నలిస్టును దుర్భాషలాడాడు. కానిస్టేబుల్ వీరంగం అతని మాటాల్లోనే... ‘‘లంచం డబ్బులు తీసుకుంటాం... అడగడానికి నీ వెవ్వరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోడ్లపై డ్యూటీలు చేస్తాం. యాబ్భైయ్యో.. వందో సంపాదించుకుంటాం తప్పేంటి. కమిషనర్కు ఫిర్యాదు చేసుకున్నా భయంలేదు. కావాలంటే నేను నిన్నే కమిషనర్ మహేందర్రెడ్డి వద్దకు తీసుకెళ్తా పదా. నీవే యాబై వేలు అడిగావంటూ ఫిర్యాదు చేస్తా. నీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయిస్తా’’.. సైదాబాద్కు చెందిన జర్నలిస్టు జావెద్ తన బైక్పై గురువారం మధ్యాహ్నం 2.30కి రాజ్భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. అక్కడి రహదారిపై వచ్చిపోయే వాహనాలను పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ జయరాం ఆపి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని జావెద్ గమనించాడు. తన సెల్ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో అటు వైపుగా వచ్చిన ఆడి కారును కానిస్టేబుల్ ఆపాడు. డ్రైవర్తో కారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించలేదని అడిగాడు. ఇంతలో డ్రైవర్ పక్కన కూర్చున్న పెద్ద మనిషి జేబులోంచి రూ. 100 నోట్ను తీసి కానిస్టేబుల్కు ఇవ్వడంతో కారును వదిలిపెట్టాడు. ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించి హాక్-ఐ ద్వారా నగర కమిషనర్కు జావెద్ ఫిర్యాదు చేశాడు. ఇంతలో విషయం తెలుసుకున్న కానిస్టేబుల్..జావెద్ను పట్టుకుని లంచం తీసుకుంటే నీ కేందిరా అంటూ నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా పంజగుట్ట ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బందిని కూడా అక్కడికి రప్పించి నానా రభస సృష్టించి జావెద్ను ఠాణాకు తీసుకెళ్లారు. ఇంతలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ షేక్ మాసూమ్ బాషాలు అసలు విషయం తెలుసుకుని జావెద్ను నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. హాక్-ఐకు పంపిన వీడియోను సైతం ఏసీపీలు తీసుకున్నారు. లంచం తీసుకోవడం, జర్నలిస్టును పట్టుకుని హింసించడంపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.ఎస్ఐ స్థాయి అధికారి లేకుండా సదరు కానిస్టేబుల్ వాహనాలను ఆపడం నేరమే. కాగా ట్రాఫిక్ విభాగంలో దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ క్యాష్ లెస్ చలానా విధానాన్ని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రారంభించిన మూడు రోజులకే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. -
వారికి మామూలే
సీఎం, డిప్యూటీ సీఎంలే లంచంపై విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే ఎవరేం చేస్తారులే అనుకున్నారేమో.. ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లంచాలకు తెగబడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులు అనారోగ్యం పాలైతే వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అక్కడకు వెళ్తే పానం బాగుచేస్తారన్న నమ్మకం.. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకొచ్చాంరా భగవంతుడా అనాల్సిన పరిస్థితి. జేబునిండా డబ్బులు తీసుకెళ్తే తప్పా వైద్యం అందడం లేదు. ప్రతి పనికీ చేతులు తడపాల్సిందే.. ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలతో బేరమాడుతున్నారు. చావుకైనా, పుట్టుకైనా పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇచ్చేదాకా వేధింపులు తప్పవు. వాళ్లు డిమాండ్ చేసినంతా ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే. సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఒక ప్రధాన ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 85 పీహెచ్సీలున్నాయి. వీటికి ప్రధానంగా అనునిత్యం వెయ్యికి పైగానే ఓపీ ఉంటుంది. ఆస్పత్రులకు వచ్చే వారిని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరీ ప్రధానంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి దోపిడీకి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డబ్బుల కక్కుర్తి ఆగడంలేదు. ప్రధానం గా నాలుగు విభాగాల్లో విచ్చలవిడిగా పేషెంట్ల సంబంధీకుల నుంచి డబ్బుల కోసం పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రసూతిగది, ఆపరేషన్ థియే టర్, క్యాజువాలిటీ, మార్చురీ విభాగాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ప్రసవం జరిగి తే.. మగపిల్లవాడు పుడితే రూ.వెయ్యి, ఆడపిల్ల పుడితే రూ.500 డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి ఆరోపణలు రావడంతో మూడుసార్లు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా వారిలో మార్పు రా వడంలేదు. కొన్ని నెలల క్రితమే పోస్టుమార్టం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్ఎంఓలు యా దయ్య, కిష్ణయ్యలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై సస్పెండ్ చేశారు. అయినా ఆస్పత్రి సిబ్బంది తాజాగా చెన్నకేశవులు, ఆయన కూతురు ఆత్మహత్యకు కారకులయ్యారు. వైద్యులదీ అదే పరిస్థితి..! కమీషన్లకు కక్కుర్తి పడుతున్న వైద్యులు ప్రతి చిన్నదానికీ టెస్టుల కోసం బయటకు రాస్తున్నారు. సంబంధిత పరీక్షలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నా వారికి అవేమీ పట్టవు. ముఖ్యంగా జిల్లా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలు... సరిగా పనిచేయడం లేదనో, కండిషన్ లేదనో రకరకాల కారణాల చేత బయటకు పంపుతున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేవలం గర్భవతులకు మాత్రమే తీస్తున్నారు. మిగతా కడుపునొప్పి బాధతో వచ్చే వారిని ఆస్పత్రిలో చికిత్స నిర్వహించకుండా బయటకు పంపుతున్నారు. ఎక్స్రే మిషన్ ఉన్నా ఫిల్మ్ సరిగా రావడం లేదంటూ బయటకు రాస్తారు. అందుబాటులో ఉన్న సీబీపీ, ఎలక్ట్రోలైట్స్, హిమోగ్లోబిన్, సీఆర్పీ, ఏఎస్ఓ, వైడల్, ఆర్యటెస్టు తదితర వాటికి కూడా బయటకే. ఆస్పత్రిలో అందుబాటులో లేని ఎల్పీటీ, కాల్షియం, కొలెస్ట్రాల్, యూరిక్యాసిడ్, సిరమ్ప్రొటిన్ వంటి పరీక్షలను అతితక్కువ ఖర్చులో స్థానికంగా ఉన్న ఎస్వీఎస్ ఆస్పత్రిలో పరీక్షలు జరిపేలా గతంలో ఉన్న కలెక్టర్ గిరిజాశంకర్ ఆదేలిచ్చారు. అయితే అటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. అంతా ప్రైవేట్ నర్సింగ్హోంలకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల సంబంధిత వైద్యులకు కమీషన్లు అందుతున్నట్లు వినికిడి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించం. లంచావతారుల భరతం పడతాం. లంచం ఎవరడిగినా 040-23254071 నెంబర్కు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి చాలు - ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానాల్లో వందో, రెండొందలో తీసుకుంటే తప్పేంటి. సహజంగా చేతి ఖర్చులకు అడిగి తీసుకుంటే తీసుకోవచ్చు. అయినా దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు - డిప్యూటీ సీఎం, -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
సూళ్లూరుపేట :మండలంలోని కేసీఎన్ఎన్గుంట, కుదిరి గ్రామాలకు కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్.శ్రీరామ్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం మేరకు సూళ్లూరుపేట పట్టణానికి చెంది మస్తానయ్య కేసీఎన్ గుంట సమీపంలో 47 సెంట్ల భూమిని 2009లో అప్పటి సర్పంచ్, కార్యదర్శితో అప్రూవల్ చేయించుకుని లేఅవుట్ ప్లాట్లు విక్రయించారు. కడపట్ర, దామరాయ, కొరిడి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరామ్ను కేసీఎన్గుంట, కుదిరి గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కేసీఎన్గుంట లేఅవుట్ విషయంలో శ్రీరామ్ మస్తానయ్యను వేధించడం ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా లేఅవుట్ వేశారని, ఇందులో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని బెదిరిస్తూ వచ్చారని తెలిపారు. నిబంధనలకు అనుకూలంగా లే అవుట్ చేసుకోవాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో మస్తానయ్య శ్రీరామ్తో బేరసారాలకు దిగారు. రూ. 3.50 లక్షలు డిమాండ్ చేశారని, చివరకు రూ. 2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం ఉదయం లక్ష రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారని వెల్లడించారు. తీవ్రమైన వేధింపులకు గురైన మస్తానయ్య ఏసీబీని ఆశ్రయించారని చెప్పారు. మస్తానయ్య ఇచ్చిన డబ్బును శ్రీరామ్ బ్యాగ్లో పెట్టుకున్న వెంటనే తాము ఇంట్లోకి వెళ్లి పట్టుకున్నామని వివరించారు. దాడి చేసే సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సాక్షులుగా తీసుకొచ్చామని చెప్పారు. పట్టుబడిన నగదుతో శ్రీరామ్పై కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎన్.శివకుమార్రెడ్డి, ఎం కృపానందం, సిబ్బంది పాల్గొన్నారు. -
పైసలిత్తెనే..!
‘హలో... ముఖ్యమంత్రి ఆఫీసా... మాది కనగర్తి గ్రామం, ఓదెల మండలం. నాపేరు రవి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆఫీస్కు వెళితే అక్కడ పనిచేసే అసిస్టెంట్ ఒకరు పని కావాలంటే పది వేలు ఇవ్వాలని అడుగుతున్నడు సార్. విచారణ జరిపి నాకు న్యాయం చేయండి సార్...!’ ‘హలో... సీఎం కార్యాలయమా? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు కృష్ణారెడ్డి. మహిళా పోలీస్స్టేషన్లో అవినీతి బాగా పెరిగిపోయిందండీ. 498(ఏ) కేసు పేరుతో భార్యభర్తలకు కౌన్సిలింగ్ చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇటు భార్య నుంచి అటు భర్త నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు. ఈ స్టేషన్పై నిఘా పెడితే వాస్తవాలు మీకే తెలుస్తాయండీ...!’ ‘సార్... నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాంరెడ్డిని మాట్లాడుతున్నా. ఈ కార్పొరేషన్లో 13 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ గుత్తాధిపత్యం చెలాయిస్తుండు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో మిలాఖత్ అయి శానిటేషన్ టెండర్లు దక్కించుకుంటుండు. 861 మంది కార్మికులున్నారని చెబుతూ నాలుగువందల మంది కార్మికులతోనే పని చేయిస్తూ ప్రతినెలా నలభై లక్షలు దోచుకుతింటుండు. అధికారులు, కార్పొరేటర్లు, నాయకులకు నెల నెలా కమిషన్లు ముట్టజెబుతూ అడ్డొచ్చే వారిపై దాడులకు పాల్పడుతూ దాదాగిరి చెలాయిస్తుండు. దయచేసి పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోండి...!’ కరీంనగర్ జిల్లాకు అవినీతి జబ్బు పట్టింది. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. పింఛన్, ఆహారభద్రత కార్డులు సహా ఏ చిన్న పని కావాలన్నా లంచం ముట్టజెప్పాల్సిందే. పంచాయతీ కార్యాలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, కలెక్టరేట్ అనే తేడాలేకుండా అన్ని శాఖల్లో అవినీతి పాతుకుపోయింది. ఇందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫిర్యాదులే నిదర్శనం. ‘ఎవరైనా లంచం అడిగితే సీఎంఓకు ఫోన్ చేయండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న వరంగల్లో ఫోన్ నంబరు ప్రకటించగా, జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎంవో ప్రకటించిన టోల్ఫ్రీ నెంబర్కు ఈనెల 11 నుంచి 14వ తేదీవరకు దాదాపు 11వేల మంది ఫోన్లు చేసి అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఓకు వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే విచారణ జరుపుతోంది. వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 1500 మంది కరీంనగర్ జిల్లావాసులవే కావడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో సీఎంఓకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం విశేషం. ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన నెంబర్ల జాబితాలోని సుమారు 20 మందికి ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్లు చేయగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు వంటి వ్యక్తిగత సమస్యలు మొదలుకుని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవి నీతిని ప్రస్తావిస్తూ తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంఓకు ఫోన్ చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కార్యాలయ సిబ్బంది ఒకరు సీఎం సహాయ నిధి మంజూరు కోసం లంచం అడుగుతున్నాడంటూ ఫిర్యాదు చేయడం విశేషం. తమ పేర్లను గోప్యంగా ఉంచాలని బాధితులు చేసిన విజ్ఞప్తి దృష్ట్యా ‘సాక్షి’ అసలు పేర్లను మార్చి వారు పేర్కొన్న వాస్తవాలను మాత్రం పాఠకుల ముందుంచుతోంది. సుల్తానాబాద్ మండలానికి చెందిన ప్రమీల అనే ఆవిడ మాట్లాడుతూ ‘సార్... రేషన్కార్డులో నా పేరు చేర్చాలని దరఖాస్తు చేసుకుంటే ఎమ్మార్వో ఆఫీస్లోని పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నడు. లంచం అడిగితే చెప్పాలని కేసీఆర్ అనడంతోనే సీఎం ఆఫీస్కు ఫోన్ చేసిన’ అని పేర్కొన్నారు. కరీంనగర్ మండలం బావుపేట గ్రామానికి చెందిన షాజహాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ ‘రైస్డిపో కోసం రుణం ఇవ్వాలని మైనారిటీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. బ్యాంకు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. డబ్బుల కోసం ఇండియన్ బ్యాంకుకు వెళితే రేపు మాపు అంటూ నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదేమిటని అడిగితే బ్యాంకులో ఉన్న అటెండర్ ఒకరు పదివేలు ఇస్తే పనైపోతుందని, మేనేజర్తో మాట్లాడతానని చెబుతుండు. దయచేసి మీరైనా జోక్యం చేసుకుని నాకు లోన్ ఇప్పించాలని కోరుతూ సీఎం ఆఫీస్కు ఫోన్ చేసిన’ అని తెలిపారు. తిమ్మాపూర్కు చెందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నేను వికలాంగుడిని. సదరం సర్టిఫికెట్ కావాలని జిల్లా ఆసుపత్రికి వెళితే అక్కడి సిబ్బంది ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నడు. డబ్బులిస్తే ఏ వైకల్యం లేకపోయినా విలాంగుల సర్టిఫికెట్ ఇచ్చి పంపుతుండు. ఇదేం పద్దతని అడిగితే నీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోమ్మని చెప్పిండు. అందుకే కేసీఆర్ సార్ ఆఫీస్కు ఫోన్ చేసిన చెప్పిన’ అని వివరించారు. ‘సార్... నా పేరు నరేష్. మాది ఎల్కతుర్తి. మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేటర్గా చేస్తున్నా. ఇక్కడ ఎంఈఓ, ఎంపీపీ కుమ్మక్కై నన్ను పక్కనపెట్టి మరో వ్యక్తి దగ్గర యాభై వేల డబ్బులు తీసుకుని ఆయనను ఆపరేటర్గా నియమించుకోవాలని యత్నిస్తున్నారు. త్వరలోనే మా ఉద్యోగాలు రెగ్యుల ర్ అయితట. నేను ఆర్వీఎం ఆఫీస్కు వెళితే... ‘నువ్వే అక్కడ ఆపరేటర్వి. నీకే వేతనం ఇస్తాం. వెళ్లి పని చేసుకో’ అని అధికారులు చెబుతుంటే... ఇక్కడ ఎంఈవో మాత్రం ‘నీవు ఏం పనిచేస్తలేవ్. వేతనాలు ఇచ్చేదెట్లా?’ అంటూ దెప్పిపొడుస్తున్నారు. నాకు న్యాయం చేయండి సార్ అని కేసీఆర్కు ఫోన్ చేసిన’ అంటూ తన గోడును వివరించాడు. -
లంచం కోసం పీడించి..
ప్రొద్దుటూరు టౌన్ : అతని పేరు మస్తాన్వల్లి.. ఎంతో మంది కలెక్టర్ల వద్ద సీసీగా పని చేశాడు. ప్రజలను ముక్కుపిండి డబ్బు వసూలు చేయడంలో దిట్ట. అతని వద్ద ఉన్న ఫైల్ కదలాలంటే నోట్లు జోబులో పడాల్సిందే. విసిగి పోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారినీ ముప్పతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సయ్యద్ జహరుద్దీన్ ఆ గ్రామంలో ఉన్న నూనానీ మాస్క్ మసీదుకు అధ్యక్షుడిగా ఉన్నారు. 8.20 ఎకారాల వక్ఫ్బోర్డు స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసుకున్నారు. ఈ విషయంపై జహరుద్దీన్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టు జహరుద్దీన్కు ఆర్డర్ మేరకు డీఆర్ఓ ఆ ఫైల్ను ఆర్డీఓకు పంపారు. అక్కడి నుంచి ఫైల్ ప్రొద్దుటూరు తహశీల్దారు కార్యాలయానికి వచ్చింది. దీంతో తహశీల్దారు వారికి మొదటి నోటీసులు జారీ చేశారు. అయినా వారు స్పందించలేదు. దీంతో రెండవ నోటీ సు ఇచ్చి స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మస్తాన్వల్లిని తహశీల్దారు ఆదేశించారు. అయితే మస్తాన్వల్లి రెండవ నోటీసు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. అయితే తన వద్ద డబ్బు లేదని ఎన్ని సార్లు చెప్పినా మస్తాన్వల్లి వినలేదు. నోటీసులు ఇచ్చే విషయంపై ఈ నెల 12వ తేదీన జహరుద్దీన్ మస్తాన్వల్లిని గట్టిగా ప్రశ్నించాడు. అయినా మస్తాన్వల్లి కనీసం రూ.5000 అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మస్తాన్వల్లికి డబ్బు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొదట తహశీల్దారు కార్యాలయానికి రమ్మని మాస్తాన్వల్లి జహరుద్దీన్కు చెప్పారు. అక్కడకి తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డితోపాటు కడప ఏసీబీ సీఐ పార్థసారథిరెడ్డి, తిరుపతి ఏసీబీ సీఐలు సుధాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, లక్ష్మికాంత్రెడ్డి సిబ్బందితో మాటు వేశారు. అయితే మస్తానల్లి అక్కడి నుంచి ఓ టీ బంకు వద్దకు రావాలని జహరుద్దీన్కు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లేలోపే తిరిగి పోన్ చేసి కోర్టు ఆవరణంలోకి రావాలని చెప్పారు. చివరకు మార్కెట్యార్డుకు వెళ్లి జహరుద్దీన్తో రూ.5000 నగదు, మద్యం బాటిళ్లు తీసుకుంటుండగా రెడ్హ్యాండ్డ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మస్తాన్వల్లి అరెస్టు- కర్నూలుఏసీబీ కోర్టులో హాజరు... మస్తాన్వల్లిని అరెస్టు చేసినట్లు ఏసీబీ తిరుపతి రేంజ్ డీఎస్పీ, కడప, తిరుపతి సీఐలు తెలిపారు. అతన్ని కర్నూలులోని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు వివరించారు. ప్రజలను ఏ అధికారి లంచం అడిగినా... ప్రజలను ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. తిరుపతి రేంజ్ (కడప, చిత్తూరు జిల్లాలు) డీఎస్పీ సెల్ నెంబర్ 9440446190, కడప సీఐ 9440446191 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
ఏసీబీ వలలో ఇద్దరు సర్వేయర్లు
* ఓ రైతు వద్ద పొలం కొలతలకు రూ.17 వేలు తీసుకుంటూ... * ఎకరాకు రూ.2 వేలు డిమాండ్ ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సంతనూతలపాడు మండలానికి చెందిన ఇద్దరు సర్వేయర్లు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఆర్విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేసిన దాడిలో సంతనూతలపాడు సర్వేయర్ ఒ.యలమందరాజు, సహాయ సర్వేయర్ శివరాజులు ఒకేసారి చిక్కారు. సంతనూతలపాడులో యలమందరాజు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఒంగోలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయంలోనే అవినీతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అక్కడే నిఘా పెట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆర్విఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కొండపి మండలం ముప్పరాజుపాలేనికి చెందిన మురార్జీకి తన బావమరిదికి సంతనూతలపాడు మండలం మద్దులూరులోని సర్వే నెం.299, 300లో 14 ఎకరాల పొలం ఉంది. సంతనూతలపాడు మండలానికి యలమందరాజు సర్వేయర్ కావడంతో తన 14 ఎకరాల పొలం కొలిచేందుకుగాను రైతు కోటపాటి మురార్జీ గత వారం రోజుల క్రితం సంప్రదించాడు. కొన్ని రోజుల పాటు తిప్పుకున్న తర్వాత ఎకరాకు రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేను, ఎకరాకు రూ.1,000 చొప్పున ఇచ్చుకుంటానని రైతు మురార్జీ అభ్యర్ధించినా అంగీకరించని సర్వేయర్ రూ.1,800 ఇస్తే సరే లేకపోతే వేరేవారిని చూసుకోవాలంటూ తెగేసి చెప్పాడు. చివరకు చేసేది లేక రూ.1,500 చొప్పున ఎకరాకు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. తొలుత అడ్వాన్సుగా రూ.4 వేలు సర్వేయర్కు ఇచ్చారు. మిగతా రూ.17 వేలు కొలతలు పూర్తయిన తర్వాత ఇవ్వాల్సి ఉంది. అయినా కొలతలు పూర్తి చేయకుండానే రూ.17 వేలు మొత్తం ఇవ్వాలని సర్వేయర్ రైతు మురార్జీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ మూర్తిని బాధిత రైతు ఆశ్రయించాడు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం మురార్జీ ఆ మొత్తాన్ని తీసుకొని నేరుగా యలమందరాజు ప్రైవేట్ కార్యాలయానికి వెళ్లి సహాయ సర్వేయర్ శివరాజుకు రైతు అందజేశాడు. ఆ తర్వాత సహాయ సర్వేయర్ శివరాజు నుంచి ప్రధాన సర్వేయర్ యలమందరాజు తీసుకొని తను వేసుకున్న టీ-షర్టు జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ మూర్తి బృందం సర్వేయర్ యలమందరాజు ప్రైవేట్ కార్యాలయంపై దాడి చేశారు. అతని వద్దనున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక కెమికల్స్ ద్వారా ఆ నోట్లను పరీక్షించారు. నగదు నోట్లపై ఉన్న వేలిముద్రలు, సర్వేయర్, సహాయ సర్వేయర్లవేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాడి చేసి పట్టుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీ మూర్తితోపాటు నెల్లూరు సిఐ కె.కృపానందం, ఒంగోలు ఎస్సై ఎస్. వెంకటేశ్వర్లు, ఒంగోలు ఏసీబీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
ఏసీబీ వలలో మంచాల ఏఓ
మంచాల: ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్కు రూ. 2 వేలు లంచం తీసుకుంటూ మంచాల ఏఓ(అగ్రికల్చర్ అధికారి) లావణ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎల్లమ్మ తండాకు చెందిన యువకుడు సపావట్ దేవరాంనాయక్ ఆరు నెలల క్రితం ఫర్టిలైజర్ దుకాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులకు లెసైన్స్ సిఫారసు చేసేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి లావణ్యను సంప్రదించగా గతేడాది అక్టోబర్ 14న రూ. 4 వేలు లంచం తీసుకుంది. నిబంధనల ప్రకారం దేవరాంనాయక్ సభ్యత్వం కోసం రూ.1250, ఎన్ఎస్సీ కోసం రూ. 1000, విత్తనాల కోసం రూ.50, మందుల కోసం రూ. 300 అధికారులకు డీడీ రూపంలో చెల్లించాడు. తిరిగి టిన్ నంబర్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా ఏఓ మరో రూ. 4 వేలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తాను రూ. 2 వేలు ఇస్తానని దేవరాంనాయక్ చె ప్పి ఈనెల 2న నగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నిఘా వేసిన అధికారులు ఏఓ లంచం కోసం డిమాండ్ చేయడం నిజమని నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ నేతత్వంలో రంగంలోకి దిగారు. అధికారులు దేవరాంనాయక్కు రసాయనాలు పూసిన రూ.2 వేలు ఇచ్చారు. సదరు డబ్బు ఆయన సోమవారం ఏఓ లావణ్యకు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పక్కా వ్యూహంతో.. ఏసీబీ అధికారులు ఏఓ లావణ్యను పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంచాల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఓ బండలేమూర్లో రైతులతో సమావేశం ముగించుకొని మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్కు వచ్చారు. దేవరాంనాయక్ ఆమెకు రూ. 2 వేలు ఇచ్చాడు. క్షణాల్లోనే ఏసీబీ అధికారులు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఓ లావణ్య నుంచి రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 7 గంటల వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఉండి వివరాలు సేకరించారు. కాగా ఏసీబీ అధికారులు నగరంలోని వైదేహినగర్లో ఉన్న ఏఓ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ సీఐ సునీల్, వెంకట్రెడ్డి, లక్ష్మి, ఏసీబీ సిబ్బంది ఉన్నారు. అవినీతిపరుల భరతం పట్టండి: ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ అవినీతిని అరికట్టేందుకు అందరూ చైతన్యవంతం కావాలి. ప్రభుత్వ అధికారులు సర్కార్ నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. వారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనం నిర్భయంగా అవినీతిపరుల సమాచారం 9440446140 నంబర్కు ఫోన్ చేసి చెప్పండి. వారి భరతం మేం పడతాం. గవర్నమెంట్ అధికారికి డబ్బులెందుకు ఇవ్వాలి..? నేను ఎంటెక్ చేశాను. ప్రస్తుతం నిరుద్యోగిని. గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. ఏఓ లావణ్యకు గతంలో రూ. 4వేలు లంచం ఇచ్చాను. తిరిగి మరో రూ. 4 వేలు ఇవ్వాలని వేధించింది. చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. గవర్నమెంట్ అధికారులకు లంచాలు ఎందుకు ఇవ్వాలి. వారు సర్కార్ నుంచి వేతనాలు తీసుకోవడం లేదా...? - బాధితుడు, సపావట్ దేవరాంనాయక్ -
లంచం ఇవ్వకుంటే రౌడీషీటే...
* వస్త్ర వ్యాపారికి ఎస్ఐ బెదిరింపు * రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం ఎంవీపీ కాలనీ : లంచం ఇవ్వకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కడం పోలీసు శాఖలో కలకలం రేపింది. వస్త్ర వ్యాపారి నుంచి గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా మూడో పట్టణ పోలీస్స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏం జరిగిందంటే.. వస్త్ర వ్యాపారులు రాజ్కుమార్ మోది, దినేస్ మోది ప్లాట్ కొనుగోలు నిమిత్తం పాండ్యన్ అనే వ్యక్తికి రూ.15 లక్షలు అడ్వాన్సగా ఇచ్చారు. రోజులు గడుస్తున్నా అతను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అడ్వాన్స తిరిగి ఇచ్చేయాలని వారు అడగడంతో పాండ్యన్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల 22న అతను ఇంటికి వచ్చినట్టు తెలుసుకున్న రాజ్కుమార్ మోది ఎనిమిది మంది అనుచరులతో అతని వద్దకు వెళ్లి కొట్టి వదిలేశాడు. వారిపై ఈ నెల 23న పాండ్యన్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రాజ్కుమార్ మోది మాత్రం ముందస్తు బెయిల్ పొందాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు అతనికి ఫోన్ చేసి రూ.1.5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారు. దీంతో రాజ్కుమార్ మోది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం ఇచ్చేందుకు గురువారం రాజ్కుమార్ మోది వాల్తేరు జోన్ పోలీసుస్టేషన్లో ఎస్ఐను కలిశాడు. పక్క గదిలోని కానిస్టేబుల్ లక్ష్మణరావుకు ఇవ్వమని ఆయన చెప్పడంతో అక్కడి వెళ్లాడు. రూ. లక్ష లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్కడినుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఎస్ఐ రామారావును అరెస్టు చేశారు. -
పింఛన్ కోసం.. లంచం ఇవ్వొద్దు
సిద్దిపేట జోన్: పేదలు కడుపు నిండా తినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు హెచ్చరించారు. వివిధ కారణాల వల్ల తొలి జాబితాలో పేర్లు రాని 531 మంది లబ్ధిదారులకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ ఇచ్చేందుకు ఎవరు లంచం అడిగినా వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలతో పాటు పింఛన్ డబ్బులను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఆహార భద్రత జాబితాలో పేరు లేని అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరిలో మూడు కొత్త పథకాలు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ, మధ్యాహ్న భోజనం పథకం, వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన సోనామసూరి బియ్యం సరఫరా, గర్భిణులకు ప్రతిరోజూ గుడ్డుతోపాటు పౌష్టికాహారం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న రమణాచారి పని తీరును మెచ్చుకున్నారు. రాజనర్సు పాల్గొన్నారు. నంగునూరులో పాసు పుస్తకాల పంపిణీ... సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీష్రావు తెలిపారు. నంగునూరుంలో బుధవారం 576 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. చదువుల ఖిల్లాగా.. గజ్వేల్ గజ్వేల్: వచ్చే విద్యా సంవత్సరంలోపు గజ్వేల్లో పీజీ, మరో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు బుధవారం ప్రకటించారు. దీనికోసం త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు. గజ్వేల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.కోటితో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం దేశంలోనే రోల్ మోడల్గా అవతరించనుందని చెప్పారు. డీగ్రీ కళాశాల విద్యార్థుల కోరిక మేరకు ఆడిటోరియం, రీడింగ్ రూమ్స్ నిర్మాణానికి మరో రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్త కోర్సులను ప్రవేశ పెడతామన్నారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం... గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోని హైరిస్క్ ప్రెగ్నెన్సీ మానిట రింగ్ సెంటర్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నట్లు మంత్రి హరీష్రావు ప్రకటించారు. హైరిస్క్ కేంద్రం తో పాటు ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి ఆర్థోపెడిక్ వైద్యున్ని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీణాకుమారికి సూచించారు. ఆస్పత్రిలోని చిన్నచిన్న పనులకోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జననీ ఎక్స్ప్రెస్ పథకంలో భాగంగా తల్లీబిడ్డలను తీసుకెళ్లే వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్పర్సన్ అరుణ, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ జేజాల వెంకటేశ్గౌడ్, భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి , డాక్టర్ వి.యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్త’ పనికి రూ. లక్ష లంచం
రూ.50 వే లకు కుదిరిన బేరం డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెటింగ్శాఖ అధికారులు చాదర్ఘాట్: కూరగాయల మార్కెట్ నుంచి చెత్త తరలింపు పని అనుమతి (వర్క్ అలాట్మెంట్) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మార్కెటింగ్శాఖ అధికారులు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ)కి పట్టుబడ్డారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ (ఎస్జీఎస్) కల్పన గుడిమల్కాపూర్ మార్కెట్లోని చెత్త తరలింపునకు సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబు నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఈనెల 22న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్జీఎస్ను పట్టుకొనేందుకు పథకం వేశారు. కాంట్రాక్టర్ రాంబాబు ఇచ్చిన లంచం డబ్బును సీనియర్ అసిస్టెంట్ మహేశ్ ద్వారా ఎస్జీఎస్ కల్పన తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. కల్పన, మహేష్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లంచం డబ్బు రూ. 50 వేలను స్వాధీనం చేసుకుంది. విచారణ అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇదే సమయంలో దోమలగూడలో ఉన్న కల్పన ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో సీఐలు మంజుల, సుదర్శన్రెడ్డి, రాజేశ్, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో తహశీల్దార్
దగదర్తి(బిట్రగుంట) : అవినీతికి మారుపేరుగా నిలిచిన దగదర్తి తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం వల విసిరారు. భూవివాదంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటున్న తహశీల్దార్ కె.లీలమ్మను పక్కా వ్యూహంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదుతో సహా ఆమెను, ఉలవపాళ్ల వీఆర్వో సాయిప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి అధికార వర్గాల్లో కలకలం సృష్టించింది. దాడి విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కార్యాలయాల నుంచి మాయమయ్యారు. ఫోన్లు సైతం స్విచ్ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఏసీబీ అధికారులు, బాధితుల కథనం మేరకు..దగదర్తి మండలం ఉలవపాళ్లకు చెందిన గోచిపాతల చిన్నమ్మ, పోతిపోగు మాల్యాద్రి, పోతిపోగు వెంకయ్యల పూర్వీకులకు సుమారు 20 ఏళ్ల కిందట అదే గ్రామంలోని సర్వే నంబర్లు 46-3, 46-4, 46-5లో ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. పలుమార్లు క్రయవిక్రయాలు జరగడంతో ప్రస్తుతం ఈభూమి అనంతవరానికి చెందిన ఇద్దరు రైతుల ఆధీనంలో ఉంది. అన్యాక్రాంతమైన తమ పూర్వీకుల భూమిని తిరిగి అప్పగించాలంటూ చిన్నమ్మ, మాల్యాద్రి, వెంకయ్య ఇటీవల జేసీకి వినతిపత్రాలు అందచేశారు. జేసీ విచారణకు ఆదేశించడంతో తహశీల్దార్ లీల బాధితులతో బేరం పెట్టారు. బాధితులకు అనుకూలంగా నివేదిక పంపించేందుకు ఎకరాకు రూ.5వేలు వంతున రూ.30వేలు డిమాండ్ చేశారు. బాధితులు బతిమలాడటంతో చివరకు రూ.15 వేలకు అంగీకరించారు. వీఆర్వో సాయిప్రసాద్కు అదనంగా రూ.2వేలు ఇవ్వాలని సూచించారు. ఈమేరకు బాధితులు ఈనెల 16న తహశీల్దార్కు రూ.10వేలు అందచేశారు. మిగిలిన రూ.5వేలు, వీఆర్వోకు ఇవ్వాల్సిన రూ.2వేలు ఇస్తే నివేదిక పంపుతానని తహశీల్దార్ స్పష్టం చేయడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ నెల్లూరు ఇన్చార్జి డీఎస్పీ మూర్తి సూచన మేరకు బాధితులు మొత్తం రూ.7వేల నగదును కవర్లో పెట్టి తహశీల్దార్ కార్యాలయంలో లీలకు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే తహశీల్దార్ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్కు రసాయనిక పరీక్షలు నిర్వహించి నగదు స్వీకరించినట్లు నిర్ధారించుకున్నారు. వీఆర్వో సాయిప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎసీబీ అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు : కె.లీల, తహశీల్దార్ నేను ఎవరి దగ్గర నగదు డిమాండ్ చేయలేదు. నన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు. కవర్లో పెట్టి ఇచ్చేసరికి అర్జీ అనుకుని స్వీకరించాను. అంతకు మించి నాకేమీ తెలియదు. ఏడాదిన్నర నుంచి తిరుగుతున్నాం : చిన్నమ్మ, కొండయ్య, బాధితులు అన్యాక్రాంతమైన మా భూములను తిరిగి ఇప్పించాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి చివరకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. కాళ్లావేళా పడటంతో తహశీల్దార్ రూ.15 వేలకు అంగీకరించారు. రూ.10 వేలు చెల్లించినా అంగీకరించలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాం. -
లంచం తీసుకుంటూ ఇద్దరు అరెస్టు
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలోని ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8 వేలు డిమాండ్ చేసిన ఇద్దరు ఐటీ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 8 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విశేషాలను ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు వెల్లడించారు. 66వ వార్డు పద్మనాభనగర్లో ఎస్సీ, బీసీ కాలనీలో ఇంజనీరింగ్ అధికారులు గత ఏడాది ఓ కల్వర్టు నిర్మాణ బాధ్యతను గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టరుకు అప్పగించారు. ఆయన కల్వర్టు పనులన్నీ పూర్తి చేసి బిల్లుకు దరఖాస్తు చేసుకున్నారు. రూ.13 లక్షలు బిల్లులు చెల్లించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ బిల్లులను జీవీఎంసీ ఫైనాన్స్ విభాగ అధికారులు క్లియర్ చేసేసి ఈనెల 2న ఐటీ విభాగానికి పంపారు. ఐటీ విభాగంలో వెంటనే ఈ బిల్లు క్లియరెన్స్ కావాలి. రెండు వారాలుగా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పని చేస్తున్న బొడ్డేటి అనిల్కుమార్ కొద్ది రోజులుగా ఈ బిల్లు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఐటీ విభాగ ఓఎస్డీగా వ్యవహరిస్తున్న జెన్కో సహాయ డిప్యూటీ ఇంజనీర్ ఎస్. గోపాలరావును కాంట్రాక్టరు సంప్రదించాడు. ఆయన రూ. 10 వేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు ముందస్తు పథక రచన చేశారు. ఆ మేరకు రూ. 8 వేలు చెల్లిస్తానని కాంట్రాక్టరు ఐటీ ఓఎస్డీకి చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం నగదును ఐటీ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. ఆ మొత్తాన్ని తనకు కాకుండా ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగి జి. రవికి ఇవ్వాలని గోవిందరావు సూచించాడు. ఈ మొత్తాన్ని రవి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఎస్ఐ
కేసు విత్డ్రాకు రూ.40 వేల డిమాండ్ రూ.22 వేలు తీసుకుంటుండగా పట్టివేత అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు సీతంపేట (విశాఖపట్నం): అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారి లంచగొండిగా మారాడు. ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనికి లంచం డిమాండ్ చేశాడు. ఫలితంగా అవినీతి నిరోధకశాఖకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఫోర్త్ టౌన్ ఫోలీస్స్టేషన్లో లాఅండ్ఆర్డర్ ఎస్ఐగా పనిచేస్తున్న రమేష్బాబు తన కేబిన్లో ఆదివారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నుంచి రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. నేవల్ డాక్యార్డులో వెల్డింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అక్కయ్యపాలెంలోని టూ బెడ్రూమ్ ప్లాట్ను వెంకట రాజేశ్వరరావు అనే వ్యక్తికి రూ.22 లక్షలకు అక్టోబర్లో విక్రయించాడు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఇంటిని మాత్రం అప్పగించలేదు. దక్షిణామూర్తికి తన భార్య దివ్యతో కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో దివ్య ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో ఇల్లు అప్పగించలేదని రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దక్షిణామూర్తిపై 420, 448 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ఎస్ఐ రమేష్బాబు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణామూర్తి తన భార్య దివ్యకు రూ. 5లక్షలు చెల్లించి గొడవ సెటిల్ చేసుకున్నాడు. ఇంటిని రాజేశ్వరరావుకు అప్పగించాడు. సమస్య పరిష్కారమైనందున మెగా లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసుకుంటామని దక్షిణామూర్తి ఎస్ఐ రమేష్బాబును కలిశాడు. ఇందుకోసం ఎస్ఐ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే రిమాండుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రూ.22 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో స్టేషన్లోని ఎస్ఐ కేబిన్లో దక్షిణామూర్తి నుంచి రమేష్బాబు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్ఐను ఆరెస్టు చేశారు. పోలీసు అధికారుల్లో గుబులు... ఎస్ఐ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎస్ఐ రమేష్బాబు హఠాత్తుగా పట్టుబడటంతో ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఆర్థికపరమైన కేసుల్లో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ బెదిరించారు ఎస్ఐ చర్యలకు విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించాను. కుటుంబ కలహాలు సెటిల్ చేసుకుని, కొనుగోలు చేసిన వ్యక్తికి ఇల్లు అప్పగించాను. లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేయడానికి ఎస్ఐ రూ.40 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకుంటే రిమాండ్కు తరలిస్తానని బెదిరించడంతో ఏసీబీని ఆశ్రయించాను. -దక్షిణామూర్తి, ఫిర్యాదుదారుడు -
ఏసీబీ వలలో అవినీతి ఆర్ఐ
ఇల్లంతకుంట : సాటి ఉద్యోగని చూడకుండా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇల్లంతకుంట ఆర్ఐ అపర్ణ. రైతులకు సం బంధించిన భూ సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా పరిష్కారానికి లంచం తీసుకోవడమే త న రూటుగా మార్చుకున్న ఆర్ఐ ఎట్టకేలకు అడ్డంగా బుక్కయ్యారు. ముస్కాన్పేట రెవెన్యూ సహాయకుడి నుంచి రూ.25 వేలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేట గ్రామానికి చెందిన సీరవేని కనుకయ్య గ్రామ రెవెన్యూ సహాయకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి తండ్రికి చెందిన సర్వే నం బర్ 18, 126, 146, 147, 282, 284లోని 4.21 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుమీద విరాసత్, పహణీలో నమోదు, పాస్పుస్తకాలు జారీ చేయాలని ఏడాది కాలం గా ఆర్ఐ అపర్ణ చుట్టు తిరుగుతున్నాడు. ‘పైసలిస్తేనే ఫైల్ కదుల్తది. లేకుంటే పని కాదు’ అని ఆర్ఐ తేల్చిచెప్పడంతో బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. విరాస త్ కోసం రూ.50 వేలు డిమాండ్ చేయగా తనతో అంత కాదని రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటగా రూ.5 వేలు ముట్టజెప్పగా, మూడు నెలల క్రితం రూ.10 వేలు రెండు నెలల జీతం అప్పజెప్పాడు. మిగతా రూ.25 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని అపర్ణ చెప్పడంతో విసిగిపోయిన కనుకయ్య ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్ను ఆశ్రయించారు. మూడు రోజులుగా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారు. గురువారం సాయంత్రం బాధితుడి నుంచి ఆర్ఐ రూ.25 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అపర్ణ తీసుకున్న రూ.25 వేలు, పాస్పుస్తకాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎవర్నీ వదలం :ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ లంచం కోసం ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తున్న అవినీతి అధికారులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్ అన్నారు. రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఆర్ఐ అపర్ణను శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్ఐ అపర్ణతోపాటు కార్యాల యంలో పని చేసే సిబ్బంది, వీఆర్వోలపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. లంచం ఇస్తేనే పని చేస్తామనే అవినీతి అధికారుల వివరాలను 94404 46150, 94404 46139 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. ఆయన వెంట సీఐలు వీరభద్రం, రమణమూర్తి, వేణుగోపాల్ ఉన్నారు. పీడిస్తున్న వీఆర్వోలు... ఆదాయం, కులం, పహణీలో పేరు మార్పు, ఆన్లైన్ నమోదు, పాస్పుస్తకాల జారీ, జమాబందీ అమలు, విరాసత్ వంటి పనులకు రైతులు వస్తే జేబులు నింపాకే ఫైలు కదులుతుందని వీఆర్వోలు కూడా రైతులను వేధిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం రైతులు బ్యాంకులో రుణా లు తీసుకునేందుకు పహణీ కోసం వీఆర్వోల వద్దకెళితే రూ.200 నుంచి రూ.400 వందల వరకు వసూలు చేశారని తెలిపారు. వీఆర్వోలపై కూడా ఏసీబీ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. -
పట్వారీ పాపం పండింది
ఏసీబీ వలలో వీఆర్వో జాకీర్ హుస్సేన్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం సోదాల్లో మరో రూ.5 లక్షలు లభ్యం అక్రమ ఆస్తులపై కొనసాగుతున్న ఏసీబీ విచారణ భూపాలపల్లి : అవినీతి పట్వారీ పాపం పండింది. బదిలీ అయినా పలుకుబడితో ఉన్న స్థానంలోనే కొనసాగుతూ దందా సాగిస్తున్న అతడి అవినీతి బాగోతం బయటపడింది. ఇన్నాళ్లు అతడిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండగా.. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినా ఓ మహిళ ధైర్యం చేసి అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. అసైన్డ పట్టా కోసం వీఆర్వో ఆమెను లంచం అడగగా ఏసీబీ అధికారులకు పట్టించి రెవెన్యూ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. భూపాలపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. మండలంలోని జంగేడు గ్రామానికి చెందిన పాలిక సమ్మయ్య కోడలు సుగుణకు 2010లో రెవెన్యూ అధికారులు 1.07 గుంటల ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేశారు. ఆ అసైన్డ్ పట్టా ఇవ్వాల్సిందిగా వీఆర్వో సయ్యద్ జాకీర్హుస్సేన్ను ఆమె కోరింది. రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా చివరికి రూ.5 వేలు ఇచ్చేందుకు ఆమె అంగీకరించింది. ఆ డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఆమె తన మామ సమ్మయ్యతో కలిసి వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనలతో శుక్రవారం సాయంత్రం సమ్మయ్య పట్టణంలోని వీఆర్వో జాకీర్హుస్సేన్కు రూ.5 వేలు ఇవ్వగానే సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే జాకీర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఇంటిని సోదా చేయగా బీరువాలో మరో రూ.5 లక్షలు లభించాయి. అయితే ఆ డబ్బులు తన సొంత భూమిని విక్రయించగా వచ్చాయని వీఆర్వో వెల్లడించాడు. ఏసీబీ అధికారులు నగదు మొత్తాన్ని సీజ్ చేసి జాకీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అతడికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. జాకీర్పై కేసు నమోదు చేసి, హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ సాయిబాబా వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐలు రాఘవేంద్రరావు, శ్రీనివాసరాజు, సిబ్బంది ఉన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా జాకీర్ వీఆర్వో జాకీర్ అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణలో అనేక ఆధారాలు లభించినట్లు సమాచారం. సుమారు 24 ఏళ్లుగా రెవెన్యూశాఖలో అనధికారికంగా, అధికారికంగా పని చేస్తూ భారీగా మామూళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1992 నుంచి 2008 వరకు తన తల్లి వీఆర్వో ఉద్యోగాన్ని తానే చేస్తూ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 2008లో వీఆర్వోగా ఉద్యోగం పొంది జంగేడు వీఆర్వోగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి జంగేడుతోపాటు భూపాలపల్లి బాధ్యతలను నిర్వర్తిస్తూ విలువైన సీలింగ్, ప్రభుత్వ భూములకు లక్షలాది రూపాయలకు తీసుకుని పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇతడి అక్రమాలపై పలుమార్లు స్థానికులు కలెక్టర్, ఆర్డీఓలకు కూడా ఫిర్యాదులు చేశారు. బదిలీ అయినప్పటికీ.. జాకీర్ను జిల్లా అధికారులు ఏడాది క్రితం శాయంపేట మండలంలోని గట్లకానిపర్తికి బదిలీ చేశారు. అయినా అతడు తన పలుకుబడితో ఆ ఉత్తర్వులను నిలిపి వేయించుకొని ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాడు. అయితే బదిలీ అయిన వీఆర్వోను రిలీవ్ చేయాలని, ఈ వీఆర్వో మాకొద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీల నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా అప్పట్లో ఫలితం లేకుండా పోయింది. ఏడాది తర్వాత ఏసీబీ దాడి... గత ఏడాది నవంబర్ 18న భూపాలపల్లి ఉత్తర అటవీ విభాగం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాధవరెడ్డి తన క్వార్టర్లో ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ వల వేసి పట్టుకుంది. సరిగ్గా ఆ ఘటన జరిగిన ఏడాదికి వీఆర్వో జాకీర్ పట్టుబడటంతో వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీఆర్వో ఇంటిపై దాడులు కాజీపేట : దర్గాకాజీపేటలోని వీఆర్వో సయ్యద్ ఖాజా జాకీర్హుస్సేన్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఐ సాంబయ్యతో కలిసి సిబ్బంది తనిఖీలు చేశారు. దాడుల్లో ఇంట్లో తులాల కొద్ది బంగారం, ఇళ్ల నివేశన స్థలాలకు సంబంధించిన కాగితాలు, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అత్యంత రహస్యంగా తనిఖీలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. -
ఏసీబీకి ‘లక్ష'ణంగా చిక్కాడు
మారీసుపేట (తెనాలి): తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం డైట్ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. గుంటూరు రేంజ్ ఎసీబీ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి జిల్లా వైద్యశాలలో డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ చర్మవ్యాధుల నిపుణుడిగా పనిచేస్తు వచ్చారు. 2013 అక్టోబర్ 11న వైద్యశాల సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్యశాలలోని రోగులకు డైట్ అందించేందుకు 2005లో తెనాలికి చెందిన తాడిబోయిన భారతీకుమారి కాంట్రాక్టు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె, ఆమె భర్త శ్రీనివాసరావు వైద్యశాలలోని రోగులకు టిఫెన్, భోజనం అందిస్తు వస్తున్నారు. సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు డైట్కు సంబంధించిన కాంట్రాక్టుకు ఉన్నతాధికారులు పాట పెట్టాల్సి ఉంది. డైట్ నిర్వహణ బాగా చేస్తున్నట్లు అధికారులకు అనిపిస్తే కాంట్రాక్టును ఏడాది పొడిగించే అవకాశం ఉంది. అలా శ్రీనివాసరావు 2007 నుంచి తన కాంట్రాక్టును పొడిగించుకుంటూ వస్తున్నాడు. 2014 జూన్తో పొడిగించిన కాంట్రాక్టు గడువు ముగిసింది. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ను కలిసి డైట్ కాంట్రాక్టును పొడిగించాలని శ్రీనివాసరావు కోరాడు. అందుకు రూ.1.65లక్షల నగదు లంచంగా ఇవ్వాలని డిమాండ్చేయడంతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. లంచం ఇవ్వనిదే ఫైలును ఉన్నతాధికారులకు సిఫారసు చేయనని స్పష్టంచేయడంతో లక్ష రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఇదంతా సెల్ఫోన్లో రికార్డు చేసిన శ్రీనివాసరావు గుంటూరులోని ఏసీబీ అధికారులకు వినిపించి విషయం చెప్పాడు. ఎసీబీ అధికారుల సూచన మేరకు రూ.లక్ష నగదును శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్యశాలలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో రవీంద్రకుమార్కు శ్రీనివాసరావు ఇవ్వగా వాటిని లెక్కించి తన సొరుగులో పెట్టుకున్నాడు. ఎసీబీ డీఎస్పీ రాజారావు రెడ్హ్యాండెడ్గా రవీంద్రకుమార్ను పట్టుకున్నారు. అనంతరం ఆయన నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రకుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ప్రకటించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.సీతారామ్, టి.నరసింహారెడ్డి, శ్రీనివాస్, తెనాలి మూడో పట్టణ ఎస్ఐ జోగి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. గతంలోనూ.. 2012లో జిల్లా వైద్యశాలలో ఆడిట్ ఫైనాన్స్ అధికారిగా పనిచేసిన డాక్టర్ గంగాధర్ ఇదే డైట్ కాంట్రాక్టర్ భారతీకుమారి డైట్ బిల్లులను మంజూరు చేసేందుకు లంచం అడిగారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ భర్త శ్రీనివాసరావు విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచన మేరకు రూ.40 వేల లంచం ఇస్తూ పట్టించారు. జిల్లా వైద్యశాలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది. -
ప్రతిపనికీ కమీషన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అందులేదని..ఇందు వలదని..సందేహంబు వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు అవినీతి. అన్న చందంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. అందుకు శుక్రవారం వెలుగుజూసిన ఘటనే నిదర్శనం. నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి వద్ద లంచం తీసుకుని బతికున్నా చనిపోయినట్టు ధ్రువీకరణపత్రం జారీ చేయడం అధికారుల అవినీతికి పరాకాష్టగా మారింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎటువంటి విచారణ జరుపకుండా.. మనిషి అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకుని బతికున్న వారు మరణించినట్లు.. మరణించిన వారు బతికే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఎవరినైనా హత్యచేసి తప్పించుకోవాలంటే నెల్లూరు కార్పొరేషన్లో కొందరు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెబితే నిర్దోషిగా తప్పించుకోవచ్చనడానికి తాజా ఘటనే నిదర్శనం. ఇదొక్కటే కాదు సుమా.. పారిశుధ్య పనుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలను సైతం కొందరు అధికారులు జేబుల్లో వేసుకుంటున్నట్లు రాజేం ద్రబాబు (పేరు మార్చాము) అనే కార్మికుడు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఐదునెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బోరుమన్నాడు. అదే విధంగా చెత్తను తరలించే ట్రాక్టర్ల ఖర్చు లెక్కల్లో చేతివాటం ప్రదర్శిస్తూ.. ఒకటి, రెండు ట్రక్కులతో తరలించి ఐదారు ట్రాక్టర్లతో తరలించినట్లు లెక్కలు చూపి సొమ్ముచేసుకుంటున్నట్లు అతని వివరించారు. అదే విధంగా కొందరు సిబ్బంది వాహనాలకు కొనుగోలు చేస్తున్న డీజిల్ను సైతం చోరీ చేస్తున్నట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్లో ఇష్టారాజ్యం టౌన్ప్లానింగ్లో అవినీతికి హద్దే లేకుండా పోతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఇల్లుకట్టుకోవాలనుకుని దరఖాస్తు చేసుకుంటే.. దరఖాస్తు చేసుకున్న మొద లు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు స్థాయిని బట్టి ప్రతి అధికారి వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్ల అనుమతుల కోసం వచ్చే బిల్డర్ నుంచి ఏకంగా ప్లాట్లు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్లాటు బినామీ పేరుతో రాయించుకుని అనుభవిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే ఆస్తుల మార్టిగేజ్ను విడిపించటానికి నిబంధనలను పక్కని పెట్టి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని జేబులు నింపుకుంటున్నారే ప్రచారం జరుగుతోంది. ఇంజనీరింగ్ విభాగం విషయానికి వచ్చే సరికి... అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకా లు వదిలి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారు. నిధులు మంజూరు చేయాలంటే పర్సెంటేజీలు ఇచ్చుకోవాలి. ముఖ్యంగా రోడ్లు నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవి నీతి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల నిర్వహణ పేరుతో రూ.లక్షలు దోచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో ప్రతి పనికీ కమిషన్... డబ్బులు ముట్టాక బిల్లులు మంజూరు చేస్తున్నారని ఇటీవల నగరంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి చేతులు కాల్చుకున్న ఓ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అవసరం లేకున్నా కాంట్రాక్ట్ పద్ధతిన పెద్ద ఎత్తున నియామకాలు జరిగినట్లు సమాచారం. అయితే సిబ్బందిని నియమించుకుని జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు నెల్లూరు కార్పొరేషన్లో సుమారు 20 మందికిపైగా ఉన్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్ అవినీతిని కట్టడి చేసే విషయంలో గట్టి చర్య లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ సంక్షేమ శాఖలో బదిలీలు నెల్లూరు (సెంట్రల్): జిల్లా బీసీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఇద్దరిని బదిలీ చేశారు. గూడూరులో పనిచేస్తున్న ఏబీసీడబ్ల్యూఓ రమేష్ను నెల్లూరులోని బీసీ జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరులో బీసీ సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్గా ఉన్న షర్మిలను నెల్లూరుకు, నెల్లూరులో ఉన్న రామారావును ఒంగోలుకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులపై క్రిమినల్ కేసులు నెల్లూరు(క్రైమ్): స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన విద్యార్థి నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కలెక్టరేట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని తదితర కారణాలను కేసులో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన పి. కిరణ్, సుధీర్, రవి, ప్రసాద్, నాని, జనార్దన్, రాము, అశోక్, నందకిరణ్ను శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఒకటో నగర ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు తెలిపారు. ఉప రవాణా కమిషనర్ బదిలీ నెల్లూరు (దర్గామిట్ట): నెల్లూరులో రవాణాశాఖ ఉపకమిషనర్(డీటీసీ)గా పనిచేస్తున్న ఎ.మోహన్ కాకినాడకు బదిలీ ఆయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు డీటీసీ శివరామ్ప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం రాత్రి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. శివరామ్ ప్రసాద్ రెండు రోజుల్లో నెల్లూరులో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. -
సీబీఐకి చిక్కిన ఇన్కంట్యాక్స్ డీసీ
కరీంనగర్: కరీంనగర్ ఇన్కం ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయప్రకాశ్ ఓ చిట్ఫండ్ వ్యాపారి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్లోని సన్నిహిత చిట్ఫండ్ నిర్వాహకుడు భూమాగౌడ్ను చిట్ఫండ్కు సంబంధించిన ఇన్కంటాక్స్ వ్యవహారంలో జయప్రకాశ్ రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్లోని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఇన్కం ట్యాక్స్ కార్యాలయంలో జయప్రకాశ్ను కలిసి రూ.2 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. అప్పటికే మాటు వేసిన సీబీఐ అధికారులు వెంటనే కార్యాలయంపై దాడి చేసి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
అడ్డంగా దొరికిన ఉన్నతాధికారి
గుంటూరు రూరల్ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఉన్నత స్థానంలో ఉన్న విషయాన్ని మరచిన ఆయన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కొద్ది రోజుల కిందట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతునాయక్ లంచం తీసుకుంటూ దొరికిపోగా, తాజాగా ఏసీబీ అధికారులు పన్నిన వ్యూహంలో మరో ఉన్నతాధికారి చిక్కుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రావెల్ క్వారీ లీజు మంజూరుకు సంబంధించి లంచం తీసుకుంటున్న మైనింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అమరేంద్ర(ఔట్ సోర్సింగ్)లను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇదీ నేపథ్యం.... ఏసీబీ డిఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నగరంపాలెంకు చెందిన మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము భార్య వెంకటవిజయలక్ష్మి చేబ్రోలు మండలం పాతరెడ్డి పాలెంలోని 7.83 ఎకరాల భూమిలో గ్రావెల్ క్వారీ కోసం 2012 ఆగస్టు 25న మైనింగ్ శాఖకు దరఖాస్తు చేశారు. ఆ తరువాత ఆ శాఖకు సంబంధించి గుంటూరు, ైెహ దరాబాద్ల నుంచి ఎన్వోసీలు పొందారు. చివరకు ఆ ఫైలు గుంటూరులోని మైనింగ్ డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్ వద్దకు చేరింది, ఆయనే గ్రావెల్ లీజు గ్రాంట్ మంజూరు చేయాలి. ఈ సమయంలో ఉన్నతాధికారి ప్రసాద్ రూ.లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న విజయలక్ష్మి భర్త రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు రాము రూ. 80 వేలు తీసుకొని శుక్రవారం మధ్యాహ్నం రామన్నపేటలోని ైమైనింగ్ డీడీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డబ్బును డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్కు అందజేశారు. డబ్బు తీసుకున్న ప్రసాద్ లెక్కించమంటూ తన పక్కనే ఉన్న డేటా ఎంట్రీ అపరేటర్ అమరేంద్రకు (ఔట్ సోర్సింగ్) నగదు అందజేశారు. చివరకు డబ్బు ను ప్రసాద్ తన టేబుల్ సొరుగులో పెట్టుకున్నారు. అప్పటికే కార్యాలయం బయట వేచి ఉన్న ఏసీబీ గుంటూరు డిఎస్పీ ఎమ్. రాజారావు, విజయవాడ డీఎస్పీ ఆర్.విజయపాల్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజు, సీతారామ్, నరసింహారెడ్డి ఒక్కసారిగా డిప్యూటీ డెరైక్టర్ చాంబర్లోకి దూసుకు వచ్చి టేబుల్ సొరుగులో ఉన్న డబ్బు స్వాధీనం చేసుకోని ప్రసాద్, డేటా ఎంట్రీ అపరేటర్ (ఔట్సోర్సింగ్) అమరేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రాజారావు విలేకరులతో మాట్లాడుతూ...మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము ఫిర్యాదు మేరకు దాడి చేసినట్టు వివరించారు. అవినీతికి పాల్పడిన మైనింగ్ శాఖ డిప్యూటి డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి ప్రసాద్తో పాటు అతనికి భాగస్వామిగా వ్యవహరించిన డేటా ఎంట్రీ అపరేటర్ను అదుపులో తీసుకున్నామన్నారు. టేబుల్ సొరుగులోని రూ. 80 వేలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇదిలావుండగా, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి గ్రావెల్ క్వారీకి అనుమతులు వచ్చినా చివరకు మైనింగ్ శాఖ డిప్యూటి డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి ప్రసాద్ లంచం డిమాండ్ చేశారని మాజీ కార్పొరేటర్ పాలపర్తి రాము తెలిపారు. అందుకే ఏసీబీని ఆశ్రయించానన్నారు. -
ఏసీబీ వలలో ఉప ఖజానా ఉద్యోగి
సరెండర్ లీవ్ బిల్లు మంజూరుకు రూ.2వేలు డిమాండ్ లంచం తీసుకుంటూ చిక్కిన మైలవరం సబ్ ట్రెజరీ సూపరింటెండెంట్ మైలవరం : సరెండర్ లీవ్ మంజూరు బిల్లు విడుదల చేయడానికి రూ.2వేలు లంచం తీసుకున్న మైలవరం సబ్ ట్రెజరీ సూపరింటెండెంట్ను ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ విజయవాడ రేంజ్ డీఎస్పీ ఆర్.విజయపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో వాచ్మన్గా పనిచేస్తున్న రవికుమార్ గత నెలలో లీవ్ సరెండర్ చేసినందుకు రూ.19,389 మంజూరైంది. ఈ మొత్తానికి మైలవరం సబ్ ట్రెజరీలో బిల్లు పాస్ చేసేందుకు సూపరింటెండెంట్ జి.కృష్ణయ్య రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను లంచం ఇచ్చుకోలేనని రవికుమార్ చెప్పినా అతడు అంగీకరించలేదు. ముందుగా బిల్ పాస్ చేయాలని, తన బ్యాంకు అకౌంట్లో సొమ్ము జమ కాగానే రూ.2 వేలు ఇస్తానని రవికుమార్ కోరాడు. దీంతో కృష్ణయ్య బిల్లు మంజూరు చేశాడు. బిల్లు మంజూరయ్యాక రవికుమార్ లంచం ఇవ్వలేదు. ఈ నెల బిల్లులు తీసుకునేందుకు అతడు బుధవారం మైలవరం సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చాడు. తనకు లంచం ఇవ్వలేదని, బిల్లులు మంజూరు చేయనని సూపరింటెండెంట్ చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు రసాయనం పూసిన రూ.2వేల కరెన్సీని రవికుమార్కు ఇచ్చి గురువారం సాయంత్రం పంపించారు. అతడు ఆ నోట్లను సూపరింటెండెంట్కు ఇచ్చి, ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ విజయపాల్ ఆధ్యర్యంలో సీఐలు నాగరాజు, శ్రీనివాసరావు సిబ్బందితో దాడి చేసి కృష్ణయ్య లంచంగా తీసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు జరిపిన పరీక్షల్లో సూపరింటెండెంట్ లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఎవరైనా లంచం తీసుకున్నా, అడిగినా వెంటనే తమకు సమాచారం ఇస్తే అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరమేనన్నారు. అవినీతిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446164, 9440446167, 9440446169 నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. -
శ్రీదేవి దగ్గర లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
కడప: ఏసిబి అధికారులు దాడులు చేసి ఎంతోమందిని పట్టుకుంటున్నప్పటికీ కొందరు అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడంలేదు. అనేక మంది లంచం తీసుకుంటూనే ఉన్నారు. వారిలో కొందరు దొరికిపోతున్నారు. అయినా వారికి బుద్ధిరావడంలేదు. ఈ రోజు ఇక్కడ శ్రీదేవి అనే ఉద్యోగి నుంచి బీసీహెచ్ఎఫ్ కోఆర్డినేటర్ రామ్ మోహన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రామ్ మోహన్ శ్రీదేవి నుంచి 20 వేల రూపాయలు తీసుకుంటుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. ** -
ఏసీబీ వలలో లంచావతారం
నాయుడుపేట : ఏసీబీ అధికారుల వలలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి తిమింగలం పడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఖాదర్బాషా రెడ్హ్యాండెడ్గా చిక్కిపోయాడు. అనంతరం గూడూరులోని ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..సూళ్లూరుపేటలోని సూళ్లూరు నాగరాజుపురానికి చెం దిన కళత్తూరు సుబ్బరామిరెడ్డికి 1.04 ఎకరాల భూమి ఉండేది. సీలింగ్ యాక్ట్ కింద 1974లో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసమని 92 సెంట్ల భూమిని సేకరించింది. దానికి సంబంధించి ఆయనకు అప్పటి నుంచి పరిహారం అందలేదు. విలువైన భూమి కావడంతో ప్రభుత్వం ప్రకటించినా పరిహారం నచ్చక, భూమిని తనకే తిరిగి అప్పగించాలంటూ సుబ్బరామిరెడ్డి కొన్నేళ్ల పాటు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగారు. అధికారుల నుంచి స్పందన కరువవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుబ్బరామిరెడ్డికి రూ.23,18,923 చెల్లించాలని ఆరు నెలల క్రితం కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా అధికారుల తీరులో మార్పు రాలేదు. ఆయనకు పరిహారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే నాయుడుపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కావడంతో ఏఓ ఖాదర్బాషా చుట్టూ తిరగసాగాడు. విషయం తెలుసుకున్న సుబ్బరామిరెడ్డి మనుమడు నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపునకు చెందిన ప్రతాప్రెడ్డి ఆ భూమికి సంబంధించి పవర్ ఆఫ్ పట్టా పొందాడు. అనంతరం ఆయన కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన కరువైంది. దీంతో ఖాదర్బాషాను ప్రతాప్రెడ్డి వారం క్రితం కలిసి మాట్లాడగా రూ.50 వేలు లంచం ఇస్తే పరిహారం అందేలా చూస్తానని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ప్రతాప్రెడ్డి ఏసీబీ డీఎస్పీ నంజుండప్పను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఖాదర్బాషాకు రూ.25 వేలు మొత్తాన్ని ప్రతాప్రెడ్డి అందజేశాడు. అప్పటికే అక్కడ మాటేసిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాదర్బాషాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నెల్లూరుకు తరలించారు. డీఎస్పీ నంజుండప్ప వెంట ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, కృపానందం, శివకుమార్రెడ్డి, సిబ్బంది మధుసూదన్రావు, ఫణి, కుద్దూష్, షఫీ, సుబ్బారావు తదితరులు ఉన్నారు. పక్కా ప్రణాళికతో.. ఏఓ ఖాదర్బాషాను ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకే లుంగీలు ధరించి ప్రైవేటు వాహనంలో సాధారణ వ్యక్తుల్లా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. ప్రతాప్రెడ్డితో ఖాదర్బాషాకు ఫోన్ చేయించారు. సాయంత్రం 6 గంటలకు ప్రతాప్రెడ్డి ఫోన్కు స్పందించిన ఖాదర్బాషా నగదు తీసుకుని బస్టాండ్ ప్రాంతంలోని అమరావతి హోటల్ వద్దకు రమ్మన్నాడు. మొదట రూ.25 వేలు తీసుకుని మిగిలిన రూ.25 వేలు విషయమై మాట్లాడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనే ఖాదర్బాషాపై పలు ఆరోపణలున్నాయి. మేనకూరు సెజ్కు సంబంధించి సేకరించిన భూముల పరిహారం చెల్లింపులో వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. పాత రికార్డుల ఆధారంగా బినామీ పేర్లతో పరిహారం డ్రా చేశారని అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. గూడూరులో సోదాలు గూడూరు టౌన్: ఖాదర్బాషాపై పలు ఆరోపణలు రావడంతో గూడూరులోని మాళవ్యానగర్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, నగదు దొరకలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇన్స్పెక్టర్ కృపానందం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఖాదర్బాషా లంచం తీసుకుంటూ చిక్కాడనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన గూడూరు ఆర్డీఓ కార్యాలయంలోనూ ఏఓగా పనిచేశారు. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
- రూ. 5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు - నెల క్రితం ఎస్బీ హెడ్కానిస్టేబుల్.. డిచ్పల్లి : లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీ కి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన రైతు గుడాల ఒడ్డెన్న తన బావమరిదికి చెంది న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఒడ్డెన ్న తన పేరిట పాసు పుస్తకం, టైటిల్ డీడ్, ఆర్డర్ కాపీ కోసం వీఆర్ఓ భూపతిరెడ్డిని సంప్రదించాడు. వీటికోసం ఆయన రూ. 10 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనంటూ ఒడ్డెన్న ప్రాధేయపడ్డాడు. దీంతో రూ. 6 వేలకు బేరం కుదిరింది. పది రోజుల క్రితం వేయి రూపాయలు ఇచ్చాడు. మిగిలిన రూ. 5 వేల కోసం భూపతిరెడ్డి వేధిస్తుండడంతో విసుగు చెందిన ఒడ్డెన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం అమృతాపూర్లోని వీఆర్ఓ కార్యాలయంలో రూ.5వేల నగదును వీఆర్ఓకు అందించాడు. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు దాడి చేసి వీఆర్ఓను పట్టుకున్నారు. ఐదు వారాల వ్యవధిలో.. ఐదు వారాల వ్యవధిలోనే మండలంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. గత నెల 13వ తేదీన ఎస్బీ హెడ్కానిస్టేబుల్ అజ్మత్ పాస్పోర్టు విచారణ నిమిత్తం రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీకి వీఆర్ఓ చిక్కడంతో పలువురు రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో పలువురు ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డబ్బులిస్తేనే పనిచేస్తానన్నాడు.. మా బావమరిది వద్ద రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, టైటి ల్ డీడ్, ఆర్డర్ కాపీని నా పేరుపైకి మార్చుకోవడం కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. రూ. 10 వేలు ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తాను, లేదంటే ఇవ్వనని వీఆర్ఓ భూపతిరెడ్డి డిమాండ్ చేశాడు. డబ్బులకోసం వేధిస్తుండడంతో ఏసీబీకి పట్టించాను. నాలాగే చాలా మందిని ఆయన డబ్బులకోసం వేధించాడు. - బాధిత రైతు ఒడ్డెన్న పైసలివ్వకపోతే పెండింగే.. పలువురు ప్రభుత్వోద్యోగులు లంచాలకు అలవాటు పడి పైసలిస్తేనే పనులు చేస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ము ఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఈ విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. పైసలిస్తేనే ప నులు అవుతున్నాయని, లేదంటే ఏదో ఒక కారణం చెబుతూ రోజుల తరబడి పెండిం గ్లో పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నా రు. కొందరు లంచాలు ఇచ్చి పనులు చే యించుకుంటున్నారు. లంచాలకు రుచిమరిగిన అధికారుల వేధింపులు భరించలేని వారు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. గురువా రం ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్ఓ భూపతిరెడ్డి ఇదే మండలంలో కొ న్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఖిల్లా డి చ్పల్లి, సుద్దపల్లి, అమృతాపూర్, గొల్లపల్లి గ్రామాల వీఆర్ఓగా పని చేశారు. వీఆర్ఓ లాంగ్ స్టాండింగ్ కావడంతో గతంలో ఆ యనను సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి బదిలీ చేశారు. అయితే రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన నాలుగు నెలల్లోనే తిరి గి డిచ్పల్లి మండలానికి బదిలీపై వచ్చారు. ఆయన సర్టిఫికెట్ల నుంచి పట్టాదారు పా సు పుస్తకాల వరకు అన్నింటికీ వెలకట్టి అ మ్ముకుంటున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నా రు. ఆర్ ఐ, తహశీల్దార్లకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఆయన డబ్బులు వసూ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక అధికారులకు కొందరు బాధితులు ఫిర్యాదులు చేసినా.. ఆయనపై ఎలాంటి చ ర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. మండలంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉ న్నాయనే విషయాలను రియల్ వ్యాపారులకు చెబుతూ కబ్జాల విషయంలో వారికి సహకరించే వాడని భూపతిరెడ్డిపై ఆరోపణలున్నాయి. మండలానికి ఏ అధికారి బదిలీపై వచ్చినా మచ్చిక చేసుకుని అన్నీ తానై పనులు చక్కబెడతాడని ఆయనకు పేరుంది. మండలంలో పని చేసే మరి కొందరు వీఆర్ఓలు సైతం ఏసీబీ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘శివ' శివా..!
ప్రకాశ్నగర్ (రాజమండ్రి) : రాజమండ్రి నగర పాలక సంస్థ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ యార్లగడ్డ శివశంకరరావు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ్మయ్య నాయుడు అనే మున్సిపల్ కాంట్రాక్టర్ గత మార్చి 30న జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బారికేడ్ల ఎక్స్టెన్షన్ కాంట్రాక్టు పొందాడు. అందుకు సంబంధించిన రూ.4.64 లక్షల బిల్లు మంజూరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు సంతకాలు చేశారు. ఆ మొత్తాన్ని మంజూరు చేయాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని శివశంకరరావు డిమాండ్ చేశారు. రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన తమ్మయ్యనాయుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం.. వారు రంగు పూసి ఇచ్చిన రూ.20 వేల నగదును తమ్మయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నగర పాలక సంస్థ కార్యాలయంలోని శివశంకరరావు చాంబర్కు వెళ్లి ఇచ్చాడు. ఆ సొమ్మును ప్యాంటు జేబులో పెట్టుకున్న శివశంకరరావు తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి, తిరిగి లోపలికి వెళ్లి ఫైలు కింద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు లోపలికి వెళ్లి అతడి చేతులు పరిశీలించగా నోట్లకు పూసిన రంగు అంటుకుని ఉంది. దాంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ్మయ్యనాయుడికి మంజూరు చేయాల్సిన రూ.4.64 లక్షలకు సంబంధించి ఫైలును, శివశంకరరావు తీసుకున్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శివశంకరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. లంచం ఇస్తేనే బిల్లు మంజూరు.. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ శివశంకరరావు లంచం ఇస్తే తప్ప ఏ బిల్లూ మంజూరు చేయరని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బిల్లును మంజూరు చేయకుండా నాలుగు నెలలుగా తిప్పించుకుంటున్నారని, ఆయనకు లంచం ఇవ్వడం ఇష్టం లేకే ఏసీబీని ఆశ్రయించానని తమ్మయ్యనాయుడు చెప్పారు. తాను తనకు ఇవ్వాల్సిన రూ.60 వేల బిల్లును సంవత్సరకాలంగా మంజూరు చేయడం లేదని కాంట్రాక్టు పద్ధతిపై నగర పాలక సంస్థకు కార్లను సరఫరా చేసే కేపీఆర్ విఠల్ ఆరోపించారు. శివశంకర్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని కోన కిషోర్కుమార్ గౌడ్ అనే మరో కాంట్రాక్టర్ చెప్పారు. నగరపాలక సంస్థ కాంట్రాక్టులు దక్కాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా తన కుమార్తెను కారులో వివిధ ప్రాంతాల్లో జరిగే పరీక్షలకు తీసుకువెళ్లాలని రూట్ మ్యాప్తో సహా నిర్దేశించారని ఆరోపించారు. చేసేది లేక ఇండికా కారులో గుడివాడ, తెనాలి వంటి ప్రాంతాలకు ఆయన కుమార్తెను పరీక్షలకు తీసుకు వెళ్లినట్టు చెప్పారు. ప్రతి రూ.లక్ష బిల్లుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సిందేనని శివశంకరరావు అందరు కాంట్రాక్టర్లనూ ఆదేశించారని ఆరోపించారు.