
వికారాబాద్-పర్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వేట్రాక్
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా వికారాబాద్ - పర్లి మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలను .నిజామాబాద్ - ముద్ఖేడ్ మీదగా మళ్లించినట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. షిర్డీ - విజయవాడ, పుణె - హైదరాబాద్ ఎక్స్ప్రెస్తోపాటు ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్లు కూడా దారి మళ్లించినట్లు పేర్కొంది. అలాగే బీదర్ - హమ్నాబాద్, హమ్నాబాద్ - బీదర్ డెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.