6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర | Jagan raithu barosa yatra starts from 6 | Sakshi
Sakshi News home page

6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

Published Mon, Jan 4 2016 1:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర - Sakshi

6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ప్రారంభం

 సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం నాడిక్కడ తెలిపారు. రుణమాఫీ జరగక రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఇప్పటికే అనంతపురం జిల్లాలోని హిందూపురం, మడకశిర, సింగనమల, ఉరవకొండ, గుంతకల్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహించినట్టు తెలిపారు. తిరిగి ఈ నెల 6న ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభిస్తారని, ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వారం రోజులపాటు కొనసాగుతుందని రఘురాం వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement