ప్రపంచ దేశాలు అణువిద్యుత్ ను తగ్గించుకోవాలని చూస్తుంటే భారత పాలకులు మాత్రం ఆ విద్యుత్ ను పెంచుకోవాలని చూస్తున్నాయని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు.
విశాఖపట్నం: ప్రపంచ దేశాలు అణువిద్యుత్ ను తగ్గించుకోవాలని చూస్తుంటే భారత పాలకులు మాత్రం ఆ విద్యుత్ ను పెంచుకోవాలని చూస్తున్నాయని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు.
కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో తీరని నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీలో కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో కాకినాడ నుంచి ఒడిశా వరకు పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు.