Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ys Jagan Visit Rashid Family Vinukonda Updates
ఆంక్షలు.. ఆటంకాల మధ్య జగన్‌ వినుకొండ ప్రయాణం

Updates02:44 PMవై ఎస్ జగన్ వినుకొండ పర్యటనకు అడుగడుగునా ఆటంకాలుదారి పొడవునా ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులు ఆటంకాలుజగన్ వెంట నాయకుల వాహనాలు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు15 సార్లు వై ఎస్ జగన్ కాన్వాయ్ కి ఆటంకాలు కలిగించిన పోలీసులుపోలీసులు ఆంక్షలు, ఆటంకాలు తో ఆలస్యంగా జగన్ ప్రయాణంవినుకొండ వచ్చే దారిలో పదే పదే ఆటంకాలు కలిగిస్తున్న పోలీసులు 02:40 PMసంతనూతలపాడు అడ్డరోడ్డుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌02:30 PMవైఎస్‌ జగన్‌కు వాహన కేటాయింపుపై సిల్లీ రీజన్‌ చెప్పిన ప్రభుత్వంఎస్ఆర్‌సీ 2024సీ నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉంది. దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే అదనపు ఆక్టోపస్, ఎపీఎస్పీ మొదలైన సెక్యూరిటీ స్థానంలో Z+ కేటగిరీకి పరిమితం చేసినట్టు పేర్కొంది.Z+కేటగిరీ ప్రకారం, బీఆర్ కార్‌ను అందించాలి. మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారి బీఅర్ కార్ కేటాయించారు. విజయవాడలో టాటా సఫారి బీఆర్ కార్లు లేవు కాబట్టి, విజయనగరం పూల్‌లో లభ్యమైన బీఆర్ కార్‌ను కేటాయించారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ ఏపీ 39పీ 0014. ఈ కారు 2018 మోడల్. ఇది మంచి కండీషన్‌లోనే ఉంది. అలాగే అందుబాటులో ఉన్న టాటా సఫారీ బీఆర్ కార్లలో ఇదే ఉత్తమమైనది.కేటాయించిన ఆ వాహనాన్ని డ్రైవర్ రాత్రి 11:30 విజయనగరంలో స్టార్ట్ చేసి, ఉదయం 8:45 తాడేపల్లి చేరుకున్నాడు. మొదట మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఐఎస్‌డబ్య్లూ అధికారులను సంప్రదించి, టాటా సఫారి బీఆర్ కారు బదులుగా టయోటా ఫార్చునర్ బీఆర్ లేదా ప్రడో కార్ కోసం అభ్యర్థించారు.మరే ప్రత్యామ్నాయం లేనందున, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుండి అదే టాటా సఫారీ బీఆర్ కారులో ఉదయం 10:05 గంటలకి బయలుదేరారు. ప్రయాణం మొదలెట్టిన 10 నిమిషాల తర్వాత టెక్నికల్‌ సమస్య కారణంగా వైఎస్‌ జగన్‌ తన సొంత టయోటా ఫార్చునర్ కారులోకి మారారు అని పేర్కొంది. 01:20 PMవైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతంవినుకొండ వెళ్తున్న జగన్‌కు ప్రతీచోటా ప్రజలు బ్రహ్మరథంవర్షంలోనూ పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులుఅందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌ 01:14 PMకాసేపట్లో వినుకొండకు వైఎస్‌ జగన్‌రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్‌ 12:55 PMనరసరావుపేట బైపాస్‌కు చేరుకున్న వైఎస్ జగన్భారీగా తరలివచ్చి జగన్ కు స్వాగతం పలికిన కార్యకర్తలుకారు దిగి‌ అభివాదం చేసిన జగన్ 11:30 AMచిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్రోడ్డుకు ఇరువైపులా భారీగా ఉన్న కార్యకర్తలుజగన్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు10:54 AMమాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్‌ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైఎస్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.10:38 AMవినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు పడుతున్నారు.10:08 AM⇒వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వినుకొండ బయల్దేరారు.⇒టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కాసేపట్లో‌ పరామర్శించనున్న జగన్ 9:40 AM⇒వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ రానున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు.⇒టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరో­డ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్‌ మీదుగా వైఎస్‌ జగన్‌ వినుకొండ చేరుకుంటారు.⇒టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్‌ జగన్‌ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనా­యుడుతో ఫోన్‌లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్‌ కుటుంబ సభ్యు­లను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. ⇒హింసాత్మక విధానాలు వీడాలని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ఏపీలో ఆటవిక పాలనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఏపీలో గడిచిన 40 రోజులగా జరుగుతున్న హత్యాకాండలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.⇒కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 31 మంది హత్య, 300 మందిపై హత్యాయత్నాలు, టీడీపీ వేధింపులకి 35 మంది ఆత్మహత్య.. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని లేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.⇒టీడీపీ అరాచకాలు భరించలేక 2700 కుటుంబాలు ఊళ్లు విడిచివెళ్లాయని లేఖలో వైఎస్‌ జగన్‌ తెలిపారు. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగా దారుణ హత్యాకాండకు పాల్పడ్డారని.. ఈదురాగతాలను నివేదించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధానిని వైఎస్‌ జగన్‌ కోరారు.

Telangana Group 2 2024 Exam Postponed
తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్‌ వాయిదా

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నాం అధికారికంగా ప్రకటించింది.ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బోర్డు వెల్లడించింది.

Microsoft cloud services led to flight cancellations and delays globally
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఎర్రర్‌ మెసేజ్‌..

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ అనే మెసేజ్‌ వస్తోంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఇలా మెసేజ్‌ వచ్చిన వెంటనే సిస్టమ్‌ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్‌లు వైరల్‌ అవుతున్నాయి.భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ సేవలు, ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ సర్వర్లు డౌన్‌ అయినట్లు తెలిసింది. హాంకాంగ్‌ ఎయిర్‌పోర్ట్లో సిస్టమ్స్‌ పనిచేయకపోవడంతో మ్యానువల్‌ చెకింగ్‌ చేస్తున్నారు.హైదరాబాద్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. ‘మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి’ అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.డెన్వర్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్‌లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్‌లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది.ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లుఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ‘మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్‌గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం’ అని వివరణ ఇచ్చింది.VIDEO | Passengers stranded at Goa airport following a technical glitch with the check-in system. Further details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/XAYjtLRlpJ— Press Trust of India (@PTI_News) July 19, 2024pic.twitter.com/SI8mcURA1H— IndiGo (@IndiGo6E) July 19, 2024@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD— Sameen (@MarketWizarddd) July 19, 2024

YSRCP MP Mithun Reddy Key Comments Over Punganuru TDP Attacks
AP: నిన్న దాడి.. ఇవాళ సెక్యూరిటీ తగ్గించారు

సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి. అలాగే, పోలీసుల సమక్షంలో నిన్న తమపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్పుకొచ్చారు.కాగా, రాజంపేటలో ఎంపీ మిథున్‌ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఎపిసోడ్‌ అంతా జరిగింది. మళ్లీ అదే పోలీసులు మాపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. నిన్న నాపై దాడి జరిగింది. ఈరోజు నా భద్రతను తగ్గించారు.ఈరోజు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు అధైర్యపడవద్దు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. విద్యార్థి దశ నుంచే మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదిసార్లు ఎన్నికలు చూశారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

KSR Comments On Chandrababu Naidu Political Strategies
ఇది చంద్రబాబుకు బాగా పాత అలవాటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను పిచ్చిపత్రాలుగా, వ్యర్ధ పత్రాలుగా మార్చేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయినదానికి, కానిదానికి శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా వాటి విలువను ఆయనే పొగొట్టారనిపిస్తుంది. ఏవైనా ప్రధాన అంశాలపై వైట్ పేపర్స్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. అంతే తప్ప-ప్రతి చిల్లర విషయానికి ఉన్నవి, లేనివి కలిపి కాకి లెక్కలతో పత్రాలు ఇస్తే అది వృధా ప్రయాసే అవుతుంది. వాటి సీరియస్ నెస్ కూడా పోతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్దంకాక, ఎలా ప్రజలను మభ్య పెట్టాలా అన్నదానిపై ఎడతెగని ఆలోచనలు చేస్తున్న నేపద్యంలో ఈ శ్వేతపత్రాలను ముందుకు తీసుకు వచ్చారనిపిస్తుంది. చంద్రబాబుకు ఇది బాగా పాత అలవాటు.1994లో ఈయన ఎన్‌టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. అప్పుడు కూడా రెవెన్యూ, ఫైనాన్స్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఇచ్చారు. తదుపరి ఎన్‌టీఆర్‌ను పడదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల వాగ్దానాలను ఎగవేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తంతును సాగించారు. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తివేశారు. రేషన్ బియ్యం రేటు పెంచారు. 2004 ఎన్నికలకు ముందు కూడా వాస్తవ పత్రాలు అంటూ ప్రభుత్వ ప్రచార పత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ది చేసింది చెప్పడానికి ఆయన ఆ పత్రాలు ఇచ్చారు. కాని జనం వాటిని నమ్మలేదు.. టీడీపీని ఓడించారు.2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే పత్రాల కార్యక్రమం నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో కూడా అభివృద్ది నివేదికలు అంటూ హడావుడి చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక యధాప్రకారం ఈ డ్రామా నడుపుతున్నారు. ఇవి అర్ధవంతంగా ఉంటే తప్పుకాదు. కాని అర్ధం, పర్ధం లేకుండా తెలుగుదేశం పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో వచ్చిన పచ్చి అబద్దాలను, తాను ఎన్నికల ముందు చేసిన విమర్శలను శ్వేతపత్రాలలో భాగం చేయడం ద్వారా ఆ పత్రాలకు అసలు ప్రాధాన్యత లేకుండా చేసుకున్నారు. సహజ వనరుల దోపిడీ పేరుతో ఇచ్చిన శ్వేతపత్రం సరిగ్గా అలాగే ఉంది.అసలు ఇలాంటి పత్రాన్ని ఇచ్చారంటేనే ఈ ప్రభుత్వం ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ఇసుక, మైనింగ్‌లో రూ.19,137 కోట్ల దోపిడీ జరిగిందని కాకి లెక్క చెప్పారు. అంకెల విషయంలో చంద్రబాబు స్టైలే వేరు. ఆయన ఆ రోజుల్లో విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేయించినా, లేదా ఎదుటివారిపై విమర్శలు చేసినా, జనమే ఆశ్చర్యపోయేలా లెక్కలు చెబుతుంటారు. అవి అబద్దాలు అని తెలిసినా, ఆయన మొహమాటపడరు. ఒకే అంకెను, పదే-పదే ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది ఆయన ధీరి. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలం అయ్యారు కూడా. తన హయాంలో ఇసుక చితం అంటూ గోల్ మాల్ జరిగినా అది గొప్ప విషయంగా చెబుతారు. 2014టరమ్‌లో టీడీపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా ప్రజలనుంచి డబ్బు వసూలు చేసి ఇసుక సరఫరా చేసేవారు. ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు కాకుండా, టీడీపీ వారి జేబులలోకి వెళ్లేది.జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుకకు ఒక విధానం తెచ్చి నిర్దిష్ట రేటు పెట్టి జనానికి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ ఐదేళ్లలో నాలుగువేల కోట్లకు పైగా ఆదాయం తీసుకు వచ్చారు. అదేమో తప్పట. 2014టరమ్‌లో చంద్రబాబు టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ఇసుకను దోపిడీ చేశారో పూర్తిస్థాయిలో కాకపోయినా, కొన్ని విషయాలను వారి పత్రిక ఈనాడు లోనే వార్త వచ్చింది. ఆ సంగతి ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇసుక కాంట్రాక్టు సంస్థలు వంద కోట్ల జీఎస్టీ ఎగవేశాయని ఆయన అంటున్నారు. దానిపై చర్య తీసుకోవచ్చు. తవ్వకాలలో అక్రమాలు జరిగాయని అన్నారు. గత టరమ్‌లో చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో కృష్ణానదిలో జరిగిన ఇసుక దోపిడీపై ఎన్.జి.టి స్పందించి వంద కోట్ల జరిమానా విధించిన విషయం గురించి ఎందుకు చెప్పలేదు.అటవీ, మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఉన్నారట. అంటే చంద్రబాబు లక్ష్యం ఏమిటో అర్ధం అవుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు ఏదో వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తూనే ఉంది. అటవీ,మైనింగ్ రెండు శాఖలు ఒకే మంత్రికి ఇవ్వడం తప్పు అయితే,1994 లో ఈయనకు రెవెన్యూ, ఆర్దిక శాఖలను ఎన్‌టీఆర్‌ఎందుకు ఇచ్చారు?ఈ రెండు శాఖలను గత ఐదు దశాబ్దాలలో ఏ ప్రభుత్వంలోను ఒకరికే ఇవ్వలేదు. అల్లుడు కాబట్టే చంద్రబాబుకు ఎన్.టి.ఆర్ ఆ శాఖలు కేటాయించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.గ్రానైట్‌ లీజ్ లపై పలు ఆరోపణలు చేశారు. 155 గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ తనిఖీలు జరిపించి, అందులో 23 మందికే రూ.614కోట్ల జరిమానాలు వేశారని అంటున్నారు. వారు తప్పులు చేయకుండానే ఫైన్‌లు వేశారా? అన్నది కదా చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను గ్రానైట్ లీజుల విషయంలో ఎలా బెదిరించి టీడీపీలోకి తీసుకు వచ్చారో అందరికి తెలుసు. సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాయి లీజును పునరుద్దించడం కూడా తప్పేనట.మైనింగ్ శాఖ ఆదాయం తన హయాంలో రూ.966కోట్లు నుంచి రూ.2643కోట్లకు పెరిగితే, జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏడాదికి రూ.3425కోట్లకే చేరుకుందని అంటున్నారు. ఒకవైపు తప్పు చేసిన కంపెనీలకు జరిమానాలు విధిస్తే ఆక్షేపిస్తారు. ఇంకోవైపు మైనింగ్ శాఖ ఆదాయం ఇంకా పెరగాల్సిందని చెబుతారు. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా గనుల శాఖ ఆదాయం పెరిగిందని మాత్రం ఒప్పుకోరు. ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం పదివేల కోట్లు పెరిగితే చంద్రబాబు మాత్రం 19వేల కోట్ల దోపిడీ అని చెబుతున్నారు. అదెలాగో మాత్రం స్పష్టంగా చెప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. జగన్ ప్రభుత్వం 83లక్షల టన్నుల ఇసుకను పోగుచేసి నిల్వచేస్తే అందులో సుమారు నలభై లక్షల టన్నుల మేర కూటమి ప్రభుత్వం రాగానే, టీడీపీ, జనసేన నేతలు దోపిడీకి పాల్పడ్డారన్నది అభియోగం. దానిపై కూడా శ్వేతపత్రం ఇవ్వవచ్చు కదా! చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వపరంగా విచారణ జరిపించి చర్య తీసుకుంటే ఎవరు కాదంటారు. అలాకాకుండా ఈ రకంగా అవాస్తవాలతో పత్రాలు ఇస్తే ఎవరికి లాభం. కేవలం జగన్‌ను బదనాం చేయాలని, ఎలాగైన పెద్దిరెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ పత్రాల దందా నడుపుతున్నారని అనుకోవాలి.ఇక కబ్జాల పర్వం గురించి పలు ఆరోపణలు చేశారు. వీటిలో మెజార్టీ టీడీపీ పత్రికలలో వచ్చిన పచ్చి అబద్దాలే. ఉదాహరణకు శారదా పీఠానికి లీజుపై ఇచ్చిన భూములను అదేదో తక్కువ ధరకు అమ్మినట్లు చంద్రబాబు చెబుతున్నారు. పోనీ ఇలాంటివి చంద్రబాబు ఎప్పుడు చేయలేదా అంటే అదేమీ లేదు. 2004ఎన్నికలకు ముందు ఐఎమ్జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతంలో 450ఎకరాల భూమిని ఉత్తపుణ్యానికి కట్టబెట్టారన్న ఆరోపణ ఉంది. దానిపై ఇప్పటికీ కోర్టులో విచారణ జరుగుతోంది. వైఎస్ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంది. అష్టావధానం చేసే ఒక ప్రముఖుడికి కూడా హైటెక్స్ వద్ద అత్యంత విలువైన భూమిని ఎవరి సిఫారస్ తో ఇచ్చారో అప్పట్లో ప్రచారం జరిగింది.అదెందుకు చంద్రబాబు కుటుంబానికి చెందినవారు కోరితేనే కదా గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ సంస్థకు భూములు ఇచ్చారు. అవన్ని కూడా తప్పులు అవుతాయా? లేదా? అన్నది చెప్పాలి. నిజానికి చంద్రబాబు ఇవ్వవలసిన వివరాలు ఏమిటంటే జగన్ ప్రభుత్వ హయాంలో నిజంగా ఆక్రమణలు జరిగితే ప్రకటించవచ్చు. తదనంతర చర్యలు తీసుకోవచ్చు. దానికి ఈ పత్రాల గోల అక్కర్లేదు. అదే టైమ్‌లో జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో టీడీపీ నేతల అక్రమ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర కబ్జాదారుల భూ ఆక్రమణలను తొలగించి ఐదువేల కోట్ల విలువన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అవి కరెక్టా? కాదా? అన్నది వివరించాలి కదా! విశాఖలో టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్శిటీ ఆక్రమించిన నలభై ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ విషయాన్ని పత్రంలో ఎందుకు చెప్పలేదు. ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?అలాగే టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆక్రమించారన్న అభియోగంపై కొన్ని భూములను వెనక్కి తీసుకున్నారు. అది నిజమైనదా? కాదా? అన్నది చెప్పి ఉంటే జనానికి విషయం తెలిసేది. 2014 టరమ్‌లో తానే సీఎంగా విశాఖలో భూ అక్రమాలపై సిట్ వేశారు. ఆ సందర్భంలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఒక మంత్రితో సహా కొందరు టీడీపీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తూ సిట్ కు వివరాలు ఇచ్చారు. వాటిని ఇప్పుడైనా చంద్రబాబు బయటపెట్టవచ్చు కదా! అలా చేయకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. అస్సైన్డ్ భూములకు సంబందించి జగన్ ప్రభుత్వం చట్టం తెచ్చి వారికి విక్రయ హక్కులు కల్పిస్తే అదేదో నేరమన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అది చట్ట విరుద్దం అని భావిస్తే ఆయన ఆ చట్టాన్ని రద్దు చేసి ఎస్సి, ఎస్టిలకు జగన్ ఇచ్చిన సదుపాయాన్ని తొలగించవచ్చు.ఆ పని ఆయన చేయగలరా? అమరావతి ప్రాంతంలో సుమారు నాలుగువేల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ నేతలు, ఇతరులు చౌకగా కొనుగోలు చేసి, తదుపరి వాటిని రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణ వచ్చింది. అమరావతిలో టీడీపీ హయాంలో పలు భూ స్కామ్‌లు జరిగాయని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోపించింది. వీటిపై గత ప్రభుత్వం పలు ఆధారాలతో కేసులు పెట్టింది. అవి అన్యాయమైనవా?లేక నిజమైనవో ఎందుకు చంద్రబాబు చెప్పలేదో తెలియదు. ఇలాంటివి కాకుండా ఊరికే పనికిరాని అంశాలతో ఎన్నికల ముందు చేసిన ఆరోపణలనే శ్వేతపత్రాలలో పేర్కొంటే వీటి లక్ష్యమే నీరుకారిపోయినట్లు అవుతుంది కదా! విధానపరమైన కీలక అంశాలలో ఇవ్వవలసిన ఈ వైట్ పేపర్లను ఒక హాస్యాస్పద వ్యర్ద ప్రక్రియగా మార్చడం వల్ల జరిగే ప్రయోజనం శూన్యం అని చెప్పకతప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

IND VS SL: Virat Kohli 152 Runs Away From 14000 ODI Runs And 116 Runs Away From 27000 International Runs
లంకతో సిరీస్‌.. రెండు భారీ రికార్డులపై కన్నేసిన విరాట్‌ కోహ్లి

త్వరలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌లో రెండు భారీ రికార్డులపై కన్నేశాడు బ్యాటింగ్‌ లెజెండ్‌ విరాట్‌ కోహ్లి. ఈ సిరీస్‌లో విరాట్‌ మరో 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27000 పరుగులు (మూడు ఫార్మాట్లలో).. మరో 116 పరుగులు చేస్తే వన్డేల్లో 14000 పరుగుల అరుదైన మైలురాళ్లను తాకుతాడు. ప్రస్తుతం విరాట్‌ 652 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 26884 పరుగులు.. 292 వన్డేల్లో 13848 పరుగులు చేసి ఈ తరం క్రికెటర్లలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (34357), కుమార సంగక్కర (28016), రికీ పాంటింగ్‌ (27483) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో సచిన్‌ (18426), సంగక్కర (14234) మాత్రమే కోహ్లి కంటే ఎక్కువ పరుగులు చేశారు. రెండు విభాగాల్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒక్కరు కూడా కోహ్లి దరిదాపుల్లో లేరు. విరాట్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో (ప్రస్తుత తరం క్రికెటర్లలో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్‌ ఉన్నాడు. రూట్‌ 344 మ్యాచ్‌ల్లో 19219 పరుగులు చేశాడు. వన్డేల్లో విరాట్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత తరం ఆటగాడిగా రోహిత్‌ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌.. 262 వన్డేల్లో 10709 పరుగులు చేశాడు.కాగా, శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. కోహ్లి, రోహిత్‌ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో టీ20 జట్టులో లేరు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది. లంకలో పర్యటించే భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్‌.. టీ20 టీమ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.

Chandrababu Government Negligence Over YS Jagan Security
వైఎస్‌ జగన్‌ భద్రతపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్‌ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది.రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైఎస్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.మరోవైపు, వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను కవర్‌చేస్తున్న జర్నలిస్టులకు కూడా పోలీసులు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాన్వాయ్‌లో జర్నలిస్టుల వాహనాలను నిలిపేశారు. పోలీసులు తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు పడుతున్నారు.

Actress Bhamaa Cryptic Post On Marriage
కట్నం ఇచ్చి మరీ పెళ్లి.. అతడు డబ్బు తీసుకుని వెళ్లిపోతే?: హీరోయిన్‌

ఈ రోజుల్లో వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. పెళ్లి ఆల్బమ్‌ వచ్చేలోపే విడాకులంటున్నారు. దశాబ్దాలు కలిసున్న జంటలు సైతం విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్‌ భామ కూడా విడాకులు తీసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. భర్తతో కలిసున్న ఫోటోలు డిలీట్‌ చేయడం, తాను సింగిల్‌ మదర్‌నని ప్రకటించడంతో విడాకులు నిజమేనని అంతా ఫిక్సయ్యారు.కట్నం ఇచ్చి మరీ పెళ్లితాజాగా ఈ నటి పెళ్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. అమ్మాయిలు పెళ్లెందుకు చేసుకోవాలి? తన దగ్గరున్న డబ్బు కట్నంగా ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలా? అవసరమే లేదు. పెళ్లయ్యాక ఆ భర్త మనల్ని వదిలేస్తే? మన డబ్బుతో వాళ్లు సుఖంగా బతుకుతారు. కానీ మనం మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తాం. అసలు మన జీవితంలోకి వచ్చేవాళ్లతో మనం ఎలా మసులుకోవాలనేది తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.పెళ్లితో సినిమాలకు దూరంకాగా భామ, అర్జున్‌ 2020 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత భామ సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి గౌరి అనే కూతురు పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భామ తన కూతురే ప్రపంచంగా బతుకుతోంది. నివేద్యం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన భామ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. తెలుగులో మంచివాడు అనే ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.చదవండి: Nawazuddin Siddiqui: సౌత్‌ సినిమాలు అందుకే చేస్తున్నా..

Radhika Merchant's Shubh Aashirwad Lehenga Hand Painted By Jayasri Burman
అనంత్‌ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్‌ లెహెంగా పైనే

ఫ్యాషన్, ఫైన్‌ ఆర్ట్‌ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్‌ లెహంగా డ్రెస్‌ ఇది. అనంత్‌ అంబానీతో రాధికా మర్చంట్‌ వివాహం కోసం ఆర్టిస్ట్‌ జయశ్రీ బర్మన్‌ డిజైనర్‌ ద్వయం అబు జానీ సందీప్‌ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్‌ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్‌ చేయడానికి వెచ్చించింది.‘అనంత్‌–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్‌ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ,ప్యారిస్‌ లో ప్రింట్‌ మేకింగ్‌ కోర్సు చేసిన బర్మన్‌ తన పెయింటింగ్‌ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
title
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్‌ను ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?

బడ్జెట్‌ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?..

title
పూజా ఖేడ్కర్‌కు యూపీఎస్సీ షాక్‌..ఐఏఎస్‌ పోస్టింగ్‌ రద్దు!

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది.

title
ఢిల్లీకి రూ. పది వేల కోట్లు కేటాయించాలి.. ఆప్‌ మంత్రి డిమాండ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జె

title
బిల్కిస్‌ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గోద్రాలో 2002 జరిగిన అల్లర్ల సమయంలో

title
కన్వర్‌ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..

లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లన

International View all
NRI View all
title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all