trust
-
Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం
చదువుతోనే సమాజ వికాసం జరుగుతుందన్న విశ్వాసం ఆయనది.. అందుకే ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అతడి ఆకాంక్ష.. విద్యకు డబ్బు సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్పుల పేరిట తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ వారు చదువు కొనసాగించేలా దోహదపడుతున్నారు. ఆయనే మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మణిదీప్. బేగంపేట కుందన్బాగ్కు చెందిన మణిదీప్ విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. – సనత్నగర్మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ను 2018లో ప్రారంభించిన మణిదీప్ సేవలను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతగా నిలవాలని తలంపుతో మహా యజ్ఞాన్ని ఆరంభించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 180 మందికి వారి ఆర్థిక స్థోమతను బట్టి సహకారం అందించి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క ఏడాదే 50 మందికి స్కాలర్షిప్పులను అందజేశారు. అలాగే చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గురుకుల్ ట్రస్ట్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వైశ్య వికాస వేదిక వారు 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో టాప్గా నిలిచిన వారికి ల్యాప్ట్యాప్లను అందజేశారు. చదవండి : బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ఆయన 30 ల్యాప్ట్యాప్లను అందజేశారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు అందించేందుకు ముందుకువచ్చారు. నిరుపేదలకు మెడిసిన్తో పాటు న్యూట్రిషన్, విటమిన్ ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యపరంగానూ సేవలుఅందిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ తరఫున ఎన్నో సేవలు అందించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వినర్గా కూడా మణిదీప్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాల నిర్వహణ చేపట్టడంతో పాటు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలబడుతున్నారు. మణిదీప్ సేవలను గుర్తించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించారు. ఇదీ చదవండి: ‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియోల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం సమాజం మనకు ఏమి ఇచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యం. చదువే అన్నింటికీ సమాధానం. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువును ఎవరూ ఆపకూడదు. అందుకోసం మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అవసరమైన వారికి ల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం. రాజ్భవన్ వేదికగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాం. ఇండియన్ రెడ్క్రాస్సొసైటీ తరఫున సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. – మణిదీప్, మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ -
నమ్మకమే పునాది.. కోల్పోతే కష్టమే!
సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు. అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్లైన్కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.సంధ్య మామూలుగానే రిజర్వ్డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య. ఆ సమయంలోనే రాజీవ్ టీమ్లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్కి పూర్తిచేయాలని లేట్ అవర్స్లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి. రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది. ఆ తర్వాత రాజీవ్తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు. అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.» ఎమోషనల్ ఓపెన్నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.» అవసరమైతే సైకాలజిస్ట్ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి. -
అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు
అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు, దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అయోధ్యలో మూడు కీలక మార్పులు
అయోధ్యలో కొలువైన బాలక్ రాముని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు భక్తుల సౌలభ్యం కోసం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపతాయని ట్రస్టు భావిస్తోంది.ఇకపై ఆయోధ్య రామాలయానికి వచ్చే ప్రముఖులకు, సెలబ్రిటీస్కు చందనం రాయడం లేదా తిలకం పెట్టడం లాంటివి చేయరు. చరణామృతం(తీర్థం) ఎవరికీ ఇవ్వరు. అలాగే అక్కడి పూజారులకు దక్షిణ ఇవ్వకూడదు. దానిని విరాళం రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది.రామాలయంలో భక్తులందరినీ సమానంగా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్న దరిమిలా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి గంధం పూస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. చరణామృతం అందజేస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసింది. ఇకపై రామాలయానికి వచ్చే ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించరు. రామభక్తులందరినీ సమానంగానే పరిగణించనున్నారు. -
అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!
మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్నాథ్లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్లైన్లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్షాప్ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్షాప్కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్లోని పిల్లల కోసం షెల్ఫ్ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
ఫేస్బుక్ యాడ్స్లో ఫేక్ లోన్యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్యాప్లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్కార్డు, పాన్కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
భావోద్వేగాలతో నిండిన రోజు ఇది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇవాళ(బుధవారం) రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తనను కలిసి ఆహ్వానం అందించారని సంతోషం వ్యక్తం చేశారాయన. ఈ మేరకు ఎక్స్లో భావోద్వేగంగా ఆయన ట్వీట్ చేశారు. సియా రామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం అని ఎక్స్లో పోస్ట్ చేశారాయన. जय सियाराम! आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023 జనవరి 22వ తేదీన ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగర రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందించే యోచనలో ఉంది ట్రస్ట్. 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాతే కేంద్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేయించి మందిర నిర్మాణం ప్రారంభించింది. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబయి: అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తేవడం మహారాష్ట్ర రాజకీయంలో పెను సంచలన మార్పు. ఈ కీలక పరిణామంలో రాజకీయ ఉద్దండుడిగా పేరుగాంచిన శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ తన మేథోసంపత్తితో పార్టీ పునర్నిర్మాణం దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో నాసిక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అజిత్ పవార్ను ఉద్దేశించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవ్వరినీ నమ్మకూడదని అన్నారు. కొందరిని గుడ్డిగా నమ్మి తప్పు చేశానని శరద్ పవార్ అన్నారు. మళ్లీ అలాంటి తప్పులను పునరావృతం చేయబోనని చెప్పారు. 83 ఏళ్లు వచ్చాయని రిటైర్మెంట్పై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ తిప్పికొట్టారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన వయస్సు ఏంటో తెలుసా? అని సభా వేదికగా ప్రశ్నించారు. (నా టైర్డ్ హు.. నా రిటైర్డ్ హు..) అలసిపోను.. రిటైర్మెంట్ తీసుకోను అనే వాజ్పేయీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత కొడుకును కానందునే తనను ఎన్సీపీలో పక్కకుపెట్టారని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. కుటుంబ విషయాలు బయట మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ క్రమంలో పార్టీని పునర్నిర్మించడానికి రాష్టవ్యాప్త పర్యటనకు శరద్ పవార్ తెరతీశారు. తిరుగుబావుటా ఎగురవేసిన తన సన్నిహితుడైన ఛగన్ బుజ్భల్ నియోజకవర్గమైన నాసిక్ జిల్లా యోలా నుంచి శరద్ పవార్ ర్యాలీ ప్రారంభించడం గమనార్హం. ఇదీ చదవండి: ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్ -
క్యూబ్ హైవేస్ ట్రస్ట్కు రూ. 1,030 కోట్ల నిధులు!
న్యూఢిల్లీ: క్యూబ్ హైవేస్ ట్రస్ట్ (క్యూబ్ ఇన్విట్) తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి. -
‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. ఈ ట్రస్టుకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటవుతుందన్నారు. ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టిక్కెట్కు వేర్వేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాదిమంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం అవాస్తవం శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీవిరజానందస్వామి, హైదరాబాద్కు చెందిన శ్రీహనుమత్పీఠం పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాదస్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు.. ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి.. వడ్డీ ఎంత వచ్చింది.. తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్లు పక్కాగా ఉన్నాయి హైదరాబాద్కు చెందిన సోలిస్ ఐకేర్ ఎండీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీధర్రావు, మురళి, దీపక్రెడ్డి, శ్రీనివాస్, సుబ్బన్న, సురేష్, కుమారస్వామి, టీటీడీ వీజీవో బాలిరెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దు సనాతన హిందూధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు మీడియా సమావేశంలో ప్రశంసించారు. విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దని కోరారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం.. ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మికసంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్కపైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. -
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
బోడుప్పల్ లో రూ.10 కోట్ల కుచ్చుటోపి
-
ఆమె చూపిన బడిబాట
తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్ఎన్ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది. ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే... అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో... ‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది. మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది. మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను. అన్నింటా రాణిస్తున్నారు! అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది. ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం. స్నేహితులు వచ్చారు! మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్కే. డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్గా హాస్పిటల్కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్కు రెగ్యులర్గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల వయసు నుంచి పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్ ఇండియన్ నైటింగల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడిన ఈ ఇండియన్ నైటింగల్ తన గొంతుతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా చివరి వరకు స్టార్ గాయనిగా వెలుగువెలిగిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది. మరి ఆమె మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది సస్పెన్స్లో ఉండిపోయాయి. మరి దీనిపై ఆమె లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది. -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
వెలుగులోకి ధూళిపాళ్ల ట్రస్ట్ అక్రమాలు
-
ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయశాఖ నోటీసులు
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్రకు శుక్రవారం దేవాదాయశాఖ నోటీసులు అందించింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ స్మారక ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయనకు ట్రస్ట్ వార్షిక ఆదాయ వివరాలు అందించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2018 నుంచి జమా ఖర్చుల వివరాలను అందించాలని నోటీసులో పేర్కొంది. -
కొండకోనల్లో ప్రవాసిని వైద్యం
పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది. గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్ యానిమేటర్గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది. కష్టం తీరింది.. ‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్ సుస్మిత వివరిస్తారు. ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్ -
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.ఎస్.జయరాఘవేంద్ర ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు డి.పి.అనంత తిరుమలలోని బంగళాలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. చదవండి: జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత -
కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం
దిల్సుఖ్నగర్: సేవయే తమ ధ్యేయమని ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలో నివాసం ఉండే తమ్మనాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమ్మన శ్రీధర్, లక్ష్మి సుజాతలు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో కరోనా వచ్చిందని తెలిస్తే రోగుల బంధువుల కూడా దగ్గరికి రావడం లేదు. అలాంటిది కరోనా బాధితుల బాధను చూసి వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కూడా ఉచితంగా అందిస్తున్నారు. తమ్మనాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజనం లేక ఇబ్బంది పడే వారికి లక్ష్మీ సుజాతే స్వయంగా వంట చేసి ఆహారం అందజేస్తున్నారు. ప్రసుత్తం ఆర్కేపురం వాసవి కాలనీలో 35 మంది బాధితులకు ఉచితంగా రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు తమకు సెల్ 9441128021లో ఫోన్ చేసి వివరాలు తెలిపితే ఇంటికే భోజనం పంపిస్తామని పేర్కొన్నారు. ( చదవండి: మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..! ) -
‘దేవుడు చనిపోయాడు.. ఇక ఆ భూమి మాదే’
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని లక్నోలో ఉన్న ఓ ఆలయం, అది ఉన్న భూమిని ‘‘దేవుడి’’ పేరిట రిజిస్టర్ చేసిన ట్రస్ట్కు చెందుతుందని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలయం, భూమి హక్కుదారైన ‘‘దేవుడు’’ మరణించాడని చెప్పి.. వాటిని ఆక్రమించారు కొందరు వ్యక్తులు. అసలు హక్కుదారు ఫిర్యాదు చేయడంతో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. లక్నో మోహన్లాల్గంజ్ ప్రాంతంలో కుష్మౌరా హలువాపూర్లో 100 ఏళ్ల నాటి ఆలయం ఒకటి ఉంది. దీని బాగోగులు చూడటం కోసం శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ఓ ట్రస్టును నమోదు చేశారు. సదరు ఆలయం, భూమి ట్రస్ట్కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గయా ప్రసాద్ అనే వ్యక్తి తాను శ్రీక్రిష్ణ-రామ తండ్రిని అంటూ వచ్చాడు. ఏకీకరణ ప్రక్రియలో భాగంగా 1987లో ‘‘దేవుడైన’’ శ్రీకృష్ణ-రామ మరణించాడని వెల్లడించి.. సదరు ట్రస్ట్ని గయా ప్రసాద్ పేరు మీదకు మార్చారు. ఈ క్రమంలో 1991లో గయా ప్రసాద్ మరణించాడు. దాంతో ఈ ట్రస్ట్ను అతడి సోదరులు రామ్నాథ్, హరిద్వార్ పేర్ల మీదకు మార్చారు. ఈ విషయం కాస్తా ఆలయ ఒరిజినల్ ట్రస్టీ సుశీల్ కుమార్ త్రిపాఠి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ఈ వ్యవహారం గురించి 2016 నాయిబ్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అలా ఈ ఫిర్యాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ క్రమంలో యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఈ ఫిర్యాదును ఎస్డీఎం ప్రఫుల్లా త్రిపాఠికి బదిలీ చేశారు. ఇక దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 0.730 హెక్టార్ల ఆలయ భూమిని ఆక్రమించుకోవడం కోసం ఓ వ్యక్తి అసలు ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్డీఎం సదర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘నిజమైనా ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తి శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ట్రస్ట్ రిజిస్టర్ చేసి.. సదరు ఆలయం, భూమి ట్రస్ట్కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ‘‘దేవుడి’’ తండ్రిని అని చెప్పుకుని గయా ప్రసాద్ ట్రస్ట్ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆ తర్వాత అతడి సోదరులు దీన్ని ఆక్రమించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన భూమిని గ్రామసభ బంజరు భూమిగా ప్రకటించింది. ప్రసుతం ఈ ఫిర్యాదు ఎస్డీఎం కోర్టు విచారణలో ఉంది’’ అని తెలిపారు. చదవండి: యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ -
లారెన్స్ అనాథాశ్రమంలో 20 మందికి కరోనా
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేట్టు లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఈ వ్యాధి విజృంభణ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ అనాథాశ్రమంలో మరో 20 మందికి ఈ వ్యాధి సోకింది. నటుడు లారెన్స్ అనాథలు, దివ్యాంగుల కోసం స్థానిక అశోక్నగర్లో లారెన్స్ ట్రస్ట్ ద్వారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇద్దరికి కరోనా వ్యాధి సోకడంతో ఆరోగ్య శాఖ అధికారులు వారితో పాటు, లారెన్స్ అనాథాశ్రమంలోని అందరికీ కరోనా వరీక్షలు నిర్వహించారు. ఆ ఆశ్రమంలో ఉన్న 20 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని స్థానిక నుంగంబాక్కంలోని లయో లా కాలేజీలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. కరోనా వ్యాధి సీరియస్గా ఉన్న వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవ లు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: నటుడు సూర్యకు గాయాలు -
అమోధ్య ట్రస్ట్ ఏర్పాటు
-
ట్రస్ట్ ఏర్పాటుకు కేబినేట్ అమోదం తెలిపింది
-
దేవరకొండ ట్రస్టు వితరణ
సాక్షి,మేడ్చల్ జిల్లా: సినీనటుడు విజయ్ దేవరకొండ నిర్వహిస్తున్న దేవరకొండ ట్రస్ట్ ద్వారా ఏడు వేల డిక్షనరీలను కలెక్టర్ ఎంవీ రెడ్డికి ఆదివారం దేవరకొండ ఆనంద్ తన తల్లితో కలిసి అందజేశారు. వీటిని మేడ్చల్, శామీర్పేట్, కీసర మండలాలకు చెందిన విద్యార్థులకు పంపిణీ చేస్తారు. -
అదోలా ఉంటే అయిపోతారు!
వాషింగ్టన్ : ప్రతికూల భావోద్వేగాలు, ఎప్పుడూ అదోలా ఉండటం మనిషిని మరింత ఒత్తిడికి గురిచేస్తాయని, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే ప్రతికూల భావోద్వేగాలు ఎదుటి వ్యక్తి మీద నమ్మకాలను సన్నగిల్లేలా చేస్తాయని తాజా సర్వేలో తేలింది. ఇవి ఎదుటి వ్యక్తితో మనం మసలుకునే తీరును కూడా దెబ్బతీస్తాయని వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రేమంచిన వ్యక్తులతో చిన్న చర్చ కూడా గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ షాక్ టెక్నిక్ ద్వారా కొంతమంది మనషులపై ప్రయోగాలు చేశారు. షాక్ ద్వారా వ్యక్తులలో ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపించారు. ఆ క్షణంలో వారు ఎదుటి వ్యక్తిని ఎంత మేరకు నమ్ముతున్నారో పరిగణలోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ షాక్ ద్వారా వ్యక్తిలో ప్రేరేపించబడ్డ ప్రతికూల భావోద్వేగాలు కారణంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం సన్నగిల్లినట్లు తేల్చారు. ప్రతికూల భావోద్వేగాల ద్వారా మన ఎదుటి వారితో తత్సంబంధాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా మనం ఎదుటి వ్యక్తులను నమ్మటంపై ప్రభావం ఉంటుందని, మెదడులో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తనలను అంచనా వేయటం కుదరదని అంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అయితే మనతో సంబంధంలేని, సంఘటనల ఆధారంగా చోటు చేసుకునే ‘ఇన్సిడెంటల్’ భావోద్వేగాలకు వారు పరిశోధకులు అంతగా ప్రాధాన్యత నివ్వలేదు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
పేరుకు ట్రస్ట్.. టీడీపీ ట్విస్ట్
సాక్షి, ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): టీడీపీ పాలనలో ఒక నేత ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు దూరం చేశారు. దాని భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు కట్టబెట్టారు. అది ఆ ప్రాంత విద్యార్ధుల పాలిట శాపమైంది. ఇదంతా ఒక టీడీపీ నాయకుడి స్వార్ధ ప్రయోజనాల కారణంగానే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల మండలంలోని మద్దులగూడెం పంచాయతీ పరిధిలో గతంలో ఒక ఎంపీపీ పాఠశాల ఉండేది. ఆ ప్రాంత విద్యార్ధులు ఆ పాఠశాలలోనే చదువుకునేవారు. నాలుగేళ్ల క్రితం ఒక టీడీపీ నేత ఒత్తిడి కారణంగా సంబంధిత అధికారులు పాఠశాలను మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాల భవనంలో శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏడెనిమిది మంది విద్యార్థులను ఏలూరు ఆశ్రమం నుంచి తీసుకొచ్చి ఇందులో ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు కూడా అందులో లేరని, ట్రస్టుకు లెక్కలు చూపేందుకే ఈ ట్రిక్కులు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను మూసేయడం వల్ల మద్దులగూడెం పంచాయతీకి చెందిన విద్యార్థులు నిత్యం కిలోమీటరు దూరంలో ఉన్న సీహెచ్.పోతేపల్లిలోని పాఠశాలకు కాలినడకన వెళుతున్నారు. స్థానిక గోద్రెజ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి నిత్యం ట్రాక్టర్లు, లారీల ద్వారా ఈ మార్గం గుండానే పామాయిల్ లోడులు వెళుతుంటాయి. దీంతో ఏ సమయంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ట్రస్టుకు ఎలా ఇస్తారు? ప్రభుత్వ భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాలికల అనాథ ఆశ్రమం నడపాలనుకుంటే అందరికీ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి గానీ.. ఇలా మారుమూల గ్రామంలో ఏర్పాటు చేసి, ఎక్కడో ఉన్న విద్యార్థులను ఇక్కడ ఉంచడం హాస్యాస్పదమని గ్రామస్థులు అంటున్నారు. దీనిపై గ్రామానికి చెందిన పలువురు భవనం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని, తిరిగి పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రసాద్ వివరణ ఇస్తూ 2016 మార్చిలో ఈ పాఠశాల భవనాన్ని శ్రీ సత్యసాయి డిజిటల్ సాధికారిత శిక్షణకు కేటాయిస్తూ మండల పరిషత్ తీర్మానించిందన్నారు. అయితే ఆ భవనం వద్ద ప్రస్తుతం అనాథ ఆశ్రమం బోర్డు ఉందని చెప్పారు స్వలాభం కోసం పాఠశాల మూసేశారు స్వలాభం కోసం శ్రీ సత్యసాయి ట్రస్టు పేరుతో పాఠశాలను మూసేశారు. డిజిటల్ సాధికారిత శిక్షణ కోసమని పొందిన ఈ పాఠశాల భవనంలో బాలికల అనాథాశ్రమాన్ని ఎలా నడుపుతున్నారో తెలియడం లేదు. 35 మంది అనాథ బాలికలు ఉన్నట్లు లెక్కల్లో చూపి, భవనాన్ని పొందారు. కానీ ఇందులో మొన్నటి వరకు కేవలం ఏడెనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు భవనం గేట్లకు తాళాలు పడ్డాయి. యాచమనేని నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు, సీహెచ్.పోతేపల్లి చాలా ఇబ్బందిగా ఉంది మద్దులగూడెంలో ఎంపీపీ పాఠశాల మూతపడటం వల్ల మా పిల్లలను సీహెచ్.పోతేపల్లిలోని పాఠశాలకు పంపుతున్నాం. సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఆ పాఠశాలకు పిల్లలు నిత్యం నడిచి వెళుతున్నారు. ప్రభుత్వం కనికరించి, మూతపడ్డ పాఠశాలను మళ్లీ తెరిపించాలి. – చమటబోయిన రాంబాబు, మద్దులగూడెం, గ్రామస్థుడు ఆందోళనగా ఉంది మా పిల్లలను చదువు కోసం మద్దులగూడెం నుంచి సీహెచ్.పోతేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నాను. అయితే పామాయిల్ లోడు లారీలు, ట్రాక్టర్లు తిరిగే ఈ రహదారిలో పిల్లలు నడిచి వెళ్లడం భయాన్ని కలిగిస్తోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దులగూడెంలో మూతపడ్డ పాఠశాలను తెరవాలి. – ముసలి కల్యాణి, మద్దులగూడెం -
దేవుని సార్వభౌమత్వానికి తలవంచితేనే ఆశీర్వాదం
ప్రార్థన ఎలా చెయ్యాలి? దేవునితో విశ్వాసి చేసే ‘ప్రార్థన’ అనే సంభాషణ ఎలా సాగాలి? తన గురించైనా, మరి దేని గురైంచైనా సర్వజ్ఞుడైన దేవునికి, విశ్వాసి కొత్తగా ఏదైనా చెప్పవలసిన అవసరం ఉంటుందా? మరి మనం చెప్పవలసిందేమీ అవసరం లేకుండా ముందే అంతా ఎరిగిన దేవునితో ప్రార్థనలో మనమాయనకు ఏమి చెప్పాలి? విశ్వాసిలో బాహ్యం, ఆంతర్యం అనే రెండు ప్రధానాంశాలుంటాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు (2 కొరింథీ 4:16). ఈ రెండింటి మధ్యా అంతర్గతంగా నిరంతర సంఘర్షణ సాగుతూ ఉంటుంది. లోకం ప్రాతినిధ్యం వహించే మన బాహ్యానికి, దైవసంబంధమైన మన ఆంతర్యంలోని ఆత్మీయతకు ఎప్పుడూ ఘర్షణే!! అయితే ఎంత నలిగినా, బలహీనపడ్డా, చింతచచ్చినా పులుపుచావదన్నట్టు, మనిషిలోని ‘అహం’ మాత్రం ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. కాని ఈ అంతర్గత సంఘర్షణలో మనిషిదెప్పుడూ ఓటమే!! గెలవాలన్న ప్రయత్నమే తప్ప, గెలిచే అవకాశాలు మనిషికి ఏ మాత్రం లేని ఈ రంగంలోనే, దేవుని ప్రేమ మాత్రం అంతకంతకూ మరెక్కువగా విశ్వాసిలో పరిపూర్ణమౌతుందంటాడు అపొస్తలుడైన పౌలు. తన జీవితంలో ఒక ముల్లు ఉండేదంటాడాయన. ముండ్లు లేని జీవితాలసలుంటాయా? అయితే ఆ ముల్లును తొలగించమని తాను ముమ్మారు వేడినా దేవుడు దానిని తొలగించలేదు సరికదా, ‘నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుందని దేవుడు తనకు బదులిచ్చాడు’ అని పౌలు తన నిస్సహాయతను, ఓటమిని కొరింథీ చర్చికి వివరించుకున్నాడు (2కొరింథీ 12:1–9). అతిశయపడేందుకు పౌలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికీ లేని ఒక పరలోకానుభవం కూడా ఉంది. ఆయన పరలోకం దాకా వెళ్లి మానవుల వశంలో లేని ఎన్నో పారలౌకికానుభవాలకు గురయ్యాడు.. కానీ తిరిగొచ్చిన తర్వాత ఆ ‘అనుభవం’ గురించి ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పుకోలేదు. సరికదా అలా పరలోకానికి వెళ్ళింది తానే అని కూడా చెప్పుకోకుండా, అలా వెళ్లిన ఒక వ్యక్తి తనకు తెలుసునని మాత్రం పౌలు తన పత్రికలో వివరించడం పౌలు సాత్వికత్వానికీ, వినయానికి, తగ్గింపు స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ.. కానీ క్రీస్తు ప్రేమకు నన్ను అంతకంతకు దగ్గర చేసే నా బలహీనతలయందే నేను అతిశయిస్తాను తప్ప, అతిశయించేందుకు తన వద్ద మరేదీ లేదని అపొస్తలుడైన పౌలు అంత సవినయంగా ప్రకటించుకోవడం, పైపై మెరుగుల ప్రచారం తప్ప మరేదీ లేని క్రైస్తవానికి ప్రతినిధులైన నేటి తరం విశ్వాసులకు, పరిచారకులకు ఎన్నటికీ అర్థం కాదు. కొందరి ప్రార్థనల నిండా వాళ్ళ జీవితంలోని ముండ్ల ప్రస్తావనే ఉంటుంది. ముల్లు తీసెయ్యమని అడగడం తమ హక్కు, దాన్ని తీసివేయడం దేవుని బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు సాగుతుంటాయి. అయితే తన ముల్లు తీసెయ్యమంటూ తాను మూడుసార్లు అడిగినా దేవుడు అందుకు తిరస్కరించి, ఆ ముల్లు నిన్ను బలహీనుణ్ణి చెయ్యడంలోనే నా బలం నీలో పరిపూర్ణమవుతుందంటూ దేవుడు జవాబిచ్చాడని పౌలు రాసుకున్నాడు. మనం ఏదడిగితే అది ఇస్తూ మనల్ని సంతోషపర్చడానికే దేవుడున్నాడన్న పద్ధతిలో లోతులు లేక కేవలం పబ్బం గడుపుకునే బాపతు పద్ధతిలో సాగుతున్న ఈనాటి పరిచారకుల పసలేని ప్రసంగాల కారణంగా ‘దేవుని సార్వభౌమత్వం’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయాంశం విశ్వాసులకు అర్ధం కావడం లేదు. దేవుడు సార్వభౌమత్వం కలిగిన సర్వాధికారి తప్ప, మనమేది అడిగితే అది తెచ్చిచ్చే ‘అల్లాఉద్దీన్ అద్భుతదీపం’ కాదు. కూడా. మనమడిగింది ఆయన చేస్తాడు కాని దాన్ని చెయ్యకుండా ఉండే సార్వభౌమత్వం కూడా దేవుని సొంతం. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే, దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించడమే, దేవుని విధానాలను, దేవుని సమయాన్ని సంపూర్ణంగా ఎరగటమే!! దేవునిలో ఎదగడమంటే, ప్రాపంచికంగా మనం బలహీనపడటమేనన్న పౌలు మాటలు, దేవుని హృదయస్పందనకు సాదృశ్యాలు. ‘మన బాహ్యపురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడు దినదినం వినూత్నపర్చబడుతున్నాడు’ అంటాడు పౌలు. అలాంటి ఆత్మీయవృద్ధిని, దేవుని సార్వభౌమత్వాన్ని కాంక్షిద్దాం. -
భావానీ భక్తుల ట్రస్ట్కు కోటి రూపాయలు టోకరా
-
దుర్గా ట్రస్ట్కు కోటి రూపాయల టోకరా!
సాక్షి, విజయవాడ : భూమి అమ్మకం పేరిట ఓ వ్యక్తి దుర్గా ట్రస్ట్కు కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందని నమ్మ బలికి ట్రస్ట్ను మోసం చేసి కటకటాలపాలయ్యాడు. పలు కేసుల్లో నిందితుడైన కేసినేని రమేశ్ అలియాస్ నవీన్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు కాజేశాడు. ఈ పీఠానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు అందజేశారు. మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రమేష్ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని గుర్తించారు. గతంలో అతనిపై అనేక ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. -
10రూపాయలకే రెండు పూటలా భోజనం..
సాక్షి, హైదరాబాద్ : జబ్బు చేసి ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి ఒకలా ఉంటే... వారిని పరామర్శించడానికి వచ్చే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారి పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరోజులో చూసి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందే. పట్నంలో పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లు ఉంటాయి. అలాంటి వారి పట్ల ఆత్మీయ బంధువవుతుంది ‘సేవా భారతి ట్రస్ట్’. రోగులకు, వారితో పాటు వచ్చే బంధువులకు కూడా రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ఉండటానికి వసతి కల్పిస్తుంది ఈ ట్రస్ట్. ఇదంతా కూడా కేవలం ‘పది రూపాయలకే’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దూర ప్రాంతం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అలానే వారితో పాటు వచ్చే కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టి ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ విషయం గురించి ‘సేవా భారతి ట్రస్ట్’ సెక్రటరీ నర్సింహమూర్తి ‘మొదట మేము కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించే వాళ్లం. కానీ 2013లో గాంధీ ఆస్పత్రి సుపరిండెంట్ ‘రోగుల కోసం వచ్చే వారి కోసం వసతి కల్పించమ’ని కోరాడు. దాంతో మేము ఈ వసతి గృహాన్ని నిర్మించాము. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేము ఈ భవనాన్ని నిర్మించాం. దీన్ని నిర్మించిన కొత్తలో రోజుకు కేవలం పది మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఇక్కడ దాదాపు రెండు వందల మంది వరకూ బస చేస్తున్నారు. వారానికి దాదాపు 7 వేల మందికి బస కల్పిస్తున్నామని’ చెప్పారు. -
చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా..!
సాక్షి, చెన్నై: ‘పద్నాలుగేళ్లపుడు సినీరంగంలోకి వచ్చా... చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా’నని సీనియర్ సినీనటి వై విజయ చెప్పారు. నేడు నాలుగో తరంతో నటిస్తున్నా, నాటితో పోల్చుకుంటే నేటి నటీనటుల్లో క్రమశిక్షణ, అంకితభావం కరువైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నపురి ట్రస్ట్ మహిళా విభాగ్ నెలనెలా నిర్వహించే సెలబ్రెటీలతో ముచ్చట్లు కార్యక్రమంలో సోమవారం నటి వై.విజయ, దివంగత నటి రాజసులోచన కుమార్తె, కళాకారిణి దేవీ కృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు నటి వై విజయ తన జీవనగమనాన్ని వివరించారు. ఆమె మాటల్లోనే.. ఆరేళ్ల చిన్నారిగా ఒక సమావేశంలో పక్కన ప్రముఖ నటి రాజసులోచన కూర్చుని నన్ను దగ్గర తీసుకున్నారు. నన్ను నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తల్లిదండ్రులు చెన్నైకి మకాం మార్చారు. క్లాసికల్ కర్నాటక డ్యాన్స్ నేర్చుకున్నాను. 14 ఏళ్ల వయస్సులో 1953లో ఒక డాన్స్మాస్టారు నా ఫొటో అల్బం చూడడంతో సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. తొలి చిత్రమే శోభన్బాబు పక్కన హీరోయిన్. ఆ తరువాత ఎంజీఆర్, శివాజీ, ఎన్టీఆర్ వంటి మహామహులతో పనిచేశాను. ఠంచనుగా టైమ్కు రావాలి, సెట్లోకి వచ్చే ముందే స్క్రిప్ట్, సీన్ తెలుసుకోవాలి తదితర క్రమశిక్షణ సీనియర్ల నుంచే నేర్చుకున్నాను. తెలుగులో మంగమ్మగారి మనుమడు చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం నేను నాలుగో తరంతో నటిస్తున్నానంటే ఆనందగా ఉందని వై విజయ అన్నారు. దివంగత నటి రాజసులోచన కుమా ర్తె, ప్రముఖ నాట్యకళాకారిణి దేవీ కృష్ణ తన మాటల్లో అమ్మ అనుభవాలను పంచుకున్నారు. 1953లో విడుదలైన ‘కన్నతల్లి’ మా అమ్మకు తొలి చిత్రం. గొప్ప నటి, నర్తకి అయిన అమ్మ రాజసులోచన దక్షిణాది భాషలతో పాటూ మొత్తం ఐదుభాషల్లో 325 చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజసులోచన కూతురివా అంటూ ఆప్యాయంగా చూస్తుంటారు. అందుకే ఈ నాటికీ నలుగురులోకి వెళ్లినపుడల్లా అమ్మ గొప్పదనం ఆస్వాదిస్తుంటాను. అలాగే తండ్రి సీఎస్ రావు కూడా ప్రముఖ సినీ దర్శకులుగా పేరుగాంచారు. అమ్మానాన్నలు ఇద్దరూ సినీరంగంలో బీజీగా ఉండడాన్ని చూసినందునే నేను వారసురాలిగా రాలేదు. అయితే అమ్మ స్ఫూర్తితో నేను కూడా క్లాసికల్ కర్నాటక డ్యాన్స్ నేర్చుకున్నాను. అమ్మతో కలిసి అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. స్టేజిషోల్లో గాత్రదానం కూడా చేశాను. నాలుగేళ్ల క్రితమే ఆమె కన్నుమూశారు. ఈరోజు అమ్మ జ్ఞాపకాలతో తెలుగు మహిళలను కలుసుకోవడం ఆనందగా ఉందని అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, భిన్నకోణాల్లో తన నటనా పటిమను చాటుకుంటూ గత ఆరుదశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి వై.విజయను, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజసులోచన కుమార్తె దేవీ కృష్ణ హాజరుకావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినెల ఒక సెలబ్రెటీతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు ఈ ఇద్దరు కళాకారులు హాజరయ్యారని మహిళావిభాగ్ అధ్యక్షురాలు ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. నటుడు రాజ్కుమార్, విభాగ్ కోశాధికారి భారతి, మెహతా హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ యువరాజ్ గుప్త, చెన్నైపురి ట్రస్ట్ నగర అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు, వామ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ పొన్నూరు రంగనాయకులు పాల్గొన్నారు. -
జగన్ అన్న నమ్మకాన్ని వమ్ము చేయను
-
ఊరికి ఉపకారం
-
వ్యక్తిగత బేషజాలకు పోవద్దు
బాబా సూక్తులను ఆచరించండి శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం తెలుగు రాష్ట్రాల పదాధికారుల సమావేశం ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్ : వ్యక్తిగత బేషజాలకు పోయి సంస్థ లక్ష్యాన్ని దిగజార్చవద్దని, బాబా చెప్పిన ప్రేమ, సేవ మార్గాలతో ప్రతి పల్లెలోను శ్రీసత్యసాయి నామ స్మరణతో ఆధ్యాత్మిక సేవా, విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి కృషి చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎస్జీ చలం అన్నారు. బొమ్మూరులోని శ్రీసత్యసాయి గురుకులంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవాసంస్థల పదాధికారుల రెండురోజుల సమావేశానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీసత్యసాయి అవతార వైభవాన్ని, సమాజ సేవా కార్యక్రమాలను మరింత చైతన్యవంతంగా నిర్వహించడానికి 2025 సంవత్సరం బాబా శతజయంతి ఉత్సవం నాటికి కార్యచరణను రూపొందించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పుట్టపర్తి యాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, భజన మండళ్లు, సేవా సమితిలు పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యా, సేవ, ఆధ్యాత్మికం, యువత, వేదపఠనం విభాగాలను విభజించి బృంద చర్చగోష్టిలు నిర్వహించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మణరావు, సర్వోత్తముడు, వివిధ విభాగాల కోఆరి్డనేటర్లు డాక్టర్ కృష్ణకుమార్, ఎన్.ఉషారాణి, ఎంఎస్ ప్రకాశరావు, అడబాల వెంకటేశ్వరరావు, సిహెచ్.త్రిమూర్తులు, బులుసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యయన మండలి సభ్యుడు జంధ్యాల సుమన్బాబు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన సీతారాంబాబు, శ్రీసత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్సుందర్ తదితరులు హాజరయ్యారు. -
మనవడిని రంగంలోకి దించిన శాంసంగ్
నోట్7 ఫెయిల్యూర్తో టెక్ పరిశ్రమలోనే అత్యంత దుర్భలమైన పరిస్థితి ఎదుర్కొన్న శాంసంగ్, మేనేజ్మెంట్లో మార్పులు చేస్తూ కొత్త డైరెక్టర్ను ఎన్నుకుంది. గురువారం షేర్ హెల్డర్స్ ఓటింగ్ అనంతరం కుటుంబ సమ్మేళన శాంసంగ్ గ్రూప్ వాస్తవ చీఫ్ జే వై లీని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్గా ఎంపికచేశారు. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీలో ఇక ఆయన అత్యంత కీలకమైన బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. శాంసంగ్ వ్యవస్థాపకుడికి జేవై లీ మనవడు కాగ, చైర్మన్ లీ కున్-హికి ఈయన ఒకగానొక్క కొడుకు. ఇక ఇతను బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారని, ఇటీవల మార్కెట్లో నెలకొన్న బ్యాటరీ ముప్పుకు పరిష్కారం కనుగొన్న అనంతరం ఆయన కంపెనీ బాధ్యతలు చేపట్టనున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్ తెలిపారు. గెలాక్సీ నోట్7 బ్యాటరీ పేలుళ్ల ఘటన, శాంసంగ్కి మార్కెట్లో రాబడులపైనే కాక, క్రెడిబిలిటీపై కూడా తీవ్ర దెబ్బకొట్టింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ దిగ్గజంగా ఉన్న ఈ కంపెనీ మూడో క్వార్టర్లో మొబైల్ రాబడులు 96 శాతం క్షీణించాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. టెక్ పరిశ్రమలోనే అత్యంత దుర్భలమైన పరిస్థితి ఈ దిగ్గజం ఎదుర్కొంది. త్వరలోనే వినియోగదారుల నమ్మకాన్ని పునఃసంపాదించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. కంపెనీ ఫలితాల సందర్భంగా సియోల్లో నిర్వహించిన మీటింగ్లో మార్కెట్లో తమ వైఫల్యానికి క్షమాపణ చెబుతున్నామని, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి తాము శాయశక్తులా కృషిచేస్తామని కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేకే సిన్ తెలిపారు. నాలుగో క్వార్టర్లో తాము రాబడులను పెంచుకుంటామని, స్ట్రాంగ్ ఫర్ఫార్మెన్స్ను నమోదుచేస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. 2015 నాలుగో క్వార్టర్లో ఎలాంటి ఫలితాలనైతే ప్రకటించామో అదేమాదిరి వచ్చే నాలుగో త్రైమాసికంలోనే విడుదల చేస్తామని, ప్రస్తుతం కోల్పోయిన మొబైల్ వ్యాపారాలను పునఃరాబట్టుకుంటామని స్పష్టంచేసింది. -
9న జక్కంపూడి ప్రజావారధి ఆవిర్భావం
దానవాయిపేట(రాజమహేంద్రవరం) : సామాన్యుడి సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను వీఎల్ పురంలో ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ నరవ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అండగా వారి పక్షాన జక్కంపూడి ప్రజా వారధి పోరాటం సాగిస్తుందన్నారు. ఇందులో భాగంగానే వృద్ధుల కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అనంతరం జక్కంపూడి ప్రజా వారధి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. లంక సత్యనారాయణ, కొమ్ముల సాయి, ధర్మవరపు శ్రీనివాస్, ఎస్. కృష్ణమూర్తి, మురపాక వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 4.75 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు సోమవారం వేరువేరుగా రూ. 4.75 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా భీమవరంకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు తన అన్న, వదినలు శ్రీరామ్మూర్తి, నాగమణిల పేరున రూ. 3,75,000 లను అన్నదాన ట్రస్టులో జమచేశారు. అలాగే విజయవాడకు చెందిన దుద్దుకూరి వెంకట శాంతకుమార్ తన తల్లిదండ్రులు, కుమారుడి పేరున రూ. 1,00,002 లను విరాళంగా అందజేశారు. దాతలు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఈ విరాళాలను అన్నదాన ట్రస్టులో జమచేయగా దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఏఈవో కర్రా శ్రీనివాసరావులు బాండ్ పత్రాలను అందజేసి, అభినందించారు. -
నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
కాణిపాకం(ఐరాల): నిర్మాణ రంగంలో నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా భారతి సిమెంట్ నిలిచిందని మార్కెటింగ్ ఆఫీసర్ బాలకష్ణ తెలిపారు. ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శ్రీగణేష్ స్టీల్స్ పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో పట్టణంలోని కాంట్రాక్టర్లు, మేస్త్రీలు, బిల్డర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతి సిమెంట్ అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిందని తెలిపారు. మిగతా సిమెంట్లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమైన నాణ్యత అని రుజువైందన్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రోబోటిక్ క్వాలిటీ టాంపర్ ప్రూఫ్తో అత్యాధునికంగా తయారవుతున్న ఏకైక సిమెంట్ ఇదేనన్నారు. కేవలం వ్యాపార దక్పథంతో కాకుండా నిర్మాణ ర ంగ కార్మికుల సంక్షేమానికి కూడా భారతి సిమెంట్ యాజమాన్యం కషి చేస్తోందన్నారు. నిర్మాణ రంగంలో మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాపీమేస్త్రీలకు, కార్మికులకు సంస్థ అవగాహన కల్పిస్తుందన్నారు. తాపీ మేస్త్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా కల్పిస్తున్న ఘనత తమ సంస్థ దేనన్నారు. టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి భారతి సిమెంట్ ప్రత్యేకతలను స్లైడ్ షోలు, షార్ట్ వీడియోల ద్వారా కార్మికులకు వివరించారు. అనంతరం 75 మంది కార్మికులకు రూ.లక్ష బీమా పత్రాలను అందజేశారు. -
రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్
20 రోజుల్లోగా దరఖాస్తులకు ఆహ్వానం వేములవాడ: వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నెల 6న విడుదలైన జీవో 349 అనుసారం 20 రోజుల్లోగా ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్తోపాటు రాష్ట్రంలోని 34(6ఏ టెంపుల్స్) దేవాలయాల ఈవోలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం ప్రకటించకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు అధికారులను సంప్రదిస్తున్నారు. గతంలో డిగ్రీ అర్హత ఉండాలని ఒక నిబంధన విధించారని, ఆ నిబంధన మేరకు అర్హత అడుగుతారా? లేక ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆశావహులు ఆలోచనలో పడ్డారు. ట్రస్టుబోర్డు సభ్యుల సంఖ్య సైతం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రాజన్న ఆలయం, ధర్మపురి ఆలయాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్బాబు జర్మనీకి వెళ్లడంతో ఆయన రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం రావిశాస్త్రి
–తెలుగువారికి అపూర్వ అక్షరసంపద అందించిన రావి శాస్త్రి –30న రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ఆవిర్భావం –రామతీర్థకు అవార్డు బహూకరణ కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోవడం మనవల్లకాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపు పాఠకులకు నవ్వును, దుఃఖాన్ని, ఏకకాలంలో అనుభవంలోకి తీసుకురాగలిగిన రచయితల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలేనని చెప్పాలి. ఆధునిక వచన సాహిత్యంలో ఆయనదొక ఆచార్యపీఠం. అయనొక కులపతి. రెండుమూడు దశాబ్దాల యువ రచయితలపై ఆయన రచనలు, వ్యక్తిగత ప్రభావం పడింది. ఇకపై మన సాహిత్యవీధులవలె విశాఖపట్నం వీధులు కూడా ఆయన లేని లోటు పూడ్చడానికి ఉత్తరాంధ్ర సన్నద్ధమైంది. కొన్ని దశాబ్దాలలో రావిశాస్త్రి సాహిత్యసష్టి తక్కువేమీ కాదు. సారోకథలు, సారా కథలు, ఖాకీ కథల వంటి కొన్ని వందల కథలు, రాజు–మహిషి, రత్తాలు–రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి వంటి నవలలు, నిజం, విషాదం,తిరస్కృతి వంటి నాటకాలు, ఇంకా ఎన్నో ఇతర రచనలు ఆయన తెలుగు వారికిచ్చి పోయిన సాహిత్య వారసత్వం. –విశాఖకల్చరల్ కళింగాంధ్ర మాండలిక రచనా చక్రవర్తి రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు సాహిత్యంలో ఆయన ఉండేడువంటి పేరుప్రఖ్యాతలు అనన్యమైనవి. విశాఖలో పుట్టిపెరిగిన రావిశాస్త్రిగారి గురించి ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల దష్ట్యా రావిశాస్త్రి జ్ఞాపకాన్ని స్థిరస్థాయిగా ఉండేవిధంగా చేయాల్సిన బాధ్యత తెలుగు సాహితీ ప్రేమికులపై ఎంతైనా ఉంది. ముఖ్యంగా విశాఖ రచయితలకు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే రావిశాస్త్రి 95వ జయంతి రోజున (జూలై30న ) ఒక ప్రముఖ సాహితీవేత్తకు అవార్డు ఇవ్వాలనే సంకల్పం పుట్టింది. కొంతకాలం ఈ ఆలోచన నలుగుతున్నప్పటికీ రావిశాస్త్రి కుటుంబ సభ్యుడు (తమ్ముడు) రాచకొండ నరసింహ శర్మ, రావిశాస్త్రి కుమారుడు ఉమా కుమారశర్మ ముందుకు రావడంతో విశాఖలో ఉన్న సాహితీ ప్రముఖలంతా ‘రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్లో ఆచార్య చందు సుబ్బారావు, సాహితీ సురభి వ్యవస్థాపకుడు సాహితీవేత్త కల్యాణరామారావు, బహుభాషా సాహితీవేత్త, కేంద్ర సాహితి అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి, సాహితీవేత్త పి.జయశీలరావు, కవయిత్రి జగద్ధాత్రి తదితరులు సభ్యులు. సాహితీ మిత్రుల సహకారం చాలా గొప్పది విశాఖసాహిత్యమిత్రులతో కలసి నాన్నగారి ఆశయాన్ని ఆయన సాహిత్య గుళికల్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఏడాది భారత దేశంలో ఉన్న సాహిత్యసేవ చేసే సాహితీమిత్రులందరూ రావిశాస్త్రి అవార్డు పొందడానికి అర్హులే. రావిశాస్త్రి శతజయంతి మరో ఐదేళ్లలో రాబోతున్న ఈ తరుణంలో ఈ ట్రస్ట్ ఆవిర్భావం, అందుకు నగరానికి చెందిన సాహితీ మిత్రులు సహకరించడం ఈ ట్రస్టు ముందుకు కొనసాగుతుందని అభిలషిస్తున్నాను. –రాచకొండ ఉమా కుమార శాస్త్రి, ట్రస్ట్ నిర్వాహకులు అక్షర‘తీర్థం’..సముచిత సత్కారం నగరానికి చెందిన రామతీర్థ ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు,అనువాదకులు, ఆంధ్రాంగ్ల భాషల సాహితీవేత్త. సాహితీ సమావేశాల నిర్వాహకులు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రచయిత. ఆయనకు ‘రావిశాస్త్రి అవార్డు–2016’ ఇవ్వటం సముచితమని తెలుగు సాహిత్యలోకం ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది. –ఎల్.ఆర్.స్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సంతృప్తినిచ్చింది రావిశాస్త్రి 20 శతాబ్దాలు తెలుగు వచన సాహిత్యంలో మహా వటవక్షంలాంటివారు. ఇలాంటి చెట్ల కింద మొక్కలు మొలవని అంటారు కానీ..ప్రపంచ ధర్మంలో రావిశాస్త్రిగారి నీడలో తెలుగులో అనేకమంది కథకులు సమాజం గురించి,పేద బడుగు బలహీన జీవిత అవసరాల గురించి కళాత్మకంగా రాయడానికి ఎంతో స్ఫూర్తి పొందారు. అటువంటి రావిశాస్త్రి పేరిట ఒక ట్రస్ట్ ఏర్పడి, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తూ తమ తొలి ‘రావిశాస్త్రి అవార్డు–2016’ను నాకు ప్రకటించడం పట్ల నేను కూడా జీవిస్తున్న ఈ ఊరు, ఇక్కడి సాహిత్యలోకం నన్ను గుర్తించినందుకు ఒక సంతృప్తి ఉంది. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్యానికి వెలుగు దివిటీలుగా మన ప్రాంతం నుంచి గత శతాబ్దంలో విస్తారమైన కృషి చేసిన సాహిత్యవేత్తల ప్రతిష్ట, ప్రయోజనం, ఇంకా ప్రజాపక్షంగా విశాలమయ్యేలా ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తున్నాను. ట్రస్ట్కు కతజ్ఞతలు. –రామతీర్థ, ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు ఆధునిక సాహిత్యాన్ని భుజాన వేసుకుని విశాఖలో ఆధునిక సాహిత్యాన్ని భుజానవేసుకుని మోస్తున్న రచయితల్లో రామతీర్థ ఒకరు. సమాజ హితానికే సాహిత్యం ఉపయోపగపడాలనే దీక్షాపరుడు. సామాజిక రచయితలైన శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి,ఆరుద్ర, సోమసుందర్, పురిపండా వారసత్వాన్ని కొనసాగించడానికి కషి చేస్తున్నవాళ్లలో ప్రధానమైన రచయిత. మంచి అనువాదాలు. సాహిత్యాన్ని విస్తృతమైన ప్రచారం కల్పించడానికి అహర్నిశలు కషి చేస్తున్నారు. స్వార్థం లేకుండా సాహితీ వ్యక్తుల ప్రాధాన్యత కోసం కృషి చేస్తూ, రచయితల్లో ఒక చైతన్యాన్ని నెలకొల్పడానికి నిర్విరామంగా పనిచేస్తున్నారు. విశాఖలో సామాజిక సాహిత్య వర్గానికి కొంత మేలు జరుగుతుందనే భావనతో రామతీర్థను ఎంపిక జరిగింది. –ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ సభ్యుడు నిరంతర చైతన్యశీలి రామతీర్థ సాహిత్యంలో నిరంతర చైతన్యశీలి. పాశ్చత్య సాహిత్యాన్ని కూడా బాగా చదివిన రచయిత. చదివి వదిలేయకుండా పాశ్యాత్యసాహిత్య ధోరణికి, భారతీయ సాహిత్యధోరణికి మధ్య గల తేడా, కారకాలను విశ్లేషించడం ఆయన ప్రత్యేకత. సాహిత్యోపన్యాసాలు చేస్తూ చైతన్య దీపికలను సిద్ధం చేస్తున్నారు. – కల్యాణ రామారావు, సాహిత్య సురభి వ్యవస్థాపక అధ్యక్షుడు రేపు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ఆవిష్కరణ రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ తరఫున మొదటి రావిశాస్త్రి అవార్డు జూలై 30న విశాఖ పౌరగ్రంథాలయంలో జరిగే సభలో ట్రస్ట్ ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ను ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రారంభించి ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు రామతీర్థకు ‘రావిశాస్త్రి–2016’ అవార్డును బహూకరిస్తారు. -
కోర్టులపై నమ్మకముంది.. జైహింద్- ఒవైసీ
హైదరాబాద్: గొంతు మీద కత్తిపెట్టినా.. భారతమాతకు జై అనను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరుసటి రోజే... జైహింద్ అనడం విశేషం. ఆయన వ్యాఖ్యలపై అహ్మదాబాద్ కోర్టులో ఆర్ఎస్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసినట్టు వచ్చిన వార్తలపై ఓవైసీ పై విధంగా స్పందించారు. తనకు కోర్టులపై పూర్తి విశ్వాసముందని, తన వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు అయినట్లు తన దృష్టికి రాలేదంటూ... జై హింద్ అన్నారు. అటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు. భారతమాతకు వందనం చేయబోనని సిగ్గు లేకుండా మాట్లాడటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మజ్లిస్ అధినేత వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. 'భారత్ మాతా కీ జై’అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవాలని మహారాష్ట్ర శివసేన అధికార ప్రతినిధి రాందాస్ కదమ్ ఘాటుగా విమర్శించారు, కాగా నా గొంతులో కత్తి దిగేసినా భారత్ మాతాకీ జై అనను అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయ. లాతూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కొత్త తరానికి భారత మాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆమె ఎవరు?
మత బోధకుడి కేసులో టాస్క్ఫోర్స్ ఆరా ట్రస్ట్ పేరిట వంచన వీడియోతో బెదిరించి రూ.కోట్లు వసూలు విజయవాడ : ట్రస్ట్ పెట్టామంటూ సహకరించమన్నారు. తమ సంస్థ ద్వారా అనాథ మహిళలకు ఆర్థిక, ఇతర సాయం చేస్తున్నట్టు నమ్మబలికారు. సరే ఏదైనా పార్టీ ఏర్పాటు చేయండంటూ మత బోధకుడు అన్నందుకు ‘సర్వం’ సమకూర్చి అదిరిపోయే పార్టీ ఏర్పాటు చేశారు. అంతే వీడియో చిత్రీకరించి కోట్లు దండుకున్నారు. పథకం రచన చేసింది ఎలక్ట్రానిక్ మీడియా మాజీ విలేకరులైతే.. అమలు చేసింది మాత్రం శాటిలైట్ ఛానల్ ప్రతిని ధులు అని పోలీసు వర్గాల సమాచారం. కొందరు న్యాయవాదులు సహా ఈ కుట్రలో అనేక మంది ఉన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మత బోధకుడిని ట్రాప్ చేసేందుకు బ్లాక్మెయిలింగ్ ముఠా ఏర్పాటు చేసిన యువతి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సహా 12మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక పాత్ర ఎవరిది? మత బోధకుడికి పార్టీ చేసినప్పుడు తీసుకొచ్చిన యువతి ఎవరనేది తెలిస్తే బ్లాక్మెయిలింగ్ ముఠాకు సంబంధించి మరికొన్ని వివరాలు వెలుగు చూస్తాయని టాస్క్ఫోర్స్ అధికారులు అంటున్నారు. వీరి ఆమెను ఏ విధంగా ఆ పార్టీలో ఉపయోగించుకున్నారు? పార్టీ ఏర్పాటు చేసిన వారిలో కీలకం ఎవరు? తదితర అంశాలు రాబట్టాల్సి ఉందంటున్నారు. ఒక్క మత బోధకుడితోనే సరిపెట్టారా లేక ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకున్నాయా? అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠా చేసిన ఆగడాలన్నిం టిని వెలికి తీయాలంటూ పోలీసు కమిషనర్ ఆదేశించడంతో ముందుగా ఆ యువతిని పట్టుకోవాలనేది టాస్క్ఫోర్స్ ఆలోచన. ఆమె పట్టుబడితే అనేక కీలక విషయాలు వెలుగు చూస్తాయంటున్నారు. విరాళం కోసం కలిశారు... మత బోధకుడి ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న మాజీ విలేకరి, మరికొందరు కలిసి డొనేషన్ కోసం కలిశారు. పదే పదే వెళ్లి కలవడంతో విరాళం ఇచ్చేందుకు మత బోధకుడు అంగీకరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా మంచి పార్టీ ఏర్పాటు చేయండి అంటూ ఆయన చెప్పగా వీరు సరేనన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ యువతిని ఎరగా వేసి వీడియోలు చిత్రీకరించారు. ఆపై వాటిని చూపించి దశల వారీగా రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. మరో రూ.5 కోట్లు కావాలంటూ ఈ ముఠా ఒత్తిడి తేవడంతో విధిలేని స్థితిలో మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ను ఆశ్రయించగా టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళకు బెదిరింపు నగరానికి చెందిన మరో మహిళను కూడా ముఠా సభ్యులు బెదిరించి రూ. లక్షలు గుంజినట్టు తెలిసింది. ఓ గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ఆమె మత బోధకుడితో సన్నిహితంగా ఉండటం గుర్తించిన ముఠా సభ్యులు బ్లాక్మెయిలింగ్కు దిగా రు. విధిలేని స్థితిలో ఆమె వీరికి రూ.16 లక్షల వరకు ముట్టచెప్పినట్టు తెలిసింది. ఒత్తిళ్లు ఎలక్ట్రానిక్ మీడియా ముసుగులో బ్లాక్మెయిలింగ్ దందాకు పాల్పడిన కొందరు వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడంపై జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఆరోపణలు వచ్చిన వ్యక్తుల ప్రమే యం ఉంటే తనకు తెలియకుండా చర్యలు తీసుకోరాదంటూ సైడ్ చేయాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. -
ఇస్తారా.. చస్తారా?
ట్రస్టు మాటున మాజీమంత్రి ఆక్రమణలు రైతుల భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేశారంటూ పోలీసు కేసులు రైతులను భూముల్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ ఓ మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు రైతులను బెదిరించి వందలాది ఎకరాల భూములను లాక్కుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే సొంత భూముల్లోకి రైతులనే వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి/తిరుపతిరూరల్: ట్రస్టు పేరుతో రైతుల భూములు ఆక్రమించుకోవడం అధికారపార్టీ నేతలకు పరిపాటిగా మారింది. తవణంపల్లి మండలం దిగువమాఘంలో ఓ ట్రస్ట్ పేరుతో దాదాపు రెండు వందల ఎకరాల్లో విద్యాసంస్థల ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించారు. అందుకోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 180 ఎకరాలకు పైగా ఇప్పటికే స్వాధీనం చే సుకున్నారు. ఎదురుతిరిగినరైతులు మూడు నాలుగు తరాలుగా కుటుంబానికి ఆసరాగా ఉన్న భూములను ఇస్తే తమకు జీవనం పోతుందని కొందరు రైతులు ట్రస్ట్కు భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ట్రస్ట్ కొనుగోలుచేసిన భూముల మధ్యలో దాదాపు 20 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. తమకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తేనే భూమిని ఇస్తామని అన్నదాతలు ట్రస్ట్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. అమ్మని భూముల చుట్టూ ప్రహరీ చుట్టూ భూములను కొనుగోలుచేసిన ట్రస్ట్ నిర్వాహకులు దాదాపు 10 అడుగుల ఎత్తులో ప్రహరీని నిర్మిస్తున్నారు. తమకు భూములు ఉన్నాయని వాటిలోకి వెళ్లేందుకు దారి కూడా వదలకుండా గోడ కట్టడంతో రైతులు ఆందోళన చేశారు. మధ్యలో వస్తున్న కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించారని వాపోతున్నారు. అడ్డుకున్న వారిపై కేసులు తమ భూముల్లోకి వెళ్లకుండా కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించడంపై సదరు నేతలను రైతులు అడ్డుకున్నారు.కొందరు ప్రహరీ రాళ్లను తొలగించారు. దీంతో తమ భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, తమ ఆస్తులను నాశనం చేస్తున్నారని ట్రస్ట్ ప్రతినిధులు రైతులపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు. -
ఆ ట్రస్ట్ ఏదో తెలియదా ?
ప్రభుత్వ, ప్రైవేటుకు వ్యత్యాసం లేదా చర్చనీయాంశమైన అశోక్ వ్యాఖ్యలు వైద్యకళాశాల కోసం మాన్సాస్ ట్రస్టు దరఖాస్తు చేసిందని అందరికీ తెలుసు తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయిన అశోక్ గజపతిరాజు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మెడికల్ కాలేజ్ ఇప్పటికే ఒకటి ఉంది. మరొకటి ఓ ట్రస్టు అడుగుతోంది. మీ పత్రికల ద్వారా చూశాను. మూడు నాలుగు మెడికల్ కాలేజీలు ఒకే ప్రాంతంలో ఉంటే అవి ఇబ్బందిపడతాయి. అన్నీ పడిపోతాయి. న్యాణ్యత కొరవడుతుంది.ప్రభుత్వమైనా, ప్రైవేటైనా మెడికల్ కాలేజ్ కదా. అక్కడ చదివే పిల్లలంతా డాక్టర్లవుతారు.’ ఇవీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం కేంద్రాస్పత్రిలోని పరికరాల ప్రారంభోత్సవ అనంతరం విలేకర్ల వద్ద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. వైద్య కళాశాల కోసం దరఖాస్తు చేసిన ట్రస్టు తనకేదో తెలియదన్నట్టు అశోక్ మాట్లాడారు. ప్రభుత్వ స్థాయిలో జరగాల్సినదంతా జరిగిపోయినప్పటికీ ఆ ట్రస్టు అడుగుతుందని పత్రికల్లో చూశానని చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదివినా వైద్యులే అవుతారని హితబోధ చేసిన కేంద్రమంత్రికి, విద్యార్థులకొచ్చే ప్రయోజనాల వ్యత్యాసాలు తెలియవా అన్న సందేహాన్ని రేకెత్తించారు. మాన్సాస్ ట్రస్టుకు వైస్ చైర్మనైన అశోక్కు తెలియదా? ప్రైవేటు వైద్య కళాశాల ఏదో ట్రస్టు అడుగుతోందని, అది కూడా పత్రికల్లో చూశానని అశోక్ గజపతిరాజు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలీ ప్రైవేటు కళాశాల కోసం దరఖాస్తు చేసింది మాన్సాస్ ట్రస్టు అని జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తెలుసు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేయాలని అనేక ఆందోళనలు జరిగాయి. శాసనసభలో సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం మాన్సాస్ ట్రస్టు ప్రైవేటు కళాశాలను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. జిల్లాకొచ్చిన వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఇతరత్రా మంత్రులు బహిరంగంగా వెల్లడించారు. అలాంటిది ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఆనుమతితో మాన్సాస్ ట్రస్టు భూములను వేలం కూడా వేశారు. జిల్లా కేంద్రాస్పత్రు క్లీనికల్ అటాచ్మెంట్ కింద మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాల కోసం ఇచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా స్పష్టం చేసింది. ఈ విధంగా తన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ అశోక్కు తెలియవన్నట్టు మాట్లాడారు. తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయారు. ప్రభుత్వ, ప్రైవేటుకు తేడా తెలియదా ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అశోక్ చెప్పడం జిల్లా ప్రజల్ని మరింత విస్మయానికి గురి చేసింది. జిల్లాకు మూడు నాలుగు వైద్య కళాశాలు ఏర్పాటు చేయాలని ఎవరూ కోరలేదు. ఇప్పటికే నెల్లిమర్లలో ప్రైవేటు వైద్య కళాశాల ఉంది. మరొకటి ప్రభుత్వ వైద్య కళాశాలైతే బాగుంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా ఉన్నత వైద్యసేవలందడమే కాకుండా తక్కవ ఫీజుతో వైద్య విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు అవకాశం వస్తుంది. ఒకవేళ ప్రైవేటు వైద్య కళాశాలే ఏర్పాటు చేద్దామనుకుంటే ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అక్కడి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా చాలామంది ప్రాణాలు నిలబెట్టవచ్చనేది ప్రజల అభిప్రాయం. ఆ తేడా తెలియదన్నట్టుగా అశోక్ వ్యాఖ్యలుండటం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓ ట్రస్టు అనడం సరికాదు కేంద్రమంత్రి స్థాయిలో వైద్య కళాశాలను ఓ ట్రస్టు అడుగుతోందని చెప్పడం సరికాదు. మాన్సాస్ ట్రస్టు పెడుతుందని జిల్లా ప్రజలందరికీ తెలుసు. దానిపై ఆందోళనలు కూడా జరిగాయి. అలాంటి ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు వైద్య కళాశాలను అడుగుతున్నట్టు తెలియదా. ఇప్పటికే భూ ముల వేలం, ఇతరత్రా కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ స్థాయిలో అన్నీ జరిగిపోతున్నా మాన్సాస్ ట్రస్టే అని చెప్పుకోవడానికి ఎందుకంత ఇబ్బంది. ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అందరికీ తెలుసని, ప్రభుత్వ వైద్య కళాశాలైతే రోగులకు ఉచిత వైద్యసేవలు, విద్యార్థులకు తక్కువ ఫీజుతో వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుందనేది తెలియదా. - బీశెట్టి బాబ్జీ, లోక్సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. -
‘శ్రవణం’పై నీలినీడలు
బెలాను ఉల్లంఘిస్తున్న టీటీడీ కొత్త కో-ఆర్డినేటర్ను నియమించే ప్రయత్నాలు తిరుపతి: బాల్యం నుంచే వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు వినికిడి లోపాలను సరిచేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రవణం(బాలవిద్యాలయ) ప్రాజెక్ట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ నిర్వహణ భారాన్ని మోసిన చెన్నైకి చెందిన బాలవిద్యాలయ డెరైక్టర్ సరస్వతీనారాయణస్వామిని శ్రవణం కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించిన టీటీడీ యాజమాన్యం ట్రస్ట్ బైలాస్కు విరుద్ధంగా స్థానికంగా పలుకుబడి గలిగిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ట్రస్ట్ బైలాస్ ప్రకారం శ్రవణం ప్రాజెక్ట్ డెరైక్టర్గా మహిళలను నియమించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సిఫార్సులకు లొంగి మగవారిని డెరైక్టర్గా నియమించే పనిలో టీటీడీ నిమగ్నమైంది. తిరుపతికి చెందిన ఒక ఈఎన్టీ వైద్య నిపుణుడిని శ్రవణం కోఆర్డినేటర్గా నియమించనున్నట్లు తెలిసింది. అయితే అందుకు విరుద్ధంగా మహిళలను కాదని, మగవారిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నియమించే ప్రతిపాదనను పలువురు వ్యతిరేకిస్తున్నారు. 2006 డిసెంబర్ 15న అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి శ్రవణం ప్రాజెక్ట్ను ప్రారంభించి ప్రాజెక్ట్ నిర్వహణకు టీటీడీ రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. వినికిడి లోపం ఉన్న బాలల సంక్షేమానికి పాటుపడుతున్న చెన్నైకి చెందిన బాలవిద్యాలయానికి శ్రవణం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. శ్రవణం ప్రాజెక్ట్లో పనిచేయడానికి అవసరమైన ఉపాధ్యాయినుల నియామకం, వారికి జీతభత్యాల చెల్లింపు బాధ్యతలు ఆ సంస్థకే అప్పగించి నిర్వహణ ఖర్చులతో కలిపి టీటీడీ రీయింబర్స్ చేసేలా 2006 డిసెంబర్ 5న ఎంవోయూపై సంతకాలు జరిగాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన బాలవిద్యాలయానికి మంచి ఆదరణ ఉండడంతో మహబూబ్నగర్, విశాఖపట్నాలలో సబ్సెంటర్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి 2012 ఏప్రిల్ 3న జరిగిన సమావేశంలో తీర్మానాన్ని (నెం,24) కూడా ఆమోదించింది. సరస్వతీనారాయణస్వామి నేతృత్వలో శ్రవణం నిర్వహణ తీరును టీటీడీ ఉన్నతాధికారులు మెచ్చుకున్న సందర్భాలు, విమర్శలు వెలువడినప్పుడు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న, చిన్న లోపాలు ఉన్నా ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించేందుకు ఆమె చిత్తశుద్ధితో కృషి సాగించారు. ప్రస్తుతం బాలవిద్యాలయలో సుమారు 220 మంది వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు. కోఆర్డినేటర్ను మారిస్తే ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది అంతా మహిళలే అయినందున శ్రవణం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా అనుభవం ఉన్న టీ టీడీ సెంట్రల్ ఆస్పత్రి రిటైర్డ్ మహిళా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రాజెక్ట్(బాలవిద్యాలయం)ను పూర్తిస్థాయిలో టీటీడీనే నిర్వహించాలని కోరుతున్నారు. -
నిర్భయ తల్లిదండ్రుల పెద్దమనసు
బల్లియా: కన్నబిడ్డను పాశవిక అత్యాచార దాడిలో కోల్పోయిన నిర్భయ తల్లిదండ్రులు బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు. వేధింపులు ఎదుర్కొనే తమ బిడ్డలాంటి మహిళలకు సాయం చేసేందుకు ఆమె పేరుతో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్భయ కన్నుమూసి ఏడాది గడచిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో తమ స్వగ్రామం దామినికి ఆదివారం చేరుకున్న నిర్భయ తండ్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రయత్నానికి గ్రామస్తులు కూడా సహకారం అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నకూతురు దూరమై ఏడాది గడచినా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. నిర్భయ తుదిశ్వాస విడిచి ఏడాది గడచిన సందర్భంగా ఒక్క నేతా తమ గ్రామానికి రాలేదని, వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుక్కి ఇంతవరకూ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. -
నమ్మకం: ఇలాంటివి నమ్ముతారా!
కొన్ని దేశాలు అభివృద్ధి చెందినవిగా కనిపిస్తాయి. కానీ అక్కడి ప్రజల నమ్మకాలు చూస్తే, వీళ్లేంటి ఇలా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో బలంగా ఉన్న కొన్ని నమ్మకాలివి... {బెడ్ తయారు చేసినప్పుడు అది సరిగ్గా పొంగకపోతే, ఇంట్లో దుష్టశక్తి ఉందని నమ్ముతారు. వెంటనే ఆ బ్రెడ్ రెండు చివర్లనూ కత్తిరించి పారేస్తారు. అలా చేస్తే దెయ్యం బయటికి పోతుందట! చాకు కిందపడితే మగ చుట్టం, ఫోర్క్ కిందపడితే ఆడ చుట్టం వస్తారట! టేబుల్ మీద పూర్తి తెల్ల బట్టను పరచరు. ఒకవేళ పరిచినా, పడుకునేముందు తీసేస్తారు. తీయకుండా రాత్రంతా ఉంచేస్తే, ఎవరో మరణిస్తారని భయపడతారు! ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు గబ్బిలం గానీ అతడి కంటపడితే... కచ్చితంగా ఏదో పెద్ద ఘోరం జరుగుతుందట! నెమలీకలోని కన్ను దెయ్యానికి ఆశ్రయమిస్తుందట. అందుకని ఇంట్లో ఉంచుకోరు. ఉప్పు ఒలికితే దురదృష్టం వచ్చి నెత్తిమీద కూర్చుంటుందట. ఒకవేళ పొరపాటున ఒలికితే దాన్ని ఎత్తి, తల తిప్పకుండా, భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని అంటారు. అలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందట! కొత్త చెప్పులు, బూట్లు టేబుల్ మీద పెడితే దరిద్రం ఇంట్లో తిష్ట వేస్తుందట! నాలుగు ఆకులున్న లవంగం మొక్కను చూస్తే సంపద వరిస్తుందని ఓ విశ్వాసం! గుమ్మంలో నిలబడి గొడుగును తెరిస్తే... ఇక కష్టాలు తప్పవట! పిచ్చుక ఇంట్లోకి వస్తే చంపేయాలట. లేదంటే దానితో పాటే మన సర్వ సంపదలూ ఎగిరిపోతాయనే నమ్మకం బ్రిటన్లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది!