రెండు కార్లు ఢీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు | Road accident | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Published Tue, Dec 13 2016 12:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Road accident

  • ముగ్గురి పరిస్థితి విషమం
  • రామచంద్రపురం: 
    పసలపూడి– చోడవరం బైపాస్‌ రోడ్డులో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన  ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన పిన్ని వీరాస్వామి ఆయన భార్య శ్రావణి నాగజ్యోతి,పిల్లలు భవ్యశ్రీ సత్య, మనోహర్‌ సత్యదీప్, శ్రావణి నాగజ్యోతి తాతయ్య సీతారామయ్య, నానమ్మ మంగ తాయారు, పిన అత్తగారు తణుకు శ్రీదేవి మండపేట వచ్చారు. అక్కడి నుంచి సామర్లకోట వెళ్లారు. కారులో వారు తిరిగి మండపేట వస్తుండగా రామచంద్రపురం బైపాస్‌ రోడ్డులో  ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. 
    దాంతో వారందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మనోహర్‌ సత్యదీప్, సీతారామయ్య, మంగతాయారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)కి తరలించారు.ఎస్సై శ్రీనునాయక్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఎదురుగా వచ్చి ఢికొట్టిన కారు డ్రైవరు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి  అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై తెలిపారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement