తిరుపతి: శేషాచలం ఎన్కౌంటర్ కేసులో సాక్షులను సిట్ విచారిస్తోంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సిట్ బృందం విచారణ చేస్తోంది.
సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తిరువన్నామలై నుంచి సాక్షులను తీసుకువచ్చారు. అయితే తమవారి ప్రాణాలకు ముప్పు ఉందని సాక్షుల బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు పథకం ప్రకారం తమవారిని కాల్చి చంపారని సాక్షులు ఇంతకుముందు హైకోర్టులో సాక్షం చెప్పారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎర్రచందనం కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.