త్వరలో మాజీ సైనికుల కల సాకారం
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల ఇంటిపట్టాల కల త్వరలో సాకారం కానుందని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తెలిపారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంటి పట్టాల మంజూరుకు మార్గం సుగమం అవుతోందని చెప్పారు. జిల్లాలో మాజీ సైనికుల భూమి ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు శ్రీనివాసులు, అబ్దుల్ఖాదర్, ఆంజనేయులు, రమేష్రెడ్డి, నారాయణరెడ్డి, ఆజాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.