డిజిటల్‌ లిటరసీపై ప్రత్యేక దృష్టి | special focus on digital litarasi | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లిటరసీపై ప్రత్యేక దృష్టి

Published Fri, Dec 9 2016 11:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

డిజిటల్‌​లిటరీసీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకు అధికారులకు జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ సూచించారు.

- కలెక్టర్‌ విజయమోహన్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): డిజిటల్‌​లిటరీసీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకు అధికారులకు జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ సూచించారు. ప్రతి గ్రామాన్ని ఈ నెల 25లోగా డిజిటల్‌ లిటరసీగా మార్చాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమావేశ మందిరంలో సిండికేట్‌ బ్యాంకు, ఆంధ్రబ్యాంకుల బ్రాంచీ మేనేజర్లు, బ్యాంకుల ఇన్‌చార్జి అధికారులకు వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...ప్రధానంగా 7 బ్యాంకులే జిల్లాలో కీలకంగా ఉన్నాయన్నారు. ఈ బ్యాంకులు తమ పరిధిలోని గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో  ఎల్‌డీఎం నరసింహారావు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఆంధ్రబ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement