దళితులపై దాడులుచేస్తున్న వారిపై చర్యతీసుకోవాలి
Published Fri, Aug 12 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
అమ్రాబాద్: గోసంరక్షక దళం పేరుతో హిందూమతోన్మాదులు పనిగట్టుకొని దళితులపై దాడులు చేస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు ప్రశాంత్, జ్యోతి లింగయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్,మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో ఇప్పటికే దాడులు చేశారని, సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించలేదని తెలిపారు. మరోసారి తూర్పుగోదావరి జిల్లా తమనప్ప గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితుల పై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న కేంద్రప్రభుత్వం ఇప్పటికైన దళితులపై దాడులు చేసిన గో సంరక్షకదళం వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement