లారీ డ్రైవర్‌ ఆత్మహత్య | Suicide lorry driver | Sakshi

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

Dec 15 2016 1:10 AM | Updated on Nov 6 2018 7:53 PM

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో బుధవారం జరిగింది.

అనంతపురం సెంట్రల్‌ :
లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎర్నాలకొట్టాలలో నివాసముంటున్న కొండయ్య(55) లారీ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement