ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మల్లాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న బాలయ్య(35) మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆటో-బైక్ ఢీ... వ్యక్తి మృతి
Published Sun, Apr 24 2016 9:23 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement