వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Aug 19 2016 7:25 PM | Updated on Aug 30 2018 4:07 PM
వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న తాడెం ప్రభాకర్(23) ద్విచక్రవాహనం పై వెళ్తూ.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement