రైలు ఢీకొని వ్యక్తి మృతి
Published Mon, Nov 14 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
ఏలూరు అర్బ¯ŒS : గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వట్లూరు గ్రామానికి చెందిన పఠా¯ŒS బాజీ (45) అనే వ్యక్తి ఆదివారం బహిర్భూమికి వెళ్లేందుకు వట్లూరు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో పట్టాల వద్దకు వచ్చాడు. అదేసమయంలో అటుగా వెళ్లిన గుర్తుతెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతుని బంధువులను రప్పించి వారి వివరణ మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement