గిడుగు రామ్మూర్తికి అక్షర నివాళి
మారీసుపేట: వ్యవహరిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడ్డుగు రామ్మూర్తి చిత్రాన్ని ‘అ’ నుంచి ‘ఱ’ వరకు వరుస క్రమంలో క్రమబద్ధంగా రాస్తూ చిత్రించినట్లు తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు ఫణీదపు వెంకటకృష్ణ ఆదివారం చెప్పారు. 11 అంగుళాల ఎత్తు, 10 అంగుళాల వెడల్పు ఉన్న చిత్రాన్ని రెండు గంటల్లో చిత్రించినట్లు తెలిపారు.