చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
చౌటుప్పల్(నల్గొండ జిల్లా): చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు.
టాటా ఏస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.