లారీని ఢీకొట్టిన సుమో: ఇద్దరు మృతి | two killed in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన సుమో: ఇద్దరు మృతి

Published Wed, Aug 24 2016 7:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

two killed in road accident in chittoor district

చిత్తూరు : చంద్రగిరి మండలం అగరాల వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన వారంతా సుమోలోని తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement