
కోనాపూర్లో సేంద్రీయ ద్రావణాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
రామాయంపేట: సేంద్రీయ ద్రావణమైన వర్మీవాష్తో పంటలకు మేలు చేకూరుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేశ్ పేర్కొన్నారు. మండలంలోని కోనాపూర్లో ఆదర్శ రైతు పోచమైన కిషన్ తయారు చేసిన ద్రావణాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎకరాకు మూడు లీటర్ల చొప్పున ద్రావణాన్ని పిచకారీ చేస్తే శిలీంద్రాలను రూపుమాపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ద్రావణంతో భూమి కూడా సారవంతంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని గణేశ్ సూచించారు. కార్యక్రమలో రైతు కిషన్, ఇతర రైతులు అశోక్, భీరయ్య పాల్గొన్నారు.