
భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య
భార్యభార్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగడంతో అసహనానికిగురైన భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది.
రేబాల (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు) :
భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అసహనానికిగురైన భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల తూర్పు దళితవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. దళితవాడకు చెందిన మమత్కు (32) తన భార్యకు మనస్పర్ధలున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాగుతున్న నూనెను మమత్పై అతడి భార్య పోసింది. దీంతో మమత్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని 108 సహాయంతో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.