వడదెబ్బతో మహిళ మృతి | woman dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మహిళ మృతి

Published Thu, May 11 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

woman dies of sun stroke

గుత్తి : పట్టణంలోని జెండా వీధికి చెందిన ఎస్‌.రసూల్‌ బీ(51) వడదెబ్బతో మృతిచెందారు.  కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రసూల్‌ బీ రెండు రోజులుగా పని నిమిత్తం ఎండలో బాగా తిరిగారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో కళ్లు తిరిగి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిస్థితి విషమించింది.  మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఆమెకు భర్త అబ్దుల్‌ జబ్బార్, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement