వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులలో జరిగే గోదావరి పుష్కరాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఆయన పుష్కర స్నానం చేస్తారు.