IFTAR party
-
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12 సయ్యద్నగర్లో పూండ్ల వెంకు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛారిటుబుల్ ట్రస్ట్ అధినేత పూండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శ్రవణ్కుమార్రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతియేటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈసారి 3 వేలమందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్ఖాన్, రశీద్ఖాన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ మాసం : ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
బిర్యానీ పార్టీకి పిలిస్తే మంచివాళ్లా?.. హీరోయిన్పై నెటిజన్ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’ అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది. దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు. అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు. On odd and even days dear sir terrorists are villains . Not muslims. — Adah Sharma (@adah_sharma) March 26, 2024 What a fraud she is!!! On Odd Days Muslims are Villains for these people and you make hate movies against them!!! On Even Days Muslims are great for these people because you get invited for a Biryani!!! pic.twitter.com/ygNhPNMnkO — Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) March 25, 2024 -
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 12న ఇఫ్తార్ విందు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న ఇఫ్తార్ విందు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి భూపాల్రెడ్డిని ఆదేశించారు. ఇఫ్తార్ విందుకు కోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. -
కేంద్రానికి రోగం వచ్చింది, చికిత్స చేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్, కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏకే ఖాన్, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చదవండి: రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం! ఇఫ్తార్ విందు సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రానికి రోగం వచ్చిందని, చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కూల్చివేతలు సులువు కానీ దేశాన్ని నిర్మించడం కష్టమన్నారు. ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం దేశమంతా చీకటి అలుముకుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. -
ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీఎం.. విజయవాడలోని వన్టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా భవనాన్ని ప్రారంభించారు. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హోరెత్తిన సభా ప్రాంగణం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి సీఎం ఇఫ్తార్ విందుకు వెళ్తున్న క్రమంలో సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. యువత సెల్ ఫోన్లలో సీఎంను ఫొటోలు, వీడియో తీస్తూ సందడి చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక సబ్ప్లాన్ను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నమాజ్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ 4 % రిజర్వేషన్తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడు సీఎం జగన్ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, రోజా, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్, పలువురు ఎమ్మెల్యేలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
Vijayawada: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
-
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ వన్టౌన్లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయిప్రవీణ్ చంద్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
27న విజయవాడలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైఎస్ జగన్ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్లో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
‘అల్లా ఆశీస్సులతో మంచి పాలన అందిస్తాం’
సాక్షి, వైఎస్సార్జిల్లా : పవిత్ర రంజాన్ మాసంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన నగరంలోని అమీన్ ఫంక్షన్ ప్యాలెస్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో మంచి పాలన అందిస్తామన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఎప్పటికి మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెల్లదు, మైనార్టీ సోదరులు, అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ అతిథులకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పాక్ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్లోని భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్లోని సెరేనా హోటల్లో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది. ఫోన్చేసి బెదిరింపులు.. ఈ విషయమై ప్రముఖ పాక్ జర్నలిస్ట్ మెహ్రీన్ జెహ్రా మాలిక్ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫైసలాబాద్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, లాహోర్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పాక్ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్ చేశారు. భారత హైకమిషన్ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్ మీడియా కవర్ చేయలేదు. పాక్ నేతకు చుక్కలు.. ఈ విందుకు హాజరైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్ బాబర్కు పాక్ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్ రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన బిసారియా.. ఇఫ్తార్ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు కరాచీ, లాహోర్ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అతిథులు రాకుండా భారత్ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్ దౌత్యవర్గాలు చెప్పాయి. -
భారత్ ఇఫ్తార్ విందులో పాక్ ఓవరాక్షన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో భారత హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ దేశ భద్రతా సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తించారు. ఇప్తార్ విందుకు హాజరైన అతిథులతో అత్యంత అమర్యాదగా వ్యవహరించారు. రంజాన్ సందర్భంగా ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా, దానికి పలువురు అతిథులు వచ్చారు. అయితే, భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్లను వేధింపులకు గురిచేశారు. భద్రత పేరుతో అతిథులకు తీవ్ర అసహం కలిగించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు గెస్ట్ల కార్లను పార్కింగ్ స్థలం నుంచి తొలగించగా.. మరికొందరి వాహనాలను హోటల్లోకి అనుమతించలేదు. దీంతో కొందరు ముఖ్యలు కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ పదే పదే భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఇతర దేశస్తులు ఎవరైనా పాకిస్తాన్లో అడుగుపెట్టినా.. వారినికూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రంజాన మాసం కావడంతో.. అనువనవూ గాలింపు చేపడుతున్నారు. -
విభజన వివాదాలకు తెర!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మరో ముందడుగు పడింది. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని అభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం రాజ్భవన్లో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. శనివారం సాయంత్రం రాజ్భవన్లో ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేస్తున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్. చిత్రంలో ఏకే ఖాన్, ఎర్రబెల్లి, ఫరూక్ హుస్సేన్, మహమూద్ అలీ తదితరులు రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనతోపాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల మధ్య విద్యుత్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్ విభజన తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉభయ ప్రయోజనకరంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. రంజాన్ మాసం సందర్భంగా రాజ్భవన్ కాంప్లెక్స్లోని ‘సంస్కృతి’కమ్యూనిటీ హాల్లో గవర్నర్ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్ చేరుకున్న కేసీఆర్, జగన్... గవర్నర్ సమక్షంలో గంటకుపైగా చర్చలు జరిపారు. ఇఫ్తార్లో ఏపీ సీఎం వై.ఎస్. జగన్కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం కేసీఆర్ ప్రేమను పంచండి: గవర్నర్ సందేశం ప్రేమను పంచండి.. ప్రేమను చాటండి అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. రాజ్భవన్ కాంప్లెక్స్లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఆయన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించండి.. ప్రేమను పంచండి అని అల్లా చెప్పారన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లా బోధనలను జీవితంలో ఆచరించాలని రంజాన్ సందేశమిస్తుందన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభకాంక్షాలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ అనంతరం అక్కడే ముస్లిం సోదరులు మగ్రిబ్ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం గవర్నర్ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఎర్రబల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి, ఎంపీ వై.ఎస్. మిథున్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్కు పండు తినిపిస్తున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్ -
రాజ్భవన్లో గవర్నర్ ఇఫ్తార్ విందు కేసీఆర్, వైఎస్ జగన్ హాజరు
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
-
గవర్నర్ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
రాజ్భవన్లో వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాజ్భవన్లో జరిగిన ఇఫ్తార్ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం రాజ్భవన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కాగా అంతకు ముందు గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ గవర్నర్ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విందు..పసందు
-
ఆత్మీయులతో జగన్ మమేకం
సాక్షి ప్రతినిధి కడప: పులివెందులలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించిన ఆయన రాబోయేవన్ని మంచి రోజులేనని అందరికి మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. పోరాటం చేశాం. కొద్దికాలం ఓపిక పట్టండి..దేవుని దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అందరికీ మంచి జరుగుతుందని జగన్మోహన్రెడ్డి వారితో అన్నారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం.. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న ప్రతిపక్షనేత క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసింది. ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యాలయ ఆవరణం అంతా ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులతో నిండిపోయింది. భారీగా వచ్చిన శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టతరమైంది. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతిపక్షనేతను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, ఎస్.బి.అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, డాక్టర్ సుధీర్రెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏసురత్నం, డాక్టర్ శిద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో జగన్మోహన్రెడ్డి పలు విషయాలు చర్చించారు. నూతన జంటకు ఆశీర్వాదం.. పులివెందులలోని రాజ్యలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు మోడం పద్మనాభరెడ్డి ఇంటికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఇటీవలే వివాహమైన పద్మనాభరెడ్డి కుమారుడు యశ్వంత్రెడ్డి, కోడలు సుజితలను ఆశీర్వదించారు. అప్పట్లో బిజీగా ఉండి వివాహానికి రాలేకపోయిన ఆయన బుధవారం సాయంత్రం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డిలతో కలిసి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్.. పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ సభ్యులు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్కు ఇమామ్ జామిన్ను చేతికి కట్టారు. అనంతరం ఇస్లాం సంప్రదాయ పద్ధతి ప్రకారం టోపీ పెట్టుకుని దువా చేశారు. ఆ తరువాత విందారగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, పార్టీ నాయకులు వైఎస్ మనోహర్రెడ్డి, శివప్రకాష్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ కన్వీనర్ వరప్రసాద్, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్, రఫీ, హఫీజ్, బాబు, బాషాలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందరర్భంగా వెఎస్ జగన్కు ముస్లిం సోదరులు ఖర్జూరాలు తినిపించారు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాలులో రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు. -
కువైట్లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్తో మాట్లాడుతూ.. కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ వైఖరి తెలిసిపోయింది : ఒవైసీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ఇఫ్తార్ విందుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ముస్లిం సాధికరతపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. వారు హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారం కిందట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగ్పూర్లో ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంపై విమర్శలు చేసిన ఒవైసీ.. కాంగ్రెస్ ఇఫ్తార్ విందుకు ప్రణబ్ను ఆహ్వానించడంపై కూడా ఘూటుగానే స్పందించారు. ఈ విందుకు ప్రణబ్ని ఆహ్వానించి, గౌరవించడం ద్వారా కాంగ్రెస్ వైఖరి ఎంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ఇఫ్తార్ పేరుతో డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రెండేళ్ల విరామం తరువాత ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. -
ఖతార్లో ఇఫ్తార్.. హాజరైన కడప ఎమ్మెల్యే
దోహా, ఖతార్ : గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతార్ కో-కన్వీనర్ గోవింద నాగారాజు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్బీ అంజద్ బాషా మాట్లాడుతూ.. మత సామారస్యనికి ప్రతీక అయిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశం కాని దేశంలో ఉంటూ కూడా పార్టీ అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తమకు ఘన స్వాగతం పలికి భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. పార్టీ కోసం మీరు శ్రమిస్తున్న దానికి పార్టీ అధిష్ఠానం, తాము రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే కో కన్వీనర్ నాగారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నిలో విజయం సాధించి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుల సమస్యలను కో-కన్వీనర్లు, గవర్నింగ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు. కార్యక్రమానికి హాజరై, విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేలను కువైట్, ఖతర్ వైసీపీ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కువైట్, ఖతార్ ముఖ్యనాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ విందు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా బుధవారం ఇఫ్తార్ విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా బుధవారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుండటంతో.. అందుకు పోటీగానే బీజేపీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై స్పందించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఏవిధంగానూ మేము(బీజేపీ) కాంగ్రెస్తో పోటీ పడటం లేదు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తనకు తానుగా ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న విందు ఇది’ అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ తాజ్ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరవుతారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. -
4 నెలలు..12 శాతం రిజర్వేషన్లు..ఏమయ్యాయ్!
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న కేసీఆర్..నాలుగేళ్లయినా రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ అగ్రనేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, జైపాల్ రెడ్డి, పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ముస్లింలను మోసం చేసిన కేసీఆర్కు ముస్లింలు ఓటెయ్యాలా అని సూటిగా ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు విషయం తెలియగానే కేసీఆర్ మొట్టమొదట మద్ధతు పలికారని, మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందంతో ముందుకెళ్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్, ఓవైసీ పరోక్షంగా ప్రధాన మంత్రి మోదీకి మద్ధతు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. భారతదేశంలో మోదీ పీఎం అయిన తర్వాత మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. -
ఇఫ్తార్లో హీరోయిన్ అవతారం.. విమర్శలు
నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోనాలీ రౌత్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇఫ్తార్ విందులో ఆమె ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ప్రతీ ఏటా కాంగ్రెస్ నేత బాబా సిద్ధిఖీ గ్రాండ్గా ఇఫ్తార్ విందు ఇచ్చే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కార్యక్రమానికి బడా బడా ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నటి సోనాలీ రౌత్ కూడా ఉన్నారు. అయితే ఆ విందులో ఆమె ఫోటోదిగి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా, పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇస్లాంకు, ఉపవాసానికి నువ్వు గౌరవం ఇవ్వకపోవచ్చు. కానీ, పవిత్ర రంజాన్ మాసానికి కాస్త గౌరవం ఇవ్వటం నేర్చుకో. ఇతర మతాల వారెవరూ నువ్వు ఇలాంటి డ్రెస్సులతో వేడుకలకు వెళ్తే అస్సలు ఒప్పుకోరు.. జాగ్రత్త’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ కామెంట్లకు ఆమె మాత్రం స్పందించటం లేదు. కాగా, ఇదే విందుకు మౌనీ రాయ్, హీనా ఖాన్, షామా సికిందర్, రాగిణి ఖన్నా, సుర్విన్ చావ్లా తదితరులు హాజరుకాగా, వారంతా చాలా పద్ధతిగా రావటంతో... సోనాలిని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కొందరు ఇస్లాంకు చెందిన సెలబ్రిటీలు ఇదే తరహాలో హాట్గా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శించిన విషయం తెలిసిందే. Last night at Baba Siddique's Iftar Party wearing outfit designed by @charmisdesign. A post shared by Sonali Raut (@isonaliraut) on Jun 11, 2018 at 5:48am PDT -
ప్రణబ్ ముఖర్జీకి ఊహించని పరిణామం!
న్యూఢిల్లీ : ఓ వైపు ప్రధాని పదవికి తాను అర్హుడినని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతో చిరకాల కోరికను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీర్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ మరోవైపు సొంత పార్టీ కాంగ్రెసే ఆయనకు షాకిచ్చినట్లు సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్కు ఆహ్వానం అందలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రణబ్ను ఆహ్వానించక పోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కీలక ఇఫ్తార్ విందుకు ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆప్ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని అందుకు ఈ ఇఫ్తార్ ఈవెంట్ను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడం కాంగ్రెస్ కూటమికి అంతగా రుచించడం లేదు. కాగా, తమకు అనుకూల పార్టీలకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానాలు పంపిన కాంగ్రెస్.. ఆయా పార్టీల అధ్యక్షులు హాజరుకాని పక్షంలో ఇతర కీలక నేతలను పంపాలని కోరింది. -
శివాలయంలో నమాజ్, ఇఫ్తార్ విందు..
లక్నో, ఉత్తరప్రదేశ్ : మత ఘర్షణలు పెరిగిపోతున్నాయంటూ తరచూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... హిందువుల ఆరాధ్య దైవమైన మహాశివుడు కొలువైన ఓ ఆలయంలో ఇఫ్తార్ విందు, హారతి ప్రదేశంలో నమాజ్.. ఇలాంటి ఊహ కూడా అసాధ్యమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దేవ్యగిరి. లక్నోలోని వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శివాలయంలో పూజారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ దేవ్యగిరి. మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఆమె చేపట్టిన కార్యక్రమం అందరి మన్ననలు అందుకుంటోంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని గోమతి నది ఒడ్డున అతి పురాతనమైన మంకమేశ్వర్ గుడి ఉంది. అక్కడ ప్రధాన అర్చకురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహంత్ దేవ్యగిరిగా మారారు అరుణిమా సింగ్. ఏ మతమైనా మనుషులను ప్రేమించమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించమని మాత్రమే చెబుతుందనే ఆమె నమ్మకాన్ని ఆచరించి చూపాలనుకున్నారు. అందుకోసం వెయ్యేళ్ల ప్రాశస్త్యం ఉన్న శివాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. హారతి స్థలంలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ‘మంకమేశ్వర్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సుమారు 500 మంది సున్ని, షియా ముస్లింలను ఆహ్వానించాం. విందు ఏర్పాటు కోసం ముగ్గురు వంటవారు, గుడిలో పనిచేసే కార్యకర్తలు ఉదయం నుంచే ఎంతో కష్టపడ్డారు. ముస్లిం సోదరుల కోసం మొదటిసారిగా మేము చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. లక్నోలో ఒక ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమనేది మొదటిసారి. ఇలాంటి కార్యక్రమానికి నాందిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ దేవ్యగిరి హర్షం వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయం ఆదర్శనీయం.. ఇఫ్తార్ విందుకు హాజరైన తేలీ వలీ మసీదు మౌలానా ఫజల్-ఈ-మనన్ మాట్లాడుతూ.. ‘మహంత్ దేవ్యగిరి శివాలయంలో విందు ఏర్పాటు చేస్తున్నామని నన్ను ఆహ్వానించినపుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆమె నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
13న రాహుల్ ఇఫ్తార్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఇఫ్తార్ విందు ఉంటుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆతిథ్యమిస్తారని ఆ పార్టీ మైనారిటీ విభాగం నేత నదీమ్ జావెద్ చెప్పారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక ఆయన ఇస్తున్న తొలి ఇఫ్తార్ విందు ఇదే. కాంగ్రెస్ చివరిగా 2015లో ఇఫ్తార్ విందు ఇచ్చింది. 2016, 2017ల్లో ఆ కార్యక్రమ నిర్వహణకు దూరంగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కార్యక్రమానికి పలు పార్టీల్లోని అన్ని మతాలకు చెందిన నేతలు, పలువురు రాయబారులు హాజరవుతారు. -
ఎమ్మెల్యేలను కొన్నందుకా..రుణమాఫీతో ముంచినందుకా
కర్నూలు జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం దేనికోసమని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వంచించినందుకా లేక మహిళలను మోసం చేసినందుకా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నందుకా లేక రైతన్నలను రుణమాఫీ పేరుతో నిట్టనిలువునా ముంచినందుకా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరులో ముస్లిం సోదరులు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ హఫీజ్ ఖాన్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ..‘ టీడీపీ ప్రభుత్వంలో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోంది. చంద్రబాబుపై ఎవరు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డే వాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు మొత్తం జగన్ను తిట్టడానికే సరిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను డ్రామాలుగా వర్ణించడం సిగ్గు చేటు. 14 నెలల ముందు రాజీనామా చేసిన ఎంపీల త్యాగాన్ని అందరూ కీర్తించాలి. దమ్ము, చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చార’ని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరువందల హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలు అపహాస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని ఎద్దేవా చేశారు. పంచభూతాలను సైతం దోచుకుతిన్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా ఏ ఏడు కా ఏడు నవ నిర్మాణ దీక్షలు చేయడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాత్రమే నవనిర్మాణ దీక్షలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉరి వేసుకున్నా ఎవరికీ లాభం లేదని, కాంగ్రెస్తో జతకట్టేందుకు టీడీపీ సిద్ధపడి, వైఎస్సార్సీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. దిగజారుడు టీడీపీ రాజకీయాలకు పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని అన్నారు. కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు గురించి చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో యూటర్న్ అంకుల్ అన్న పేరు మాత్రమే చంద్రబాబు సాధించిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు దుల్హన్ కార్యక్రమంలో అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరడం లేదని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
ఆ హక్కు కేసీఆర్, హరీష్కు ఎవరిచ్చారు
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్కు తీసుకుపోయే హక్కు కేసీఆర్కు, హరీష్కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు, రీ నోటిఫికేషన్లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. -
కొడుకు హత్య.. మతసామరస్యం చాటాడు
సాక్షి, న్యూఢిల్లీ : కోపాలు, ద్వేషాలు మనుషుల మనస్తత్వాలకు చెందినవని, మంచి చేయమని మాత్రమే మతం చెబుతుందని మరోసారి రుజువైంది. ఢిల్లీకి చెందిన ఓ హిందువు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మత సామరస్యాన్ని చాటిచెప్పారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీరు అనుకోవచ్చు.. కానీ తన ఒక్కగానొక్క కొడుకు మరణానికి కారణమైన మతస్తుల పట్ల తనకు ఎటువంటి కోపం లేదని, శాంతిని పెంపొందిచడమే తన లక్ష్యమని నిరూపించేందుకే ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంగా అంకిత్ సక్సేనా అనే 23 ఏళ్ల హిందూ యువకుడు నాలుగు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన అంకిత్ హత్య కేసును పరువు హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అంకిత్ సక్సేనా తండ్రి యశ్పాల్ ఇఫ్తార్ విందు ఏర్ఫాటు చేయడం మంచి పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు. శాంతికి, సహనానికి చిహ్నంగా.. కుమారున్ని కోల్పోయిన దుఃఖంలో తనకు స్నేహితుడు మహమ్మద్ ఇజార్ ఆలం మాటలతో ఊరట కల్పించారని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే తన ఆలోచనను ఆలంతో పంచుకున్నపుడు ఆయన అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చా రని తెలిపారు. ఆలంతో పాటు ఇరుగుపొరుగు వారు (హిందూ, ముస్లింలు) కూడా ఇఫ్తార్ విందు ఏర్పాట్లలో పాల్గొని శాంతికి, సహనానికి ప్రతీకగా నిలిచారన్నారన్నారు. అంకిత్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మందార్, గోరఖ్పూర్ డాక్టర్ కఫీల్ ఖాన్ కూడా హాజరయ్యారు. వారిని ఉరితీయాలి.. తన కుమారుడిని దారుణంగా హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు యశ్పాల్ తెలిపారు. అంకిత్ను హత్య చేసిన వారిపైన మాత్రమే తన కోపం తప్ప వారి మతానికి చెందిన వారందరినీ ఒకేలా చూడడం, వారిపై కక్ష పెంచుకోవడం మూర్ఖమైన చర్యగా భావిస్తానన్నారు. తన కుమారుడు మరణించినప్పటికీ అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, శాంతిని పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడమే తన ముందున్న లక్ష్యమని యశ్పాల్ చెప్పారు. ఇఫ్తార్ అంటే ఏమిటో తెలీదు.. యశ్పాల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన పుష్పా ఓత్వాల్ అనే మహిళ అంకిత్ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అంకిత్ హత్యకు గురవడం తమను కలచివేసిందన్నారు. తన జీవితంలో ఇంతవరకు ఇఫ్తార్ విందుకు వెళ్లలేదని, కానీ యశ్పాల్ విందుకు రావాలంటూ పిలిచినపుడు ఇఫ్తార్ గురించి తనకు అర్థమయ్యేలా చెప్పారన్నారు. మానవత్వానికి ఇదొక ఉదాహరణ.. ‘మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పే సంఘటన ఇది. మాలో చాలా మంది ఉపవాసం ఉండలేదు. కానీ అందరం కలిసి ఇలా విందులో పాల్గొనడం చక్కని సందేశాన్నిస్తుంది. సౌభ్రాతృత్వ భావనను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని’ హర్ష్ మందార్ వ్యాఖ్యానించారు. -
ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ ఆపండి
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ముస్లింలకు ఇవ్వనున్న ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందుకు మరో దెబ్బ తగిలింది. ఆరెస్సెస్ నాయకులే ఈ విందును అడ్డుకునే యత్నం చేస్తున్నారు. మలబార్హిల్స్లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందు ఏర్పాటు చేయనున్నసంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని ఆరెస్సెస్ ముస్లిం విభాగం (ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2015 జూలై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలనీ, ఆరెస్సెస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లింలకు దగ్గరవుదామని ఆరెస్సెస్ భావిస్తోందనీ, ముస్లిం వ్యతిరేక చర్యలు ఆపనంత వరకు ఎలాంటి విందుల్లో పాల్గొనబోమని వివిధ ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం నాటి గ్రాండ్ ఇఫ్తార్లో పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కాగా, ఆరెస్సెస్ ఇవ్వనున్న ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. -
‘పదవి ఇవ్వని బాబు..ఇఫ్తార్ విందు ఇచ్చాడు’
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లలో ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్లో తగిన స్థానం ఎందకుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల పాలనలో ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి.. నంద్యాల ఎన్నికల కోసం రూ.96 లక్షలు ఖర్చు చేసి మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారని ఆయన విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..తలుచుకుంటే ఓటుకు రూ.5 వేలు పంచగలమని చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షలు పంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశాడని ఆరోపించారు. నంద్యాలలో 2014లో వైఎస్ఆర్సీపీ గెలిచింది..ఇప్పుడు ఉప ఎన్నికల్లో టీడీపీ ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు. అభద్రతా భావంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. -
ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం
- టీడీపీ అభ్యర్థికి సహకరించాలని కోరిన సీఎం - ఫరూక్ విషయం పట్టించుకోని చంద్రబాబు నంద్యాల: ముస్లింల పవిత్ర ఇఫ్తార్ విందును టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయం వేదికగా మార్చి.. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అన్ని పార్టీలను ఒప్పిస్తున్నామని చెబుతూ, మరోవైపు పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేశామని, ముస్లింలు ఆయనకు సహకరించి ఆశీర్వదించాలని కోరారు. స్థానిక టెక్కె మార్కెట్యార్డులో రూ.1.27కోట్ల వ్యయంతో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని..ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత తాను ముస్లింల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేశానని చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మృతితో సీటు ఖాళీ అయ్యిందని, ఇంకా ఏడాదిన్నర కాలపరిమితి ఉన్నందున ఎన్నికలు జరుగుతాయన్నారు. మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి సీటును ఏకగ్రీవంగా ఇవ్వాలనే సంప్రదాయం ఉందన్నారు. ఈ మేరకు భూమా కుటుంబానికి సీటు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశామని, ప్రధాన పక్షం నుంచి స్పందన రావాల్సి ఉందన్నారు. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ఖరారు చేశామని ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ ఎస్పీవైరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీసుబ్బారెడ్డిలతో కూడా మాట్లాడామని చెప్పారు. ముస్లింలు భూమా కుటుంబానికి సహకరించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న మాజీ మంత్రి ఫరూక్కు ఎమ్మెల్సీ సీటు, శాసన మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆవాజ్ కమిటీ ప్రతినిధి అంజాద్బాషా కోరగా.. ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ప్రజలకు అభివాదం చేసి వెళ్లారు. ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాలను ప్రసాదిస్తారని ముస్లిం నేతలు ఆశించారు. కాని ఆయన ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను గురించి ప్రసంగించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇఫ్తార్ విందులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎస్వీమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. -
షాన్దార్.. ఇఫ్తార్
-
‘రాష్ట్రం ఊరుకోదు, యుద్ధం కొనసాగుతుంది’
► ముస్లిం బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘‘ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాను. బిల్లును రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ఆమోదించిన తర్వాత మీకు పంపుతానని ప్రధాని మోదీతో ఢిల్లీలో సమావేశమైనప్పుడు తెలిపాను. పంపండి.. సానుకూలంగా పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనం మళ్లీ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో బిల్లును తీసుకువద్దాం. లేకుంటే తెలంగాణ రాష్ట్రం మౌనంగా ఊరుకోదు, యుద్ధం కొనసాగుతుంది (జంగ్ జారీ రహేగీ)’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులతో సహా అన్ని చోట్లా ముస్లింలకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ సీట్లు, 5 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, ఓ వర్సిటీ వీసీ పదవి, హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ల పదవులను ముస్లింలకు కేటాయించామని, ఈఆర్సీ చైర్మన్గా ఇస్మాయిల్ అలీఖాన్ను నియమించామన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఉర్దూలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు తాము రాష్ట్రంలో 204 మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలను తెరిచామని, 2022లోగా 1.33 లక్షల మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకుంటారని వెల్లడించారు. కాన్వెంట్ స్కూళ్ల తరహాలో ఒక్కో విద్యార్థి చదువుకి ఏటా రూ.1.25 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు. ముస్లిం అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ విద్య, ఇతర అంశాల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. విదేశీ విద్య అభ్యసించే ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీ వర్గాల విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఉపకార వేతనం మంజూరు చేస్తున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ పోటీ పరీక్షల కోసం 100 మంది ముస్లిం అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం హైదరాబాద్లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వానికి సూచనలివ్వండి.. ముస్లింల అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యక్రమాలను ముస్లిం మతపెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని, అవసరమైతే తనకు లేఖలు రాయాలని, ప్రత్యేకంగా వచ్చి కలవాలని కేసీఆర్ కోరారు. ఇఫ్తార్ విందు అనంతరం ముస్లిం సోదరులు అక్కడే మఘ్రిబ్ నమాజ్ చేశారు. ఉపవాస దీక్ష విరమణ కోసం పండ్లు, ఫలాలు, భోజనం కోసం హలీమ్, చికెన్ బిర్యానీ.. తదితర వంటకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, ఏకే ఖాన్, డీజీపీ అనురాగ్శర్మ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ఓవరాక్షన్ సీఎం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆహ్వానాలు అందుకున్న వందల మందికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం రాకకు 10 నిమిషాలు ముందే ఎల్బీ స్టేడియానికి వెళ్లే దారుల్ని పోలీసులు మూసేసి ట్రాఫిక్ను ఆపివేశారు. కేసీఆర్ ఎల్బీ స్టేడియానికి చేరుకోగా, వెంటనే పోలీసులు గేట్లు మూసేసి, అతిథులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వర్షంలో చిక్కుకున్న ఆహ్వానితులు ప్రభుత్వం నుంచి అందుకున్న పాస్లను చూపించినా పోలీసులు అనుమతించలేదు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా చాలా మంది మీడి యా ప్రతినిధులు కూడా వర్షంలో డీ–బ్లాక్ గేట్ వద్ద వేచి చూశారు. ప్రభుత్వం జారీ చేసిన మీడియా పాస్ను చూపించి లోపలికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులు అనుమతి కోరగా, ‘లోపల స్థలం లేదు.. ఎవరినీ లోపలికి పంపవద్దని మా డీసీపీ ఆదేశించారు’ అని అక్కడ బందోబస్తులో ఉన్న ఎస్ఐ అడ్డుకున్నారు. చివరికి కొద్దిసేపటి తర్వాత లోనికి ప్రవేశించినా.. సీఎం ప్రసంగంతో పాటు ఇఫ్తార్ సమయం కూడా ముగిసిపోయింది. -
సీఎం ఇఫ్తార్ విందు ఇవ్వరా?
రంజాన్ మాసం వచ్చిందంటే ముఖ్యమంత్రులు తమ అధికారిక నివాసాల్లో ఇఫ్తార్ విందులు ఇవ్వడం సర్వసాధారణం. బీజేపీ అగ్రనేతలు అటల్ బిహారీ వాజ్పేయి, రాజ్నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఇలా ఇఫ్తార్ విందులు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ సంప్రదాయాన్ని పాటించకపోవచ్చని అంటున్నారు. ఈసారి 5 కాళిదాస్ మార్గ్లోని ఆయన అధికారిక నివాసంలో ఇఫ్తార్ విందు ఉండకపోవచ్చట. ఒకవేళ నిజంగానే ఆయన అలా చేస్తే.. ఇఫ్తార్ విందు ఇవ్వకుండా మానేసిన రెండో బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు. ఇంతకుముందు రామ్ ప్రకాష్ గుప్తా ఇలాగే ఇఫ్తార్ ఇవ్వలేదు. అలాగే.. నరేంద్రమోదీ కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఇఫ్తార్ విందులు ఏవీ ఏర్పాటు చేయలేదు. ఏప్రిల్ నెలలో చైత్ర నవరాత్రి సందర్భంగా బీజేపీ నేతలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక ఫలహార విందు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు ఇఫ్తార్ విందు మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ముస్లిం పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులు ఇచ్చారని, దేశంలో లౌకిక వాదాన్ని కాపాడేందుకే వారలా చేశారని సున్నీ ముస్లిం మతపెద్ద, ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు సభ్యుడు ఖాలిద్ రసీద్ ఫిరంగీ మహాలీ అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినా ఇవ్వకపోయినా.. దాంతో సంబంధం లేకుండా తాము మాత్రం ఇఫ్తార్ విందులు ఇస్తామని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం రాష్ట్రీయ ముస్లిం మంచ్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆవు పాల నుంచి వచ్చిన ఉత్పత్తులతో రంజాన్ ఉపవాస దీక్షలను విరమింపజేస్తామని అంటున్నారు. రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత ముస్లింలు తినే భోజనాన్నే ఇఫ్తార్ అంటారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. 6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
రేపు కడపలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
హాజరుకానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద దర్గా సమీపంలోని అమీన్ ఫంక్షన్ హాలులో ‘దావతే-ఏ- ఇఫ్తార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అలాగే జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీఛైర్మన్, మేయర్, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొననున్నారని చెప్పారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలు, నగర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలు షేక్ అన్సర్బాషా, షేక్ గయాజ్, బాబు, రఫీఖ్ఖాన్ పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందును రద్దుచేసిన కాంగ్రెస్ పార్టీ
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) ప్రతియేటా నిర్వహించే ఇఫ్తార్ విందును రద్దుచేసింది. ఈ మేరకు సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇలా ఇఫ్తార్ను రద్దుచేయడం ఇదే మొదటిసారి. ఇందుకు కారణం ఏంటో అధికారికంగా చెప్పకపోయినా.. జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ కూడా చేశారని అంటున్నారు. జూలై 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ హాజరు కావల్సి ఉంది. అయితే.. ఇలా ఇఫ్తార్ విందును రద్దు చేయడం వల్ల మైనారిటీలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇప్పటివరకు అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి వాళ్ల ఓట్లే పడుతున్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రశాంత కిషోర్ నేతృత్వంలోని బృందం రావడం వల్ల ఇప్పటికే పార్టీ బ్రాహ్మణ రంగు పులుముకున్నట్లు అయిందని, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో ఇలా చేయడం వల్ల మరింత నష్టం తప్ప లాభం ఏమీ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇఫ్తార్ విందుకు పెట్టదలచిన మొత్తాన్ని ముస్లిం పిల్లల సంక్షేమం కోసం ఖర్చుపెడతామని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. -
12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్
హైదరాబాద్: 'నా మాట అంటే మాటే. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తా. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం ఎంక్వైరీ కమిటీని వేశాం. కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అసెబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ముస్లిం రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఢిల్లీకి పంపిస్తాం. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విజయం సాధిస్తామన్న ధీమా ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ఆదివారం నిజాం కళాశాల మైదానంలో ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లింలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం విద్యార్థుల కోసం రూ.390 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 120 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ముస్లింల పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో హిందూ ముస్లింల సమైక్యతకు సంబంధించి ఒకనాటి గంగాజమున తహజీద్ ప్రపంచ ఖ్యాతి గడించిందని, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను గ్రహించి ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 200 మసీదుల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుల్లో లక్ష మంది ముస్లింలు ఆనందోత్సవాలతో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు శుభకాంక్షాలు తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రంజాన్ మాసం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాం సర్కార్ హాయాంలో సైతం లేని సత్ సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టింపజేశారన్నారు. రంజాన్ పండుగ కోసం పేద ముస్లింలకు ఒక కుర్తా పైజామా, రెండు చీరలతో కూడిన ప్యాక్ను కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయా, శాసనమండలి చెర్మైన్ స్వామి గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహ రెడ్డి, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, ఏసీబీ డీజే ఏకేఖాన్, మైనారిటీల సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఇరాన్ కన్సులేట్ జనరల్(హైదరాబాద్) హసన్ నౌరీన్, టర్కీ కాన్సులేట్ జనరల్ అర్డా ఉల్టాజ్, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు బొంతు రామ్మోహన్, బాబా ఫసియొద్దీన్, ఎమ్మెల్సీ యండీ సలీం తదితరులు పాల్గొన్నారు. అతిథులతో ఇఫ్తార్ విందుకు హాజరైన వారితో సీఎం కేసీఆర్ కలిసి విందు భోజనాన్ని ఆరగించారు. ఇఫ్తార్ అనంతరం ముస్లింలకు మగ్రీబ్ నమాజ్ చదువుకోడానికి ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు ఇఫ్తార్ విందుకు హాజరైన అనాథ ముస్లిం బాలబాలికలకు సీఎం కేసీఆర్ కానుకలు అందజేశారు. -
నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ దీక్షలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఆదివారం విందు ఏర్పాటు చేసింది. ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతోపాటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
జూన్ 26న 195 మసీదుల్లో ఇఫ్తార్ విందులు
- రూ.12 కోట్లతో 2లక్షల కుటుంబాలకు దుస్తుల పంపిణీ - రంజాన్ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 195 మసీదుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రంజాన్ పండుగ ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమీక్ష అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఇఫ్తార్ విందులను ఇస్తోందని, దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ ఏడాది ఇఫ్తార్ విందుల కోసం రూ.4 కోట్లు వెచ్చిస్తున్నామని, దాదాపు 2 లక్షల ముస్లిం కుటుంబాలకు రూ.12 కోట్లు వెచ్చించి దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సమీక్ష సమావేశంలో వక్ఫ్బోర్డ్ సీఈవో అసదుల్లా, ఈవో మునావర్, పలువురు ముస్లిం మతపెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
24న గుంటూరులో రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష గుంటూరు ఈస్ట్: ఈనెల 24న రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరిగే ఇఫ్తార్విందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరుకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 24వ తేదీ సాయంత్రం 6.47గంటలకు సన్నిధి కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకే సీఎం విచ్చేసే అవకాశముందని, నమాజ్,ఇఫ్తార్ విందు కార్యక్రమాలతో పాటు మత పెద్దలతో సమావేశమయ్యే అవకాశముందని తెలిపారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 2 వేల మంది హాజరుకానున్నారని చెప్పారు. అలాగే 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి తుళ్ళూరుకు విచ్చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ 6 వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ఎన్.టి.ఆర్. క్యాంటీన్ను ప్రారంభిస్తారని, అనంతరం రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్
గుంటూరు : ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూన్ 24న గుంటూరులో విందు ఏర్పాటు చేసినట్లు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం తెలిపారు. ఈ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ ఇఫ్తార్ విందు గుంటూరు నగరంలోని సన్నిధి ఫంక్షన్ హాల్ లో సాయంత్రం 6-8 గంటల మధ్య ఉంటుందన్నారు. హాల్ లోపల వేయిమంది, హాల్ బయట మరో వేయి మందికి సరిపడా ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. -
ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందు
న్యూఢిల్లీ: హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇవ్వనుంది. పార్లమెంటు భవనంలో జులై 2 న ఆ సంస్థ విభాగమైన ముస్లీం రాష్ట్రీయ మంచ్(ఎమ్ఆర్ఎమ్) ఈ విందును ఇవ్వనుందని సంస్థ ప్రతినిధి ఇంద్రేష్ కుమార్ తెలిపారు. పాకిస్థాన్ తో పాటు 140 దేశాల రాయబారులను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. ఈ విందులో ముస్లింలు, ముస్లిమేతర మేధావులు పాల్గొంటారని కుమార్ తెలిపారు. భారతదేశంలో అంన్ని మతాల వారికి భద్రత ఉంటుందని చాటడమే ఈ విందు ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి రక్షణ ఉంటుందని తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఎమ్ఆర్ఎమ్ ఛీఫ్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు. -
మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్ఫ్రెండ్తో..!
ముంబయి: మాజీ ప్రేమికులు ఒక్కచోట కలిశారు. బాలీవుడ్లో టాప్ మోస్ట్ చర్చించుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన ఒకప్పటి ప్రేయసి కత్రినా కైఫ్ మరోసారి ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఆదివారం రాత్రి రాజకీయ నేత బాబా సిద్దిఖీ బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అంతేకాదు సల్మాన్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న లులియా వాంటుర్ కూడా ఈ విందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్, ఎమీ జాక్సన్, గోల్డీ బెల్ ఇతర బాలీవుడ్ వర్గం కూడా ఇఫ్తార్ విందుకు హాజరయినట్లు తెలుస్తోంది. అయితే, లులియా ఈ విందుకు నిజంగానే వెళ్లిందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ, ఆమె భర్త ఆయుష్ శర్మ, వాళ్ల కుమారుడు అహిల్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. -
రాప్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇఫ్తార్ విందు
-
రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులలో జరిగే గోదావరి పుష్కరాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఆయన పుష్కర స్నానం చేస్తారు. -
ఆ ఇఫ్తార్ విందులో సామాన్యులు ఏరీ?
ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో.. సామాన్యులకు ఎక్కడా చోటు దొరకలేదు. మొత్తం అదంతా వీఐపీల వ్యవహారంలాగే సాగిపోయింది. ఎక్కడ చూసినా అంతా హై ప్రొఫైల్ రాజకీయ నాయకులే ఉన్నారు. సాధారణ 'వీఐపీ ఇఫ్తార్'ల కంటే ఇది విభిన్నంగా ఉంటుందని కేజ్రీవాల్ చెప్పినా.. వాస్తవానికి మాత్రం అక్కడ చేతులు కలుపుకొన్నది, అలయ్ బలయ్ ఇచ్చుకున్నది అంతా రాజకీయ నాయకులే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ లాంటి పెద్దలు కూడా హాజరవ్వడంతో కేజ్రీవాల్ చాలా సంతోషంగా కనిపించారు. వాస్తవానికి వీళ్లిద్దరితో కేజ్రీవాల్కు గత కొంత కాలంగా తీవ్ర విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ ఇఫ్తార్ విందుకు సామాన్యులు ఎవరికీ ఎంట్రీ లేదు. కేవలం 3వేల మంది ఆహ్వానితులను మాత్రమే లోనికి రానిచ్చారు. అయినా.. ఇక్కడకు వచ్చిన సామాన్యులను చూసి ఇతర రాజకీయ నాయకులు కూడా సంతోషించారని కేజ్రీవాల్ చెప్పారు! బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), టీఎంసీ.. ఇలా అన్ని పార్టీల వాళ్లనూ తాము పిలిచామని ఆయన అన్నారు. -
నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు
-
నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ దీక్షలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ నిజాం కాలేజీలో విందు ఏర్పాటు చేసింది. ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
ఈ నెల 12న ముస్లిం ఉద్యోగులకు సగం రోజు సెలవు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 వ తేదీన ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వీలుగా ముస్లిం ఉద్యోగులకు సంగం దినం (హాఫ్ డే) సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 న ఉదయం పూట విధులకు హాజరై, సాయంత్రం వివిధ ప్రాంతాల్లో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని ముస్లిం ఉద్యోగులను ముఖ్యమంత్రి కోరారు. జూలై 12 ఆదివారం అయినప్పటికీ కొన్ని శాఖల్లో, వీక్లీ ఆఫ్ విధానం పాటించే సంస్థల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. -
ఇఫ్తార్ విందు తిని.. 45 మంది ఉగ్రవాదుల మృతి
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు తిన్న 45 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు... ఆ విందులో పెట్టిన ఆహారం విషపూరితం కావడంతో మరణించారు. ఇరాక్లోని మోసుల్ ప్రాంతంలో జరిగిన ఇఫ్తార్ విందుకు మొత్తం 145 మంది హాజరయ్యారు. అయితే, బయటకు కేవలం 100 మంది మాత్రమే సజీవంగా బయటకు వచ్చారు. ఎవరైనా కావాలనే వాళ్ల ఆహారంలో విషం కలిపారా.. లేదా ప్రమాదవశాత్తు వాళ్లు తిన్న ఆహారం విషపూరితం అయ్యిందా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను విషాహారంతో చంపడం మాత్రం ఇది తొలిసారి కాదు. నవంబర్ నెలలో ఫ్రీ సిరియన్ ఆర్మీ రెబల్ గ్రూపు ఇస్లామిక్ స్టేట్ శిబిరంలోకి చొరబడినప్పుడు కూడా ఇలాగే చాలామంది ఉగ్రవాదుల భోజనాల్లో విషం కలిపి వాళ్లను హతమార్చారు. అప్పట్లో కనీసం 10 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సిరియా ప్రభుత్వ వర్గాలు, ఐఎస్ఐఎస్ ప్రకటించాయి. తాజా ఘటనలో ఏకంగా 45 మంది ఒకేసారి మరణించడం గమనార్హం. -
ఈసారైనా బాబు, కేసీఆర్ కలుస్తారా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ నెల 10న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాజ్భవన్లో ఈ విందు ఏర్పాటు చేస్తారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులకు ఆహ్వానం అందింది. కాగా వర్షాకాల విడిదికోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరుకాగా, కేసీఆర్ దూరంగా ఉన్నారు. అనారోగ్యంగా కారణంగా కేసీఆర్ గైర్హాజరయినట్టు చెప్పారు. ఇక రాష్ట్రపతి ఇచ్చిన విందులో కేసీఆర్ పాల్గొనగా, చంద్రబాబు జపాన్ పర్యటన కారణంగా వెళ్లలేకపోయారు. ఓటుకు కోట్లు కేసు అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విబేధాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ విందుల్లో చంద్రబాబు, కేసీఆర్ పాల్గొంటరా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
-
మంచి రోజులు రావాలి
సాక్షి, కడప : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష చేస్తున్నారు. అలా్లహ అందరినీ చల్లంగా చూడాలి. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం.. అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే అంజాద్బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంతకు ముందు కడపకు చేరుకున్న జననేతకు ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చుతూ పూలతో కడపకు ఆహ్వానించారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో కడప కార్పొరేటర్లు మర్యాద పూర్వకంగా వైఎస్ జగన్ను కలిసి చర్చించారు. ప్రతిపక్ష నేత కూడా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ పనిచేయాలని సూచించారు. అనంతరం వైఎస్ జగన్ కొద్దిసేపు ప్రజలతో సమస్యలు తెలుసుకుంటూ మమేకమయ్యారు. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ కడప ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ అధ్యక్షుడు అంజాద్బాష ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి నేరుగా పెద్దదర్గా చేరుకుని అక్కడ ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత అమీన్ ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ రంజాన్ మాసం విశిష్టతను వివరిస్తూ ముస్లింలకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యేలు అంజద్బాష, చాంద్బాషలు వైఎస్ జగన్కు పండ్లు తినిపించారు. వైఎస్ జగన్తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మేయర్ సురేష్బాబు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ముస్లిం నాయకుడు ముక్తియార్, కడప నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మరథం పట్టిన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ముగించుకున్న తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇడుపులపాయకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ప్రతిపక్ష నేతను కలిసేందుకు ముస్లిం సోదరులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఏ ఒక్కరినీ నిరుత్సాహానికి గురి చేయకుండా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వాహనం వద్దకు భారీగా వచ్చిన ముస్లిం మైనార్టీలు దాదాపు ఫంక్షన్ హాలునుంచి కిలోమీటరు దూరం మేర జగన్ కాన్వాయ్ వెంట నడిచారు. ముస్లింలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కడపలో ప్రతిపక్ష నేత పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కనిపించిన ప్రతిచోట అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జగన్నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. -
సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు!
సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్.. వీళ్లంతా బాబా సిద్దిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో మెరుపులు మెరిపించారు. అయితే అందరి కళ్లూ కింగ్ ఖాన్ కోసం ఎదురు చూసినా.. ఆయన మాత్రం ఈ విందుకు హాజరు కాలేదు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా షారుక్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ పార్టీకి మాత్రం షారుక్ రాలేదు. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్ల పక్కనే కూర్చుని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా తన డిన్నర్ చేసింది. ఈ ఇఫ్తార్ విందులో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ కూడా పాల్గొన్నారు. హుమా ఖురేషి, కబీర్ ఖాన్, జరైన్ ఖాన్, సంగీతా బిజ్లానీ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు టీవీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చారు. బాబా సిద్దిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ గత రెండేళ్లుగా పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా.. దీనికి మాత్రం తప్పనిసరిగా హాజరయ్యేవాళ్లు. ఈసారి మాత్రం షారుక్ డుమ్మా కొట్టాడు. -
ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు, వరాలు
రంజాన్ సందర్భంగా ఈనెల 8వ తేదీన హైదరాబాద్లోని నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మసీదులలో పనిచేసే ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు నమాజులకు పిలుపునిచ్చే మౌజమ్లకు కూడా ఈ భృతి ఇస్తామన్నారు. గురువారం పలువురు సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఈనెల 8న నిజాం కాలేజి వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తాం నాతోపాటు అందరు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిసత్ఆం హైదరాబాద్లో సీఎస్ ఆధ్వర్యంలో జీఏడీ నిర్వహిస్తుంది జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది హైదరాబాద్ నగరంలో వంద మసీదులలో ఈసారి ప్రభుత్వం పక్షాన దావతె ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నాం జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక మసీదులో ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్ విందులు ఇస్తాం ప్రతి మసీదు వద్ద వెయ్యిమందికి భోజన ఏర్పాట్లు చేస్తాం రంజాన్ సందర్భంగా 1.95 లక్షల మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రూ. 500 విలువైన దుస్తులు పంచిపెడతాం మసీదుల ఇమాంలు, కమిటీ ఆధ్వర్యంలో వీటిని పంచుతారు 1.95 లక్షల మందికి అదే రోజు భోజనాలు కూడా ఏర్పాటుచేస్తాం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఈ రంజన్ నుంచి మొదలుపెట్టి తెలంగాణలోని 5వేల మసీదుల ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తాం మసీదు కమిటీలు సమకూర్చేదానికి ఇది అదనం రంజాన్కు మొత్తం రూ. 26 కోట్ల ఖర్చు అవుతోంది ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు విజ్ఞప్తి ఇప్పుడు 1.95 లక్షల మందితో ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది నుంచి అవసరమైతే పెంచుతాం రూ. 25 లక్షలతో మొత్తం రాష్ట్రంలోని అనాథ శరణాలయాల పిల్లలకు 8వ తేదీన భోజనాలు ఏర్పాటుచేస్తున్నాం ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమం సాఫీగా సాగేలా చూడాలి. -
కేసీఆర్ వచ్చి ఉండాల్సింది!
గవర్నర్ ఇఫ్తార్ విందుకు రాకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య మైనారిటీల అభివృద్ధికి అందరూ కట్టుబడాలన్న గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చి ఉండాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజ్భవన్లో బుధవారం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ రాకపోవడంతో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. విందుకు హాజరైన తెలంగాణ మంత్రులతో చంద్రబాబు సరదాగా మాట్లాడారు. ఈ విందుకు చంద్రబాబు, వైఎస్ జగన్తో పాటు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీసీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల , నాయిని ్డ, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల , వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, సీపీఐ ఇరు రాష్ట్రాల కార్యదర్శులు వెంకటరెడ్డి, రామకృష్ణ, సీపీఎం ఎమ్మెల్యేరాజయ్య , ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల డీజీపీలు అనురాగ్ శర్మ, జేవీ రాముడు, అధికారులు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు: చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా నమస్కరించగా.. ఆయన ప్రతి నమస్కారం చేశారు. ఫొటోలు దిగుతున్న సందర్భంలో ‘జగన్’ అని పిలిచి మరీ ఫోటో దిగేందుకు రావాలని గవర్నర్ నరసింహన్ కోరారు. ఇఫ్తార్ విందు తర్వాత బయటకు వెళుతున్న సమయంలో వైఎస్ జగన్ను టీ-కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. -
ముస్లింల అభివృద్ధికి కృషి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మహ్మద్ సలీంకు సీఎం కేసీఆర్ ఖర్జూరం తినిపించి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ కలిపింది ఇద్దరినీ
ఉప్పూ నిప్పులాగా ఉండే బాలీవుడ్ సూపర్స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లిద్దరు మరోసారి కలుసుకోవడంతో వీరి అభిమానుల సంతోషానికి హద్దే లేకపోయింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఇఫ్తార్ పార్టీలో కలిశారు. కొంతకాలంగా వీరిమధ్య నెలకొన్న విబేధాల వల్ల దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖాన్లు హఠాత్తుగా కలుసుకోవడం ఇఫ్తార్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ ఆదివారం రాత్రి ముంబైలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ప్రతి సంవత్సరం మాదిరిగానే సల్మాన్, షారుఖ్ను కూడా ఆహ్వానించారు. దీంతో ఈ బడా హీరోలిద్దరూ బాబా ఆహ్వానం మేరకు ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఒకరికొకరు తారసపడగానే షేక్హ్యాండ్ ఇచ్చుకొని ఆలింగనం చేసుకున్నారు. ‘కరన్ అర్జున్’ సినిమాకు ముందు వీరి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. కొంత కాలంగా దూరం పెరిగింది. కారణాలేంటన్నది తెలియకపోయినప్పటికీ వీరిద్దరి శత్రుత్వం గురించి బాలీవుడ్లో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. విశేషమేమంటే 2013 జులై 21న బాబా ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఖాన్లు కలిశారు. దీంతో వీరి మధ్య దూరం తగ్గిందని, మళ్లీ సినిమాలు తీస్తారని భావించారు. ఇఫ్తార్ ముగిసిన తరువాత తిరిగి ఎప్పుడూ కలుసుకోలేదు. మళ్లీ ఆదివారం నాటి ఇఫ్తార్ పార్టీలోనే ఈ సూపర్స్టార్లు మెరిశారు. ఇక్కడ వీళ్లిద్దరు ఎంతో స్నేహంగా మెలిగినా, ఇద్దరి మధ్య శత్రుత్వం మాత్రం తొలగిపోలేదని పార్టీకి వచ్చిన వారిలో కొందరు అభిప్రాయపడ్డారు. వైరాన్ని పక్కనబెట్టి మళ్లీ స్నేహితులుగా మారాలని షారుఖ్, సల్లూభాయ్ అభిమానులు కోరుకుంటున్నారు. షారుఖ్ ఇటీవలి సినిమాలు జబ్ తక్ హై జాన్, చెన్నయ్ ఎక్స్ప్రెస్ భారీ విజయం సాధించాయి. సల్మాన్ జై హో మాత్రం హిట్ కొట్టలేకపోయింది. -
ఇఫ్తార్ విందులతో మత సామరస్యం
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి చేవెళ్లలోని అరుణ గార్డెన్స్లో కాంగ్రెస్ నియోజకవర్గ యువజన శాఖ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అందరం కలిసిఉంటే సమాజ ప్రగతి వేగవంతంగా జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఆర్అండ్బీ అతిథిగృహంలో స్థానిక నాయకులతో స్థానిక సమస్యలు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశం గుప్తా, వైస్చైర్మన్ పి.గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ విజయభాస్కర్రెడ్డి, సీనియర్ నాయకులు గుడుపల్లి నర్సింహారెడ్డి, ప్రకాశ్గౌడ్, బర్కల రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జంగం శివానందం, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. -
ముస్లిం సోదరులకు వైయస్ విజయమ్మ ఇఫ్తార్ విందు