
'జన్మభూమి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు'
తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జన్మభూమి సభల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు.
కమలాపురం: తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జన్మభూమి సభల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన కమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని, రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల అర్జీలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించనప్పుడు జన్మభూమి సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.