ravindranath reddy
-
జగన్ ఎప్పుడో చెప్పారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చేది..
-
పరిపాలన మీద దృష్టి లేదు.. వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు..
-
ప్రజల ఆరోగ్యంతో బాబు చెలగాటం..
-
పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రవీంద్రనాథ్ రెడ్డి
-
‘పవన్.. మీ గొంతు మూగబోయిందా?’
వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతులు కష్టాలు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచను అని హామీ ఇచ్చి పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చుగా..?, ప్రశ్నించే గొంతు మూగబోయిందా..? మీరు అధికారంలో ఉన్నా జగన్ను మాత్రమే ప్రశ్నిస్తావా’ అంటూ ధ్వజమెత్తారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీవో జవహర్బాబును పరామర్శించడానికి పవన్ ఆగమేఘాలపై వచ్చారు. ఎవర్ని పరామర్శించినా ఆహ్వానించదగినదే. అయితే జరిగిన సంఘటన ఎంత తీవ్రమైంది అనేది కూడా చూడాలి. ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు. అక్కడ ఎంపీపీ(MPP) ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు. ముందుగా పథకం ప్రకారం ఎంపీడీవోపై దాడి అంటూ వందల మంది టిడిపి వారు వచ్చేసారు. టీడీపీ వారు రావడంతో అక్కడే తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీడీవోపై కుర్చీ పడి దెబ్బ తగిలింది. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ చార్జీలపై మేం చేసే పోరుబాటను డైవర్ట్ చెయ్యడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ను పంపుతున్నారు. గాలివీడు సంఘటనను కూడా అలాగే ఉపయోగించుకున్నారు. ముందుగానే ఎవరిపై కేసు పెట్టాలో కూడా నిర్ణయించుకున్నారు. ఎంపీడీవోకి ఏమీ కాకపోయినా ఆయన్ను రిమ్స్కి తెచ్చి హడావుడి చేశారు. సింహాద్రిపురం మండలం దుద్దెకుంటలో ఒక రైతు కుటుంబం చనిపోయింది. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల, పంట నష్టం ఇవ్వని కారణంగా ఆ రైతు కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టారు అదే జగన్(YS Jagan) ఉంటే ఆ రైతు కుటుంబం చనిపోయేది కాదు. ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ రైతు కష్టాలపై ఎందుకు ప్రశ్నించరు...?, ఇంత దూరం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..?, చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు...?, ఉక్కు ఉద్యోగుల తరఫున పవన్(Pawan Kalyan) ప్రశ్నించవచ్చుగా..?, పిఠాపురంలో జాన్ అనే జనసేన నాయకుడు ఓ మైనర్ బాలికను రేప్ చేస్తే ఎందుకు పరామర్షించలేదు..?, మీ ఎమ్మెల్యే నానాజీ ఒక సీనియర్ ప్రొఫెసర్ పై దాడి చేస్తే నువ్వు ఎందుకు కట్టడి చేయలేదు..?, కానీ డైవర్ట్ చెయ్యడానికి గాలివీడు వచ్చి చంద్రబాబు చెప్పినట్లు నటిస్తున్నాడు. మీ నాటకాలన్నీ ప్రజలు చూస్తున్నారు..ప్రజలే బుద్ధి చెప్తారు’ అని మండిపడ్డారు రవీంద్రనాథ్రెడ్డి. -
జగన్ ఇంటిపై రాళ్ళ దాడి.. ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్
-
‘వైఎస్ జగన్కు ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదు’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదన్నారు ఆ పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి. స్వయంకృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రవీంద్రనాథ్రెడ్డి గుర్తుచేశారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు(Huge Crowd) పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదారణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్రనాథ్రెడ్డి(Ravindranath Reddy) మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంటిపై రాళ్ల దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తుంటే, దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాయడం నిజంగా సిగ్గుచేటన్రారు. ప్రస్తుతం రాష్ట్రంలో దరిద్రమైన పాలన కొనసాగుతోందని రవీంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. -
ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్
-
మీరు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం.. చంద్రబాబు పై ఫైర్
-
తన్నే గాడిదను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు రవీంద్రనాథ్
-
చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
కూటమి ప్రభుత్వంపై రవీంద్రనాథ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
మీ యాక్షన్'కి 10 రెట్లు రియాక్షన్ ఉంటుంది.. రవీంద్రనాథెడ్డి వార్నింగ్
-
కూటమి ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు
-
బాబు మోసంపై కూటమి నేతలు నోరు మెదపరేం
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడుగతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడురాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. -
బీటెక్ రవి, పోలీసులకు వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
-
టీడీపీ నేతలకు రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ వార్నింగ్
-
అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. ప్రేమోన్మాది ఘటనపై రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
-
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
పాలిచే ఆవును వదులుకొని దున్నపోతును తెచ్చుకున్నాం..
-
‘టీడీపీ ఆఫీస్లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదంటూ వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారని.. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వంద రోజుల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు తప్పు చేశామని బాధ పడుతున్నారు.. పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని ఆవేదన పడుతున్నారు. ఓ పక్క దోపిడీ, మరో పక్క వైఎస్సార్సీపీ వారిపై దాడులు. వరదలు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ బోటు అంటూ ఆరోపించారు. తీరా చూస్తే అది టీడీపీ నేతకు చెందిన బోటు. ఆ తర్వాత కాదంబరి అనే మహిళ వ్యవహారం తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నిక రాజకీయ కుట్రలు చేసినా కానీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు మర్చిపోరు’’ అని రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రతిష్టను దెబ్బతెస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నెయ్యి వచ్చింది. టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు. సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే. మార్చి 16 నుంచి మా ప్రమేయం లేదు. తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ సీఎఫ్టీఆర్ఐకి పంపుతారు. కానీ దీన్ని గుజరాత్ ఎన్డీడీబీకి పంపారు’’ అని రవీంద్రనాథ్రెడ్డి వివరించారు.ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం‘‘ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ ఛైర్మన్ వర్షా ఇద్దరూ శ్యామలరావును కలిశారు. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. గూడుపుఠాణి చేసి జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి..?. ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్లో విడుదల చేయడం ఏంటి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది. హిందువులను వైఎస్ జగన్కు దూరం చేయాలని ఈ కుట్ర పన్నారు. లడ్డూనే కాదు.. ఏ ఆహార పదార్థాల్లోనైనా జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు’’ అని రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు.‘‘వైఎస్ జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడు. వైఎస్సార్సీపీ వారికి నోటీసులు ఇచ్చి, పోలీసులతో అడ్డుకున్నారు. 30 యాక్ట్ పెట్టీ వైఎస్సార్సీపీ వారినే ఆడ్డుకుంటారా. ? ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా .?. నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో.’’ అని రవీంద్రనాథ్రెడ్డి సవాల్ విసిరారు.‘‘వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు.. సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.. నీకు బుద్ధి చెప్తారు. నిన్న వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు. పవన్ కళ్యాణ్.. తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు. ప్రశ్నిస్తాను అన్నాడు.. పిల్లల మిస్సింగ్ అన్నావు. డిప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు ?. వరదల్లో కనీసం బయటకు వచ్చావా .? ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్లీ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అంటూ రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నేత అయితే చాలు.. టీడీపీ కక్ష సాధింపు చర్యలు.. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది
-
మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు. ఇదే సమయంలో వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.అయితే, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
అమ్మకు వందనం అన్నారు.. వందకు మద్యం మాత్రం ఇస్తున్నాడు
-
చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
-
అమరావతి పరిస్థితిని బట్టి చంద్రబాబు పాలన ప్రజలకు అర్థమైంది
-
మితిమీరిన టీడీపీ ఆగడాలు.. రవీంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు, పవన్ గ్రామ సభలపై రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
-
‘పవన్ కల్యాణ్ గ్రామ సభలకు ప్రజల స్పందన శూన్యం’
వైఎస్సార్ కడప, సాక్షి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 13 వేల కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధ పడుతున్నారు. .. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుండి స్పందన లేదు. సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేసేందుకు సిద్ధం. చంద్రబాబు 2014లో మోసం చేశారు.. ఇప్పుడు కూడా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’’ అని అన్నారు. -
చంద్రబాబూ.. నీ సంపద సృష్టి ఎక్కడ?: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంతా మోసం, దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఇదే సమయంలో సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.కాగా, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 14వేల కోట్లు అప్పు చేసి పెన్షన్లు, ఉద్యోగస్థులకు జీతాలు మాత్రమే ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగస్థులకు పెన్షన్లు అందివ్వలేని ప్రభుత్వం ఇది. రెండున్నర నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు కాలేదు. నేను సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. ఎక్కడ నీ సంపద సృష్టి. అనేక అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. ప్రజలందరూ పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. చంద్రబాబు సీఎం అయ్యాక తన నైజాన్ని ప్రజలకు మరోసారి చూపించాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలావే పెడుతున్నాడు.. నేను బిర్యానీ పెడతానని ఓట్లు దండుకున్నాడు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు అంతా మోసం, దగా. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి.మద్యం ప్రియులకు కొత్త పాలసీ అంటూ కూటమి సర్కార్ మోసం చేస్తోంది. ఉచిత ఇసుక పాలసీ అంటూ ఎక్కువ ధరలకు అమ్ముతోంది. రైతన్నకు అన్నదాత సుఖీభవ అంటూ దగా చేసింది. స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం అంటూ పంగనామం పెట్టింది. ఇవాళ ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయారు. సంపద సృష్టిస్తామన్న బాబు ప్రభుత్వంలో మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ రాబోతోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు, హత్యలు ఎక్కువయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులపైనా, వారి మద్దతుదారులపైనా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.పవన్పై సెటైర్లు..ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వీటిపై చంద్రబాబు స్క్రిప్టు రాలేదేమో.. వస్తే యాక్టర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటా. రాష్ట్రంలో జూదం, మట్కా, దొంగ సారాయి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇసుక, మట్టి అక్రమ రవాణా పేట్రేగిపోతోంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వక్స్ బోర్డ్ చట్ట సవరణ సమంజసం కాదని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలో కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటేనే ఎన్డీయే కూటమికి వైఎస్సార్సీపీ సపోర్టు చేసేది. ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అందరికీ గౌరవం ఇచ్చేటట్టుగా మెలగాలని హితవు పలికారు. -
వైఎస్ఆర్ సీపీ ఓటమిపై రవీంద్రారెడ్డి రియాక్షన్
-
రైతుల నీటి కష్టాలు తీర్చాం : రవీంధ్రనాథ్ రెడ్డి
-
దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ -
చెన్నైకి బీటెక్ రవి పరార్!.. కీలక నేత సాయంతో జంప్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ను ధ్వంసం చేసి అనంతరం కనిపించకుండా పోయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల కళ్లుగప్పి చెన్నై చేరుకున్నట్లు సమాచారం. మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి 30 ఆదివారం వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో ఈ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుని తన పొలిటికల్ గాడ్ఫాదర్ను ఆశ్రయించి గట్టెక్కే మార్గం సూచించాలని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆ గాడ్ఫాదర్ స్పెషల్ ఫ్లయిట్లో మంగళవారం చెన్నైకి చేర్చారు. అందుకే బీటెక్ రవి దౌర్జన్యం.. పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యం చేయగలిగామని చెప్పుకునేందుకు బీటెక్ రవికి ఇప్పుడు రాజకీయ అవసరం ఎంతో ఉంది. అందుకు.. తిరగబడే స్వభావం తక్కువగా ఉన్న చక్రాయపేట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వెంచర్ను ధ్వంసం చేయడానికి అసలు కారణం అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డ బీటెక్ రవిని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్లో తన పొలిటికల్ గాడ్ఫాదర్ను ఆశ్రయించారు. దీంతో, బీజేపీలో కొనసాగుతున్న పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. అనంతరం.. సీఎం రమేష్, ఎం.రవీందర్, పి.శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు. అయితే, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్గా మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు.. చక్రాయపేట ఘటనలో 32మందిని గుర్తించి వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే, వీరందరినీ ముందుండి నడిపించిన బీటెక్ రవి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, మరో పేరుతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నీతి, నిజాయితీ, దమ్మూ, ధైర్యం ఉంటే సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురా.. నీ నిజాయితీ నిరూపించుకో..’ అంటూ నిజమైన్ వెంచర్ యజమానులు ఆ పోస్టులో సవాల్ విసురుతున్నారు. ఇది కూడా చదవండి: దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత -
సుందర నగరంగా కడప
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా, నగర మేయర్ సురేష్బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ కె.సురేష్బాబు అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఆహ్వానితులుగా హాజరు కాగా, మున్సిపల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కడప నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. పేదవ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త పన్ను (క్లాప్ కార్యక్రమం), ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. కడప నగర మేయర్ కె.సురేష్బాబు మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతోపాటు నగర సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఎదురైన సమస్యలపై నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరిచిన తొమ్మిది అంశాలతోపాటు ప్రధానంగా నగరంలోని అన్ని బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, తాగునీటి వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగు పరిచేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్బేగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి
సాక్షి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ క్యాడర్లోనూ వారి పెత్తనం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు ఏకమై సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లకు ఏకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి (వాసు), పులివెందులకు చెందిన బీటెక్ రవిలు పార్టీలో మితిమీరిన జోక్యంతో టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను కాదని సదరు నేతలు వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వాసు, బీటెక్ల ప్రోత్సాహంతో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు నియోజకవర్గాల పరి«ధిలోని రెండవ శ్రేణి నేతలు ఇన్చార్జిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ఇన్చార్జిలను కాదని ఈసారి ఎన్నికల్లో మీకే టిక్కెట్లు అంటూ ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతమున్న ఇన్చార్జిలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ ఈసారి కూడా తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాసు, బీటెక్ రవిలు పుట్టాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పుట్టా వర్గం ఆరోపిస్తోంది. ►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతోనూ వాసు, బీటెక్ రవిలకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయమ్మ తనయుడు నితేష్కుమార్రెడ్డి వాసు వ్యవహార శైలిని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ►ఇక రాజంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చెంగల్రాయులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో వాసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అక్కడున్న కొందరు నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇక్కడ కూడా వాసు మితిమీరిన జోక్యంతోనే ఆ పరిస్థితి తలెత్తినట్లు సొంత పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ►కడప నియోజకవర్గంలోనూ వాసు జోక్యంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా వాసు పోటీలో ఉంటారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే కడప అసెంబ్లీ స్థానం నుంచి మైనార్టీలను కాదని ఈసారి ఎన్నికల్లో తన సతీమణిని నిలబెట్టాలని వాసు ఉద్దేశంగా కనబడుతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్న ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్బాబు తదితరులు వాసు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ►పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వాసు, అటు బీటెక్ రవిలు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్యాదవ్, మల్లెల లింగారెడ్డి, నితీష్కుమార్రెడ్డి తదితరులు చంద్రబాబు, లోకేష్లకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మితిమీరిన జోక్యంతోనే జిల్లాలో అరకొరగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ►ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీమంత్రి పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్తోపాటు మండిపల్లి రాంప్రసాద్రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాంప్రసాద్రెడ్డి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలిశారు. అయితే వాసు స్వయాన సోద రుడైన రమేష్రెడ్డి సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. వాసు, బీటెక్లు రమేష్రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఆయన టిక్కెట్ తనకేనంటూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఈ దఫా ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్ వస్తుందని వరదరాజులరెడ్డి వర్గం సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పొలిట్బ్యూరో సభ్యులు వాసు, బీటెక్ రవిలు ప్రవీణ్కుమార్రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అభ్యర్థి తమ నేతేనని వీరశివారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. దీని వెనుక వాసు, బీటెక్ రవి జోక్యం ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. -
ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ ట్రెండ్ సెట్టర్స్
సాక్షి, అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలని బాగా ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. అసెంబ్లీ మూడో రోజు సోమవారం ‘విద్య, వైద్యంలో నాడు–నేడు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇదీ చదవండి: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ -
పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లె: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్కుమార్రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని రూ.20 కోట్లకు అమ్ముకోవాలని చూశారని.. అలాంటి వ్యక్తి వెంట ఎలా నడవాలని పలువురు ముఖ్య నేతలు సతీష్రెడ్డి ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. తమను బీటెక్ రవి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ రవిని నమ్మితే నట్టేట మునుగుతామని తేల్చి చెప్పారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ శంకించారు: సతీష్రెడ్డి 30 ఏళ్లపాటు తాను నిజాయితీగా పనిచేసినా చంద్రబాబు, లోకేశ్ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడారని సతీష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్రెడ్డి తేల్చి చెప్పారు. ఇందుకు చంద్రబాబును ఒప్పిస్తామని, త్వరలోనే కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, పార్టీని వదిలి వెళ్లిపోయిన సతీష్రెడ్డిని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవడంపై బీటెక్ రవి, ఆయన వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్రెడ్డి సమావేశ వివరాలను బీటెక్ రవి చంద్రబాబు, లోకేశ్తోపాటు పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాను కూడా చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటానని బీటెక్ రవి తేల్చి చెప్పినట్టు సమాచారం. పులివెందులలో అరకొరగా ఉన్న టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి రచ్చకు దిగడంపై ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో పులివెందులలో టీడీపీ వర్గపోరు మరింత రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం సతీష్రెడ్డితో సమావేశమైన వారిలో తొండూరు మాజీ జెడ్పీటీసీ శివమోహన్రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు తూగుట్ల సిద్ధారెడ్డి, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, చక్రాయపేట టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, భాస్కర్రెడ్డి, ఓబుళరెడ్డి, హరినాథరెడ్డిలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. -
వివేకా హత్య వెనుక మహాశక్తులను వెలికి తీయాలి
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న మహాశక్తులను వెలికి తీయాల్సిన బాధ్యత సీబీఐ అధికారులపై ఉందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోందని, దీని వెనుక హైలెవెల్ మేనేజ్మెంట్ జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ఈ కేసు విషయాలు తెరపైకి వస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా జరుగుతోందన్నారు. 2019 ఎన్నికలు జరిగినప్పుడు, ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఇదే తరహా వార్తలు ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సీన్ తయారు చేసుకుని, తర్వాత ఆర్టిస్టులు, సినిమా బయటికి వస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి దర్శకత్వం వహించేది ఎవరో తేలాల్సి ఉందన్నారు. అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా వైఎస్ అవినాష్రెడ్డి పేరు లేకపోయినా కొన్ని పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకా సౌమ్యుడని, బుద్ధుడికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఆయన్ని ఆ రకంగా హత్య చేయడం దురదృష్టకరమన్నారు. బెంగళూరు రియల్ ఎస్టేట్ దందా వెనుక ఎవరున్నారో వెలికితీయాలన్నారు. -
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మేజార్టీతో గెలుస్తాం
-
అక్రమ నీటి వాడకాన్ని తెలంగాణ వెంటనే ఆపాలి
వల్లూరు: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ చేస్తున్న అక్రమ నీటి వాడకాన్ని వెంటనే ఆపాలని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి 114 టీఎంసీల నీటిని కృష్ణా ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ఈ జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, చెన్నై తాగు నీటి పథకాలతో బాటు కేసీ కెనాల్ సప్లిమెంటేషన్కు నీళ్లు అందించాల్సి ఉందన్నారు. అయితే జలాశయంలో 854 అడుగులకు నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. 881 అడుగుల నీటి మట్టం ఉంటే గరిష్టంగా 44 వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆ స్థాయిలో నీటి మట్టం ఏటా సగటున పక్షం రోజులు కూడా ఉండటం లేదని వివరించారు. కాగా, 800 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా పాలమూరు– రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ద్వారా తెలంగాణ రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించడానికి అవకాశం ఉందన్నారు. దీనికి తోడు 796 అడుగులకు లోపు నీటి మట్టం ఉన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ రోజు 4 టీఎంసీల నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. దీని ఫలితంగా శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతూ ఉండటంతో కేటాయింపులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా వాడుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించి రాష్ట్రానికి న్యాయంగా కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకుని కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగు నీటిని అందించాలనే ధ్యేయంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి నీటిని ఎత్తి పోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. -
నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ఓ యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. సరిగ్గా నెల రోజుల్లో వివాహం. ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆ యువకుడు(బ్యాంకు ఉద్యోగి) దారుణహత్యకు గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన నగరంలోని కరెంట్ ఆఫీసు సెంటర్ కార్జోన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని విక్రమ్నగర్ చాముండేశ్వరి అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్–301లో మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శంకరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆయన నగరపాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన మొదటి భార్య సీతారావమ్మ చాలాకాలం క్రితం మృతిచెందింది. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య మరణాంతరం ఆయన శంకరమ్మను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు రవీంద్రనాథ్రెడ్డి(25) ఆయన చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. రెండేళ్లుగా సంగంలోని ఫెడరల్ బ్యాంకులో లోన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. రవీంద్రనాథ్రెడ్డికి గత నెలలో హరనాథపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. జనవరి 8వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అందుకు తగిన ఏర్పాట్లను కుటుంబసభ్యులు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన రవీంద్రనాథ్రెడ్డి విజయవాడలో ఆఫీసు మీటింగ్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. 6వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి కుటుంబసభ్యులకు తెలిపాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి నెల్లూరుకు సమీపంలో ఉన్నానని కొద్దిసేపట్లో బస్సు దిగుతానని చెప్పాడు. కుటుంబసభ్యులు అతని కోసం వేచిచూడసాగారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!) ఈ క్రమంలో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో రవీంద్రనాథ్రెడ్డి తన తండ్రికి ఫోన్ చేసి కరెంట్ ఆఫీసు సెంటర్ కారుజోన్ వద్ద ఉన్నానని, తనను ఎవరో కత్తులతో పొడిచారని మాట్లాడలేక ఉన్నానని చెప్పాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి తన మేనల్లుడు శ్యామ్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం భార్య, మేనల్లుడుతో కలిసి శ్రీనివాసులురెడ్డి అక్కడికి వెళ్లేసరికే వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావు, ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలంలో ఉన్నారు. తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రవీంద్రనాథ్రెడ్డిని జీజీహెచ్కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ మేరకు బాధిత తండ్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హుస్నాబాద్లో విషాదఛాయలు) 45 నిమిషాల్లో ఏం జరిగింది..? కొద్దిసేపట్లో బస్సు దిగుతానని రవీంద్రనాథ్రెడ్డి తన తండ్రికి రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేశాడు. 12.15 గంటలకు తనను ఎవరో పొడిచారని ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు ఆ 45 నిమిషాల్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. బస్సు దిగిన వ్యక్తి కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద ఎందుకు దిగాల్సి వచ్చింది?.. అతనిని హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి కాల్ డీటైల్స్, హత్య జరిగిన సమయంలో సెల్ఫోన్ టవర్ డంప్లను పరిశీలిస్తున్నారు. కరెంట్ ఆఫీసు సెంటర్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రవీంద్రనాథ్రెడ్డి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. అసలు అక్కడ ఎందుకు ఉన్నాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద రవీంద్రనాథ్రెడ్డి హత్య మిస్టరీగా మారింది. అతనికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఇతరత్రా వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై టీడీపీ దుష్ప్రచారం
కడప కార్పొరేషన్: కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డిపై టీడీపీ పొలిటికల్ విభాగం దు్రష్పచారానికి ఒడిగట్టింది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి తప్పుడు ప్రచారానికి తెరతీసింది. దీనిపై ఎమ్మెల్యే సీరియస్గా స్పందిస్తూ టీడీపీ నాయకులు ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని, క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మేనమామ అయినందునే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప, ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదని రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. -
‘ఆర్టీసీని టీడీపీ భ్రష్టు పట్టించింది’
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే ఆర్టీసీ ఆస్తుల విక్రయానికి పునాది పడిందన్నారు. టీడీపీ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూములు లీజుపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.(చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) కార్మిక సంఘాలపై ఆర్టీసీ అధికారులు కక్ష ధోరణితో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు విషయంపై కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీడీపీ.. ఆర్టీసీని భ్రష్ఠు పెట్టించిందని, ఏడు వేల కోట్లు అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ విలీనం ద్వారా 3,600 కోట్ల రూపాయలు భారమైనా వేతనాలు చెల్లిస్తున్నామని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. (చదవండి: ఆ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్) -
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం టీచర్ల నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పెండింగ్లో ఉన్న డీఎస్సీ–2018 ఉపాధ్యాయ నియామకాలకు మోక్షం లభించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ కన్వీనర్ కె.రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జరిగిన డీఎస్సీ–2018 కౌన్సెలింగ్ ప్రక్రియను రవీంద్రనాథ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 ప్రక్రియ పరీక్షలకే పరిమితమైందన్నారు. న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా చేపట్టిన కౌన్సెలింగ్లో 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే జాబితాల విడుదల, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ చేపట్టి నియామకాలను పూర్తి చేశామన్నారు. -
‘కష్ట సమయంలోనూ మాట నిలుపుకున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా కష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు నగదును జమచేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కమలాపురం వెలుగు కార్యాలయం ఆవరణలో ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మెగా చెక్కును ఆయన పంపిణీ చేశారు. (చదవండి: అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా) ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 3874 మహిళా సంఘాలకు మొదటి విడతగా 32 కోట్ల 47 లక్షల 81 వేల రూపాయలు లబ్ధి చేకూరింది. కమలాపురం మండలంలో ‘వైఎస్సార్ ఆసరా’ కింద మొదటి విడతగా 800 మహిళా సంఘాలకు గాను 6 కోట్ల 53 లక్షల 29 వేల రూపాయల విలువ కలిగిన మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అందజేశారు. -
'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు'
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైఎస్ జలయజ్ఞం ప్రవేశ పెట్టారు. ఆయన హయాంలో తెలంగాణ లో 60 శాతం ప్రాజెక్టులు నిర్మిస్తే 40 శాతం ప్రాజెక్టులు రాయలసీమలో నిర్శించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు నీటి కష్టాలు ఉన్నాయి. చదవండి: ‘31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు’ జాతీయపార్టీలది ద్వంద్వ వైఖరి రాబోయే రోజుల్లోనూ రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. మిగులు జలాల విషయంలోనూ రాయలసీమ వెనుకబడి ఉంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన విధంగా 511 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం లేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయి. రాయలసీమ ప్రజల సమస్య తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో నెంబర్ 203ను జారీ చేశారు. దీనిని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ జీవోని అమలు చేయాలని అంటుంది. ఇలా జాతీయపార్టీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయమై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప నీటి సమస్య తీర్చలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని చంద్రబాబు అండ్ కలెక్షన్స్ చేశారు. చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు. పార్టీలు ద్వంద రాజకీయాలు మానుకొని రాయలసీమ వాసుల నీటి కష్టాలు పోయేలా ముందుకు రావాలి. తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తి మనకెందుకు రావడం లేదు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రతిపక్ష పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలి. ఈ జీవోను అడ్డుకుంటే భవిష్యత్లో ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదని' అన్నారు. చదవండి: బస్లు, క్యాబ్లకు గ్రీన్సిగ్నల్ -
అన్నదాతా.. సుఖీభవ
సాక్షి: కడప అర్బన్ : ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. దు:ఖంలో ఉన్నవారికి కొంతయినా చేయూతనివ్వాలి... వారి ఆకలి తీర్చాలి. వసతి కల్పించాలి... ఎంత ఖర్చయినా సొంతంగానే భరించాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి సంకల్పించారు... అనుకున్నట్లే రోగుల సహాయకుల సౌకర్యార్థం కడప రిమ్స్లో భోజనం, వసతి కోసం శాశ్వత భవనాన్ని నిర్మించారు. రెండు పూటలా ఆకలి తీరుస్తూ, వసతి కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం శాశ్వతంగా రెండు పూటలా ఉచిత భోజనం, రాత్రి వేళ వసతి కల్పించారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి సొంత ఖర్చులతో ఈనెల 1న ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు స్వర్గీయ పోచిమరెడ్డి తులశమ్మ, రామాంజులరెడ్డి జ్ఞాపకార్థం శాశ్వత భవనాన్ని నిర్మించారు. లోపలికి వెళ్లగానే కుడి, ఎడమ వైపుగా భోజనశాలకు వెళ్లేదారి ఉంటుంది. రెండువైపులా రెండేసి విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో 14 మంది విశ్రాంతి తీసుకునేలా పడకలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాచ్కు 50 మంది చొప్పున భోజనం చేసేందుకు లోపలికి అనుమతిస్తారు. ప్రతి రోజూ భోజన వసతికే సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. రోగుల సహాయకుల కోసం వసతి గది టోకెన్ ఇలా.. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల లోపు రిమ్స్ ఐపీ విభాగం సిబ్బంది వార్డులలో తిరిగి, రోగుల సహాయకులకు టోకన్లు అందజేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి భోజనం కోసం మళ్లీ టోకన్లు ఇస్తారు. శుభ్రం.. రుచికరం అన్నం, పప్పు లేదా సాంబార్, తాళింపు, రసం లేక మజ్జిగ తప్పనిసరిగా వడ్డిస్తారు. భోజనం తయారీ కోసం వాడే నీళ్లు పరిశుభ్రంగా ఉండేందుకు భవనం పైభాగాన ప్యూరిఫైడ్ వా టర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అందులో నుంచి ప్యూరిఫై అయిన నీళ్లనే కూలింగ్ చేసి సహాయకులకు ఇస్తున్నారు. వేసవి కావడంతో బుధవారం నుంచి రసంతో పాటు, మజ్జిగను కూడా తప్పనిసరిగా భోజనంతో పాటు ఇస్తున్నారు. సాయంత్రం స్పెషల్: రాత్రి 7 నుంచి 8 గంటల లోపు పులిహోర, చిత్రన్న, పొంగలిలో ఏదోఒకటి వచ్చిన సహాయకులకు వడ్డిస్తారు. ఇందులో సాంబారు, పచ్చడిని ఇస్తున్నారు. విశ్రాంతి కోసం: రాత్రి వేళల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వారి జాబితాను రిమ్స్ అధికారులు పంపిస్తారు. లిస్టులో ఉన్నవారందరికీ విశ్రాంతి సౌకర్యం కల్పిస్తారు. మేయర్గా ఉన్నపుడు ఆలోచన రోగుల కోసం వచ్చే సహాయకులు, బంధువులు వసతి లేక గడ్డిపై పడుకొనేవారు. కడప మేయర్గా ఉన్న నాకు ఒక భోజన, వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకుపోయాను. స్థలం కేటాయించి భూమిపూజ చేశారు. ఆయన అకాల మరణంతో ముందుకు తీసుకుపోలేకపోయాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం, కలెక్టర్ హరికిరణ్ పదే పదే కోరడంతో నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నా. – పి.రవీంద్రనాథ్రెడ్డి, ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే, కమలాపురం నాపేరు నాగలక్షుమ్మ. మాది కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం. నా మనవడు కొండయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రిమ్స్లోనే ఉన్నాను. అప్పటి నుంచి రెండు పూటలా భోజనం ఉచితంగా చేస్తున్నాను. చాలా రుచికరంగా ఉంది. ఈ సౌకర్యం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. నా కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు. వారం రోజుల నుంచి రిమ్స్లోనే ఉంటున్నాం. ఇక్కడే భోజనం తింటున్నాం. ఎంతో రుచికరంగా ఉంది. వృథా చేయకుండా ఉపయోగించుకుంటే మంచిది. – అక్కిశెట్టి కొండయ్య, ఇడమడక, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా -
వైఎస్సార్ సీపీలోకి వీరశివారెడ్డి
వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలా చేయకపోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి వదలుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్ సమక్షంలో వెఎస్సార్సీపీలో చేరునున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. చదవండి: బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం! -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి
-
ఇది సంక్షేమ సర్కారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, రేషన్కార్డులను తొలగిస్తోందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రతిపక్షాలు పింఛన్లు, రేషన్కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీలకు ఉన్న నిబంధనలను అందరి మేలుకోసం సరళతరం చేశారన్నారు. ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చెప్పిన హామీల్లో 80 శాతం హామీలను అమలు చేశారన్నారు. ఆటో డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్ ఉన్న వారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చారన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు చెప్పిన దానికంటే ఏడాదికి రూ.13500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ, శనగ, సుబాబుల్, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించారన్నారు. వైఎస్ఆర్ చేనేత హస్తం పేరుతో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు ఇచ్చారన్నారు. జనవరి నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇవ్వనున్నారన్నారు. జనవరి 9న రాష్ట్రంలోని 46లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఉగాదికి అర్హులైనవారందరికీ ఉచితంగా ఇళ్లు ఇవ్వడమేగాక ఇంట్లో మహిళ పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చబోతున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 4.45లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం గిన్నిస్ రికార్డు అని తెలిపారు. జనవరి 1వ తేది నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా శాఖ కింద ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారన్నారు. రాజధానిపై శివరామక్రిష్ణన్ కమిటీ ఎందుకు బయటపెట్టలేదు : రఘురామిరెడ్డి రాజధానిపై శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఆ కమిటీ నివేదికలో ఉన్న అంశాలైమైనా పాటించారా అని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని రాజధానిని త్యాగం చేసిన రాయలసీమలో రాజధాని ఎందుకు పెట్టలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఐదేళ్లు గ్రాఫిక్స్ చూపారే తప్పా ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నారు. అంతర్గత రహదారులూ నిర్మించలేదన్నారు. వర్షాకాలంలో అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. శని, ఆదివారాలొస్తే ఏ ఒక్కరూ అమరావతిలో ఉండటం లేదన్నారు. హైకోర్టును కర్నూలులో పెడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతోపాటు ప్రకృతి మద్దతు కూడా ఉందన్నారు. ఆరునెలలు సంక్షేమానికి కేటాయించామని, ఇకపై అభివృద్దిపై దృష్టిపెట్టనున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
‘ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరే’
సాక్షి, వైఎస్సార్ కడప : రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉందని కమలాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రంలో కార్మికుల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడని ప్రశంసించారు. మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా, నాయకుడిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరేనని కొనియాడారు. ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్లలో అవినీతికి పరాకాష్టగా చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం కూడా లేకుండా ప్రజా పాలన సాగుతుందన్నారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అర్షులైన ప్రతి లబ్ధిదారులకు నవరత్నాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు -
బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు
-
‘డబ్బులు వస్తాయంటేనే శంకుస్థాపనలు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఉనికి కోసమే చంద్రబాబు నాయుడు కడపకు వచ్చాడని, డబ్బులు ఇచ్చి ప్రజలను సమావేశానికి రప్పించారని కమలాపురం వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు రవీంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాధ్రెడ్డి మాట్లాడుతూ.. మా అభ్యర్థి ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే చంద్రబాబు కుప్పంలో గెలిచారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. డబ్బులు వచ్చే ప్రాంతంలో మాత్రమే శంకుస్థాపనలు చేసి లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ముగిసే సమయంలో 65 వేల కోట్ల రూపాయలు అప్పుచేశాడని, ప్రపంచంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడని పేర్కొన్నారు. ‘ప్రతీ పథకాన్ని అధికారం ముగిసే సమయానికి అమలు చేశారు. యువకులు, మహిళలు, రైతులు, సంఘాలను మోసం చేసిన చంద్రబాబును, టీడీపీని ప్రజలే భూస్థాపితం చేశార’ని తెలిపారు. ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టి, ఓడిపోయాక తన రాజ్యసభ సభ్యులను అదే పార్టీలోకి చంద్రబాబే పంపారని వెల్లడించారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిన సందర్భంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని పునరుద్ఘాటించారు. -
‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాజువాకలో వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ స్టీల్ సిటీ డిపోలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని కార్మికులకు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. -
ముఖ్యమంత్రిని కలిసిన కమలాపురం ఎమ్మెల్యే
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు బుధవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయాలు, ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాహుల్ పాల్గొన్నారు. -
సీఎం నిర్ణయం కార్మికులకు పండగ
-
సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పరు..
సాక్షి, గుంటూరు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో బుధవారం వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల కల నిజం కాబోతోందని సంతోషాన్ని వెలిబుచ్చారు. రూ.7 వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సీఎం ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరనటానికి ఈ నిర్ణయం సాక్ష్యంగా నిలిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే సీఎం చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు ఒక పండగ అని తెలిపారు. ‘చంద్రబాబు హయంలో ఆర్టీసీ నష్టపోయింది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన సొంత కార్యక్రమాలకు ఆర్టీసీని వాడుకోవడమేకాక ప్రైవేటుపరం చేయాలని చూశారని ఆరోపించారు. ఆర్టీసీ అస్తులను అమ్మిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆర్టీసీని, ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇక విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఆర్టీసీ ఉద్యోగులకు అలాంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. -
స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ నిధులు కేటాయించి.. వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాజా బిల్లు చట్టరూపం దాలిస్తే.. పరిశ్రమల్లోని ఉద్యోగాలు 75శాతం స్థానికులకే లభిస్తాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కొనియాడారు. యువతకు వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యువతను ప్రోత్సహించలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షలమంది ఇక్కడ పనిచేస్తున్నారని, స్థానికులకు తగిన నైపుణ్య శిక్షణ ఇస్తే.. వారికే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. యువత కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న అద్భుత నిర్ణయం ఇదని కొనియాడారు. వైఎస్ జగన్ పాలన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనను గుర్తుకుతెస్తోందని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. -
‘ఆర్టీసీని మరింత బలోపేతం చేశారు’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత బలోపేతం చేశారన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వ బడ్జెట్లో ఆర్టీసీకి ఎప్పుడూ ఇంత స్థాయిలో కేటాయింపులు చేయలేదన్నారు. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి దాదాపు 1572 కోట్లు కేటాయించారని.. ఫలితంగా ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
ఇలాంటి నాయకుడు గల్ఫ్ దేశాల్లో ఉంటే..
-
చంద్రబాబు చిల్లర చేష్టలు మానుకోవాలి
-
‘అక్కడైతే బాబును ఎప్పుడో ఉరితీసేవారు’
సాక్షి, కడప : తన ప్రవర్తన ద్వారా చంద్రబాబు ఓటమి అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటు ఎవరికి వేశామో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయడం హేయమని చర్య అని మండిపడ్డారు. ప్రజలు పాలన మార్పుకు సిద్ధంగా ఉన్నారని.. 140 పైచిలుకు సీట్లతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. ఇప్పటికైన చంద్రబాబు చిల్లర చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ‘ 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచావు కదా అప్పుడు అనుమానం రాలేదా? వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టారు. ఇప్పుడేమో ఓటమి భయంతో మతిభ్రమించినట్లు ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే హుందాగా వ్యవహరించండి’ అని కొరుముట్ల శ్రీనివాసులు.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. అక్కడైతే ఎప్పుడో ఉరితీసేవారు.. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన వంటి నాయకుడిని, టీడీపీ వంటి పార్టీని రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుడు గల్ఫ్ దేశాల్లో ఉంటే ఎప్పుడో ఉరి తీసేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి తెలుసుకున్న ప్రజలు పాలనలో మార్పు కోరుకున్నారని.. నవరత్నాలే వైఎస్సార్ సీపీని గెలిపించనున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు దగ్గర నుంచి గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని.. ఆయన అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరున్నా ప్రత్యేక హోదా తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష గెలుపు వైఎస్సార్ సీపీదే
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలవనుందని ఆ పార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ చేసిన కుట్రలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కేవలం కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్ జపం చేశారే తప్ప ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తన ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటలెజిన్స్ వ్యవస్థను నాశనం చేసేలా డీజీ వెంకటేశ్వరరావు వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తప్పుదోవ పట్టేలా వైఎస్ కుటుంబంపై నిందలు వేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుయుక్తులు, వైఫల్యాలను ప్రజలు గుర్తించారని.. ఆయనకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో హైప్ క్రియేట్ చేసినట్లుగా.. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి అన్నారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రైతులకు ఏదో మేలు చేసేలా చంద్రబాబు అన్నదాత సుఖీభవ చెక్కులు ఇచ్చారు.. తెలంగాణలో హైప్ చేసినట్లుగా ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు అన్ని రకాలుగా విఫలమయ్యారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు పట్టం కట్టేలా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా పూర్తి మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రానుందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు తన వైఫల్యాలను ఈసీపై నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అందరినీ మోసం చేశాడు.. ఐదేళ్ల కాలంలో అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ బాషా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోందన్నారు. ప్రజలు పాలనలో మార్పు రావాలని కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో తీర్పు ప్రభంజనంలా ఉండబోతుందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలు సహకరించకపోయినా ప్రజలు ఓర్పుతో ఉన్నారన్నారు. తాను కనుగొన్నాను అని చెప్పుకునే టెక్నాలజీపై ఇప్పుడు బాబు నిందలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
జిల్లాలో జోరుగా వలసలు..
సాక్షి, వీరపునాయునిపల్లె: శుక్రవారం మిట్టపల్లె గ్రామానికి చెందిన 20కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. చంద్రమహేశ్వర్రెడ్డి, హరికేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శరత్కుమార్రెడ్డి, రవీంద్రారెడ్డి, సుధాకర్, హరీష్, వెంకటరమణలతో పాటు మరిన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరందరికీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కండువాలు వేసి చేర్చుకొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, ప్రతాప్, వేమనారాయణరెడ్డి, ప్రవీణకుమార్రెడ్డి, గురుపవన్, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు : చెన్నూరు మైనార్టీ కాలనీలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి సమక్షంలో మైనార్టీ వర్గానికి చెందిన 30 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలోచేరాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎం.రంతు, నాయబ్రసూల్, ఖాదర్, భాష, నజీర్ అహ్మద్, షేక్ సయ్యద్, ఇబ్రహీం, చాంద్బాష, కలీం, అల్లాబకష్, మస్తాన్, మాబాష, అక్మల్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్వర్, మునీర్, కరీం, వారిస్, రబ్బు, పొట్టిపాటి ప్రతాప్రెడ్డి, గణేష్రెడ్డి, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, చీర్ల సురేష్యాదవ్, కేశవరెడ్డి, మాధవరెడ్డి, రెడ్డెయ్యరెడ్డి పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె : మండలంలోని కమ్మవారిపల్లి్ల గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్ బందలకుంట గంగిరెడ్డితో పాటు వారి అనుచరులు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన 50 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పును కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి, నడిపి గంగిరెడ్డి,చిన్న గంగిరెడ్డి, పెద్ద గంగిరెడ్డి, శివగంగిరెడ్డి, లక్ష్మిరెడ్డి, సుబ్బారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శివానందరెడ్డి తదితరులు పార్టీలో చేరారు అప్పరాజుపల్లిలో .... మండలంలోని అప్పరాజుపల్లి గ్రామంలో శుక్రవారం 15 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు. కడప పార్లమెంటరీ అధ్యక్షుడు అనగాని కళాయదవ్ ఆధ్వర్యంలో మల్లెం విధశ్వనాధ్, బాలగంగాధర్, వెంకట సురేష్, జయదేవ్, వెంకట స్వామి, శ్రీనివాసులు, సురేంద్ర, ఓబులేసు, చంద్రయ్య, క్రిష్ణయ్య, సుబ్బరాయుడు తదితరులు పార్టీలో చేరారు. వల్లూరు: మండలంలోని కోట్లూరుకు చెందిన చెన్నారెడ్డి టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు. మండలంలోని పాపాగ్నినగర్లో శుక్రవారం జరుగుతున్న ఇంటింటి ప్రచారంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, పెద్దచెప్పలి (కమలాపురం) : వైఎస్సార్ సీపీ ప్రచా రంలో పాల్గొన్నాడనే కారణంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి చేశారు. మండలంలోని పెద్దచెప్పలిలో గురువారం రావాలి జగన్.. కావాలి జగన్.. కార్యక్రమం జరి గింది. ఇందులో పాల్గొన్నాడని పెద్దచెప్పలి ఇంది రమ్మ కాలనీకి చెందిన రాజాపై టీడీపీ నాయకులు నరసింహారెడ్డి, ఓబయ్య దాడి చేశారు.బాధితుడు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం పెద్దచెప్పలి బస్టాండులో ఉండగా.. పని ఉందని, వెంటనే రావాలని టీడీపీ నాయకులు చెప్పగా రాజా వెళ్లా రు. అతన్ని దాదిరెడ్డిపల్లెకు తీసుకెళ్లి కర్రలతో కొట్టి గాయపరిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి శుక్రవారం పెద్దచెప్పలికి చేరుకొని రాజాను పరా మర్శించారు. మీరు ఏమీ భయపడ వద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజాపై దాడి చేయడం హేయమని అన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇకపై తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తాము దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. బస్టాండులో ఉంటే తీసుకెళ్లారు పెద్దచెప్పలి బస్టాండులో ఉంటే నరసింహారెడ్డి, ఓబయ్య రమ్మన్నారు. ఎదైనా పని ఉందేమోనని వెళ్లాను. వైఎస్సార్ సీపీ ప్రచారంలో తిరుగుతున్నానని తనను వారు కర్రలతో కొట్టి గాయపరిచారు. –రాజా, బాధితుడు, పెద్దచెప్పలి తగిన భద్రత కల్పించాలి ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేయడానికే టీడీపీ వారు దాడులకు తెగబడుతున్నారు. 2009లో కూడా ఇలాగే పోలింగ్ స్టేషన్ వద్ద ఘర్షణకు పాల్పడ్డారు. ప్రస్తుతం అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తగిన భద్రత కల్పించాలి. –చిన్నిరెడ్డి, పెద్దచెప్పలి, కమలాపురం. -
వైఎస్ జగన్ను ఆదరించిన ప్రజలకు కృతఙ్ఞతలు
-
రవీంద్రనాధ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
‘ఆ ఘనత వైఎస్సార్కే దక్కుతుంది’
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగులో 42 వేల ఇల్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందని వైఎస్సార్ సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సురేష్ బాబు, రవీంద్రనాథ్ రెడ్డి, పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్దిలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మంత్రి సొంత గ్రామంలో ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారని, దాన్ని ఓర్చుకోలేక బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ వారిని మళ్లీ టీడీపీలో చేర్చుకున్న ఘనత ఆదినారాయణరెడ్డిదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లాకు కృష్టా జలాలు రావటానికి వైఎస్సార్ కారణమని, దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆ ఘనత కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పోటీచేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆదికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్ చలువ వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావన్నది మర్చిపోవద్దు. మార్కుఫెడ్ ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డ మంత్రి ఆదినారాయణరెడ్డి.. నీ స్థాయి ఏమిటో గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిది. లేదంటే ప్రజలు నీకు తప్పనిసరిగా బుద్ది చెబుతార’ని అన్నారు. అనంతరం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి స్థాయిలో ఉన్న ఆదికి తగదు. కారంచేడు సంఘటన నుంచి ఇప్పటివరకు దళితులపై దాడులకు టీడీపీ కారణం. రాబోయే రోజుల్లో దళిత వర్గాలు మీకు బుద్ది చెప్పడం ఖాయం. ఓట్ల కోసం దళితుడు కావాలి కానీ పక్కన కూర్చోవడానికి టీడీపీకి దళితుడు అవసరం లేదా’ అని ప్రశ్నించారు. -
చంద్రబాబు దర్శకత్వం.. శివాజీ నటనతో
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన చంద్రబాబు, శ్రీనివాసరావుకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం లేకపోతే తనకు తిరుగులేదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజారెడ్డిని హత్య చేయించింది నువ్వు కాదా..దోషులకు ఆశ్రయం కల్పించింది నువ్వు కాదా? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంత వరకు ఆ కేసు గురించి నిజాలు బయటకు రాలేదని తెలిపారు. చిచ్చరపిడుగులా ఎదుగుతున్న వైఎస్ జగన్పై కచ్చితంగా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తప్ప అన్ని పార్టీలు దాడిని ఖండించాయని తెలిపారు.ఇతర పార్టీలు ఖండించినా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం నేతల స్పందన ఎంత జుగుప్సాకరంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ ఎంత హుందాగా వ్యహరించారో గమనించాలని కోరారు. చంద్రబాబు దర్శకత్వంలో..సినీ నటుడు శివాజీ నటనతో గరుడపురాణం నడుస్తున్నదని అన్నారు. శివాజీని అరెస్ట్ చేస్తే ఆపరేషన్ గరుడ సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..మూడు నెలల నుంచి ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతోందని వ్యాక్యానించారు. శివాజీ గరుడ లీక్ దీనికి నాంది అని వివరించారు. దీని వెనక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒక మీడియా అధిపతి ఉన్నారని వెల్లడించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. శివాజీ ఇప్పుడే అమెరికా వెళ్లడంపై కూడా అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఇది అంతా ఒక పథకంలో భాగంగానే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మీలా తాము దిగజారదలచుకోలేదని చెప్పారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అప్పుడు పెరుగువడ అన్నాను కానీ..ఇప్పుడు అసలు కథ అర్ధం అవుతోందని పరోక్షంగా టీడీపీ కుట్రల గురించి ప్రస్తావించారు. ఇలానే వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతాయని పేర్కొన్నారు. తాము అడ్డదారిలో గద్దెనెక్కే వాళ్లం కాదని, భయపడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కోరారు. టీడీపీ నేతలు తమ భాషను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. -
గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే..
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ఏమి జరిగినా టీడీపీ నాయకులు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. కడప పార్లమెంటు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీలలో మొదటి వాడు సీఎం రమేశ్ అని ఆరోపించారు. సారా దుకాణం నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తికి సీఎం రమేశ్ ఎలా వచ్చాడని ప్రశ్నించారు. అనేక మందిని మోసం చేసిన, కడుపుకొట్టి అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. 2014 ముందు ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్టు పనులు చేసే రుత్విక్ కంపెనీ ఈ రోజు రూ.3500 కోట్ల రూపాయలకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఉక్కు పరిశ్రమ అడిగితే ఐటీ దాడులు అని చెప్పడం శోచనీయమన్నారు. నాలుగేళుల బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీటి అన్నింటిపైన విచారణ చేస్తామని చెప్పారు. చంద్రబాబు బినామీలపై లోతుగా విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. -
‘గండికోటకు చుక్కనీరు ఎందుకివ్వడం లేదు’
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం కడపలో ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చినా, నాగార్జున సాగర్కు కూడా నీరు విడుదల చేస్తున్నారన్నారు. అయినా గండికోటకు ఎందుకు చుక్కనీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కడప జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు మండిపడ్డారు. ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వరద సమయం పూర్తి అవ్వక ముందే గండికోటకు 10 వేల కూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంసాగర్కు సరిపడా నీళ్లు విడుదల చేయాలన్నారు. ఆగస్ట్ 30లోపు కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. -
యోగివేమన వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వైఎస్ఆర్ కడప: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పర్యటనలో భాగంగా వర్సిటీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడిని విద్యార్థులు అడ్డుకున్నారు. సీఎం గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి సీకే దిన్నె పోలీస్ స్టేషన్కు తరిలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక సీఎం వనం-మనం కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. -
అక్రమార్జన జిగేల్!
కిలో బంగారం.. 3.5 కిలోల వెండి వస్తువులు.. రూ.14 లక్షల విలువైన గృçహోపకరణాలు.. అనంతపురం, తాడిపత్రిలో భవనాలు..14 చోట్ల స్థలాలు.. నాలుగు చోట్ల 24 ఎకరాల వ్యవసాయ భూమి.. ఈ ఆస్తులన్నీ ఓ కానిస్టేబుల్ సంపాదించినవంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. ఏసీబీ దాడుల్లో ఈ నిజం వెలుగు చూసింది. అనంతపురం సెంట్రల్/ పుట్లూరు/ యల్లనూరు: గుంతకల్లు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రవీంద్రనాథరెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు సోదాలు చేపట్టారు. అనంతపురంలోని కానిస్టేబుల్ నివాసంలో డీఎస్పీ జయరామరాజు, సీఐలు ప్రతాప్రెడ్డి, కర్నూలు సీఐ ఖాదర్బాషా, యల్లనూరులోని గిరమ్మబావి గ్రామంలో ఉంటున్న బంధువులు రమేష్రెడ్డి, శ్రీధర్రెడ్డి ఇళ్లలో కర్నూలు సీఐ నాగభూషణం, తేజేశ్వరరావు, పుట్లూరులో కానిస్టేబుల్ సోదరులు చంద్రశేఖరరెడ్డి, భాస్కర్రెడ్డి ఇళ్లల్లో కర్నూలు సీఐలు చక్రవర్తి, శ్రీధర్లతో ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నాటికి దాదాపు రూ.3.50 కోట్ల ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 20కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆ శాఖ అధికారులకు సిఫారసు చేస్తామని వివరించారు. ఉలిక్కిపడిన ఆర్టీఓ అధికారులు కానిస్టేబుల్ రవీంద్రనాథ్రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో రవాణాశాఖ ఉద్యోగుల్లో ప్రకంపనలు రేగాయి. రవాణాశాఖలో గతంలో అవినీతి, అక్రమాలు భారీ స్థాయిలో వెలుగుచూశాయి. తాజాగా కానిస్టేబుల్ ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో మిగిలిన అవినీతి ఉద్యోగుల గుండ్లెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడేళ్లకోసారి కానిస్టేబుల్ ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీఏలో ఈ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవినీతిలో అందరికీ వాటాలుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నాడంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. -
రాష్ట్రంలో హిట్లర్కు మించిన పాలన
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో నియంత హిట్లర్కు మించిన పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎస్బి అంజద్బాషా మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం బంద్ చేస్తున్న వారిని పోలీసులతో అరెస్టులు, గృహనిర్భందాలు చేయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టులు చేశారని, లాఠీలతో కొట్టారని, మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే తమను అరెస్ట్ చేశారని, కార్యకర్తల వాహనాలను సీజ్ చేసి, రహదారులపై పోలీసులతో కవాతు నిర్వహించి భయానక వాతావరణం సృష్టించారని ధ్వజ మెత్తారు. చంద్రబాబు కుటిల రాజకీయానికి ఈ అక్రమ అరెస్టులే పరాకాష్ట అన్నారు. ప్రయణికులు లేకపోయినా బంద్ను విఫలం చేసేందుకు బలవంతంగా బస్సులు నడిపి ప్రభుత్వమే ఆర్టీసీ నష్టాలకు కారణమయ్యిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం వల్ల బంద్ విజయవంతమైందన్నా రు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనే టీడీపీ, బీజేపీ రహస్య ఒప్పందాలు బహిర్గతమయ్యాయన్నారు. టీడీపీ మాకు ఇప్పటికీ మిత్రపక్షమేనని రాజ్నాథ్సింగ్ అన్నారని, భవిష్యత్తులో కూడా కలిసే ముందుకు సాగుతామని కూడా చెప్పారని గుర్తు చేశారు. రాజ్నాథ్సింగ్ మాటలను ఏ ఒక్క టీడీపీ ఎంపీ కూడా ఖండించలేదన్నారు. హోదా కావాలని, రావాలనే ఆకాంక్ష చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదా సంజీవనా, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్ఆర్సీపీ అలుపెరుగని పోరాటాలు చేసిందని, విజయవాడ వేదికగా వైఎస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 14 యువభేరిలు నిర్వహించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఆనాడు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మాట్లాడితే అది ముగిసిన అధ్యాయమంటూ అవహేళన చేసిన చంద్రబాబు, మంత్రులు అవే విషయాలను నేడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్చే పార్లమెంటులో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిన త ర్వాత కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్లకార్డులు ప్రదర్శించడంలో అర్థం లేదని, వెంటనే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జెండాలను, అజండాలను పక్కనబెట్టి ఉద్యమిస్తేనే హోదా సాధించుకోగలమని తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ నగర అధ్యక్షుడు షఫీ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు త్యాగరాజు పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీ దొందూదొందే
కమలాపురం అర్బన్ (వైఎస్సార్ కడప): బీజేపీ, టీడీపీ దొందూదొందేనని ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ అనుమతించడంతో వారి అనుబంధం ఎలాంటిదో అర్థమైందన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు 13 సార్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలను అనుమతించక పోడంతో తమ పార్టీ ఎంపీలు ప్రత్యేకహోదాపై మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదాపై సీఎం యూటర్న్ తీసుకుని, తన పార్టీ ఎంపీలతో డ్రామా చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నట్లయితే గత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణానికి ఎందుకు మద్ధతు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంతో పాటు తమ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఎన్నో దీక్షలు, సదస్సులు నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం జిత్తుల మారిన నక్క అని ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో బీజేపీకి, టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అలాగే 2012–13, 2016–17కు చెందిన బీమాను రైతులకు చెల్లించకకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. 2016–17 ఖరీప్ సీజన్కు చెందిన 24 వేల మంది రైతులకు చెల్లించాల్సిన బీమా చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని బీమా అధికారుల, వ్యవసాయాధికారుల, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈనెల చివరికి రైతులకు వారి ఖాతాలో జమ కాకుంటే రైతులు, రైతు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నిమ్మకాయల సుధాకర్రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, సుమీత్రారాజశేఖర్రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, మారుజొళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్వీఎన్ఆర్, ఎన్సీ పుల్లారెడ్డి, జగన్మోహన్రెడ్డి, అల్లె రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘11 రోజులు దీక్ష.. ఆ రహస్యం ఏమిటో..!’
సాక్షి, కడప : టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీఎం రమేష్ హై టెక్ దీక్ష సాగిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయాలను దారపోసి దీక్ష చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు 11 రోజుల తర్వాత వచ్చి తుస్సు మనిపించాడని ఎమ్మెల్యే అన్నారు. రూ. 10వేల కోట్లు కేటాయిస్తాడేమో అని అందరూ ఆశ పడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘25 సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ తెస్తాడట. ఇప్పుడు 19 మంది ఉన్నారు. ఏం ఉద్ధరించావ్? కడప ప్రజలకు అరగుండు గీశాడు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు బీజేపీని మా పార్టీకి అంటగడుతున్నావు. చంద్రబాబు ఎంత తప్పు చేశాడో.. బీజేపీ కూడా అంతే తప్పు చేసింది. తిరుపతిలో హోదా అంటూ హామీలు ఇచ్చారు. 11 రోజుల తర్వాత కూడా సీఎం రమేష్ 5 నిమిషాలు ఎలా మాట్లాడగలిగాడో.. నిపుణులు ఆయనపై రీసెర్చ్ చేయాలి. ఆయన రహస్యం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అధికారులు పరాకాష్టగా జిల్లా పరిపాలన వదిలేసి కలెక్టర్ కూడా సేవలు చేశారు. 540 ఆర్టీసీ బస్సులు దీక్షకు వాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తోంది. రాకపోతే, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే 6 నెలలకు శంకుస్థాపన చేస్తాం. 2 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తాం. ఉక్కు కోసం అందరం రాజీనామా చేద్దాం.. ఉక్కు ఎందుకు రాదో చూద్దాం’ అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ దీక్ష.. ఒక హైడ్రామా క్లయిమాక్స్.. సీఎం రమేష్ దీక్షపై వైఎస్సార్సీపీ కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పందించారు. సీఎం రమేష్ రాజకీయ దీక్ష ఒక హై డ్రామా క్లయిమాక్స్ అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు బాబు ఉక్కు వరాలు తేస్తాడని ఆశించి నిరసపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే దీక్షలు అని అంజాద్ బాషా విమర్శించారు. సీఎం చంద్రబాబుకు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావాలని లేదని ఆయన పేర్కొన్నారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఆ క్రెడిట్ దివంగత నేత వైఎస్సార్కు వస్తుందని బాబుకు భయమని అన్నారు. కడప ఉక్కు అడ్డుకుంది చంద్రబాబే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. దీక్షలపై వాళ్ళ ఎంపీలకు ఎంత చులకన భావన ఉందో అందరిరీ తెలిసిపోయిందని అన్నారు. దోచుకో.. దాచుకో అన్నదే వాళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వల్ల సీఎం రమేష్ ఏం సాధించుకున్నారో అని నిలదీశారు. మా ప్రభుత్వం రాగానే మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తాం.. లేదంటే మేము రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే అంజాద్ బాషా అన్నారు. -
కువైట్లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్తో మాట్లాడుతూ.. కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
బీటెక్ రవి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
పులివెందుల : ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బీటెక్ రవి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఫ్యాక్షనిస్టులు ఎవరో జిల్లా ప్రజలందరికి తెలుసున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సౌమ్యుడని.. జిల్లాలోని రాజకీయ నాయకులు, ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రజల మధ్య ఫ్యాక్షనిజాన్ని లేపుతున్నారని సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొనడం జరిగిందన్నారు. కేవలం తమ పార్టీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపేందుకే ఎంపీ పెద్ద దండ్లూరు గ్రామానికి వెళ్లారన్నారు. టీడీపీ నాయకుల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.