ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం | theWe Fight til Every farmer gets Insurance | Sakshi
Sakshi News home page

ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం

Feb 4 2016 12:54 PM | Updated on May 25 2018 9:20 PM

ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  పోరాడుతుందని.. కమలాపురం  ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కమలాపురం పరిధిలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన కొంత మంది రైతులకు 2012 సంవత్సరానికి గానూ పంట బీమా అందలేదు. దీంతో రైతులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కలిసి విషయం వివరించారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకూ పంట బీమా వచ్చేంతవరకూ పోరాడతామన్నారు. వీలైతే హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేసి ధర్నా నిర్వహిస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement