
కావూరి సాంబశివరావు
భీమవరం: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు. భారత్ విజయ్ బహిరంగ సభా వేదికపైకి వచ్చిన కావూరి మోడీని భారీ పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ దేశానికి ప్రధాని కాగల అర్హత మోడీకి ఉందన్నారు.
దీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన కావూరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయ స్థితిలో ఆయన కొంతకాలం ఉన్నారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి విరమించుకున్నట్లు తెలిసింది. చివరకు ఈరోజు ఆయన బిజెపిలో చేరారు.