హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్ | ys jagan mohan reddy tour in helen affected areas | Sakshi
Sakshi News home page

హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్

Published Sat, Nov 23 2013 12:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు.

హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కుప్పంలో ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదికి మార్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుఫాన్ బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement