నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు | Age Limit fear in Unemployed | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు

Published Sat, Jul 15 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు

నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు

నిరుద్యోగుల్లో మళ్లీ వయోపరి మితి గుబులు మొదలైంది. ముఖ్యంగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఆందోళన ఎక్కువైంది.

ఈ నెల 26తో ముగియనున్న వయోపరిమితి ఉత్తర్వుల గడువు
 
సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల్లో మళ్లీ వయోపరి మితి గుబులు మొదలైంది. ముఖ్యంగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈనెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తుండగా, టెట్‌ ఫలితాలు వెల్లడయ్యాక విద్యా శాఖ వివరాలిస్తే వెంటనే ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఇదివరకే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ప్రకటించారు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 27తో ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల వయోపరిమితి పెంపు ఉత్తర్వుల గడువు తీరిపోతోం ది. దీంతో మళ్లీ వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్‌పీఎస్సీ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వం కూడా పదేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ 2015 జూలై 27న ఉత్తర్వులు (జీవో 329) జారీ చేసింది. ఆ తర్వాత ఏడాది గడిచి న నేపథ్యంలో 2016 జూలై 26న మరోసారి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు అత్యధికంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ రాలేదు. ప్రస్తుతం టెట్‌కు హాజరు కానున్న 3.5 లక్షల మందిలో సాధారణ గరిష్ట వయోపరిమితి దాటిన అభ్యర్థులు వేలల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిని మరోసారి పెంచాలని, లేకపోతే తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. 2012 నుంచి ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పెంచాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement