ఎన్నికల్లో నోట్లు పంచబోమనే దమ్ముందా? | Ambati fires on babu and Modi | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో నోట్లు పంచబోమనే దమ్ముందా?

Published Wed, Nov 23 2016 2:12 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

ఎన్నికల్లో నోట్లు పంచబోమనే దమ్ముందా? - Sakshi

ఎన్నికల్లో నోట్లు పంచబోమనే దమ్ముందా?

బాబుకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్:  వచ్చే ఎన్నికల్లో మా అభ్యర్థులెవరూ పెద్దనోట్లు పంచరని, నోట్లు పంచితే చెప్పుతో కొట్టండని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తెల్లారి లేస్తే.. నీతి, నిజారుుతీ, నిప్పులాంటి వాడ్ని అంటూ నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రూ.2000లు, రూ.1000 నోట్లను పంచబోమని చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుల జోడి భారతదేశాన్ని బోడి చేస్తోందని  ధ్వజమెత్తారు. వీరి జోడి గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు. కానీ దేశంలో మహావృక్షంలా ఎదిగిన మోదీకి చంద్రబాబు సలహా వల్ల దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ తాను కొన్నిరోజుల ముందు ప్రధానికికి లేఖ రాశానని అప్పట్లో చంద్రబాబు చెప్పకొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి చంద్రబాబు ఆద్యుడని, అందువల్ల ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నోట్ల సమస్య పరిష్కారంపై కమిటీ వేయాలని, దానికి చంద్రబాబు కన్వీనర్‌గా, రంగరాజన్, దువ్వూరి సుబ్బారావు, మన్మోహన్ సింగ్, కేవీరెడ్డి వంటి వారిని నియమించాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా లోకేష్‌ను నియమించాలని గాలి కోరనందుకు సంతోషమని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement