మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
హైదరాబాద్: మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన నగరంలోని టోలీచౌకీ సమీపంలోని షేక్పేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.