హైదరాబాద్ : పాతబస్తీ డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని కోమటివాడిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రాణి(35) స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తొంది. స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కరిజ్మా వాహనంపై వచ్చి స్నాచింగ్ చేసిటనట్లు బాధితురాలు తెలిపింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.