
'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది'
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ కాదు..బూడిద తెలంగాణగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు పనులిచ్చి రూ.కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారని పాల్వాయి విమర్శించారు.