అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ | DGP Anurag Sharma comments about Effort of Officials | Sakshi
Sakshi News home page

అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ

Published Sun, May 28 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ

అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 ఉత్తమ సేవాపతకాలు, 55 పోలీస్‌ మెడల్స్‌ను అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు వినూత్నమైన కార్యాచరణతో పోలీస్‌ శాఖ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రానికి 26 గ్యాలంటరీ అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను 2016 స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement