DGP Anurag Sharma
-
డీజీపీ అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు
-
ఎన్ని ఎన్కౌంటర్లన్నది చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ‘‘నాకు జన్మనిచ్చింది రాజస్తాన్. కానీ జీవితాన్నిచ్చింది హైదరాబాద్. దానికి తోడు నా భార్య హైదరాబాదీయే. 60 ఏళ్లలో 25 ఏళ్లు మాత్రమే çస్వస్థలంలో ఉన్నా. మిగతా జీవితమంతా హైదరాబాదే. భార్య, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు.. అంతా ఇక్కడే. హైదరాబాద్కు హాట్ సిటీ లాంటిది పాతబస్తీ.. కీలక సమయంలో ఆ ప్రాంతానికి డీసీపీగా పనిచేయడం జీవితంలో ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. కీలకమైన గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్లలో చాలా కాలం పనిచేశారు, ఆ అనుభవం ఎలాంటిది? - ఇప్పుడున్నంత ప్రశాంత వాతావరణం అప్పుడు లేదు. 2007 వరకు ఉద్రిక్తమైన వాతావరణం ఉండేది. గ్రేహౌండ్స్లో గ్రూప్ కమాండర్గా పనిచేసిన సందర్భంలో ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటామో? అసలు వస్తామో లేదో కూడా నమ్మకం ఉండేది కాదు. ఉగ్రవాదుల హెచ్చరికలు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, అనుమానితులను ప్రశ్నించడం.. అదంతా సెపరేట్ పోలీసింగ్. నా సక్సెస్లో ఆ పోస్టింగ్స్ కూడా కీలకం. ఇప్పటివరకు ఎన్ని ఎన్కౌంటర్లు చూశారు, మీ నేతృత్వంలో ఎన్ని జరిగాయి? - ప్రతీదీ ఎన్కౌంటర్ అనడం కరెక్ట్ కాదేమో. కొన్నిసార్లు ఎదుటి వారు ముందు కాల్పులు జరపడం మొదలుపెడితే.. ఇరువైపులా పరిస్థితి ఎవరి చేతుల్లో ఉండదు. అలా లెక్కలేనన్ని ఎన్కౌంటర్లు చూశాను. ఎన్ని అన్నది లెక్కపెట్టుకోలేదు. లెక్క ఉన్నా చెప్పడం మంచిది కాదు. చాలాసార్లు ఎన్కౌంటర్లలో యువత చనిపోయారు కదా.. అలాంటి సందర్భాల్లో బాధ అనిపించలేదా? - ప్రాణం చాలా విలువైంది. కాల్పులు శత్రువు వైపు నుంచి ప్రారంభమయ్యాక ఆపడం గానీ, నిలువరించడం గానీ మన చేతుల్లో ఉండదు. చాలా మంది తెలిసీ తెలియని వయసులో మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా యువతీ యువకులు మృతిచెందిన సమయంలో బాధనిపించినా.. బయటపడలేం. వృత్తి అలాంటిది. అలాగని మేం కర్కశులం కాదు. మీ 35 ఏళ్ల సర్వీసులో గర్వంగా అనిపించిన పోస్టింగ్ ఏది? - చెప్పాలంటే డీజీపీ పోస్టు కన్నా.. గ్రేట్గా ఫీలయ్యేది గతంలో చేసిన హైదరాబాద్ సౌత్జోన్ డీసీపీ పోస్టు. నిప్పు మీద వేలాడుతున్నట్టుగా ఉండే పోస్టింగ్లో మూడున్నరేళ్లపాటు చేశాను. ఇప్పటివరకు నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో, తర్వాత ముంబై పేలుళ్ల సమయంలో.. ఇలా ఒకదానిపై ఒకటి టెన్షన్ పెంచిన సమయంలోనూ.. అక్కడి యువత, ప్రజల సహకారంతో దుర్ఘటనలేమీ జరగకుండా పనిచేసి విజయం సాధించాను. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏమిటి, మళ్లీ పుంజుకుంటోందా? - అందుకు అవకాశమే లేదు. పేరుకు మావోయిస్టు తెలంగాణ కమిటీ ఉన్నా.. పూర్తిగా ఛత్తీస్గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. గిరిజన యువతను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి వైపు చూస్తోంది. మావోయిస్టు పార్టీలో చేరి ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితిని యువత వద్దనుకుంటోంది. భవిష్యత్లో మావోయిస్టు పార్టీ పుంజుకునే పరిస్థితులు లేవు. శాఖలో అధునాతన సాంకేతికత వినియోగం పరిస్థితి ఏమిటి? - గత పదేళ్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఏ సమాచారమైనా క్షణాల్లో కేంద్ర కార్యాలయాలకు చేరిపోతోంది. దాంతో ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసు శాఖ విజయవంతమైంది. అధికారులు, సిబ్బంది కూడా టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు. నిందితుల లొకేషన్లు, కాల్డేటా, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం వేగంగా తెలుసుకోగలుగుతున్నాం. నేరస్తులకు శిక్ష పడేలా సాంకేతిక ఆధారాలు తోడ్పడుతున్నాయి. నయీమ్ కేసులో రాజకీయ నేతలపై కేసులు పెట్టలేకపోయారన్న ఆరోపణలపై మీ వివరణ? - నయీమ్తో కలసి తిరిగిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. రాజకీయ నేతల విషయానికొస్తే పెద్దగా ఆధారాల్లేవు. ఆధారాలున్న అంశాల్లో చర్య లు తీసుకున్నాం. సిట్ కేసులు నమోదు చేసి చార్జిషీట్లు వేస్తోంది. రాజకీయంగా నయీమ్ కేసులో కొంత ఒత్తిడి వచ్చినా అది ఆధారాలను బట్టి చూడాల్సి ఉంటుంది. పక్కాగా ఆధారాలుంటే ఎవరినీ వదలే ప్రసక్తి లేదు. మీ తర్వాత వచ్చే డీజీపీకి మీరిచ్చే సూచనలు, శాఖాపరంగా ఉన్న సమస్యలు? - నా తర్వాత డీజీపీగా వచ్చే అధికారి చాలా సమర్థవంతుడే. పోలీస్ శాఖకు ఉన్న సమ స్య అధికారుల విభజన పూర్తికాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, స్టేషన్ల నిర్మాణం, టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మాదిరి రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర పోలీసు శాఖ మూడున్నరేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని సాధించింది. దీన్ని కొనసాగిస్తూ మరింత ఆధునీకరణ సాధిస్తే దేశంలోనే టాప్గా నిలుస్తాం. -
ఇన్చార్జి డీజీపీగా మహేందర్రెడ్డి?
-
ఇన్చార్జి డీజీపీగా మహేందర్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖ కొత్త బాస్ ఎవరనే అంశానికి తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా 1986 బ్యాచ్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. మహేందర్రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీజీపీగా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సూచనప్రాయంగా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం అసెంబ్లీ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల యూపీఎస్సీకి పంపాల్సిన జాబితాపై తుది కసరత్తు చేయకపోవడం, పూర్తిస్థాయి డీజీపీ ప్రక్రియకు కనీసం 2–3 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రతిపాదిత అధికారుల జాబితా యూపీఎస్సీకి వెళ్లి తిరిగొచ్చే వరకు ఇన్చార్జి డీజీపీగా మహేందర్రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక యూపీఎస్సీకి ప్రతిపాదిత అధికారుల జాబితాను పంపాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్శర్మ తొలుత ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్ 11న యూపీఎస్సీ నుంచి ప్రతిపాదిత అధికారుల జాబితా ప్రభుత్వానికి తిరిగొచ్చాక ప్రభుత్వం ఆయన్ను నవంబర్ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఎం. మహేందర్రెడ్డిని తొలుత ఇన్చార్జి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 10న ఆదేశాలిచ్చే అవకాశం ఉందని సీఎంఓ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11, 12 సెలవు దినాలు కావడంతో 10వ తేదీనే ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలివ్వొచ్చని తెలిసింది. కొత్త కొత్వాల్ ఎవరు?.. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్న ఎం. మహేందర్రెడ్డి ఇన్చార్జి డీజీపీగా నియమితులైతే కొత్త కొత్వాల్ రేసులో నిలిచేందుకు అదనపు డీజీపీ హోదాలో ఉన్న అధికారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్ పరిధిలో మహేందర్రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, కొత్త టెక్నాలజీ వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగించే సామర్థ్యంగల అధికారుల కోసం సీఎం కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో 11 మంది అధికారులు పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్కు చెందిన వీకే సింగ్, సంతోష్మెహ్రా, గోపికృష్ణ వచ్చే ఏడాది జనవరిలో డీజీపీ హోదా పదోన్నతి పొందనున్నారు. దీంతో వారికి నగర కమిషనర్ రేసులో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న 1988 బ్యాచ్కు చెందిన పూర్ణచందర్రావు సీపీ రేసులో పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే 1990 బ్యాచ్కు చెందిన శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, రవిగుప్తా, గోవింద్సింగ్లలో అంజనీకుమార్ , గోవింద్సింగ్ల పేర్లు కమిషనర్ రేసులో వినిపిస్తున్నాయి. 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్ రతన్లలో తెలంగాణ అధికారి, ప్రస్తుతం సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ ప్రధాన రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వారి తర్వాత 1992 బ్యాచ్కు చెందిన జితేందర్ పేరు సైతం సీపీ రేసులో వినిపిస్తున్నా జూనియర్ అదనపు డీజీపీ కావడంతో ఇస్తారా లేదా అనే దానిపై అనుమానం నెలకొంది. 1989 బ్యాచ్కు చెందిన ఉమేష్ షరాఫ్ కేంద్ర సర్వీసులోని జాతీయ పోలీస్ అకాడమీలో డిప్యుటేషన్పై పనిచేస్తుండటంతో ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. దీంతో పూర్ణచందర్రావు, అంజనీకుమార్, సీవీ ఆనంద్లలో ఒకరిని కమిషనర్గా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. మహేందర్రెడ్డి నేపథ్యం ఇదీ... ఖమ్మం జిల్లాకు చెందిన ఎం. మహేందర్రెడ్డి బీటెక్ పూర్తిచేశారు. 1986 బ్యాచ్కు చెందిన ఆయన సర్వీసు ప్రారంభంలో ఏఎస్పీ గోదావరిఖని, గుంటూరులలో పనిచేశారు. అనంతరం నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, నగర కమిషనరేట్లో ఈస్ట్ జోన్ డీసీపీగా, నేషనల్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా డీఐజీ హోదాలో విధులు నిర్వర్తించారు. తదనంతరం సైబరాబాద్ కమిషనర్ ఏర్పాటు నుంచి నాలుగేళ్లపాటు పనిచేయగా, ఐజీ హోదాలో పోలీస్ కంప్యూటర్ సర్వీస్, గ్రేహౌండ్స్లో కొద్ది రోజులపాటు పనిచేశారు. 2009 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతున్నారు. -
ఆన్లైన్లోనే క్రైమ్ కంట్రోల్ రివ్యూ
సాక్షి, హైదరాబాద్: క్రైమ్ కంట్రోల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు ద్వారా ప్రతీ రోజు, ప్రతీ నెల జరిగే నేరాలు, వాటి నియంత్రణకు సంబంధించి ఎస్పీలు, ఐజీలు, ఇతర అధికారులు ఆన్లైన్ ద్వారానే రివ్యూ చేసుకోవాలని డీజీపీ అనురాగ్శర్మ అభిప్రాయపడ్డారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు పురోగతిపై ఎంపవర్ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. మండల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగే అతి చిన్న నేరాలను సైతం సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా డేటా బేస్తో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీని వల్ల నేరాల సంఖ్య సమగ్రంగా తెలుస్తుందని వారికి సూచించారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అభివృద్ధిలో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని తెలిపారు. చైర్మన్ డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, నగర కమిషనర్ మహేందర్రెడ్డి, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవి గుప్తా తదితర అధికారులు పాల్గొన్నారు. -
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
-
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్శర్మ వచ్చే నెల 12వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి పంపించాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే డీజీపీ హోదాలో ఉన్న అధికారుల బయోడేటా, ట్రాక్ రికార్డు, కేసులు, క్లియరెన్సులు, విజిలెన్స్ సర్టిఫికెట్ తదితర వ్యవహారాలు మొత్తం పూర్తయినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద డీజీపీ అభ్యర్థుల వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్) సైతం క్లియర్ అయినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో యూపీఎస్సీకి... డీజీపీ ఎంపిక ప్రక్రియ కోసం ప్రభుత్వం రాష్ట్ర కేడర్లో డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఏడుగురు అధికారుల పేర్లను రెండు రోజుల్లో యూపీఎస్సీకి పంపిస్తోంది. ఇందులో 1983 బ్యాచ్కు చెందిన తేజ్ దీప్కౌర్, 1984 బ్యాచ్ అధికారి సుదీప్ లక్టాకియా, 1985 బ్యాచ్ అధికారి ఈష్కుమార్, 1986 బ్యాచ్ అధికారులు రాజీవ్ త్రివేది, మహేందర్రెడ్డి, అలోక్ ప్రభాకర్, కృష్ణప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలోని అధికారుల ట్రాక్ రికార్డు, ఏసీఆర్లు, తదితరాలు పరిశీలించిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రేసు నుంచి వాళ్లు ఔట్... రాష్ట్ర కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర సర్వీసులోని సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీగా ఉన్న సుదీప్ లక్టాకియాకు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఆయనకు డీజీపీ హోదా పదోన్నతితో పాటు సీఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీపీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన పోలీస్ యూనిట్కు బాస్గా నియమించడంతో లక్టాకియా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు స్పష్టంచేశారు. అంత కీలక పదవి వదులుకొని రాష్ట్ర డీజీపీ రేసులోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపడంలేదని వారు తెలిపారు. ఇకపోతే మిగిలిన ఆరుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండగా, మరో అధికారి అలోక్ ప్రభాకర్ 15 ఏళ్లుగా కేంద్ర సర్వీసులోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా రాష్ట్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఈష్కుమార్ దేశ పోలీస్ శాఖ డేటా సర్వీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు డైరెక్టర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా రాకపోవచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన ముగ్గురు రాజీవ్ త్రివేది, మహేందర్రెడ్డి, కృష్ణప్రసాద్.. వీరి ముగ్గురి పేర్లు యూపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందే జాబితాలో ఉంటాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరు డీజీపీగా పదవి చేపడతారు. ముందుగా ఇన్చార్జి డీజీపీనే... రేసులో వినిపిస్తున్న ముగ్గురిలో ఒకరిని నవంబర్ 12వ తేదీన ఇన్చార్జి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 12న అనురాగ్శర్మ తన బాధ్యతలను ఇన్చార్జి డీజీపీకి అందజేయనున్నారు. ఇక మహేందర్రెడ్డి, రాజీవ్ త్రివేది, కృష్ణప్రసాద్.. వీరిలో ఎవరు ఇన్చార్జి డీజీపీగా నియుక్తులు అవుతారన్న దానిపై పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొంది. యూపీఎస్సీకి రెండు రోజుల్లో జాబితా వెళితే.. ముగ్గురి పేర్ల ప్రతిపాదిత జాబితా రావడానికి కనీసం నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఇన్చార్జి డీజీపీయే డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకం
హైదరాబాద్: దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంతో కీలకమని, అలా దేశం కోసం సేవ చేస్తూ అమరులైన సైనికులను స్మరించుకోవడం వారికిచ్చే గౌరవమని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి పోలీసు అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన సంస్మరణ పరుగును ఆదివారం గవర్నర్ ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ సైనికుల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణకు ముందుకు రావాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం 10కె, 5కె, 2కె రన్లను గవర్నర్, డీజీపీ అనురాగ్శర్మ ప్రారంభించారు. పరుగులో సీపీ మహేందర్రెడ్డితో పాటు యువకులు, ఔత్సాహికులు వేలాదిగా రన్లో పాల్గొన్నారు. -
పోలీసు త్యాగాలను గుర్తిద్దాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, అమరులైన పోలీసులను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నెల 15న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న పోలీస్ రన్కు సంబంధించిన టీ షర్ట్, మెడల్ను సీపీ మహేందర్రెడ్డి, ఇతర అధికారులతో కలసి అనురాగ్శర్మ గురు వారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్లో 2కె, 5కె, 10కె రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు. 2014 గౌహతిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో పోలీసుల త్యాగాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రధాని సూచించారని వివరించారు. దీనికోసం కేంద్రం ప్రారంభించిన వెబ్సైట్లో పోలీస్ సిబ్బంది చేసిన కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్లోడ్ చేస్తున్నాయన్నారు. గతేడాది రాష్ట్రంలోని వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా ఈ నెల 14 నుంచి 16 వరకు నెక్లెస్రోడ్లో ఎక్స్పో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ రన్లో పాల్గొని, విజయవంతం చేయాలని అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. పోలీస్ రన్ నిర్వహణకు ఎస్.ఎల్.ఎన్ టెర్మినస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి రూ.5 లక్షల చెక్కును ఐజీ సౌమ్యామిశ్రా సమక్షంలో డీజీపీకి అందజేశారు. -
‘మెట్రో’ భద్రత ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కబోతోంది. మెట్రో తొలి దశను వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం దగ్గర పడుతున్నా మెట్రో రైలు భద్రతపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కీలకమైన మెట్రో రైలు భద్రత ఎవరి చేతికి వెళ్తుంది? పోలీస్ శాఖ చేతికి వస్తుందా? లేక ప్రైవేట్ ఏజెన్సీల చేతికి వెళ్తుందా? అనే దానిపై హెచ్ఎంఆర్, పోలీస్ శాఖ మధ్య సందిగ్ధత ఏర్పడింది. సాయుధ బలగాలతో గస్తీ.. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే అందు బాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు, వాటి భద్రత వ్యవహారాలు మొత్తం సాయుధ బలగాలు, పోలీస్ శాఖ చేతిలోనే ఉన్నాయి. ఉగ్రవాద ముప్పు నుంచి ప్రతిక్షణం కాపాడేందుకు ప్రత్యేకమైన భద్రత వ్యవస్థలను అందుబాటు లోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు భద్రత కూడా పోలీస్ శాఖ చేతిలోనే ఉండాలని గతంలోనే రెండు సార్లు సమావే శమై ఇరు విభాగాల అధికారులు నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవు తున్నా ఇప్పటివరకు మెట్రో రైలు భద్రత ఎవరి బాధ్యత అన్న దానిపై రెండు విభాగాల్లోని అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రైవేట్ సెక్యూరిటీకి మొగ్గు.. హెచ్ఎంఆర్, పోలీస్ శాఖ మెట్రో రైలు భద్రతపై సమావేశమైనప్పుడు.. పోలీస్ శాఖనే పూర్తి స్థాయిలో భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించాలని, ఇందుకు ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని రెండు విభాగాలు నిర్ణయించుకున్నాయి. నాగోల్, మియాపూర్, ఎస్ఆర్నగర్లో మెట్రో పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసి, మరో ఐదు ఔట్పోస్టులను పెట్టుకోవాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. మూడు పోలీస్స్టేషన్లకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఉండటంతో పాటు ఔట్ పోస్టుల్లో ఎస్ఐ ర్యాంక్ అధికారిని నియమించాలని, కో–ఆర్డినేట్ చేసుకోవడానికి డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఉంటారని భావించాయి. తీరా సమయం దగ్గరపడుతున్న టైమ్లో ప్రత్యేక పోలీస్స్టేషన్లు అక్కర్లేదని, కొన్ని చోట్ల పోలీస్ సిబ్బంది భద్రత, మిగతా అంతా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుందని మెట్రో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జీఆర్పీ నేతృత్వంలోనే... మెట్రో రైలు భద్రత వ్యవహారాలు మొత్తం ప్రస్తుతం ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం కిందే పనిచేస్తోందని ఉన్నతా ధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఖాజీపేట, హన్మకొండ ఇలా పలు రైల్వేస్టేషన్లలో రాష్ట్ర పోలీస్ కింద పనిచేసే రైల్వే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటి లాగే మెట్రో రైల్వే స్టేషన్లు కూడా జీఆర్పీ కిందే పనిచేసేలా ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్లతోపాటు బోగీల్లోనూ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని భద్రత వ్యవహారాల్లో నిమగ్నం చేయాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం.. పోలీస్ స్టేషన్లు, సాయుధ సిబ్బంది లేకుండా మెట్రో రైలు భద్రతను పర్యవేక్షించడం సాధ్యం కాదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఢిల్లీ మెట్రో రైలు భద్రత మొత్తం సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) చేతిలో ఉంటుంది. కోల్కత్తా మెట్రో భద్రత ఏకంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) చేతికిచ్చారు. బెంగళూరు మెట్రో భద్రతను ప్రైవేట్ సెక్యూరిటీకి ఇచ్చి భంగపడాల్సి వచ్చింది. ఎలాంటి అధికారాలు లేని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అసాంఘిక శక్తులను నియంత్రించడం సాధ్యం కాదని తేలడంతో ఆర్పీఎఫ్, లేదా సీఐఎస్ఎఫ్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మెట్రో నగరాలు ఉగ్రవాద టార్గెట్లో ఉంటాయని, అలాంటి ముప్పును ఎదుర్కోవడం, వాటిని నియంత్రించేందుకు సాయుధ బలగాలు, సివిల్ పోలీస్ సిబ్బంది నేతృత్వంలో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు భద్రత అప్పగిస్తే విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో సమావేశమవుతాం మెట్రో రైలు భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసు కోవాల్సిన చర్యలపై హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులతో సమావే శమవుతాం. మెట్రో రైలు భద్రత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు స్టేషన్లు, సాయుధ సిబ్బంది తప్పనిసరి. గతంలో జరిగిన సమావేశాల్లోనూ ఇదే చెప్పాం. దీనిపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందిం చుకుంటాం. – డీజీపీ అనురాగ్ శర్మ -
15న పోలీస్ మెమోరియల్ రన్
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (అక్టోబర్ 21) పురస్కరించుకొని అక్టోబర్ 15న హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసుశాఖ ‘మెమోరియల్ రన్’ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం డీజీపీ కార్యాలయంలో ఇండియన్ పోలీస్ అమరవీరుల మెమోరియల్ రన్ (ఐపీఎంఎంఆర్) వెబ్సైట్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలతోపాటు ప్రచార వాహనాలను ప్రారంభించారు. రన్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ www. policerun. inను డీజీపీ అనురాగ్శర్మ, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ప్రారంభించగా ఫేస్బుక్ ఖాతా www. facebook. com/ PoliceRun2017ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి ప్రారంభించారు. అలాగే ట్వీటర్ ఖాతా@ipmmr20172017ను అదనపు డీజీపీ గోపీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెమోరియల్ రన్కు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రచారం కోసం మూడు వాహనాలను డీజీపీ అనురాగ్ శర్మ, మిథాలీరాజ్, కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర అధికారులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాది పోలీసు కుటుంబమే: మిథాలీరాజ్ పోలీసు సిబ్బంది త్యాగాలు, వారి సేవలు తనకు బాగా తెలుసని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాల్రాజ్ పేర్కొన్నారు. తన తాత, తండ్రి పోలీసుశాఖలో పనిచేశారని, పోలీసు సిబ్బంది కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసన్నారు. కంటికి రెప్పలా పోలీసులు కల్పిస్తున్న రక్షణ వల్లే తాము దైర్యంగా క్రికెట్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నామని అభిప్రాయపడ్డారు. మహిళా రక్షణలో రాష్ట్ర పోలీసులు చేపడుతున్న చర్యలు భేష్ అని కితాబిచ్చారు. -
కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి
డీజీపీకి ఆర్యవైశ్య మహాసభ వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య మహాసభ సోమవారం డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసింది. స్మగ్లర్ల పేరుతో తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా పుస్తకంలో పేర్కొన్నారని, ఈ మేరకు ఐలయ్యపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్స్టేషన్లో తమ ఆర్యవైశ్యులు చేస్తున్న ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో రాష్ట్ర సం ఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, రాజశేఖర్ గుప్తా, రెడ్డిశెట్టి ఉన్నారు. నాకు రక్షణ కల్పించండి: ఐలయ్య ఆర్యవైశ్య సంఘం నుంచి తనకు ప్రమాదం ఉన్నందున జీవితాంతం పోలీసుల రక్షణ కావాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అనే పుస్తకాన్ని రచించినందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, దుబాయ్, యుఎస్ఏ తదితర ప్రాంతాల నుండి బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. తనకు వచ్చే ఫోన్కాల్స్లోని కొన్నింటిని ఏసీపీ కూడా మాట్లాడారని తెలిపారు. వారు తనపై కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. తన జీవితంలో అసహజ మరణం అంటూ జరిగితే ఆర్యవైశ్య సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఏడు సెల్ ఫోన్ నంబర్లను గుర్తించాం ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్కు సంబంధించి ఏడు ఫోన్ నంబర్లను ట్రేస్చేశామని ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. ఈ ఏడు నంబర్లు ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులవని తేలిందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. భద్రత కల్పించండి: అసదుద్దీన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఐలయ్యను బెదిరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. బెదిరింపులు సరికాదు: తమ్మినేని ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వస్తున్న బెదిరింపులను టీమాస్ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన టీమాస్ సభలో తమ్మినేని ప్రసంగించారు. ఐలయ్య రాసిన పుస్తకాల్లో వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, కులాల సామాజిక చరిత్రను మాత్రమే ఆయన వెలికితీశారన్నారు. ఆయన వైశ్య కులంలోని అసంబద్ధ విధానాలనే విమర్శించారని, బ్రాహ్మణులు, రెడ్లు వంటి కులాల్లోని ఆధిపత్య సంస్కృతిపై కూడా అనేక విమర్శలున్నాయని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలయ్య వంటి వారిపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఐలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
నోట్ల మార్పిడిపై 23 కేసులు
పార్లమెంటరీ కమిటీ భేటీలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో పార్లమెంటరీ కమిటీతో డీజీపీ బృందం సమావేశమైంది. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో కేసుల నమోదు, నకిలీ కరెన్సీ కేసులు తదితర అంశాలపై చర్చించడంతో పాటుగా ఓ నివేదికనూ పార్లమెంట్ కమిటీకి అందించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కమిషనర్ మహేందర్రెడ్డితో పాటు సీఐడీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు విభాగాలతో భేటీ: కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపై రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించింది. మైనారిటీ వ్యవహారాలకు సంబంధించిన పథకాలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్థిక శాఖ, పలు విభాగాలతో భేటీ అయ్యింది. నోట్ల రద్దు తర్వాత సమస్యలపై బ్యాంకు యాజమాన్యాలతో కమిటీ సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. -
గణేశుడికి జియోట్యాగ్!
- సులభతరం కానున్న వినాయక నిమజ్జనం - ప్రత్యేక క్యూఆర్ కోడ్ సైతం ఏర్పాటు - ఒక్క క్లిక్తో విగ్రహాల పూర్తి వివరాలు.. - పోలీసులకు తప్పనున్న తిప్పలు - గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలో విగ్రహాల సంఖ్య, ఎత్తు, మండపం అనుమతి తీసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచనుంది. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించే ప్రతి వినాయక విగ్రహానికి జియోట్యాగ్ ఏర్పాటు చేశారు. గతంలో పోలీసులు మండపం వద్దకు వెళ్లి తనిఖీ చేసి తమ రిజిస్టర్లో నమోదు చేసుకుని, నిర్వా హకుల సంతకం తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా జియోట్యాగ్ ద్వారా మండపానికి 50 మీటర్ల దూరంలో ఉండ గానే హైదరాబాద్ ‘కాప్యాప్’ద్వారా కమాండ్ సెంటర్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి. పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లారా లేదా అనే వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. విగ్రహాల వివరాలు పక్కాగా.. ఈసారి హైదరాబాద్లో కొత్తగా ప్రతి గణేశుడికి క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్)ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ బార్కోడ్ ద్వారా పోలీసు సిబ్బంది ట్యాబ్లో స్కాన్ చేయగానే విగ్రహం ఎత్తు మండప నిర్వాహకులు తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. నిమజ్జన సమయంలో విగ్రహం ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు నిమజ్జనం అవుతుంది.. వంటి వివరాలను కూడా పోలీసులకు తెలియజేస్తుందన్నమాట. ట్యాంక్బండ్ వద్ద నిమజ్జనమైన విగ్రహాల సంఖ్యను పోలీసులు లెక్కిస్తూ నమోదు చేసుకోవాల్సి వచ్చేది. క్యూఆర్ కోడ్ వల్ల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నిమజ్జనమైన విగ్రహాల వివరాలు పక్కాగా తెలిసిపోతాయి. క్రేన్ల రీడిజైన్.. ట్యాంక్బండ్పై ఏర్పాటుచేసిన క్రేన్ల కొండీల (హుక్స్)ను రీడిజైన్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలి పారు. విగ్రహాలు నీళ్లలోకి వెళ్లగానే కొండీలు వాటంతట అవే తెరుచుకుంటాయన్నారు. గతంలో వాటిని మనుషులు తీసేవార ని, భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో కొండీల తొలగింపు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండబోదన్నారు. 24 వేల మందితో బందోబస్తు.. నగరంలో సెప్టెంబర్ 5న జరిగే నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తుపై డీజీపీ అనురాగ్శర్మ సోమవారం సమీక్ష నిర్వ హించారు. 24 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి డీజీపీకి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, ఏపీ పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్లోని పోలీస్ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తున్నట్టు తెలిపారు. యూనిఫాం సర్వీసులైన ఫారెస్ట్, ఎక్సైజ్ సిబ్బందిని కూడా బందోబస్తులో వినియోగించనున్నామన్నారు. ఈ మేరకు ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి 2 వేల మందిని కేటాయించా లని సంబంధిత విభాగాధిపతులకు లేఖలు రాశామన్నారు. -
నవంబర్ 12న డీజీపీ రిటైర్మెంట్!
► కొత్త డీజీపీ ఎవరన్నదానిపై చర్చ ► రాష్ట్ర హోంశాఖ సలహాదారుడిగా అనురాగ్శర్మ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్శర్మ నవంబర్ 12న పదవీ విరమణ చేయబోతున్నారు. తెలంగాణ తొలి డీజీపీగా నియమితులైన ఆయన 2014 జూన్ 2న ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అనురాగ్శర్మ ఈ ఏడాది నవంబర్ 12న పదవీ విరమణ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేసులో ఎవరు..? 1982 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అనురాగ్శర్మ ప్రస్తుతం రాష్ట్ర కేడర్లో సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన తర్వాత 1983 బ్యాచ్లో ఎస్పీఎఫ్ డీజీ తేజ్దీప్కౌర్, 1984 బ్యాచ్లో సుదీప్ లక్టాకియా సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీగా ఉన్నారు. 1985 బ్యాచ్కు చెందిన ఈష్కుమార్ నేషనల్ క్రైమ్ రికారŠుడ్స బ్యూరో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పొందిన 1986 బ్యాచ్ అధికారులు మహేందర్రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్త్రివేది, ఆలోక్ ప్రభాకర్ ఉన్నారు. ఈ ఏడుగురూ డీజీపీ పోస్టు కోసం పోటీపడే జాబితాలో కనిపిస్తున్నారు. వీరిలో సుదీప్ లక్టాకియా, ఈష్కుమార్, అలోక్ప్రభాకర్ కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. వీరు డీజీపీ రేసులో ఆసక్తి చూపడంలేదు. ఇక మిగిలింది తేజ్దీప్కౌర్, మహేందర్రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్త్రివేది. ఈ నలుగురిలో ప్రభుత్వం నవంబర్ 12న ఇన్చార్జి డీజీపీగా ఎవరి పేరు ప్రతిపాదిస్తుందన్న దానిపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ప్యానల్లో అందరి పేర్లు..: డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్గా 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న, డీజీపీ హోదా ఉన్న అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్యానల్ జాబితా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించాలి. రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఏడుగురు అధికారులు డీజీపీ హోదాలో ఉన్నారు. వీరందరి పేర్లూ కేంద్రానికి పంపించాలి. అయితే కేంద్ర సర్వీసులో ఉన్నవారి డిప్యుటేషన్ గడువు ముగియకుండా వెనక్కి పంపడం కుదరదు. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల్లోని ముగ్గురి పేర్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. ఈ ముగ్గురిలో ఒక అధికారిని డీజీపీగా నియమించుకునే విచక్షణాధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అనురాగ్శర్మకు కీలక పదవి..! డీజీపీగా పదవీవిరమణ చేయనున్న అనురాగ్శర్మకు కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ కీలక పదవి వరించనున్నట్టు అటు పోలీస్, ఇటు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో హోంశాఖ, అంతర్గత భద్రత వ్యవహారాలను మానిటరింగ్ చేసేందుకు అనురాగ్శర్మను హోంశాఖ సలహాదారుడిగా నియమించే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వద్ద ఆయనకు మంచి పేరుంది. దీంతో కేంద్ర హోంశాఖలో ఓఎస్డీగా, లేదంటే ప్రత్యేక కమిటీ వేసి, దానికి చైర్మన్ను చేసే ఆలోచనలో కూడా కేంద్ర హోంశాఖ వర్గాలున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. -
నిరుద్యోగులను జాబ్తో కనెక్ట్ చేస్తుంది
► నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపే మార్గం ► ప్రత్యేక వాహనం రూపొందించిన నగర పోలీసులు ► కమ్యూనిటీ పోలీసింగ్ చర్యల్లో భాగంగానే ► ప్రారంభించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్ : ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కోసం నగర పోలీసులు అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్లో మరో ముందడుగు పడింది. నిరుద్యోగులైన యువ తకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం సిటీ పోలీసులు ‘జాబ్ కనెక్ట్’పేరుతో ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. దీన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ గురువారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఏమిటీ వాహనం..? ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి గగనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం షెడ్యూల్ ప్రకారం నిత్యం కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఎలాంటి అండదండలు లేనివారు ఉంటున్న ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని వెళ్తుంది. ఎలా ఉపకరిస్తుంది? దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహ నంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్ చేసుకోవ చ్చు. ఇలా రిజిస్టర్ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్లైతే ‘జాబ్ కనెక్ట్’సిబ్బంది ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇచ్చి సమన్వ యం చేస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా... ‘జాబ్ కనెక్ట్’వ్యాన్కు అమర్చిన స్క్రీన్ ద్వారా ప్రజలకు అవసరమైన సూచ నలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు. మరోపక్క నగర పోలీసులు రూపొందించిన ‘హాక్–ఐ’యాప్ ద్వారానూ నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ‘చేయూత’స్ఫూర్తితో... నార్త్జోన్ డీసీపీ బి.సుమతి గత ఏడాది డిసెంబర్ 4న ‘చేయూత’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు సిబ్బందిని వారి పరిధుల్లో ఉన్న కాలనీలు, బస్తీలకు పంపడం ద్వారా మొత్తం 7,540 మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం టీఎంఐ సంస్థతో కలిసి 40 కంపెనీలతో భారీ జాబ్మేళా నిర్వహించి 1,300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో సీపీ మహేందర్రెడ్డి ఈ విధానం అన్ని ఠాణాల పరిధుల్లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్కు రూపమిచ్చారు. నిస్పృహకు లోనైతే ఇబ్బందే విద్యార్హతలు ఉన్న తర్వాత ఉద్యో గాలు రాకపోతే యువత నిస్పృహకు లోనవుతారు. అలాంటి వారే దారితప్పి నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది. అలా కాకుండా చేయడానికి ఇలాంటి చర్యలు చాలా కీలకం. నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’ను పరిచయం చేయడం శుభపరి ణామం. ఇది పోలీసింగ్లోనే కొత్త ఒరవడి. – అనురాగ్ శర్మ, డీజీపీ పరిచయాలు అవసరం లేకుండా కంపెనీలో తెలిసిన వారి అవసరం లేకుండా అర్హులైన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే మంచి పేరున్న టీఎంఐ సంస్థతో కలసి పని చేస్తున్నాం. ప్రధానంగా బస్తీలు, నిరుపేదలు నివసించే, వెనుకబడిన కాలనీలపై దృష్టి పెట్టనున్నాం. – ఎం.మహేందర్రెడ్డి, నగర కొత్వాల్ ఆ రెండిటికీ వారధిగా పనిచేస్తాం అనేక సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం, నిరుద్యోగులకు ఆ వివరాలు తెలిపి అర్హులైన వారి పొందేలా చేయడం... ఈ రెండిటికీ మధ్య మేము వారధిగా పనిచేస్తాం. ఈ వ్యాన్ ద్వారా ఉద్యోగాల కోసం తిరిగే అవకాశంలేని వారి ముంగిట్లోకి అవకాశాలను తీసుకువెళ్తాం. – మురళీధరన్, టీఎంఐ చైర్మన్ -
డ్రగ్స్ తర్వాత ఇదే అతిపెద్ద వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న మానవ అక్రమ రవాణా - రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను నియంత్రిస్తున్నాం - 2014 నుంచి ఇప్పటివరకు 1,397 మందిని రక్షించాం - మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో డ్రగ్స్ తర్వాత స్థానంలో మానవ అక్రమ రవాణా ఉందని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా నేతృత్వంలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల హక్కులు, వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్న మహితా, ప్లాన్ ఇండియా సంస్థల ప్రతినిధులు, ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు కలసి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఐడీ ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నామని, ఇప్పటివరకు 953 అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, 1,397మంది మహిళలు, యువతులను రక్షించామని తెలిపారు. వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డ వారికి సరైన ఆధారం కల్పించి, ఆదాయ మార్గాలు చూపిస్తే మళ్లీ వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా ఉంటారని, దీనిపై పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సీఐడీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది బాలకార్మికులను తల్లిదండ్రుల చెంతకు పంపించామని, బాలలతో పనిచేయిస్తున్నవారిపై పీడీ యాక్ట్ పెంట్టేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. కాగా, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిన మానవ అక్రమ రవాణా సమస్య తక్కువగా ఉందని డీజీపీ వెల్లడించారు. మరింత సామర్థ్యం పెంచుకోవాలి... మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు, న్యాయవాదులు మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ సౌమ్యామిశ్రా అభిప్రాయపడ్డారు. వ్యభిచార కూపాలు, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన.. ఇలా అనేక రకాలుగా కొందరు వ్యక్తులు మహిళలు, చిన్నారులను వేధిస్తున్నారని, వీరికి కఠినమైన శిక్షలు పడాలంటే పోలీసులు, న్యాయవాదులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహితా స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ శేఖర్రెడ్డి, ప్లాన్ ఇండియా స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనితా కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణుడు సుధామురళీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్రావు, యునిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. బాధితులుగా చూడాలి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ వ్యభిచార గృహాల నుంచి మహిళలను బాధితులుగా గుర్తించి కాపాడాలని, వారిని నిందితులుగా చూడవద్దని పోలీస్ అధికారులకు సూచించారు. వారు ఈసడింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని గుర్తుచేశారు. -
‘అవసరం అయితే అకున్కు భద్రత పెంపు’
హైదరాబాద్ : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు బెదిరింపు కాల్స్పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. బెదిరింపు కాల్స్ను ధ్రువీకరించిన ఆయన ... అవసరం అయితే అకున్ సబర్వాల్కు అదనపు భద్రత కల్పిస్తామన్నారు. బెదిరింపు కాల్స్పై ఇంటెలిజెన్స్ అధికారులకు అకున్ సబర్వాల్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ కాల్స్పై విచారణ జరుగుతోందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో బెదిరింపు కాల్స్పై స్పష్టత వస్తుందన్నారు. కాగా డ్రగ్స్ మాఫియా కేసు విచారణను తక్షణమే నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అకున్ సబర్వాల్కు కాల్ చేసి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. -
పోలీస్ ఆత్మహత్యలపై అధ్యయనం
ఐపీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరసగా చోటుచేసుకుంటున్న సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ అనురాగ్ శర్మ దృష్టి సారించారు. ఆత్మహత్యలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్శాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో ఉన్న ఒత్తిడి నివారణ, మానసిక కుంగుబాటు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై శిక్షణ విభాగం ఐజీ చారుసిన్హా నేతృత్వంలో అధికారులు కలసి పనిచేయాలని, ఒత్తిడి నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆలోచనలను చారుసిన్హాకు తెలియజేయాలని అధికారులకు డీజీపీ సూచించారు. అలాగే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా తయారుచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పలువురు పోలీస్శాఖ ఉన్నతాధికారులతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెట్టెలోనే ఫిర్యాదులు..!
ముఖ్యమంత్రికి చేరని పోలీస్ ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీస్ కాన్ఫరెన్స్ను సీఎం కేసీఆర్ నిర్వహించారు. ప్రజలకు అందించాల్సిన పాలన, అవినీతి, అక్రమాల నియంత్రణ.. ప్రభుత్వ విధివిధానాలను కింది స్థాయిలో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలతో పాటు పై స్థాయిలో ఉండే ఐపీఎస్ అధికారులందరికీ వివరించారు. అలాగే పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సూచించాల్సిన సలహాలు, చేయాల్సిన ఫిర్యాదులు.. సీక్రెట్ బాక్స్ (సలహాల పెట్టె)లో వేయాలని ప్రకటించారు. ఆ సలహాల పెట్టెను స్వయంగా తానే పరిశీలిస్తానని, అందులో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. దీంతో 80 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 36 మంది ఇన్స్పెక్టర్లు పోలీస్ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, జిల్లాల్లో పలువురు ఎస్పీలు చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. దీని పై నివేదిక రూపొందించి సీఎంకు ఉన్న తాధికారులు అందించాల్సి ఉంది. సమావేశం నిర్వహించి రెండు నెలలు గడిచింది. సలహాల పెట్టెను డీజీపీ అనురాగ్ శర్మ ఓపెన్ చేసి నెలన్నర గడిచిపోయింది. అసలు ఆ ఫిర్యాదులేంటి, వాటిలో ఉన్న అధికారుల సంగతేంటి, వారు పాల్పడుతున్న అక్రమాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పట్టించుకోలేదని కింది స్థాయి సిబ్బంది నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులపై ఓ కమిటీ వేసి సమీక్ష నిర్వహించాల్సిన అధికారులు సమయం లేదంటూ దాటవేయడం ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎంత మందికి నోటీసులు జారీ చేశారో, ఎంత మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారన్న వివరాలతో కూడిన డ్రగ్స్ రాకెట్ కేసు నివేదికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీఎం కేసీఆర్కు అందజేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న కేసీఆర్.. విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టొద్దని అకున్ సబర్వాల్ సహా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షకు డీజీపీ అనురాగ్ శర్మ, అకున్ సబర్వాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కేసు విచారణకుగానూ అవసరమైతే మరికొంత మంది పోలీసుల సహాయం తీసుకోవాలని అకున్ సబర్వాల్కు కేసీఆర్ సూచించారు. సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చునని, నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని పోలీసులకు కేసీఆర్ సలహా ఇచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కెల్విన్తో పాటు మహ్మద్ ఖద్దుస్, మహ్మద్ వాహిద్లను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. నేటి సాయంత్రానికి వీరి సిట్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురిని అదుపులోకి ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. పది రోజుల సెలవుపై వెళ్లాలన్న నిర్ణయాన్ని అకున్ సబర్వాల్ ఇదివరకే వెనక్కి తీసుకుని కేసు విచారణను వేగమంతం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. పలువురు సినీ ప్రముఖులకు ఈ కేసులో నోటీసులు అందడంతో పాటు మరికొందరి పేర్లు వెలుగుచూస్తాయని కథనాలు ప్రచారం కావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. హైదరాబాద్లో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందినవారు డ్రగ్స్ కు బానిసైనట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
గ్రామీణ పోలీస్ స్టేషన్లలో మార్పులు
♦ పోలీస్ కమిషనర్లు/ఎస్పీలతో డీజీపీ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరహాలో ప్రతి జిల్లా పోలీస్ యూనిట్ మార్పు చెందాలని డీజీపీ అనురాగ్ శర్మ ఆకాంక్షించారు. పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా పోలీస్ సిబ్బందితోపాటు పోలీస్ వ్యవస్థ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన పోలీసింగ్ విధానం– అమ లుపై రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులం దరితో గురువారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.పదేళ్లలో పోలీస్ శాఖ తీసు కురావాల్సిన యాక్షన్ ప్లాన్పై చర్చించారు. జిల్లా పోలీస్ స్థిరీకరణ ప్రణాళిక.. ప్రతి పోలీస్స్టేషన్ అవసరాలను గుర్తించి వాటిని ఆధునిక సౌకర్యాలతో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థిరీకరణ ప్రణాళిక తయారు చేశారు. ప్రక్షాళనకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. మే నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల సమావేశం అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ తరహాలో ప్రతీ పోలీస్ స్టేషన్లోను అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని డీజీపీ నిర్ణయించారు. యూనిట్ అధికారులు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్, ఎస్.ఐ.హోదా అధికా రులతో కూడిన 7 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లను పరిశీలించడంతో పాటు స్టేషన్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కాగా టెక్నాలజీని, స్టేషన్ వాతావరణాన్ని మార్చేందుకు ప్రతీ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా ఒక మోడల్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ల సందర్శన ప్రస్తుతం సర్దార్ వల్లభ్భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 4 రాష్ట్రాలకు చెందిన 16మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. తెలంగాణలోని సాంస్కృతిక వ్యవహారాలు, పోలీసింగ్ విధానంపై పలు విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆబ్కారీ శాఖ చేస్తున్న దర్యాప్తునకు తమ టాస్క్ఫోర్స్తో పాటు ఇంటెలిజెన్స్ విభాగాలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. -
నో ఎంట్రీ పేరుతో దోచుకుంటున్నారు
పోలీసుల చర్యలపై డీజీపీకి లారీ యజమానుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సివిల్, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, అనుమతులున్నా తనిఖీల పేరుతో ఇష్టారా జ్యంగా వారు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆరోపించింది. ఈమేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఆ సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సీజ్ చేసిన లారీలను కోర్టుకు కాకుండా స్టేషన్ నుంచి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని అసోసియేషన్ కోరింది. ప్రమాదాల కేసుల్లో లారీల తప్పున్నా.. లేకున్నా.. పెద్ద వాహనం కాబట్టి కేసులు నమోదు చేస్తున్నారని, తప్పెవరిదో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సెక్షన్ 337, 338, 304ఏలో లారీ డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల సమయంలో అన్ని ధ్రువీకరణ పత్రాలు చూపించినా ట్రాఫిక్ పోలీసులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే డ్రైవర్లను ఇబ్బందులకు గురిచే స్తున్నారని ఆరోపించారు. జంటనగరాల్లో పగటి సమయాల్లో నో ఎంట్రీ ఉందని, అయితే ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర సర్వీస్ రోడ్డులో నో ఎంట్రీ పేరుతో ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. -
పోలీస్ శాఖలో జోన్ల లొల్లి
- రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా కానిస్టేబుళ్లు, ఎస్సైలు - నియామక పద్ధతులు మార్చాలని నిర్ణయం - విభేదిస్తున్న సీనియర్ ఐపీఎస్లు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో జోన్ల రద్దు సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో జోన్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పోలీస్ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో జిల్లా కేడర్లో ఉన్న కానిస్టేబుళ్లు, రేంజ్ కేడర్గా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు, జోన్ల వారీగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు.. ఇక రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఇటీవల కీలక భేటీ నిర్వహించింది. ఇందులో ఒక్కో ఐపీఎస్ అధికారి ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం ఐపీఎస్ అధికారులు కానిస్టేబుళ్లను రాష్ట్ర ఉద్యోగులుగా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల శాంతి భద్రతల సమస్యలు, సీనియారిటీ వ్యవహారం, పదోన్నతులు, బదిలీల వ్యవçహారాల్లో ఇబ్బందులొస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కేడర్గా గుర్తించే వ్యవహారాన్ని విభేదిస్తున్నట్లు తేల్చిచెప్పారు. రాష్ట్ర స్థాయితో ప్రయోజనం? జిల్లా పరిధిలోనే పనిచేసేలా కానిస్టేబుళ్ల ఎంపిక జరుగుతుంది. అవసరమైతే డిప్యూటేషన్పై ప్రత్యేక విభాగాలకు బదిలీ చేసేవారు. అయితే ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో పనిచేయడం వల్ల పోలీస్స్టేషన్లలో ఎస్సైలను, ఇన్స్పెక్టర్లను లెక్కచేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఇటీవల ఏకంగా కేబినెట్ భేటీలో సీనియర్ మంత్రి సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. ఒకే జిల్లాలో పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరి వల్లే ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ప్రతి పోస్టును రాష్ట్ర కేడర్గా పరిగణించాలని, జోన్ల రద్దులో ఈ విషయాన్ని చేర్చాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. రాష్ట్ర కేడర్కు మారితే జిల్లా కేడర్కు చెందిన కానిస్టేబుల్ కానీ, రేంజ్ కేడర్కు చెందిన ఎస్సై కానీ అవినీతికి పాల్పడితే రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పనిష్మెంట్ కింద బదిలీ చేయొచ్చు. దీంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఓ వాదన. జిల్లాల విభజనకు ముందు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రెండు జోన్లు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ నాలుగు రేంజ్లుండేవి. ఒక్కో రేంజ్ కింద 2 జిల్లాల యూనిట్లు ఉంటాయి. ఎస్ఐలను ఈ జిల్లాల పరిధిలోనే బదిలీ చేసే అవకాశం ఉండేది. పాత జిల్లాల ప్రకారం వరంగల్ జోన్ కింద 4, హైదరాబాద్ జోన్ కింద 5 జిల్లాలుండేవి. హైదరాబాద్, సైబరాబాద్ కూడా హైదరాబాద్ జోన్ కిందకు వచ్చేవి. ఎస్సైలకు గెజిటెడ్ హోదా! ఎస్సైలను రాష్ట్ర కేడర్గా గుర్తించడంలో పెద్దగా సమస్యలేవీ కన్పించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ లిస్ట్ను బ్యాచ్ల వారీగా పాటిస్తే ఇబ్బంది లేదని ఎస్సైలు చెబుతున్నారు. అయితే తమకు గెజిటెట్ హోదా కల్పిçస్తూ రాష్ట్ర కేడర్ చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇన్స్పెక్టర్ల విషయంలో మాత్రం కోర్టుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. జోన్ల వారీగా ఉన్న తమకు పదోన్నతులు, సీనియారిటీలో న్యాయం జరగలేదని, రాష్ట్ర కేడర్గా చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని ఇన్స్పెక్టర్లు పేర్కొంటున్నారు. బ్యాచ్ల వారీగా కాకుండా సీనియారిటీ పేరుతో వరంగల్ జోన్లో ఉన్న వారికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం చేస్తే మూకుమ్మడి సెలవులో వెళతామని, డీజీపీ సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. అభ్యంతరాలు పరిశీలిస్తాం జోన్ల రద్దుపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాం. జోన్ల రద్దు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. జోన్ల రద్దు, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల లాభ నష్టాలపై అధ్యయనం చేస్తున్నారు. కానిస్టేబుళ్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వారిని రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వారి బదిలీలు, పదోన్నతుల విషయంలో మాత్రం రేంజ్ వరకే పరిమితి చేయాలనే ఆలోచనను చాలా మంది ఐపీఎస్లు వ్యక్తంచేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. – డీజీపీ అనురాగ్శర్మ -
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
ప్రతిపాదనలను కేంద్రానికి పంపాం: డీజీపీ హైదరాబాద్: మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇందుకు ‘యాంటీ ఈవ్ టీజింగ్ యాక్ట్’పేరుతో మరింత కఠినమైన చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని తాజ్డెక్కన్ హోటల్లో ‘బీ బోల్డ్ ఫర్ ఛేంజ్’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత చట్టాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, స్వల్ప ఫైన్ చెల్లించి ఈవ్టీజర్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ కామినీ షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జేజే యాక్ట్ అమలులో సవాళ్లు
- హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ - 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోంది - కేసుల విచారణకు న్యాయాధికారుల కొరత - ఉన్న వారే జేజే, పోక్సో కేసులనూ విచారిస్తున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: జువెనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్)–2015, లైంగిక నేరాల నుంచి పిల్లల సంరక్షణ చట్టం (పోక్సో యాక్ట్)–2012 అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో న్యాయాధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోందని, పోక్సో కేసులూ పెరుగు తున్నాయన్నారు. ఈ కేసులను విచారించేందుకు తగిన సంఖ్యలో న్యాయాధికారులు లేరని, ఉన్న వారే మిగిలిన కేసులతోపాటు జేజే, పోక్సో కేసుల ను విచారించాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు ఈ కేసుల పరిష్కారం విషయంలో న్యాయాధికారులకు సహాయ, సహకారాలు అందడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ ఆర్డీలో ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో సంయుక్త ఆధ్వర్యంలో జేజే, పోక్సో చట్టాలపై ఓ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ కీలకోప న్యాసం చేశారు. జువైనల్ కేసుల పరిష్కారంలో డాక్టర్లు, సైకాలజిస్టుల పాత్ర కీలకమని, అయితే సైకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. బాధిత పిల్లలకు న్యాయస్థానాల్లోని వాతావరణం వల్ల విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చేందుకే భయప డుతున్నారని, ఇది కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. బాధిత పిల్లలకు ఈ రకమైన భయాన్ని పోగొట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామని వివరించారు. నేరం చేసిన బాలల వయస్సు నిర్ధారణ న్యాయాధికారులకు పెద్ద సమస్య అని జస్టిస్ రంగనాథన్ తెలిపారు. డాక్టర్ల సాయం లేనిదే వయస్సు నిర్ధారణ సాధ్యం కాదని, వయస్సు నిర్ధారణ అయితే తప్ప కేసులో ముందుకెళ్లడం కుదరదని పేర్కొన్నారు. కార్యక్ర మంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకర నారాయణ, పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, రిజిస్ట్రార్ (మేనేజ్మెం ట్) డి.నాగార్జున, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు, పలువురు న్యాయాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కుటుంబాల్లోనే ఎక్కువగా లైంగిక దాడులు: డీజీపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, బాలలపై లైంగిక దాడులకు సంబంధించి ఈ ఏడాది 464 కేసులు నమోదయ్యాయని, కుటుంబాల్లోనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా పిల్లల పాఠ్యపుస్తకాల్లో హెల్ప్లైన్ నంబర్లను ముద్రించి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సోనికుట్టీ జార్జ్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తెలంగాణలో మావోయిస్టులు అడుగుపెట్టలేరు
భూపాలపల్లి జిల్లాలో త్వరలో రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలు మేడారంలో పోలీస్స్టేషన్ ఏర్పాటు- డీజీపీ అనురాగ్శర్మ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు అడుగుపెట్టలేరని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, జిల్లా పోలీసు కార్యాలయాలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ మొబైల్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశమైన అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. భద్రతాపరంగా తాము రాజీ పడేది లేదన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్వరలోనే రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారంలో పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేస్తానని అన్నారు. మేడారం జాతరను దిగ్విజయంగా జరిపేందుకు జిల్లా పోలీసులు పకడ్భందీ ప్రణాళికలు రూపొందించాలని డీజీపీ అనురాగ్శర్మ ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్హెగ్డే, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు శ్రీనివాస్, కెఆర్కె ప్రసాద్ పాల్గొన్నారు. -
నయీం ఖాకీలకు చార్జిమెమోలు!
14 మందికి జారీ చేసిన డీజీపీ కార్యాలయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ కార్యాలయం చార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది. నయీంతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను సస్పెండ్ చేసిన డీజీపీ అనురాగ్ శర్మ.. మైనర్ పనిష్మెంట్ల కింద 14 మందికి చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నయీంతో కలిసి ఎందుకున్నారు, అతడికి మీకు సంబంధం ఏంటి, సిట్ దగ్గరున్న ఆధారాలపై మీ వివరణ ఏంటి.. అనే అంశాలను చేరుస్తూ వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మెమోలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిగానీ, సిబ్బందిగానీ ఇచ్చే వివరణ సరిగ్గా లేకుంటే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. లైట్ తీసుకో..: మరోవైపు నయీం కేసులో ఇక పోలీస్ శాఖ గానీ, ప్రభుత్వం గానీ ముందుకు వెళ్లే వీలు లేదని చార్జిమెమోలు అందుకున్న అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. సస్పెన్షన్పైనే తీవ్రమైన ఒత్తిడి ఉందని, చార్జిమెమోలు సూత్రప్రాయంగా ఇచ్చినవేనని, అంతకు మించి ఇందులో తదుపరి చర్యలకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ డీఎస్పీ స్పష్టంగా చెబుతున్నారు. -
తెలంగాణ పోలీస్కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ
పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారం సాక్షి, హైదరాబాద్: పోలీస్ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీస్కు ఆల్రౌండర్గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆలిండియా స్పోర్ట్స్ డ్యూటీ మీట్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను బుధవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి ఫైరింగ్ ఆర్మ్స్ను రూ.2.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిద్దామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీతోపాటు స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్రావులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్ డాగ్ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్కుమార్ జైన్, సౌమ్యా మిశ్రా, షికా గోయల్, చారు సిన్హా, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ
హైదరాబాద్: పోలీస్ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీసుకు ఆల్రౌండర్గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఆలిండియా స్పోర్ట్స్ డ్యూటీ మీట్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను పోలీస్ ముఖ్య కార్యాలయంలో బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి రూ.2.5 కోట్లు వెచ్చించి ఫైరింగ్ ఆర్మ్స్ను కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నానని అన్నారు. మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీతోపాటు స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్రావులను డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్ డాగ్ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్కుమార్ జైన్, సౌమ్యా మిశ్రా, షికా గోయల్, చారు సిన్హా, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయంలో నయీమ్ ఖాకీలు!
- అమెరికా వెళ్లేందుకు అనుమతికోసం విశ్వప్రయత్నం - ఓ మంత్రితో ఏకాంతంగా భేటీ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో ఆరోపణలతో సస్పెండైన ఇద్దరు పోలీసు అధికారులు సోమవారం సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. నయీమ్తో అంటకాగారని, పలు దందాలకు సహకరిం చారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు నెల రోజుల కింద ఐదుగురు పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్శర్మ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వెలుగులోకి రాని అధికారులు ఇలా సచివాలయంలో కనిపించడంతో మీడియా, ఇతర పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. అమెరికా వెళ్తాం.. అనుమతి కావాలి నయీమ్ కేసులో సస్పెండైన అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్రావు సోమవారం సచివాలయానికి వచ్చారు. వ్యక్తిగత కారణాల రీత్యా అమెరికా వెళ్లేందుకు అనుమతి కావాలంటూ ఇటీవల వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని.. ఆ అనుమతి వ్యవహారం ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకునేందుకు సచివాలయానికి వచ్చారని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. సచివాలయంలోని సి బ్లాక్లో ఉన్న సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లోకి వెళ్లిన ఈ ఇద్దరు అధికారులు... తమ విదేశీ పర్యటన అనుమతిపై ఆరా తీశారని, అయితే ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని జీఏడీ అధికారులు చెప్పారని సమాచారం. సీఎం కార్యాలయం నుంచి అనుమతిపై స్పష్టత రాగానే ఆదేశాలిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రితో ఏకాంతంగా భేటీ? ఈ ఇద్దరు పోలీసు అధికారులు జీఏడీకి వెళ్లడానికి ముందుగా... తొలి నుంచీ తమ వాదనను బలపరుస్తున్న ఓ సీనియర్ మంత్రితో ఏకాంతంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. తమ విదేశీ పర్యటనకు అనుమతిప్పించేలా ప్రయత్నించాలని ఆ మంత్రికి మొరపెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే రగిలిపోతున్న ఆ సీనియర్ మంత్రి.. ఈ ఇద్దరు అధికారుల తరఫున పైరవీకి సిద్ధమైనట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. అయితే.. నయీమ్ కేసులో సస్పెన్షన్లో ఉన్న అధికారులు.. హైదరాబాద్ విడిచివెళ్లేందుకు డీజీపీ అనురాగ్శర్మ నుంచి అనుమతి రావాల్సి ఉందని ఉన్నతా« దికారులు అభిప్రాయపడ్డారు. నయీమ్ కేసు విచారణలో ఉన్న సమయంలో ఆరోపణలున్న అధికారులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు. -
అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 ఉత్తమ సేవాపతకాలు, 55 పోలీస్ మెడల్స్ను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు వినూత్నమైన కార్యాచరణతో పోలీస్ శాఖ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రానికి 26 గ్యాలంటరీ అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను 2016 స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందజేశారు. -
నయీమ్ కేసులో మంత్రాంగం!
- సీనియర్ మంత్రిని రంగంలోకి దించిన ‘నయీమ్ ఖాకీలు’ - ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని వారికి మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తదుపరి చర్యల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నయీమ్తో లింకులపై మౌఖిక విచారణ, క్రిమినల్ కేసుల నుంచి బయటపడేందుకు ఓ రిటైర్డ్ డీజీపీ ద్వారా ఒత్తిడి తేవాలనుకున్నా అది బెడిసికొట్టడంతో తాజాగా కులంకార్డును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సామాజికవర్గపరంగా కేవలం తమను మాత్రమే టార్గెట్ చేసి మిగతా అధికారులను మైనర్ పనిష్మెంట్లతో సరిపెట్టి కాపాడారని ఆరోపిస్తూ ఓ సీనియర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమను గట్టెక్కించాలని ఆరుగురు అధికారులు మంత్రిని కలసి వేడుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీయే టార్గెట్... ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఇప్పటివరకు తమ వర్గం అధికారులను ఏ ప్రభుత్వం టార్గెట్ చేయలేదని, చేసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపణలెదుర్కుంటున్న అధికారులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో డీజీపీ అనురాగ్ శర్మపైనే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రికి సంబంధిత అధికారులు సూచించారని తెలిసింది. నయీమ్ కేసులో ఎనిమిది నెలల నుంచి చర్యలకు సాహసించని డీజీపీ ఒకేసారి ఇంత మంది అధికారులపై వేటు వేయడం వెనకున్న అసలు నిజాలు బయటకు రావాలని మంత్రి భావిస్తున్నారని తెలిసింది. దీనంతటికీ ప్రధాన కారణంగా ఉన్న డీజీపీ అనురాగ్ శర్మపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు, విచారణ ఎదుర్కోనున్న మరో ముగ్గురు అధికారులు ఒకే సామాజికవర్గం వారు కావడంతో సీఎం వద్దే తేల్చుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
గ్యాంగ్ నయీమ్
-
గ్యాంగ్ నయీమ్
♦ ఐదుగురు ఖాకీల సస్పెన్షన్ ♦ మరో 20 మంది పోలీసు అధికారుల విచారణ.. ♦ ఆరోపణలు రుజువైతే వారిపైనా వేటు ♦ అప్పటివరకు విధుల నుంచి తొలగించి వీఆర్లో ఉంచాలని డీజీపీ ఆదేశం ♦ సస్పెండ్ అయినవారిలో అదనపు ఎస్పీ, ఇద్దరు ఏసీపీలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో పోలీస్ అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది! నయీమ్తో చేతులు కలిపి కోట్లు గడించిన ఖాకీలపై పోలీస్ శాఖ కొరడా ఝళిపించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది పోలీస్ అధికారులపై డీజీపీ అనురాగ్ శర్మ చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేయగా, మిగతావారిపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలతోపాటు విచారణకు ఆదేశిస్తూ గురువారం ఆదేశాలు వెలువరించారు. ప్రభుత్వంపైనే ఒత్తిడి కిందటేడాది ఆగస్టు 8న మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ శివారులో నయీమ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడి ఆస్తులు, దందాలు, సెటిల్మెంట్లు, భూకబ్జాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకు, సస్పెన్షన్ వేటు పడకుండా ఉండేందుకు పలువురు అధికారులు ఏకంగా ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చారు. కొన్నాళ్లపాటు నయీమ్ కేసు మూతపడిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్ ఉన్నతాధికారులు రెండ్రోజుల క్రితం ఢిల్లీలో సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నయీమ్ తో అంటకాగిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి పొందినట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్ విభాగంపైనే అపవాదు ఉండిపోతుందని,నయీమ్తో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా పదోన్నతుల్లో అందలం ఇచ్చారన్న ఆరోపణలెదుర్కోవడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆరోపణలు రుజువైతే వేటే.. నయీమ్తో కలిసి సెటిల్మెంట్లు చేయించుకోవడం, ఫ్లాట్లు గిఫ్టులుగా పొందడం, లంచాలు తీసుకోవడం.. తదితర కార్యక్రమాలకు అలవాటుపడ్డ వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. అప్పటివరకు వారిని విధుల్లో నుంచి తొలగించి వీఆర్లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. విచారణలో ఆరోపణలు రుజువైతే వారిపై కూడా సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు వీరే.. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ చంద్రశేఖర్, మహబూబ్నగర్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీ సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశ్రావు, జెన్కో డీఎస్పీ వెంకట నర్సయ్య, పోలీస్ అకాడమీలో ఉన్న డీఎస్పీ అమరేందర్రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, మలక్పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్, ఇన్స్పెక్టర్ కిషన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికిరణ్రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, టాస్క్ఫోర్స్ నార్త్జోన్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య, ఇన్స్పెక్టర్ రవీందర్, ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్నాయుడు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ మాజిద్, హెడ్కానిస్టేబుళ్లు ఆనంద్, మహ్మద్ మియా, కానిస్టేబుల్ బాలయ్య. పదోన్నతుల ముందు కలకలం రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇన్స్పెక్టర్ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ వరకు పదోన్నతుల ప్రక్రియను పోలీస్ శాఖ ఇప్పటికే వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నయీమ్ కేసులో అంటకాగిన అధికారులకు కూడా పదోన్నతులు కల్పిస్తే పోలీస్ శాఖ నైతిక విలువ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ వర్గాలతో చర్చించారు. కేవలం 25 మంది అధికారుల వల్ల మిగిలినవారికి అన్యాయం చేసిన వారిమవుతామని వివరించినట్టు తెలిసింది. దీనితో వీరి సస్పెన్షన్, విచారణ నిర్ణయంతో పదోన్నతులకు సైతం లైన్క్లియర్ అయ్యిందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులు కల్పించి, తదుపరి దశలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతులు కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మా దగ్గర ఆధారాలున్నాయి నయీమ్తో అంటకాగినట్టు ఆరోపణలు మోపి చర్యలు తీసుకున్న అధికారుల ఎదుట త్వరలోనే అసలు అధికారులకు సంబంధించిన అధారాలు పెడతామని సస్పెన్షన్కు గురైన పలువురు అధికారులు స్పష్టం చేశారు. తాము మాత్రమే సస్పెన్షన్కు గురవడం, మిగతా వారికి ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరి కాదని, తామేమీ నయీమ్తో వ్యక్తిగత పనులు చేయించుకోలేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులను ఏరివేసేందుకు నయీమ్ను పెంచి పోషించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడం పారదర్శకమైన చర్య ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని పలువురు అధికారులు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. -
నయీం కేసులో మరో కొత్త మలుపు
-
నయీం కేసులో మరో కొత్త మలుపు
గ్యాంగ్స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్ (మీర్చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది. మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నయీం కేసు మరోసారి వెలుగులోకి రావడం, అందులో పోలీసులపై చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. -
19న రాష్ట్ర స్థాయి పోలీస్ సదస్సు
-
19న రాష్ట్ర స్థాయి పోలీస్ సదస్సు
ఎస్ఐ నుంచి డీజీపీ వరకు అందరితో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీస్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఉదయం 11 నుంచి జరిగే విస్తృత సదస్సులో వివిధ స్థాయిల పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చిస్తారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలైన పోలీసు అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం భావిస్తున్నారు. పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడానికి, సమాజానికి ఉపయోగపడేవిధంగా మరిన్ని కార్యక్రమాలను పోలీసు శాఖ ద్వారా చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు, ప్రమాదాలు, మాఫియా శక్తుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపైనా విస్తృతంగా చర్చించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో మాట్లాడితేనే కష్టనష్టాలు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ముఖ్యమంత్రే స్వయంగా అందరు అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల అధికారులకు ఆహ్వానం శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల పోలీసు అధికారులను, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను ఈ సదస్సుకు ఆహ్వానించాలని డీజీపీ అనురాగ్ శర్మను సీఎం ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఫర్నిచర్ ఉందా? భవనం పరిస్థితి ఏంటి? ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడుంబా, పేకాట, సట్టా తదితర అసాంఘిక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయా? డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో ఎలా అదుపు చేయాలి? మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మే దుర్మార్గాన్ని ఎలా అరికట్టాలి? వ్యభిచార గృహాలెక్కడైనా నడుస్తున్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఎదురయ్యే అవమానాలు, అఘాయిత్యాల విషయంలో ఎలా స్పందిస్తున్నారు? ఇతర నేరాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, పరిష్కార మార్గాలు ఆలోచించనున్నారు. ఈ సదస్సుకు అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని సీఎం కోరారు. -
కానిస్టేబుళ్లకు సరికొత్త శిక్షణ
ట్రైనీలకు ‘క్రావ్ మగ’ ఆత్మరక్షణ కోర్సు: డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరిగిన పోలీసు నియామకాల్లో ఎంపికైన కానిస్టే బుళ్లకు సరికొత్త మాడ్యుల్తో శిక్షణ మొదలైంది. గతంలోని మూస శిక్షణ పద్ధతులకు స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయిలో శిక్షణ షెడ్యూల్ను అందుబా టులోకి తెచ్చారు. పెరుగుతున్న టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంశాలను దృష్టిలో పెట్టు కొని పోలీసు సిబ్బంది మాన సిక స్థితిగతు లను కూడా అభివృద్ధి చేసే దిశగా రెండు సెమిస్టర్ల శిక్షణ విధానాన్ని ప్రవేశపెట్టారు. రెండు సెమిస్టర్లు: 9 నెలలపాటు 7,379 మంది సిబ్బందికి సాగే శిక్షణలో జీవన నైపుణ్యాలు, కమ్యూనిటీ పోలీ సింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఇజ్రాయెల్ సిబ్బందికి ఇచ్చే ‘క్రావ్ మగ’ ఆత్మరక్షణ, చిన్నారులపై లైంగిక వేధింపులు –నియంత్రణ, మనుషుల అక్రమ రవాణా, జెండర్ అవేర్నెస్, నైపు ణ్యాలు, సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాలు–దర్యాప్తు తీరుతె న్నులుంటాయని డీజీపీ అనురాగ్శర్మ వెల్ల డించారు. వీటితో పాటు నేరాలు, నియం త్రణకు మార్గదర్శ కాల మీద దృష్టిపెట్టినట్లు డీజీపీ తెలిపారు. చివరగా సిబ్బంది మొత్తా నికి సైకోథెరపిస్టు –మెంటరింగ్, ప్రజలతో ఎలా వ్యవహరిం చాలన్న అంశంలో ముఖా ముఖి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపికైన వారికి ల్యాప్ ట్యాప్ అందజేస్తున్నామన్నారు. -
రూ. 65 కోట్లు కాదు.. 316 కోట్లు
బోధన్ స్కామ్పై సీఐడీ నివేదిక.. - 2005 నుంచే అక్రమాలు - శివరాజు విచారణలో సంచలన అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పుట్ట పగలబోతోంది. సర్కిల్ కార్యాలయాల్లో సాగిన దందా కేంద్ర కార్యాలయం వరకు విస్తరించినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిరూపించబోతోంది. అధికారులు బ్రోకర్లు కలసి చేసిన ఈ స్కాంపై సీఐడీ కీలక అంశాలను ఏ1గా ఉన్న శివరాజు నుంచి రాబట్టగలిగింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం ఇప్పటిది కాదని, 15 ఏళ్ల నుంచి నడుస్తోందని పూసగుచ్చినట్టు సీఐడీ అధికారులకు శివరాజు చెప్పినట్టు తెలిసింది. పాత్రదారులు ఎవరు... శివరాజుతో కుమ్మౖక్కై కోట్లు గడించిన అధికారుల పాత్ర ఏంటన్న అంశాలపై సీఐడీ రాష్ట్ర డీజీపీ పూర్తి నివేదిక సమర్పించారు. కేంద్ర కార్యాలయం నుంచే... బోధన్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్... ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాలను డీసీటీవో కంటే శివరాజే ఎక్కువగా ఆపరేట్ చేసినట్టు సీఐడీ గుర్తిం చింది. గతంలో డీసీటీవోలుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారని, మరికొంత మంది బదిలీ అయి ఇతర విభాగాలకు వెళ్లిపోయా రని, వారి పేర్లతో సహా శివరాజు బయటపెట్టి నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. గతం లో ఈ విభాగంలో పనిచేసిన నలుగురు ఐఆర్ ఎస్ అధికారులు కుట్రలో ప్రధాన భాగస్వా ములయ్యారని విచారణలో బయటపడినట్టు తెలిసింది. వీరి ద్వారా కేంద్ర కార్యాలయంలో సర్కిల్ కార్యాలయాల్లోని ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించకుండా చేశాడని సీఐడీ గుర్తించింది. 2012 నుంచి కాదు... వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో 2012 నుంచి కుంభకోణం జరిగిందని ఆ విభాగం కమిషనర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ 2005 నుంచి స్కాం జరిగినట్టు సీఐడీ విచారణలో గుర్తించింది. అలాగే... రూ.65కోట్లు మాత్రమే నకిలీ చలాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ తెలుపగా, రూ.316 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ దర్యాప్తు బృందాలు డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత భారీతేడా ఉన్నా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు గుర్తించకపోవడంపై సీఐడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. అధికారులకు బంపర్ ఆఫర్లు... శివరాజు నిజామాబాద్ను కేంద్రంగా చేసుకొ ని దందా సాగించాడు. అతడికి సహకరించిన ఏసీటీవోలు, డీసీటీవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు ఆరు నెలలకోసారి ఆఫర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక, ముంబై.. ఇలా టూర్ ప్యాకేజీలు ఇచ్చి దగ్గరుండి స్కాం పనులు చక్కబెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఇలా శివరాజుకు సహకరించిన 16 మంది అధికారుల జాబితా ను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. వివరాలివ్వడంలోనూ జాప్యం... స్కాం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి సీఐడీ అడిగిన ఏ వివరాలనూ వాణి జ్య పన్నుల శాఖ తమకు అందించలేదని సీఐడీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశించిన తర్వాతే వివరాలు అందించారన్నారు. ఈ జాప్యం వెనుక అసలు కోణాలు శివరాజు విచారణలో బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసుల నమోదుకు రంగం సిద్ధం... శివరాజుకు సహకరించి ప్రభుత్వ ఖజానా ను జేబులోకి మళ్లించుకున్న 16 మంది అధికారులపై సీఐడీ ఇప్పుడు నజర్ పెట్టిం ది. సీఎం శాఖ కావడం, పైగా 15 ఏళ్ల నుంచి స్కాం జరుగుతుంటే పట్టించుకోక పోవడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. దీనితో వీరిపై కేసులు నమోదు చేసి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఇందుకు అన్ని ఆధారాలను సిద్ధంచేసి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్కు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నాం: డీజీపీ అనురాగ్శర్మ బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో సీఐడీ వేగవంతంగా విచారణ సాగిస్తోంది. అరెస్టయిన వారి నుంచి సేకరించిన వివరా లను బట్టి మరికొంత మందిని విచారించా ల్సి ఉంది. స్కాంలో ఆరోపణలెదుర్కుంటు న్న వారికి నోటిసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయాలి. శివరాజు చెప్పిన అంశాలపై మరికొంత స్పష్టత, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎంతటి అధికారులైనా స్కాంలో పాత్రదారులని తేలితే అరెస్ట్ చేయక తప్పదు. -
నేరాల నియంత్రణను గాలికొదిలేశారు!
- పలువురు ఎస్పీలు/కమిషనర్లపై ఉన్నతాధికారుల ఆగ్రహం - సున్నితమైన కేసులను వివాదాస్పదం చేస్తున్నారు.. - చిన్న జిల్లాల ఏర్పాటును అర్థం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి - పనితీరు మార్చుకోవాలని డీజీపీ ఆదేశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవలు, పాలన సౌలభ్యంకోసం ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అయితే ఈ అంశాన్ని పట్టించుకోవడంలో పలువురు ఎస్పీలు/ కమిషనర్లు విఫలమవుతున్నారని పోలీస్ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా కమిషనర్లు, ఎస్పీలు అయిన అధికారులు కేవలం స్వంత పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, నేరాల నియంత్రణను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు పోలీస్ బాస్లను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు తెలుస్తోంది. భూపాలపల్లిలో జరిగిన దుప్పులవేట కేసులో సరైన రీతిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయలేకపోయారని, దీనితో కేసులో రాజకీయ నేతలుండటం వల్లే కేసు పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని భావిస్తున్నారు. దీనితో జిల్లా బాధ్యులుగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి, పట్టించుకోకుండా ఉన్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో డీజీపీ అనురాగ్శర్మకు పలు రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పనితీరు సరిగ్గా ఉంటే ఇలాంటి ఆరోపణలు రావని, ఇక నుంచి సరైన రీతిలో స్పందించాలని డీజీపీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మంథని కేసులో వైఫల్యం... మంథనిలో జరిగిన మధుకర్ మృతి వ్యవహారంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే విషయం వివాదాస్పదమైందని ఉన్నతాధికా రులు భావిస్తున్నారు. ఘటన జరిగి.. పోస్టుమార్టం అయిన తర్వాత ఆందోళనలు చోటు చేసుకోవడం, రాజకీయంగా కేసులో ఒత్తిడి రావడం.. తదితర అంశాలను పట్టించుకోకుండా కమిషనరేట్ అధికారులు వ్యవహరించారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధుకర్ మృతి కేసులో సంఘటన స్థలానికి కూడా కమిషనర్ వెళ్లకపోవడం, పైగా కొత్తగా విధుల్లో చేరిన ఏసీపీపైనే భారం వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డీజీపీ అనురాగ్ శర్మ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో డీజీపీ స్వయంగా కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. బాధితుడి కుటుంబాన్ని కలసి విచారణపై నమ్మకం కల్గించేలా దైర్యం చెప్పాలని సూచించడంతో అప్పటికప్పుడు కమిషనర్, మధుకర్ గ్రామానికి వెళ్లినట్టు తెలిసింది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా పనితీరులో కూడా ప్రతిభ చూపాలని ఉన్నతాధికారులు ఎస్పీలు/కమిషనర్లకు సూచించినట్టు తెలిసింది. పర్యవేక్షణ లోపమే.. ఏ జిల్లాలో అయినా సున్నితమైన కేసులు, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు జరిగే కేసులు ఉన్నట్టయితే వెంటనే సంబంధిత ఎస్పీ/కమిషనర్ ఆ విషయాన్ని డీఐజీ, ఐజీ, డీజీపీకి చేరవేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు ఏ విషయాన్ని కూడా తగిన పద్ధతిలో ఉన్నతాధికారులకు చెప్పడం లేదని డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా పెద్దగా జిల్లాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఇక నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. -
రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్’ కదలిక!
- ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోరాటంతో ఇక్కడ కేసులపై సమీక్ష - డీజీపీ అనురాగ్ శర్మతో ఏపీ సీఐడీ చీఫ్ భేటీ - తెలంగాణలోని ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ ఆస్తులు, వేలం పాటకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పోరాటంతో.. తెలంగాణలోనూ ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి సీఐడీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరిగింది. ప్రస్తుతం ఏపీలో అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం, వేలం పాటపై డీజీపీ అనురాగ్ శర్మ వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణలో అగ్రిగోల్డ్ సంస్థపై ఉన్న కేసులు, డిపాజిట్ దారులు, స్వాధీనం చేసుకోవాల్సి ఆస్తులు, చెల్లించిన మొత్తాన్ని ఏ విధంగా అందజేయాలన్న అంశాలపై సమీక్షించినట్టు తెలిసింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి శనివారం రెండు రాష్ట్రాల డీజీపీలు, రెండు రాష్ట్రాల సీఐడీ ఉన్నతాధికారులు భేటీ కావాలని నిర్ణయించారు. రెండు కేసులు.. నాలుగేళ్లుగా పెండింగ్ అగ్రిగోల్డ్కు సంబంధించి తెలంగాణలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని సీఐడీ అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్స్టేషన్లో 2013లో ఒక కేసు నమోదు కాగా, 2015లో సీఐడీ విభాగంలో మరో కేసు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా.. సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2.5 లక్షల మంది డిపాజిట్దారులు రాష్ట్రంలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. వీరంతా సుమారు రూ.460 కోట్ల వరకు డిపాజిట్లు చేశారని తేల్చారు. ఈ మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించాలని.. ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకోకుండా మిగిలిన ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తే డిపాజిట్ దారులకు న్యాయం జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్కు సంబంధించి మహబూబ్నగర్ (పాత) జిల్లాలోని బాల్నగర్, గద్వాల, జడ్చర్ల, నల్లగొండ(పాత) జిల్లాలోని చౌటుప్పల్, మిర్యాలగూడ, ఖమ్మం, రంగారెడ్డిలోని గచ్చిబౌలిలలో ఆస్తులున్నాయని సీఐడీకి ఫిర్యాదు చేసిన బాధితులు పేర్కొన్నారు. దీంతో ఆ ఆస్తుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎంత వరకు స్వాధీనం చేసుకోవచ్చనే అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు రెండు రాష్ట్రాల్లో సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండాల్ రమేష్బాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని, డైరెక్టర్లు ఇంకా పరారీలోనే ఉన్నట్టు సీఐడీ చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆస్తులను కూడా జప్తు చేసి వేలం పాటలో చూపాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. రోజుకో ఏజెంటు, బాధితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారానే తెలంగాణలో అగ్రిగోల్డ్ కేసులను విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసులన్నీ ఆన్లైన్!
⇒ ఫిర్యాదులు, కేసుల స్థితిపై ఫిర్యాదుదారుల సెల్ఫోన్కు సందేశాలు ⇒ సీసీటీఎన్ఎస్ గోలైవ్ ప్రాజెక్టుతో టెక్నాలజీ పోలీసింగ్ సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా, ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా.. రాష్ట్ర పోలీస్ శాఖ ‘సీసీటీఎన్ఎస్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్నాళ్లూ ఫిర్యాదులు, కేసుల పరిస్థితి ఏ స్థితిలో ఉందనేది తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. దీనికి ‘సీసీటీఎన్ఎస్’ ద్వారా పరిష్కారం లభించనుంది. ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్లు ఎవరైనా ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే పిటిషన్ నంబర్, తదితర వివరాలతో ఫిర్యాదుదారు సెల్ఫోన్ నంబర్కు ఎస్సెమ్మెస్ అందుతుంది. 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఫిర్యాదుదారుల ఈ– మెయి ల్ ఐడీకి, మొబైల్కు పంపించనున్నారు. ఇక ‘సీసీటీ ఎన్ఎస్’లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి డీజీపీ కార్యాలయంలోని పీసీఎస్ (పోలీస్ కంప్యూటర్ సర్వీస్) సర్వర్లకు ప్రతి పిటిషన్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, సీడీ (కేస్ డైరీ) తదితర 14 రకాల కాపీలను అప్లోడ్ చేస్తారు. నిత్యం వచ్చే పిటిషన్లు, నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలన్నింటినీ సీసీటీఎన్ఎస్ (ఈ–కాప్స్)ద్వారా పంపిస్తారు. దీంతో రాష్ట్రంలో ఏ పోలీస్స్టేషన్లో ఏకేసు నమోదైంది, దాని పరిస్థితేమిటన్న అంశాలను డీజీపీ సహా అన్ని ర్యాంకుల్లోని అధికారులు తెలుసుకోవచ్చు. డీఎస్ఆర్ సైతం ఆన్లైన్లోనే.. రోజూ పోలీస్స్టేషన్ల నుంచి ఎస్పీలకు, ఎస్పీల నుంచి డీజీపీకి డీఎస్ఆర్ (డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్)లను పంపిస్తారు. ప్రస్తుతం వీటిని పోస్టు రూపంలో పంపు తున్నారు. ఇక నుంచి నేరుగా సీసీటీఎన్ఎస్ కింద ప్రతి అధికారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందజేస్తా రు. నేరుగా సంబంధిత అధికారి యూజర్ ఐడీకి డీఎస్ఆర్ వచ్చేస్తుంది. సీసీటీఎన్ఎస్ (ఈ–కాప్స్) ద్వారా సంబంధిత అధికారి తన మొబైల్ ఫోన్లోని అప్లికేషన్ ద్వారా డీఎస్ఆర్, కేసుల స్థితి, దర్యాప్తు పరిస్థితులను పరిశీలించవచ్చు. 2002 నుంచి ప్రతీ ఎఫ్ఐఆర్ 2002 నుంచి 2017 మార్చి 28 వరకు అన్ని ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు కేసు ఏ దశలో ఉందన్న అంశాలను పోలీసు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. నేరుగా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నేరస్తుల ట్రాకింగ్ ఒక రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్ల వివరాలను సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు పంచుకోవచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి పేరు సీసీటీఎన్ఎస్ ఈ–కాప్స్ ఎంటర్ప్రైజెస్లో టైప్ చేసి, సెర్చ్ చేస్తే అతడిపై ఉన్న మొత్తం కేసుల చిట్టా బయటకు వస్తుంది. 15 వేల పోలీస్స్టేషన్ల డేటా దేశవ్యాప్తంగా 2 వేల కోట్లతో ప్రారంభించిన సీసీటీ ఎన్ఎస్ ప్రాజెక్టులో 15 వేల పోలీస్స్టేషన్లు ఆన్లైన్ ద్వారా డేటా అప్లోడ్, షేరింగ్ చేస్తున్నాయి. 6 వేల మంది పోలీసు అధికారులు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో రూ.61 కోట్లతో పనులు చేపట్టారు. 4 క్రితం ప్రారంభమైన ఈ సాఫ్ట్వేర్ రూపకల్పన సోమ వారం నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. -
బోధన్ స్కాంపై నేడు సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: బోధన్ సర్కిల్లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలా న్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డీజీపీ అనురాగ్ శర్మకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సీఎస్ చాంబర్లో కేసు దర్యాప్తుSపై సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్కుమార్ సూచించారు. కేసు దర్యా ప్తులో ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారి స్థానంలో మరొకరిని నియమిం చారు. అదనపు ఎస్పీని ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూడా సీఎస్ సమీక్ష జరప నున్నారు. అటు కమర్షియల్ శాఖలోనూ పలువురు అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. -
లైంగిక వేధింపులు: 90శాతం తెలిసిన వారే నిందితులు!
హైదరాబాద్: దేశం మొత్తంలో 51 శాతం బాలికలు, 43 శాతం బాలురు ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ వ్యక్తి చేతికి స్మార్ట్ఫోన్, నెట్ రావడంతో వేధింపుల కేసులు పెరిగాయన్నారు. ఇంటర్నెట్ సామాన్యుడికి కేవలం 4 శాతం మాత్రమే ఉపయోగ పడుతోందని చెప్పారు. మిగతా 96శాతం క్రైం కార్నర్కు కేరాఫ్గా మారుతోందని అభిప్రాయపడ్డారు. బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో 90శాతం తెలిసిన వ్యక్తులే నిందితులవుతున్నారని తమ అధ్యయనంలో బయటపడిందని డీజీపీ స్పష్టం చేశారు. సీఐడీ నేతృత్వంలో జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న ఆన్లైన్లో చిన్నారులకు లైంగిక వేధింపులు - నియంత్రణ చర్యలు సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలను ఉద్దేశించి మాట్లాడారు. తమ కూతురు పలాన వ్యక్తి వల్ల లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు బయటపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నిందితుల పలుకుబడితో బయటపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతుంటే అక్కడి యాజమాన్యాలు తమ స్కూల్ గౌరవం చెడిపోతుందని విషయాన్ని దాచేస్తున్నారన్నారు. సమాజంలో స్టేటస్ సింబల్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలకు విచ్చలవిడి స్వేచ్చ ఇస్తున్నారని, స్మార్ట్ఫోన్లు, ట్యాబులు.. ఇలా లావిష్నెస్ పెరగడం లైంగిక వేధింపులు ఎక్కువవడానికి ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తం కావాలని కోరారు. -
షీ టీమ్స్పై మహిళలకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ భార్య మమత హైదరాబాద్: మహిళలకు షీ టీమ్స్పై మరింత అవగాహన కల్పించాలని డీజీపీ అనురాగ్శర్మ భార్య మమత అనురాగ్శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పాకళావేదికలో మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ రెండో వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మమత మాట్లాడుతూ.. ఆకతాయిల నుంచి మహిళలు ఆత్మరక్షణ ఎలా చేసు కోవాలో షీ టీమ్స్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. నగరంలో షీ టీమ్స్ రావడంతో ఆకతాయిల ఆగడాలు తగ్గాయన్నారు. ప్రజలకు, పోలీసులకు షీ టీమ్స్ వారధిగా పనిచేస్తున్నాయన్నారు. ఇంట్లో చెప్పుకోలేక తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్న మహిళలకు షీ టీమ్స్ అండగా నిలిచి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 524 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం సినీ నటి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలకు మరింత ధైర్యం వచ్చిందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన రెండు లఘు చిత్రాలను, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శివప్రసాద్, ఏసీపీ రమణకుమార్, సీఐ కళింగరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలకు ఫోరెన్సిక్ ఫోర్స్..
సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖ యోచన సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా సైబర్నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ సెల్లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా దక్షిణాసియా మొత్తం లో హైదరాబాద్లోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్(సీఎఫ్ఎల్) ఉంది. ప్రస్తుతం ఈ–మార్కెట్ ఊపందుకుంటోంది. అదే స్థాయిలో సైబర్ నేరాలుకూడా పెరిగే ప్రమాదం ఉండటంతో వాటి నియం త్రణకు ప్రతి జిల్లాకూ ఒక సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్శర్మ భావిస్తున్నారు. ఒక్కో జిల్లాకు రూ.65లక్షలు.. ప్రతీ జిల్లాలో పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.65లక్షలు ఖర్చవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆధునీకరణ (ఎంఓపీఎఫ్) నిధులను ఈ సారి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని భావి స్తోంది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులో ఉంది. మిగిలిన ఎనిమిది కమిషనరేట్లతో పాటు జిల్లా పోలీస్ విభాగాలకు ల్యాబ్లు ఏర్పాటు చేయాలంటే రూ.15కోట్ల వరకు నిధులు అవసరం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిధుల్లో 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్లో శిక్షణ.. జిల్లాలు/కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేయబోయే సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ల్లో ఎస్ఐ నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీపై పట్టు ఉండి, సైబర్ నేరాల నియంత్రణకు ఆసక్తి కనబరిచే అధికారులు, సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్శర్మ భావిస్తున్నారు. ఈ బృందాలకు హైదరాబాద్ కమిషనరేట్లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లో శిక్షణ ఇప్పించి జిల్లాల్లో ఫోరెన్సిక్ సెల్లను నిర్వహించాలని యోచిస్తున్నారు. -
అన్ని జిల్లాల్లో ‘భరోసా’ కేంద్రాలు
ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో ప్రారంభంలో నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: న్యాయపరంగా, వైద్యపరంగా, చట్టపరంగా హైదరాబాద్లోని బాధిత మహిళలకు అండగా ఉంటున్న ‘భరోసా’ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు, షీ టీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్డు పీపుల్స్ప్లాజా వద్ద ‘ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో’ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఈ ఎక్స్పోను శనివారం నాయిని ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక మహిళల భద్రత కోసం ప్రారంభించిన షీటీమ్స్ సేవలు సత్ఫలితాలి స్తున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని నాయిని చెప్పారు. మహిళల భద్రత కోసం కృషి చేస్తున్న షీటీమ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. దీనికితోడు నగర పోలీసులు ప్రారంభించిన ‘భరోసా’ రాకతో బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం, వైద్యం, కౌన్సెలింగ్ లభిస్తున్నాయన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా సాగేందుకు ‘భద్రత’ ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. నేరరహిత నగరంగా హైదరాబాద్ను మార్చాలన్న ట్యాగ్లైన్తో ఆదివారం ఉదయం నిర్వహించే ‘షీటీమ్స్ 5కే రన్’లో ప్రజలను కూడా భాగస్వాములు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతిలక్రా తెలిపారు. అనంతరం బాలికలపై లైంగిక వేధింపులపై తీసిన షార్ట్ ఫిల్మ్లను ప్రదర్శించారు. -
పోలీసు సర్వీస్ రూల్స్లో మార్పులు!
ఉమ్మడి సర్వీసు రూల్స్ కారణంగా సమస్యలు ⇒ అనవసరపు విభాగాలకు స్వస్తి చెప్పాలని సర్కారు యోచన ⇒ కొత్త రూల్స్కోసం రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో కమిటీ సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో సర్వీసు నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూల్స్నే అన్వయించుకున్న పోలీసు శాఖ.. తాజాగా కొత్త సర్వీసు నిబంధనలతో ముందుకు రానుంది. డీజీపీ అనురాగ్శర్మ దీనికి సంబం ధించి రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, రిటైర్డ్ ఏవోలు వెంకయ్య, దశరథ్రెడ్డి, ఆదినారా య ణ, యూసఫ్ మొయినుద్దీన్, రిటైర్డ్ సూపరిం టెండెంట్ విశ్వం సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుత సర్వీసు రూల్స్ను పరిశీలించి.. మార్పులు, కొత్త నిబం ధనల రూపకల్పనకు సిఫార్సులు చేస్తుంది. ఆ రూల్స్తో ఇబ్బందులు: రాష్ట్ర విభజన తర్వాత అన్వయించుకున్న ఏపీ పోలీసు సర్వీసు రూల్స్తో పలు సమస్యలు నెలకొన్నాయి. నియామకాలు, పదోన్నతులు, సర్వీసు ప్రయో జనాలు, ఇంక్రిమెంట్లు వంటి 16 రకాల సమస్యలు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హోం శాఖ సర్వీసు రూల్స్ను సమీక్షించి.. రాష్ట్ర పోలీసు అడ్మిన్ వ్యవహా రాలు, ఆపరేషన్స్ వ్యవహారాలకు తగ్గట్టుగా రూపొందించుకోవాలని నిర్ణయించింది. అనవసరపు విభాగాలకు స్వస్తి ఉమ్మడి రాష్ట్రంలో 256కు పైగా ఐపీఎస్ అధికారులు పనిచేసే పోస్టులుండేవి. దాంతో అవసరమున్నా, లేకపోయినా ప్రతి విభాగా నికి ఐజీ నుంచి డీజీ స్థాయి హోదా వరకు ఉన్న అధికారులకు పోస్టులు ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్వీసు రూల్స్పై ఏర్పాటు చేసిన కమిటీకే.. పోలీసు శాఖలోని అనవసరపు విభాగాలను తొలగించే పని కూడా అప్పగిం చారు. ఒకే తరహా పనులు చేసే రెండు మూడు విభాగాలుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. తొలగిపోనున్న కీలక సమస్యలు రాష్ట్ర విభజనలో ఇప్పటివరకు సివిల్ డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్ కేడర్ ఎస్పీల విభజన పూర్తి కాలేదు. డీఎస్పీ స్థాయి అధికారుల సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో ఇప్పటివరకు కమల్నాథన్ కమిటీ విభజన చేయలేక పోయింది. పైగా కొందరు అధికారులు కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చారు. సర్వీసు రూల్స్లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రూల్స్ మారిస్తే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కమిటీ దృష్టి సారించే అంశాలివే... సర్వీసు రూల్స్ కమిటీ మొత్తం 34 అంశాలను సమీక్షించి, నూతన నిబంధ నలను రూపొందించనుంది. స్పెషల్ పోలీస్ బెటాలియన్లలోని కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకు ఉన్న రూల్స్ మార్పు; ఆర్మ్డ్ రిజర్వ్లోని రిజర్వ్ ఇన్స్పెక్టర్ నుంచి కమాండెంట్ వరకు రూల్స్ సమీక్ష, మార్పు; పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో ఇన్స్పెక్టర్ నుంచి డైరెక్టర్ హోదా వరకు ఉన్న నిబంధనలు, సివిల్ విభాగంలో కానిస్టేబుల్ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు రూల్స్ను సమీక్షించనున్నారు. అదే విధంగా సీపీఎల్ అంబర్పేట్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఇంటలిజెన్స్ విభాగం, ప్రింటింగ్ విభాగం, పోలీసు అకాడమీ, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, పోలీస్ లీగల్ అండ్ మెడికల్ సర్వీ సెస్, పోలీస్ సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెం ట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ), పోలీస్ కమ్యూనికేషన్స్, సబార్డి నేట్ రూల్స్, పీటీవో సబార్డినేట్ రూల్స్, ఇంటలిజెన్స్ సబార్డినేట్ రూల్స్, ఏపీ పోలీస్ మాన్యువల్, స్పెషల్ పోలీస్ మాన్యువల్, కంప్యూటర్స్, సీఐడీ అడ్హక్ రూల్స్ 1981, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్లను పూర్తి స్థాయిలో సమీక్షించి నూతన నిబంధనలను సిఫారసు చేసే అవకాశముంది. -
ఏసీబీ డీజీగా అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు
⇒ డైరెక్టర్గా ఉన్న చారుసిన్హాపై బదిలీ వేటు ⇒ ట్రైనింగ్ ఐజీగా పోస్టింగ్ ⇒ ఐజీ శ్రీనివాస్రెడ్డి గ్రేహౌండ్స్కు ట్రాన్స్ఫర్ ⇒ నల్లగొండ కేసులే చారుసిన్హా బదిలీకి కారణమన్న ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా డీజీపీ అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్గా ఉన్న ఐజీ చారుసిన్హాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ట్రైనింగ్ ఐజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డిని గ్రేహౌండ్స్ ఐజీగా నియమిం చడంతోపాటు ఆయన స్థానంలో చారుసిన్హా ను ట్రైనింగ్ ఐజీగా నియమించింది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీలపై అటు ఏసీబీలోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. చారుసిన్హాపై నల్లగొండ నేతల వార్ ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందిన ఏకే ఖాన్ తర్వాత ఆ విభాగాన్ని చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. అప్పటి నుంచి అక్రమా ర్కులుగా ముద్రపడ్డ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇక్కడే చారుసిన్హాకు ఎదురుదెబ్బ తగిలినట్టు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ మూడు విభాగాల్లోని అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించడంతో అక్కడి అవి నీతి అధికారులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిం చారు. తాము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, అయినా తమను ఏసీబీ వెంటాడుతోందని, ఆ కేసులు తమపైకి రాకుండా చూడాలని కీలక నేతలపై ఒత్తిడి తెచ్చా రని తెలిసింది. ఇటీవలే విజిలెన్స్ నల్లగొండ విభాగం ఎస్పీ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ఇద్దరు రెవెన్యూ అధికారులపై అక్రమాస్తుల కేసును ఏసీబీ... ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి ఏసీబీపై పడలేదు. కానీ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న కీలక అధికారులపై ఏసీబీ దృష్టి సారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి కావాలని ఏసీబీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సంబంధిత ఆరోపణలెదుర్కొం టున్న అధికారి కీలక నేతలకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే సంబంధిత నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద ఏసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే ముందస్తు అనుమతులు లేకుండా ఏసీబీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా చారుసిన్హాపై నేతలు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కావాలనే తమ మనుషులను ఏసీబీ టార్గెట్ చేస్తోందని, దీనంతటికీ చారుసిన్హాయే కారణమని తెలియడంతో అప్పటికప్పుడు ఐజీని బదిలీచేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. -
నయీమ్తో పోలీసుల విందుపై స్పందించాలి
రాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు సీపీఐ నేత నారాయణ లేఖ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్శర్మకు ఆదివారం ఆయన లేఖ రాశారు. నయీమ్ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయించాలని తాను కోర్టులో పిల్ వేస్తే...ప్రభుత్వం మాత్రం సిట్తో సరిపో తుందని చెప్పిందని గుర్తుచేశారు. నయీమ్తో పోలీసు ఉన్నతాధికారులు విందు భోజనాలు చేస్తున్న ఫొటోలు బహిర్గతమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఇప్పటికైనా నయీమ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పనితీరు మెరుగుపరుచుకోండి
సాక్షి, హైదరాబాద్: పనితీరు మెరుగుపరు చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణ, నేరస్థులపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ అనురాగ్శర్మ సూచించారు. బడ్జెట్ సమీక్ష సందర్భంగా మంగళవారం రాష్ట్ర పోలీ స్ ముఖ్యకార్యాలయంలో సుదీర్ఘ భేటీ జరిగిం ది. బడ్జెట్పై అధికారులతో 3 గంటల పాటు చర్చించారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎస్పీలు, కమిషనర్లపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఇద్దరు ఎస్పీల బదిలీ వేటు నేపథ్యంలో పని తీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల్లో చేప ట్టాల్సిన పలు నిర్మాణాలపై ఎస్పీలు ప్రతిపా దనలు సమర్పించారు. సీసీ కెమెరాల, కమాం డ్ కంట్రోల్ సెంటర్లు, టెక్నాలజీ వినియోగం తదితరాలకు రూ.5,038 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. ప్రతిపాదనలను 2 రోజుల్లో సీఎం కేసీఆర్కు అందజేయనున్నట్టు తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘పోలీసు ల్యాబ్స్’ ఏర్పాటు
సీసీఎస్ ప్రారంభోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. నేరగాళ్లకు చెక్ పెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ క్రైమ్, సైబర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.7.3 కోట్లతో ఆధునీకరించిన హైదరాబాద్ సెంట్ర ల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) భవనంతోపాటు రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్స్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ ల్యాబ్స్లో ఉన్న సదుపాయాలు, కొంత పరిజ్ఞానం కేవలం హైదరాబాద్ పోలీసుకు మాత్రమే సొంతమని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో లేవన్నారు. సీసీఎస్ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి, డీసీపీ అవినాశ్ మహంతిలను డీజీపీ అభినందించారు. సీసీ ఎస్ ఆధీనంలో ఏర్పాటైన క్రైమ్, సైబర్ ల్యాబ్స్ను పరిశీలించిన ఆయన ఈ తరహాలో నే అన్ని జిల్లాలు, సీఐడీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. భారీ కేసుల్ని సీసీఎస్లోని ల్యాబ్స్ సహకారంతోనే దర్యాప్తు చేయిస్తామని డీజీపీ వివరించారు. జిల్లాల వారీగా ల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం అందరు ఎస్పీలతో సమావేశం నిర్వ హించనున్నట్లు పేర్కొన్నారు. సీఐడీతో పాటు జిల్లాల వారీగా అవసరమైన నిధులపై అంచనాలు రూపొందిస్తామని, ఈ బడ్జెట్లోనే ప్రభుత్వం నుంచి వాటిని పొందేలా కృషి చేస్తామన్నారు. -
'అమాయకులపై అక్రమ కేసులు'
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోమవారం డీజీపీ అనురాగ్శర్మను కలిశారు. అనంతరం శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రకటనలు చేస్తూనే పోలీసులు కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సనత్నగర్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేత నిరంజన్రెడ్డి కుమారునిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ జరిపి, కేసును ఎత్తివేయాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. డీజీపీని కలిసిన వారిలో నిరంజన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
-
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి, డీజీపీ పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రకటన సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం హోంగార్డులు కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ,, ఐజీ (హోంగార్డ్స్) బాల నాగాదేవీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే హోంగార్డుల డిమాండ్లన్నీ ఒకేసారి చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, మొదటి దఫాలో భాగంగా వేతన పెంపుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న 21 వేల మంది హోంగార్డులకు హెల్త్కార్డులు అందించే ఆలోచన కూడా ఉన్నట్టు వివరించాయి. బస్ పాస్ల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చించడంతో హోంగార్డులకు తీపి కబురు అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల డిమాండ్లు... మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని కానిస్టేబుళ్లుగా మార్చాలి. కానిస్టేబుల్ నియామకాల్లో ఇన్సర్వీస్లో ఉన్న హోంగార్డులను శిక్షణకు పంపాలి. డెప్యుటేషన్లో ఉన్న హోంగార్డులను అదే విభాగంలో క్రమబద్ధీకరించాలి. హోంగార్డు బెటాలియన్ ఏర్పాటు చేయాలి. కనీసం వేతనం రూ. 25 వేలకు పెంచాలి. ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన సాధారణ, మెడికల్ సెలవులు, బస్పాస్లు అందించాలి. డెప్యుటేషన్, ట్రావెలింగ్, డెయిలీ అలవె న్సులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి. పదవీ విరమణ, సాధారణ మరణం పొం దిన వారికి రూ. 10 లక్షలు అందించాలి. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
-
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
నేరాల సంఖ్య తగ్గింది: ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖలోని పలు అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, నగర కమిషనర్ మహేందర్రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, సీఎంఓ అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో పోలీసు, పరిశ్రమల శాఖలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పలువురు అభిప్రాయపడ్డారని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానం ప్రకటించిన తర్వాత 2500కుపైగా పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభమైందన్నారు. దీనంతటికీ ప్రదాన కారణం శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటమే కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని, అదే విధంగా నేరస్తుల్లోనూ మార్పు వచ్చిందన్నారు. మానవతా దృక్పథంతో పోలీసులు నేరస్తులను మారుస్తున్నారన్నారు. పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ అంశం గురించి డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్కు వివరించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
పోలీసుశాఖలో ‘ఆర్డర్లీ’ కలవరం!
ఏడీజీ వ్యవహారంపై సర్వత్రా చర్చ ఢిల్లీ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ ఆరా సాక్షి, నెట్వర్క్: పోలీసుశాఖలో కలవరం మొదలైంది. ఆర్డర్లీ వ్యవస్థ పేరిట జరుగుతున్న అరాచకాలపై కింది స్థాయి సిబ్బందిలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదనపు డీజీపీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్య పోయారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీజీపీ అనురాగ్ శర్మ ఈ వ్యవహారంపై ఆరా తీసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం తతంగం మీద తనకు నివేదిక అందిం చాలని ఇంటెలిజెన్స్ అధికారులను డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. డిసెంబర్లో జరిగిన వ్యవహారం నుంచి కానిస్టేబుల్ను కొట్టిన ఘటన, ఇతరత్రా అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించినట్టు తెలియవచ్చింది. సోమవారంలోగా నివేదికకు సీఎస్ ఆదేశం... అదనపు డీజీపీ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సోమవారానికల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. సీసీ ఫుటేజీ పరిశీలన... తమ వ్యవహారం బయటపడటంతో సంబంధిత అధికారి కార్యాలయం లీకేజీ చేసిన వారి గుర్తింపునకు కంకణం కట్టుకున్నట్టు తెలిసింది. మొత్తం డీజీపీ కార్యాలయానికి నిత్యం వచ్చి వెళ్లే వారి జాబితాపై దృష్టి సారించినట్టు సమాచారం. తమకు జరిగే అన్యాయాలు చెప్పుకోవడానికి వచ్చే బాధితులు మొదలుకొని వీఐపీలు, జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది, అధికారులు.. ఇలా డీజీపీ ఆఫీసుకు వచ్చి వెళ్లే వారి సీసీ ఫుటేజీ కావాలని భద్రతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలియవచ్చింది. తమ కార్యాలయానికి వచ్చి వెళ్లే వారే సమాచారం లీక్ చేశారని, వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అధికారి వ్యవహారం బయటపడటం జీర్ణించుకోలేని కార్యాలయ అధికారులు ఇలాంటి విపరీత ధోరణికి తెరదీశారని తెలిసింది. -
‘ద్యావుడా’ను ఆపేయండి
డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ద్యావుడా సినిమా టైటిల్తో పాటు చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, ఆ సినిమాపై నిషేధం విధించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో శివుడు, వెంకటేశ్వర స్వామిని అభ్యంతకరంగా చిత్రీకరించి యూట్యూబ్లో విడుదలు చేశారని పరశురాం పరివార్ సంఘం సోమవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్లో సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉందని, పూర్తి సినిమా కూడా హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుందన్న ఆందోళన ఉందని, వెంటనే సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్, నిర్మాత హరికుమార్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డీజీపీని కోరారు. శివలింగంపై మద్యం, మాంసం, సిగరెట్లను అభిషేకంలాగా కుమ్మరిస్తూ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్లో ట్రైలర్ను తొలగించడంతోపాటు.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని సంఘం అధ్యక్షుడు ఆత్మకూరి కిషోర్, తదితరులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇప్పటికే తాము ఫిలిం చాంబర్స్, దేవాదాయ మంత్రికి, సీసీఎస్ సైబర్ క్రైమ్, సెన్సార్బోర్డుకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. -
పోలీస్ శాఖలో క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్
అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యవస్థను పోలీస్ శాఖలోనూ అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. పోలీస్ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ విధానంలో క్యాష్లెస్ను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణ ప్రసాద్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో శనివారం సమీక్ష జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న ఈ–చలాన్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కమిషన రేట్లోని ఈ–చలాన్ సాఫ్ట్వేర్, సర్వర్లు, సిబ్బంది శిక్షణపై ఎస్పీలు ఆధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్, ఈ–చలాన్ విధానంపై జిల్లాల పోలీస్ సిబ్బందికి శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఖర్చుపై పోలీస్ కంప్యూటర్ సర్వీ సెస్ అదనపు డీజీపీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. -
వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి
డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రిం చాలని.. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డీజీపీ అనురాగ్శర్మ కోరారు. హైదరాబా ద్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని అశ్విని అలర్జీ కేంద్రం తలపెట్టిన స్వచ్ఛ ఆకాశ్ అభియాన్ ప్రచారోద్యమాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని 20 ప్రధాన ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్థాయిలపై ఈ ఆస్పత్రి వైద్యులు జరిపిన అధ్యయన నివేదికను సైతం డీజీపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగిందని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. అశ్వినీ అలర్జీ కేంద్రం వైద్యులు, ప్రముఖ ఆస్తమా నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ మెట్రో రైలు పనుల వల్ల నగరంలో వాయు కాలుష్యం పెరిగిందన్నారు. -
నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పుట్టా మధు డీజీపీ అనురాగ్ శర్మకు చెప్పారు. గురువారం డీజీపీని కలిసిన ఆయన నయీం గ్యాంగ్ తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. నయీంతో కలిసి ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి పలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పుట్టా మధు చెప్పారు. నయీంతో మాజీ మంత్రికి ఉన్న సంబంధాలపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. సదరు మాజీ మంత్రి చేసిన భూకబ్జాల వివరాలను డీజీపీకి సమర్పించినట్లు తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఆధారాలను సిట్కు పంపిస్తామని అన్నారు. -
మెట్రో రైలు కు 17 కొత్త పోలీసు స్టేషన్లు
⇒ మరో 48 ఔట్ పోస్టుల ఏర్పాటు ⇒ మెట్రో రైలు భద్రతపై సమీక్షలో డీజీపీకి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రక్షణకు మెట్రో కారిడార్ వెంబడి 5 ‘ఏ- కేటగిరీ’, 12 ‘బీ- కేటగిరీ’ పోలీస్స్టేషన్లతో సహా 48 పోలీసు ఔట్ పోస్టులను నిర్మించాలని ప్రతిపాదనలు అందాయి. మెట్రో భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో రైల్వేలు, రోడ్డు భద్రత విభాగం అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. మెట్రో ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఓ నివేదికను అందజేశారు. మెట్రో భద్రతకు సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎంవీఎస్ రెడ్డి, నగర సీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీలు అంజనికుమార్, సందీప్ శాండిల్య, సైబరాబాద్, రాచకొండ సీపీలు మహేశ్ భగవత్, నవీన్ చంద్, ఇంటెలిజెన్స్ ఐజీ శివానంద్ నింబర్గ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
-
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పోలీసుల సేవల చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఎండనకా..వాన అనకా పనిచేసేది పోలీసులేనని అన్నారు. ఈ ఏడాది 470మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో అమరులైన హోంగార్డులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ అనురాగ శర్మ తెలిపారు. -
పోలీస్ అధికారులకు కొత్త వాహనాలు
- అన్ని స్థాయిలవారికి ప్రభుత్వం మంజూరు చేసింది - కొత్త జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షలో డీజీపీ అనురాగ్ శర్మ హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కావాల్సిన కనీస సదుపాయల్లో కార్యాలయ భవనంతో పాటుగా ఫర్నిచర్, పూర్తి స్థాయిలో సిబ్బంది, కంప్యూటర్లు, ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లు అన్నీ త్వరగా సమకూర్చుకోవాలని కొత్త ఎస్పీలు, పోలీసు కమిషనర్లను రాష్ట్ర పోలీసు విభాగం డైరెక్టర్ జనరల్ అనురాగ్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వం నూతన వాహనాలను మంజూరు చేసిందని, అన్ని స్థాయిల అధికారులకు వాహనాలు ఇస్తామని ఆయన తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో పాత, కొత్త జిల్లాల ఎస్పీలు, నూతన పోలీస్ కమిషనర్లతో కొత్త జిల్లాల్లో గత తొమ్మిదిరోజుల అనుభవాలను డీజీపీ సమీక్షించారు. ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ప్రభుత్వం, ప్రజలు ఆశించిన విధంగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పని చేయాలని అన్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న కార్యాలయాల ఫోటోలు, సిబ్బంది గదులు, నూతన పోలీసు స్టేషన్లు, సర్కిల్ల కార్యాలయ ఫోటోలు, సిబ్బంది వివరాలతో నూతన జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వార డీజీపీకి వివరించారు. జిల్లా భౌగోళిక స్వరూపం, అక్కడి రాజకీయ వాతావరణం, ప్రజల అవసరాలు, వారి సంప్రదాయం అన్నీ కూడా జిల్లా ఎస్పీలు బాగా స్టడీ చేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ లోపు తమ అవసరాలని ప్రాధాన్యతలను ఉన్నతాధికారులకు తెలియచేస్తూ వుండాలన్నారు. సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, రామగుండం, కరీంనగర్, వరంగల్, పోలీస్ కమీషనర్లతో పాటుగా అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు. -
దేశ రక్షణలో పోలీస్ కీలకం: గవర్నర్
- ‘అమరుల సంస్మరణ’ పరుగు ప్రారంభించిన నరసింహన్ హైదరాబాద్: దేశరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని, ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజలకు మరింత చేరువయ్యారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో భారతీయ పోలీసు అమర వీరుల తొలి సంస్మరణ పరుగును ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడు తూ దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్బండ్ మీదుగా 10కె, 5కె, 2కె రన్లను నిర్వహించారు. వీటిలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న వారందరికీ పోలీసు శాఖ తరఫున ప్రోత్సాహక పతకాలను అందజేశారు. రన్లో 5వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్శర్మ, జాతీయ పోలీస్ అకాడమీ డీజీ అరుణా బహుగుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీలు పాల్గొన్నారు. రెండోరోజు ఆకట్టుకున్న ఎక్స్పో... రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో రెండోరోజు ఏర్పాటుచేసిన పోలీస్ ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకుంది. రన్లో పాల్గొన్న వారంతా ఎక్స్పోను సందర్శించి వివిధ స్టాళ్లల్లో ఏర్పాటుచేసిన ఆయుధాలతో పాటు ఫొటోలను తిలకించారు. -
అమర పోలీసుల సంస్మరణార్థం 10కె రన్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో 5 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తొలిసారి అమర పోలీసుల సంస్మరణార్థం రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన తర్వాత న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంట్ (ఎన్వైపీడీ) ఏటా రన్ నిర్వహిస్తోందని, అలానే రాష్ట్రంలోనూ పోటీలు ప్రారంభించనున్నామని, ఇక నుంచి ఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం 2కె, 5కె, 10కె పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఠీఠీఠీ.ఞౌజీఛ్ఛిటఠ.జీ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలానే హైదరాబాద్లోని మాదాపూర్, కూకట్పల్లి, సరూర్నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్పేట, నారాయణగూడ పోలీస్స్టేషన్లలోనూ పేర్లు నమోదు చేయించుకోవచ్చని చెప్పారు. 2కె రన్లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్కు రూ.300, 10కె రన్కు రూ.350 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తారని చెప్పారు. రన్లో విజయం సాధించిన వారికి మెడల్స్ అందజేస్తామని, పోటీలో పాల్గొనే వారికి టీ-షర్ట్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. పోలీసు సేవలపై ‘ఎక్స్ పో’ పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16 తేదీల్లో పీపుల్స్ ప్లాజాలో ‘‘ఎక్స్ పో’’ నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాల పోలీసు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా, రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యామిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రెస్క్లబ్లో సీసీ కెమెరాల ఏర్పాటు
పంజగుట్ట: రాష్ట్రంలో ప్రెస్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో చెప్పేందుకు ప్రెస్క్లబ్లో కమ్యునిటీ సీసీ కెమరాలు ఏర్పాటు చేయడమే నిదర్శనమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పత్రికారంగం వారు కెమరాలు ఏర్పాటు చేస్తే మరికొందరు ముందుకు వస్తారన్నారు. శుక్రవారం ప్రెస్క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కమ్యునిటీ సీసీ కెమరాల మనిటరింగ్ను ఆయన నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి, పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు. క్లబ్లో 16 కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ... గతంలో దిల్శుఖ్నగర్ బాబు పేలుళ్ల కేసులో పోలీసుల ఆధ్వర్యంలో ఓ షాపులో ఏర్పాటు చేసిన కెమరావల్లే ఎన్నో ఆధారాలు సేకరించగలిగామన్నారు. నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్క్లబ్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంతో మీడియాదే కీలకపాత్ర అన్నారు. డీసీపీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ .. మీడియా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు. సీనియర్ పాత్రికేయులు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ .. పోలీసులు మీడియా కలిసి పనిచేస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ప్రెస్క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధానకార్యదర్శి ఎస్.విజయ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్క్లబ్ను ఫ్యామిలీ క్లబ్గా, సేఫ్టీ క్లబ్గా తీర్చిదిద్దుతామన్నారు. మీడియా, పోలీసులు మరింత ఫ్రెండ్లీగా ఉండి సేఫ్, సెక్యుర్డ్ తెలంగాణ రూపొందించే దిశగా అడుగులేయాలన్నారు. పోలీస్ రంగంలో విశేష మార్పులు వచ్చాయని, అందుకు డైనమిక్ అధికారులే కారమన్నారు. హైదరాబాద్లో నేరం చేస్తే తప్పించుకోలేమని నేరస్ధుల్లో భయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు రవికాం త్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు దుగ్గు రఘ, రమేష్ వైట్ల, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్ జి పద్మశాలి, ఎ.రాజేష్, పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై లింగారెడ్డి పాల్గొన్నారు. -
డీజీపీని కలసిన గద్దర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ డీజీపీ అనురాగ్శర్మను మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. 1997లో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు డీజీపీకి ఒక వినతిపత్రం అందజేశారు. 1997లో సికింద్రాబాద్ అల్వాల్లోని తన నివాసంలో గద్దర్పై గ్రీన్కోబ్రా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది నయీమ్ ముఠానేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అప్పటి డీజీపీ హెచ్.జె.దొర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. కానీ దర్యాప్తులో కాల్పులకు పాల్పడిన వ్యక్తులెవరనేది తెలియలేదు. ఇటీవల గ్యాంగ్స్టర్ నయీమ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గ్రీన్కోబ్రా, బ్లాక్ కోబ్రాల పేరిట నయీమ్ అరాచకాలు సృష్టించినట్లు అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని గద్దర్ డీజీపీని కోరారు. -
'నాపై దాడి కేసును పునర్విచారించండి'
హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మను మంగళవారం కలిశారు. తనపై జరిగిన దాడి కేసును మరోసారి విచారించాలని గద్దర్ కోరారు. 1997, ఏప్రిల్ 6 న గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మూడు బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. డాక్టర్లు మూడు బుల్లెట్లలో రెండింటిని బయటికి తీశారు. మూడవ బుల్లెట్ తీయడానికి వీలుపడకపోవడంతో శరీరంలో ఉండిపోయింది. ఈ కేసు విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన గద్దర్ మరోసారి విచారణ చేపట్టాల్సిందిగా డీజీపీని కోరారు. -
డయల్-100 సర్వీస్ను వాడుకోండి: డీజీపీ
హైదరాబాద్: జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దష్ట్యా ట్రాఫిక్ పోలీసులతోపాటు శాంతిభద్రతలను పర్యవేక్షించే సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ తదితర సీనియర్ అధికారులతో డీజీపీ గురువారం సమావేశమై వర్షాల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. ఎఫ్ ఎం రేడియో, టీవీ స్క్రోలింగ్, మైక్ ఎనౌన్స్మెంట్, వాట్సప్, ఫేస్బుక్ వంటి ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని ఆదేశించారు. వర్షం కారణంగా నీళ్లు ఇళ్లలోకి, సెల్లార్లలోకి వచ్చినా డయల్ - 100 సర్వీస్ను ఉపయోగించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మెట్రో రైలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. నాలాలు పొంగడం, రోడ్లపై మ్యాన్ హోల్స్ కనిపించకపోవడం వంటి కారణాలతో వృద్ధులు, బాలలు, మహిళలు ప్రమాదాల బారినపడే అవకాశం ఉన్నందున గల్లీల్లోని రోడ్ల పట్ల పోలీస్ సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యాలయ వేళలు, పాఠశాలలు, కళాశాలల సమయాల్లో ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ను వెంటవెంటనే క్లియర్ చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి రెండు మూడు రోజుల పాటు పనిచేయాలని ఆదేశించారు. -
భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. -
పోలీసు విభజనకు సీనియర్ ఐపీఎస్లు
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు విభజనకు సంబంధించి డీజీపీ అనురాగ్శర్మ వేగం పెంచారు. పోలీస్ స్టేషన్ల పరిధి, సిబ్బంది విభజన తదితర అంశాలను పరిష్కరించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దింపారు. జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేసి, జిల్లా పోలీసింగ్పై పూర్తి అవగాహన ఉన్న అధికారులను జిల్లాల ఇన్చార్జిలుగా నియమించారు. మెదక్-కృష్ణప్రసాద్, రంగారెడ్డి-ఎం.గోపీకృష్ణ, నల్గొండ-రవిగుప్త, ఖమ్మం-అంజనీకుమార్, ఆదిలాబాద్-సందీప్ శాండిల్య, మహబూబ్నగర్-కె.శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్-సౌమ్యామిశ్రా, నిజామాబాద్-సంజయ్కుమార్జైన్, వరంగల్-బి.మల్లారెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ అనురాగ్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ జిల్లాల విభజన పనుల్లో ప్రస్తుత జిల్లా ఎస్పీలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాల సబ్డివిజన్లు, ఠాణాల పరిధి తదితర అంశాలను చర్చించనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో జరిగిన కానిస్టేబుళ్ల నియామకాలు, జోనల్ స్థాయిలో జరిగిన సబ్ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల్లో బందోబస్తు చర్యలు పుష్కలం. పోలీసులు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 12(శుక్రవారం) నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 13,474 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారు. మహబూబ్నగర్ జిల్లాలో మేజర్, మైనర్, లోకల్ ఘాట్లు 57 వరకు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం 6,754 మంది పోలీసులను కేటాయించారు. మహబూబ్నగర్ జిల్లాలోని బాగా రద్దీ ఉండే అవకాశమున్నా బీచుపల్లి ఘాట్కు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ను ఇన్చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అలంపూర్ పుష్కర ఘాట్కు ఐజీ కె.శ్రీనివాస్రెడ్డి, ఈగలపెంట వద్దనున్న ఘాట్కు సెక్యూరిటీ వింగ్ జాయింట్ సీపీ మహేందర్ కుమార్ రాథోడ్, కృష్ణా గ్రామం వద్దనున్న ఘాట్కు సీఐడీ ఎస్పీ ఎం.శ్రీనివాసులుకు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరఘాట్ల భద్రత కోసం 6,720 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో రద్దీగా ఉండే వాడపల్లి ఘాట్కు నార్త్జోన్ ఐజీ వై నాగిరెడ్డి, సాగర్ ఘాట్కు డీఐజీ ఎంకే సింగ్, మఠంపల్లి ఘాట్కు గ్రేహౌండ్స్ ఎస్పీ తరుణ్జోషిని కేటాయించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు పుష్కర భక్తులకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్ను అంచనా వేసి అదుపు చేసేందుకు రెండు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్నగర్ జిల్లాలో 33 ట్రాఫిక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారి వెంబడి ఎక్కడికక్కడ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను నెలకొల్పిన్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరగకుండా చూసేందుకు 27 ‘షీ’ టీమ్లను, సంఘవిద్రోహ చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 80 చెక్ టీమ్లను నియమించామని పేర్కొన్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద దాదాపు 555 సీసీ కెమెరాలతో ఎల్లవేళలా గస్తీ నిర్వహిస్తామని వివరించారు. రెండు జిల్లాల ఎస్పీలు భక్తుల సౌకర్యార్థం కోసం మొబైల్ యాప్లను ఏర్పాటు చేశారన్నారు. -
'పక్కా సమాచారంతోనే స్కెచ్'
హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి. -
కేసీఆర్తో డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఎంసెట్-2 పేపర్ లీకేజ్ కేసుపై ముఖ్యమంత్రితో చర్చించారు. తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు ఇక్బాల్ అనుచరుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కన్సల్టెన్సీ యజమాని రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీఐడీ అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశముంది. -
డీజీపీ, ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ భేటీ
హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీక్పై సీఐడీ అధికారులు నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. మరోవైపు ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శుక్రవారం సచివాలయానికి తరలి వస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారి ర్యాంకులు రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఎంసెట్ -2 లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు ఎంసెట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ -2ను రద్దు చేస్తే.. పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని దానికి బదులు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ.. కడియం, లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండి చేస్తూ.. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలు అరెస్ట్ చేశారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం..
స్మార్ట్ పోలీసింగ్ వర్క్షాప్లో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్ : పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పవర్ ఒక్కటే పోలీసుల బలం కాదని, స్నేహభావంతో సమస్యలను పరిష్కరించినపుడు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. మంగళవారం రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో నిర్వహించిన స్మార్ట్ పోలీసింగ్ వర్క్షాప్కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలంతోపాటు పోలీసులు టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు నైపుణ్యం సాధించాలని సూచించారు. దేశం మొత్తంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే స్మార్ట్ పోలీసింగ్ మీద వర్క్షాప్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర హోం శాఖలో ఆధునీకరణ విభాగానికి చెందిన ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అధికారి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. స్మార్ట్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే పోలీసులందరికీ శిక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈశ్కుమార్, అదనపు డెరైక్టర్ ఎంకే సింగ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులందరూ పోలీసు అకాడమీలో మొక్కలు నాటారు. -
పక్కాగా కానిస్టేబుల్ ‘ఈవెంట్స్’
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ కొలువుల కోసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈవెంట్స్ను పక్కాగా నిర్వహించాలని డీజీపీ అనురాగ్శర్మ జిల్లా ఎస్పీలను ఆదేశించారు. వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1.92 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో డీజీపీ అనురాగ్శర్మ అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేహ దారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా బాధ్యతగా నిర్వహించాలని కోరారు. మొదట 800 మీటర్ల పరుగును నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే రెండవ రోజు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించాలని సూచిం చారు. అయితే మహిళా అభ్యర్థులు మాత్రం రాత్రి బస ఏర్పాట్లను వారే స్వయంగా సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. వేల సంఖ్యలో హాజరయ్యే అభ్యర్థుల కోసం గ్రౌండ్లో తగినంత సిబ్బందిని ఉంచాలన్నారు. అన్ని రికార్డులను సరిగ్గా రాయాలని సూచించారు. కృష్ణాపుష్కరాల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ప్రత్యేకంగా చర్చించారు. ఒక వైపు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణ, మరోవైపు కృష్ణా పుష్కరాల బందోబస్తు నిర్వహించాల్సి రావడంతో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీలకు సూచించారు. -
17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచిన కోహ్లీ
హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో దొంగ బాబా కోహ్లీ ముఠా ఏకంగా 17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచింది. యురేనియం, ఇరిడియం లాంటి లోహాలను వెలికి తీస్తామని చెబుతూ డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టింది. ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందనీ, ఈ పాత్రను ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ ప్రధాన నిందితుడు దొంగ బాబా కోహ్లి నమ్మబలికాడు. అతడి మాయమాటలను నమ్మిన జూబ్లీహిల్స్కు చెందిన దామోదర్రెడ్డి అనే వ్యక్తి అడ్డంగా మోసపోయాడు. దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు కోహ్లీ, గంగధారరెడ్డి, రమేష్ బాబు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
సొమ్ముల ‘పుల్లింగ్’
- నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో ఇంకో దోపిడీ - రూ.4 కోట్లకు బురిడీ కొట్టించిన మరో దొంగ బాబా - డీజీపీ అనురాగ్ శర్మకు బాధితుడి ఫిర్యాదు - నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్స్టైల్’ భవన యజమానిని 1.33 కోట్లకు బురిడీ కొట్టించిన దొంగ బాబా శివానంద ఉదంతాన్ని మరువకముందే.. ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. శివానంద బాబా మాదిరిగానే రైస్ పుల్లింగ్ పేరుతో మరో దొంగ బాబా హైదరాబాద్లో డబ్బున్న వారికి టోకరా వేశారు. ఉత్తరాది నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడిన కోహ్లి అనే దొంగ బాబా సుమారు రూ.4 కోట్లకు ఎసరు పెట్టినట్టు సమాచారం. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైస్ పుల్లింగ్తో లక్ష్మీ కటాక్షం: ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ పాత్రనుఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ దొంగ బాబా కోహ్లి చెప్పిన మాయ మాటలకు జూబ్లీహిల్స్కు చెందిన దామోదర్రెడ్డి అనే వ్యక్తి మోసపోయాడు. అతీత శక్తులున్న పాత్రను అందజేస్తామంటూ దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. ఇటీవల శివానంద బాబా ఉదంతం వెలుగు చూడటంతో.. తాను కూడా మోసపోయినట్లు గుర్తించిన దామోదర్రెడ్డి డీజీపీ అనురాగ్శర్మను ఆశ్రయించారు. దీంతో కర్నూలుకు చెందిన కోహ్లి బాబా బెంగళూరు కేంద్రంగా చేస్తున్న రైస్ పుల్లింగ్ డ్రామాలు వెలుగుచూశాయి. దొంగబాబా ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా ‘సాక్షి’కి చెప్పారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘ఆ రెండు’ పోలీస్ యాప్స్
- అన్ని జిల్లాల్లోనూ ‘హైదరాబాద్ కాప్’, ‘360 డిగ్రీస్ వ్యూ’ - వినియోగించాలని నిర్ణయించిన డీజీపీ అనురాగ్ శర్మ - పోలీసు ఉన్నతాధికారులతో భేటీలో ఆదేశాలు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పోలీసులు రూపొందించి, వినియోగిస్తున్న పోలీస్ యాప్స్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 6 నెలలుగా ఈ యాప్స్ను సిటీ పోలీసులు వినియోగిస్తున్నారు. డీజీపీ ఆదేశాల నేపథ్యంలో ఈ యాప్స్లో అవసరమైన మార్పులుచేర్పులు చేయడానికి సిటీ పోలీసు ఐటీ సెల్ సన్నాహాలు చేస్తోంది. ఇదీ ‘హైదరాబాద్ కాప్’.. ఠాణాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలకు గస్తీ సిబ్బంది కచ్చితంగా వెళ్లిరావడం కోసం ఈ-బీట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ యాప్ అక్షాంశ, రేఖాంశాలను గ్రహించడం ద్వారా లోపాలకు తావు లేకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చేస్తుంది. పోలీసుస్టేషన్ల వారీగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ యాప్లో ఉంది. ఓ వాహనచోదకుడు వాహనానికి చెందిన పత్రాలను పోలీసులకు తనిఖీ సమయంలో చూపినప్పుడు ఆ జిరాక్సు ప్రతులు అసలువో కాదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోపక్క చోరీ వాహనాల జాబితానూ ఈ యాప్కు అనుసంధానిస్తున్నారు. పాత నేరగాళ్ల చిరునామాలు, జైలు నుంచి విడుదలవుతున్న వారి వివరాలనూ పొందుపరిచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే వాళ్లు ఎవరున్నారు? వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? అనేవి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిత్యం తప్పిపోయిన, గుర్తుతెలియని శవాల కేసులు నమోదవుతుంటాయి. ఈ యాప్ వల్ల ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా సరిచూడటానికి అవకాశం ఉంటుంది. ‘360 డిగ్రీస్ వ్యూ’ ఉపయోగం ఇలా.. రాష్ట్రంలో ఏటా వేల కేసులు నమోదవుతుంటాయి. వీటిలో అరెస్టయ్యే నిందితులందరినీ పోలీసులు గుర్తుంచుకోవడం కష్టం. రిపీటెడ్ అఫెండర్స్ తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు అరెస్టైనప్పుడు తమ పేర్లలో స్వల్ప మార్పులు చేసి చెప్తుంటారు. ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టు అయినప్పుడు బెయిల్ పొందడం కోసం కోర్టులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఇలాంటి వారికి ‘360 డిగ్రీస్ వ్యూ’ చెక్ చెప్తుంది. ఈ సాఫ్ట్వేర్లో అరెస్టు అయిన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్లైన డ్రైవింగ్ లెసైన్స్, రేషన్కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను సర్వర్కు అనుసంధానిస్తారు. ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి సదరు వ్యక్తి ‘పేర్లు’ మార్చుకున్నా ఆ వివరాలన్నింటినీ అందిస్తుంది. దీన్ని పోలీసు విభాగం కంప్యూటర్లతో పాటు ల్యాప్టాప్స్, ట్యాబ్స్, సెల్ఫోన్ల నుంచీ ఈ సెర్చ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులకు శిక్షణ ఒక సవాల్: డీజీపీ సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి శిక్షణ ఇవ్వడం ఒక సవాల్తో కూడుకున్న అంశమని డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం డీజీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐల నియామకం భారీగా జరుగుతోందన్నారు. పోలీసు స్టేషన్ల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్, సమాచార సాంకేతిక వ్యవస్థ, నేరాల అదుపుకు తీసుకుంటున్న చర్యలు, కృష్ణా పుష్కరాలు, రాబోయే పలు పండుగలు సందర్భంగా తీసుకుంటున్న భద్రతా చర్యలను ఈ సమావేశంలో సమీక్షించారు. 2015 సంవత్సరానికి అందించిన సేవలకు గాను అవార్డులు పొందిన అధికారులకు ధ్రువీకరణ పత్రాలను డీజీపీ అందజేశారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు రాజీవ్ త్రివేది, మహేందర్ రెడ్డి, పూర్ణచందర్రావు, గోపీకృష్ణ, గోవింద్సింగ్, అంజనీకుమార్, డాక్టర్ ఈష్కుమార్, రవిగుప్తా, సందీప్ శాండిల్య, సి.వి.ఆనంద్, బాలనాగదేవితో పాటు ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పాల్గొన్నారు. -
దేశంలోనే అత్యుత్తమం
♦ తెలంగాణ పోలీసుకు గుర్తింపు వచ్చిందన్న డీజీపీ అనురాగ్శర్మ ♦ శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో విజయం సాధించాం ♦ రెండేళ్ల కాలంలో ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం పెరిగింది ♦ టెక్నాలజీని విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చాం ♦ పోలీసు అధికారులు లంచం తీసుకుంటే సస్పెండ్ చేస్తాం సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కాలంలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసు శాఖ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు విజయం సాధించారని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోనే రాష్ట్ర పోలీసులకు దేశంలోనే పేరుప్రతిష్టలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు అదుపులో ఉండి ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి చెందవచ్చన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ ‘100’కు భారీగా కాల్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవల భరోసా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు కోసం థర్డ్పార్టీ చేత విచారణ జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. పాస్పోర్టు వెరిఫికేషన్, ఠాణాల్లో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరును ఎప్పటికప్పుడు థర్డ్పార్టీ ద్వారా నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. పోలీసులెవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్, బాడీ కెమెరాలను తీసుకొచ్చి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ వల్ల పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్డన్ సెర్చ్ ద్వారా నేరగాళ్లను అదుపు చేయడమే కాక.. చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఇటీవల స్టడీ టూర్లో భాగంగా అమెరికా, బ్రిటన్లో పోలీసు ఉన్నతాధికారుల పర్యటన విషయాలను వివరించారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు పూర్ణచందర్రావు, గోపీకృష్ణ, కృష్ణప్రసాద్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ విధులకు టాటా..?
- బాధ్యతల నుంచి తప్పుకోనున్న పోలీసు శాఖ - అమెరికా, బ్రిటన్ మాదిరిగా రవాణా శాఖకు అప్పగించే యోచన - పోలీసులను పూర్తిగా శాంతిభద్రతల కోణంలోనే ఉపయోగించే ఆలోచన - ప్రభుత్వానికి అందజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న డీజీపీ సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ విభాగం నుంచి పోలీసులు తప్పుకోనున్నారా..? ఆ వ్యవస్థను మొత్తం రవాణా శాఖ పరిధిలోకి తీసుకెళ్లనున్నారా? దీనికి అవుననే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా రవాణా శాఖ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ, ఆర్అండ్బీకి చెందిన ఇంజనీర్లే ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోనూ ట్రాఫిక్ విభాగాన్ని పూర్తిగా రవాణా శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోడ్ల భద్రత, రహదారుల లోపాలు, రోడ్ల మార్కింగ్ వంటి వాటిని రవాణా శాఖ అధికారుల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. కనుక ట్రాఫిక్ విధులను రవాణా శాఖకే అప్పగించి.. పోలీసులను పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన కోణంలోనే ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసేందుకు డీజీపీ అనురాగ్శర్మ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. లోటుపాట్లు తెలిసేది రవాణా శాఖకే.. చిన్న చిన్న రహదారులు మినహా ఒక మోస్తారు నుంచి రహదారుల నిర్మాణాలన్నీ ఆర్అండ్బీ శాఖనే చేపడుతుంది. డ్రైవింగ్, వాహనాల ఫిట్నెస్ వంటి నియమ నిబంధనలన్నీ రవాణా శాఖే నిర్ణయిస్తుంది. అంతేకాదు రహదారుల్లో ఉండే లోపాలను ఆర్అండ్బీ, రవాణా శాఖ అధికారులే గుర్తిస్తారు. ఈ విభాగాల్లోనే ఇంజనీర్లు, నిఫుణులైన అధికారులు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా పదే పదే ప్రమాదాలు జరిగే రహదారులను, బాటిల్నెక్ వంటి వాటిని గుర్తించి సరిచేయడం ఈ రెండు విభాగాల పరిధిలోనే ఉంటుంది. అలాగే రద్దీగల రహదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలన్నా, దారి మళ్లింపులు చేపట్టాలన్నా అందుకు ఇంజనీరింగ్ నిఫుణులైతేనే సరైన ప్రణాళిక రూపొందించగలరు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ట్రాఫిక్ను పూర్తిగా రవాణా శాఖనే పర్యవేక్షిస్తుంది. రహదారుల లోపాలను, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం వంటివన్నీ అక్కడి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. సీసీటీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ వివరాలను రవాణా శాఖ అధికారులే ప్రజలకు చేరవేస్తారు. పోలీసులకు ఏ మాత్రం సంబంధం ఉండదు. రహదారులపై ఏమైన ప్రమాదాలు, శాంతిభద్రతలకు విఘాతం వంటి ఘటనలు చోటు చేసుకుంటేనే పోలీసులు జోక్యం చేసుకుంటారు. అలాంటి విధానాన్ని ఇక్కడ తీసుకురావడం ద్వారా పోలీసు సేవలను శాంతిభద్రతల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సిబ్బంది పరిస్థితిపై తర్జనభర్జన.. ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి అవసరమైన సిబ్బంది రవాణా శాఖకు అందుబాటులో లేరు. ఇప్పటికిప్పుడు సిబ్బంది నియామకం చేయాలన్నా కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు కొత్తగా సిబ్బందిని నియమించాలా లేదా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను బదలాయించాలా? అనేది అధికారులకు అంతుబట్టడం లేదు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులను రవాణా శాఖకు బదిలీ చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పోలీసుల క్యాడర్ ర్యాంకు, నియమ నిబంధనలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మొత్తం మీద ప్రభుత్వ సలహా తీసుకుని సిబ్బంది విషయంలో ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. -
'దేశంలోనే తెలంగాణ పోలీసుకు అత్యుత్తమ గుర్తింపు'
- శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు సక్సెస్ - టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకొస్తాం - రెండేళ్లలో ప్రజలకు పోలీసుల పట్ల భారీగా పెరిగిన నమ్మకం - పోలీసు అధికారులు లంచం అడిగితే సస్పెండ్ చేస్తాం హైదరాబాద్ : రెండేళ్లలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసింగ్ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకున్నదని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వ్యాఖ్యానించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు విజయం సాధించారని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులకు దేశంలోనే పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు అదుపులో ఉండి ప్రశాంత వాతావరణం ఉంటేనే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి చెందవచ్చన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పోలీసుశాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రతీనెలా డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. పోలీసు ఎమర్జెన్సీ నెంబర్ '100'కు భారీగా కాల్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా 'షీ టీమ్స్' ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవల భరోసా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు కోసం థర్డ్పార్టీ చేత విచారణ జరుపుతున్నామన్నట్లు డీజీపీ తెలిపారు. పాస్పోర్టు వెరిఫికేషన్, ఠాణాలలో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే వాటిని ఎప్పటికప్పుడు థర్డ్పార్టీ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వివరించారు. పోలీసులెవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్, బాడీ కెమెరాలను తీసుకొచ్చి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ వల్ల పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్డెన్ సెర్చ్ ద్వారా నేరగాళ్లను, చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలు, చోరీ చేసిన వాహనాలు భారీగా వెలుగు చూస్తున్నాయన్నారు. ఇంతకు ముందు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెళ్లేవారు కాదని కార్డన్ సెర్చ్ ద్వారా అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళుతున్నారన్నారు. అదే విధంగా సీఐడీ, పోలీస్ రిక్రూట్మెంట్ విజయాలను డీజీపీ వివరించారు. అలాగే ఇటీవల స్టడీ టూర్లో భాగంగా యూఎస్ఏ, యూకేలలో పోలీసు ఉన్నతాధికారుల పర్యటన విషయాలను వివరించారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు పూర్ణచందర్రావు, గోపికృష్ణ, కృష్ణప్రసాద్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతీ పోలీసుస్టేషన్లో ఇంకుడుగుంత: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పోలీసుస్టేషన్ ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంతను తవ్వాలని డీజీపీ అనురాగ్శర్మ పోలీసులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రతీ నీటిచుక్కను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. సోమవారం ఇక్కడ పోలీసు ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతల కార్యక్రమంలో డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతీ పోలీస్స్టేషన్లో వారంలో ఒకరోజు స్వచ్ఛ తెలంగాణను పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఐజీ సంజయ్కుమార్ జైన్, ఎస్పీ రమేష్రెడ్డిలతో కూడిన అధికారుల బృందం డీజీపీ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించింది. డీజీపీ కార్యాలయంలో అత్యంత పరిశుభ్రతను పాటిస్తున్న సీ-సెక్షన్ కు డీజీపీ ప్రోత్సాహక బహుమతిగా రూ.2 వేలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు గోపీకృష్ణ, కృష్ణప్రసాద్, రవిగుప్తా, సందీప్ శాండిల్య, బాలనాగదేవి, నవీన్చంద్, శివధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోండి
డీజీపీకి అడ్వకేట్స్ జేఏసీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ, డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేసింది. డీజీపీ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆదివారం టి.అడ్వకేట్స్ జేఏసీ నేతలు ఫిర్యాదు పత్రాన్ని పోలీసు ప్రధాన కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సభలు, సమావేశాలతో పాటు ప్రెస్మీట్లలో కూడా సీఎం కేసీఆర్పట్ల అగౌరవంగా మాట్లాడటమే కాకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా రేవంత్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టి.అడ్వకేట్స్ జేఏసీ నేతలు కె.గోవర్ధన్రెడ్డి, ఎస్.జనార్దన్గౌడ్, వి.రవికుమార్, కె.నరేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. డీజీపీ అనురాగ్శర్మ బుధవారం తన కార్యాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమక్షంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,93,197 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, 1,92,588 మంది అర్హత పొందారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ)లను నిర్వహిస్తారు. ఈ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు రె ండువారాల ముందుగా వెబ్సైట్ నుంచి అనుమతి లేఖలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత నెల 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఆదిలాబాద్ జిల్లా నుంచి 14,437 మంది, హైదరాబాద్ నుంచి 19,312, కరీంనగర్ నుంచి 22,054, ఖమ్మం నుంచి 22,806, మహబూబ్నగర్జిల్లా నుంచి 20,421,మెదక్జిల్లా నుంచి 10,481, నల్లగొండ నుంచి 23,595, నిజామాబాద్ నుంచి 11,271, రంగారెడ్డిజిల్లా నుంచి 22,861, వరంగల్ నుంచి 25,270 మంది అర్హత సాధించారు. ఎక్స్సర్వీస్మెన్ 292 మంది హాజరుకాగా 138 మంది అర్హత సాధించారు. కాగా, ఓఎంఆర్ షీట్ల వాల్యుయేషన్కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు దానిని సవాల్ చేయవచ్చు. గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www.tslprb.in వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకుని తమ వినతులను సమర్పించవచ్చు. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు (ఎస్సీ, ఎస్టీలకు రూ.2 వేలు) చెల్లించాల్సి ఉంటుందని టీఎస్పీఎల్ఆర్బీ చైర్మన్ జె.పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను డీజీపీ అనురాగ్శర్మ బుధవారం విడుదల చేశారు. మొత్తం 4,93,197 మంది పరీక్ష రాయగా 1,92,588 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 47 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారు. ఈ కార్యక్రమంలో పోలీసు, జేఏన్టీయూ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. -
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్శర్మ గురువారం విడుదల చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 17న రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో 510 పోస్టులకుగాను 1,74,962 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా 88,875 మంది(50.79 శాతం) ఉత్తీర్ణత సాధిం చారు. వీరిలో పురుషులు 79,854 మంది కాగా.. మహిళలు 9,021 మంది ఉన్నారు. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లో 29 పోస్టులకుగాను 10,584 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 1,709 మంది (16.14 శాతం) అర్హత సాధించారు. వీరిలో పురుషులు 1,513 మంది ఉండగా, మహిళలు 196 మంది ఉన్నారు. మొత్తమ్మీద పరీక్షా ఫలితాల్లో ఖమ్మం జిల్లా 54.36 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించగా.. మెదక్ జిల్లా అతి తక్కువగా కేవ లం 44 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు స్పష్టం చేశారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు శుక్రవారం నుంచి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జవాబు పత్రాల మధింపులో ఏమైనా అనుమానాలు ఉంటే మే 5వ తేదీలోగా అభ్యర్థులు నిర్దేశిత మొత్తం చెల్లించి ఓఎంఆర్ షీట్లు పొందవచ్చు. ఇందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనే అత్యధిక ఉత్తీర్ణత ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అతి తక్కువగా అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ వారికి అర్హత మార్కులు అత్యధికంగా ఉండటంతో కేవలం 28.62 శాతం మంది మాత్రమే తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. ఎస్సై ప్రిలిమినరీలో జనరల్ కేటగిరీకి కటాఫ్గా 80 మార్కులు నిర్ణయించడంతో కేవలం 4,454 మంది మాత్రమే అర్హత సాధించారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 17,386 మంది(63.74 శాతం), ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు 22,882 మంది (61.54 శాతం) అర్హత సాధించారు. అలాగే బీసీ-ఏ కేటగిరీలో 5,742 మంది(42.77 శాతం), బీసీ-బీలో 18,422 మంది (49.20 శాతం), బీసీ-సీలో 174 మంది (31.35 శాతం), బీసీ-డీలో 17,728 మంది (48.19 శాతం) బీసీ-ఈలో 2,009 (30.19 శాతం) మంది అర్హత సాధించారు. -
కాలేజీల్లో సోదాలకు రెడీ..
♦ ఉన్నతాధికారులతో డీజీపీ విస్తృత సమావేశం ♦ 600 పోలీసు బృందాల ఏర్పాటుకు నిర్ణయం ♦ తనిఖీ చేయాల్సిన అంశాలపై సుదీర్ఘ చర్చ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో లోటుపాట్లపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు 600 పోలీసు బృందాల సేవలు అవసరముంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కాలేజీల్లో ఏయే అంశాలపై సోదాలు నిర్వహించాలనే విషయమై డీజీపీ అనురాగ్శర్మ సోమవారం తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా తయారు చేయాలని నిర్ణయించారు. అడ్మిషన్ విధానం, ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, స్కాలర్షిప్ల మంజూరు, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల వివరాలు, కాలేజీల అనుమతులు, వాటికి అనుగుణంగా ఉన్న బ్రాంచ్లు తదితర వాటిపై ఒక నమూనా రూపొందించి తనిఖీలు చేయాలని యోచిస్తున్నారు. 600 తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని భావించడంతో ఒక్కో బృందంలో ఎంత మంది సిబ్బందిని నియమించాలనే దానిపైనా కూలంకషంగా చర్చించారు. సమావేశంలో హైదరాబాద్ సీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్చంద్, సైబరాబాద్ డీఐజీ శశిధర్రెడ్డి, సీఐడీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. వేసవి సెలవులు కదా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రైవేటు కాలేజీలు 6,800 వరకు ఉన్నాయి. కాలేజీల చిరునామాలు, వాటి వ్యవహారాలకు సంబంధించి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, బోధన సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తనిఖీలకు ప్రాథమికంగా అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశముందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ అధికారులతో భేటీ కాలేజీలపై దాడులకు సంబంధించి డీజీపీ అనురాగ్శర్మ ఒక వైపు సుదీర్ఘ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే మరోవైపు విద్యా శాఖ అధికారులతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ప్రత్యేక భేటీ నిర్వహించారు. మాసబ్ట్యాంక్ వద్దనున్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), ఉన్నత విద్యామండలి అధికారులు, కళాశాల విద్య, సాంకేతిక విద్య అధికారులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఏయే అంశాలపై సోదాలు నిర్వహిస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అప్పట్లోగా మరింత సమాచారంతో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులను రాజీవ్ త్రివేది కోరినట్లు తెలిసింది. -
పరీక్షల నిర్వహణకు సహకరించం
♦ విజిలెన్స్ తనిఖీలు ఉపసంహరించే వరకు అంతే.. ♦ విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది ♦ తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసు, విజిలెన్స్ తనిఖీలను నిలిపివేసే వరకు పాలీసెట్, కానిస్టేబుల్, ఎంసెట్ పరీక్షలకు సహకరించమని, తమ కాలేజీల్లో పరీక్షలను జరగనివ్వమని తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీలను ఉపసంహరించాలని కోరుతూ సోమవారం నుంచి ప్రారంభమైన విద్యాసంస్థల బంద్ కొనసాగిస్తామని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం జేఏసీ నేతలు సమావేశమై బంద్, సహాయ నిరాకరణను కొనసాగించాలని నిర్ణయించారు. తనిఖీలను వెంటనే ఆపాలంటూ డీజీపీ అనురాగ్ శర్మను, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డిని జేఏసీ నేతలు గౌతంరావు, రమణరెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామ్దాస్ కలసి వినతి పత్రాలు అందజేశారు. పాలీసెట్పై ఏం చేయాలి? యాజమాన్యాల జేఏసీ నిర్ణయంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి పాలీసెట్ పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ యాజమాన్యాలు తమ కాలేజీల్లో పరీక్షలను నిర్వహించనీయమని, నిరవధిక బంద్ కొనసాగిస్తామని ప్రకటించడంతో ఆందోళనలో పడింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ వివిధ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను కూడా కేటాయించారు. ఇపుడు విద్యా సంస్థలను మూసేయడం వల్ల పరీక్ష ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీఎం కేసీఆర్తో మంగళవారం చర్చించాక నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. పరీక్షలు యథాతథం: అధికారులు జేఎన్టీయూ, ఓయూ పరిధిలో పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆ వర్సిటీ ల పరీక్షల విభాగాధికారులు స్పష్టం చేశా రు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలకు హాజ రు కావాలన్నారు. జేఎన్టీయూ పరి ధిలో మిడ్ ఎగ్జామ్స్ ప్రారంభం కాగా.. ఓయూ పరిధిలో బీ ఫార్మసీ, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ తదితర వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. బంద్పై ఎటువంటి ఆదేశాలు తమకు అందలేదని, కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి అప్పారావు, జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారి ఆంజనేయ ప్రసాద్ వివరించారు. పోలీసులతో విచారణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసులతో విచారణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రమణా రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ నేతలు సోమవారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసులతో కాకుండా ఉన్నత విద్యా శాఖ, విశ్వవిద్యాలయ అధికారులతో విచారణ జరిపించాలన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి తనిఖీలకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరారు. -
ఈ యాప్ ఎస్సై పరీక్ష కేంద్రానికి దారి చూపుతుంది
‘ఫైండ్ మి@యాప్’ను ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఎస్సై పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వివరాలు, అక్కడికి చేరుకోవడానికి సులువైన దారి తెలుసుకునేందుకు ‘ఫైండ్ మి@యాప్’ ఉపయోగపడుతుందని డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. జేఎన్టీయూహెచ్ సహకారంతో టీహబ్ స్టార్టప్లోని యాప్ స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఈ యాప్ను డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ బుధవారం ఆవిష్కరించారు. ఐ ఫోన్తో పాటుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ లభ్యమవుతుందని, ఈ ఫోన్లు లేనివారు ‘వే టు ఎస్ఎంఎస్’ ద్వారా వివరాలు పొందవచ్చని తెలిపారు. దీనికోసం 9222273310కు హాల్టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్లు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఎస్సై పరీక్షల కోసం ఏర్పాటుచేసిన 350 కేంద్రాల్లో 310కేంద్రాల వివరాలు గూగుల్ మ్యాప్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఒకరిబదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్ చర్యలతో పాటు శిక్ష కూడా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.. ఈ నెల 17న జరిగే ఎస్సై పరీక్షకు అభ్యర్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. అభ్యర్థులను ఎలక్ట్రానిక్ వస్తువులతో పరీక్ష హాల్లోకి అనుమతించరని, చేతి గడియారం కూడా తీసుకురావద్దని సూచించారు. కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్టికెట్, పూర్తిచేసిన ఆన్లైన్ అప్లికేషన్, పాస్పోర్టు ఫొటో, అభ్యర్థి ఐడీ ప్రూఫ్ తెలిపే ఆధార్, పాన్కార్డ్, డ్రైవింగ్ లెసైన్స్ మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ నవీన్ చంద్, జేఎన్టీయూ కో ఆర్డినేటర్ ఫ్రొఫెసర్ ఎన్వీ రమణరావు, మొబైల్ యాప్ ఎండీ రాజీవ్ పాల్గొన్నారు. -
‘పోలీసు’ అభ్యర్థుల కోసం మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడం కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 'findme' మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. జేఎన్టీయూహెచ్ సహకారంతో టీ-హబ్ స్టార్టప్ కంపెనీలోని యాప్స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన కంపెనీ ఈ కొత్త యాప్ను రూపొందించింది. దీనిని బుధవారం డీజీపీ అనురాగ్శర్మ తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారా సంబంధిత పరీక్షా కేంద్రం ఫోన్ నంబర్తో పాటు గూగుల్ నేవిగేషన్ను కూడా పొందవచ్చు. అలాగే పరీక్షా సమయంలో అభ్యర్థులకు తాగునీరు, ఇతరత్రా సమస్యలు తలెత్తితే పరీక్ష ముగిసిన అనంతరం యాప్ ద్వారా తెలిపే వీలుంది. తద్వారా పరీక్షా కేంద్రంపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నారు. -
మెట్రో రైల్వే స్టేషన్లలో పటిష్ట భద్రత: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైల్ త్వరలో పరుగుపెట్టనున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మెట్రోరైల్ భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో తీసుకోవాల్సిన నేర, ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలపై చర్చించారు. ప్రతి 22 రైల్వే స్టేషన్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా ప్రతిపాదనలు రూపొం దించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్లలో షిప్టుల వారీగా 24 గంటల భద్రతా ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలతో సహా అన్ని స్థాయిల సిబ్బందీ కలిపి మొత్తం 1,525 మంది పోలీసులు భద్రతలో నిమగ్నమవుతారన్నారు. అయితే ఇందుకు సుమారు రూ.54 కోట్ల వ్యయమవుతుందని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. -
ప్రాజెక్టులకు పోలీసు పహారా
♦ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీస్స్టేషన్ ♦ స్థలాన్ని పరిశీలించిన డీజీపీ అనురాగ్శర్మ ♦ మావోయిస్టుల ప్రభావం లేకుండా చర్యలు సాక్షి ప్రతినిధి, వరంగల్: సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్పై దృష్టి పెట్టిన ప్రభుత్వం కొత్త వాటి నిర్మాణం విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గోదావరి నదీ తీరం వెంట నిర్మించబోయే ప్రాజెక్టులకు మావోయిస్టుల నుంచి ఇబ్బంది లేకుండా చేసేందుకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం తుపాకులగూడెం ప్రాంతంలో అటాకింగ్ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. పోలీసు రాష్ట్ర ఉన్నతాధికారి(డీజీపీ) అనురాగ్శర్మ ఈ ప్రాంతాన్ని శనివారం పరి శీలించారు. పోలీస్ అటాకింగ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలం ఐదు ఎకరాలను గుర్తిం చారు. తుపాకులగూడెం, దేవాదుల, గుట్టలగంగారం ప్రాంతాల్లో 72 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై రెండు ఎకరాల స్థలంలో అటాకింగ్ పోలీస్స్టేషన్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గోదావరి నది ఆనుకుని ఉన్న గ్రామాల మీదుగా జాతీయ రహదారిని నిర్మిం చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంట్లో భాగంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం, తుపాకులగూడెం, దేవాదుల గ్రామాలను తాకుతూ ఈ రహదారిని కరీంనగర్ జిల్లాకు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రాచలం నుంచి కౌటాల వరకు 380 కిలోమీటర్ల జాతీయ రహదారికి ప్రతిపాదిత పోలీస్ అటాకింగ్ స్టేషన్ ప్రాంతం కేంద్ర బిందుగా మారనుంది. ఏటూరునాగారం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం ఇంటేక్వెల్ నిర్మించారు. దేవాదుల ప్రాజెక్టు దిగువ భాగంలో తుపాకులగూడెం-ఛత్తీస్గఢ్ సరిహద్దు భీరమయ్య గుట్ట మధ్య గోదావరి నదిపై రూ.3 వేల కోట్లతో బ్యారేజీ పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉంటున్నాయి. గోదావరి నదిపై ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద నిర్మించిన బ్రిడ్జిపై రాకపోకలు పెరిగాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలోకి వచ్చి ఆశ్రయం పొందుతుంటారు. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు రక్షణ కల్పించాలంటే ఈ ప్రాంతంలో పోలీస్ అటాకింగ్ స్టేషన్ అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. మేడిగడ్డను సందర్శించిన డీజీపీ మహదేవపూర్ : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని మేడిగడ్డ ప్రాంతం లో మావోరుుస్టు పార్టీ కదలికలున్నారుు. దీంతో పోలీసుశాఖ ముందస్తుగా చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి అంచనా వేసేందుకు డీజీపీ ఇక్కడికి వచ్చారు. గోదావరినది ఒడ్డు నుంచి అవతలి వైపున ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాన్ని బైనాక్యులర్ల ద్వారా పరిశీలించారు. సరిహద్దున ఉన్న గ్రామాలు, ఇతర వివరాల గురించి ఎస్పీ, ఓఎస్డీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావ రి నదిపై బ్యారేజీలను నిర్మించనున్న నేపథ్యంలో.. వాటి రక్షణ ఏర్పాట్లు, ఇతర పనులను పరిశీలించేందుకే గోదావరి తీరం వెంట పర్యటించామని అనురాగ్శర్మ తెలిపారు. -
పోలీస్ స్టేషన్లలో 33 శాతం మహిళా ఉద్యోగులు
♦ మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమంలో డీజీపీ ♦ పాల్గొన్న హీరో రాంచరణ్, మంచు లక్ష్మి హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో 33 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర సీఐడీ, హైదరాబాద్ సిటీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మహిళల రక్షణ, శిక్షణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి పోలీస్స్టేషన్లో 33 శాతం మహిళా ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది హైదరాబాద్కే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాలకు కూడా అమలయ్యేలా చూస్తామన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో 100 ‘షీ’టీమ్లు పనిచేస్తున్నాయన్నారు. మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకుని లక్ష సీసీ కెమెరాలతో అన్ని ప్రాంతాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి 24/7 నిఘా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పుట్టిన పాపకు మంచి డ్రెస్లు వేసి అందంగా ఉన్నావని ఎలా అంటామో.. ఎదిగిన తరువాత కూడా తల్లిదండ్రులు ధైర్యం, భరోసా ఇవ్వాలని నటుడు రాంచరణ్తేజ్ సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కేవలం మన దేశంలోనే మహిళలను దేవతలా పూజించే గొప్ప సంప్రదాయం ఉందని నటి మంచు లక్ష్మి అన్నారు. అనంతరం మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనే అంశాలపై విద్యార్థినులకు, యువతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరాటే చాంపియన్ సైద లఖన్, ఏసీబీ డెరైక్టర్ చారుసిన్హా, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్, అధికారులు వేణుగోపాల్రావు, అనసూయ, సునీత, వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. షీటీమ్స్ వెబ్సైట్ ఆవిష్కరణ.. షీ టీమ్స్ వెబ్సైట్, పాటల సీడీ, పోస్టర్ను డీజీపీ అనురాగ్శర్మ, నటుడు రామ్చరణ్తేజ్, నటి మంచు లక్ష్మి, నగర కమిషనర్ మహేందర్రెడ్డి, స్వాతి లక్రా, సౌమ్యమిశ్రా తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ప్రతి మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుణపాఠంగా భావించి ముందుకు సాగాలని ప్రతిజ్ఞచేశారు. -
'పోలీసు' పరీక్షకు 1,131 పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్ : వచ్చే నెల 3వ తేదీన జరగబోయే పోలీస్ ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షకు 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మొత్తం 9,281 కానిస్టేబుళ్ల పోస్టులకు గాను 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 539 ఎస్సై పోస్టులకు 1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతోపాటు ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. జేఎన్టీయూ సహకారంతో పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచీలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోరని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షలు జరిగే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
పక్కాగా ‘పోలీస్’ పరీక్షల నిర్వహణ
జిల్లా ఎస్పీలను ఆదేశించిన డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాలని ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలను డీజీపీ అనురాగ్శర్మ ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి ప్రిలిమినరీ పరీక్షలు ప్రారంభం కానుండటంతో గురువారం డీజీపీ సమీక్ష నిర్వహించారు. దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానుండటంతో తీసుకుంటున్న చర్యలపై రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సహకారంతో పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షకు 5.36 లక్షల మంది, ఏప్రిల్ 17న జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 1.38 లక్షల మంది హాజరుకానున్నారని, వారికోసం 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్ కాగజ్నగర్, ఉట్నూర్లలో 110 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, మంథనిల్లో మొత్తం 106 సెంటర్లు, వరంగల్ జిల్లాలో వరంగల్, జనగాం, నర్సంపేటల్లో 109, ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లిలలో 112, నల్లగొండ జిల్లాలో కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేటలలో కలిపి 156, మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, కల్వకుర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, షాద్నగర్, మహబూబ్నగర్లలో కలిపి 195 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్లలో 79, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ సహా 124, హైదరాబాద్లో 74 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని చెప్పారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలన్నారు. దీంతో వారి వేలిముద్రలు సేకరించడం ద్వారా నకిలీ అభ్యర్థులు పరీక్ష రాయకుండా చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జేఎన్టీయూ కన్వీనర్ రమణారావు, పోలీస్ అధికారులు సుదీప్ లక్టాకియా, గోపీకృష్ణ, రవిగుప్తా, మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, సందీప్ శాండిల్య, సంజయ్ కుమార్ జైన్, నవీన్ చంద్, శ్రీనివాస్రెడ్డి, రమేశ్రెడ్డి, మల్లారెడ్డి, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. -
పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
డీజీపీ అనురాగ్శర్మ జహీరాబాద్: రాష్ట్రంలో చేపట్టబోయే పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తున్నామని డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. శనివారం ఆయన మెదక్ జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ పంచాయతీ పరిధిలోని లాల్సింగ్తండా శివారులో 25 ఎకరాల్లో పోలీసు ఫైరింగ్ రేం జ్కు, చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు చెక్పోస్టుకు శంకుస్థాపన చేశా రు. జహీరాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణలో రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన రిసెప్షన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసులు.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. 65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో చెక్పోస్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ రే ంజ్ ఐజీ నవీన్చంద్, కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ సుమతి పాల్గొన్నారు. కాగా మెదక్ జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ పంచాయతీ పరిధిలోని లాల్సింగ్ తండా శివారులోగల 25 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన పోలీసు ఫైరింగ్ జోన్ పనులకు డీజీపీ శంకుస్థాపన చేశారు. -
ఎన్కౌంటర్పై డీజీపీ స్పష్టత
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కూంబింగ్ లో ఉన్న పోలీసులకు మంగళవారం ఉదయం 7.30గంటలకు మావోయిస్టులు తారసపడ్డారని, ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారని అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. అయితే మృతులు ఎవరనేది ఇంకా గుర్తించలేదన్నారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గత నాలుగు రోజులుగా కూంబింగ్ జరుపుతున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఏకే 47, ఎస్ఎల్ఆర్, మూడు 303 రైఫిల్స్, 2 ఎస్బీపీఎల్ ఆయుధాలను మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు. -
పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస
ఎస్సై మహేందర్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్ ప్రథమ బహుమతి సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్శర్మ ప్రశంసించారు. కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించిన రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్రెడ్డిని డీజీపీ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన 12వ సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్కు ప్రథమ బహుమతి లభించింది. ఫైనల్లో దాయాది దేశం పాకిస్తాన్ను భారత జట్టు చిత్తుచేసింది. దేశానికి నాయకత్వం వహించిన మహేందర్రెడ్డితో పాటు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ రమణారెడ్డి, బెటాలియన్ ఐజీ శ్రీనివాసరావులను ప్రశంసించారు. -
'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదైందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రారంభం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనకసాగుతుందన్న విషయం అందరికీ విదితమే. -
మేడారం జాతరకు మొబైల్ యాప్
ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దర్శనం మరింత సులభతరం కానుంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరిగే జాతరకు రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, స్నాన ఘట్టాలు, ట్రాఫిక్ జామ్ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వరంగల్ పోలీసులు మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్ నిట్ విద్యార్థుల సహకారంతో రూపొం దించిన ఈ యాప్ను శుక్రవారం డీజీపీ అనురాగ్శర్మ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.రవీందర్, విద్యార్థులు సాయితేజ, రాహుల్, దేవేంద్ర, శివం యాప్ పనిచేసే విధానాన్ని వివరించారు. జాతరపై వరంగల్ జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన వీడియోను డీజీపీ పరిశీలించారు. తెలంగాణ నార్త్జోన్ ఐజీ నవీన్ చంద్, వరంగల్ ఎస్పీ అంబార కిశోరే ఝా పాల్గొన్నారు. -
కిడ్నీ రాకెట్పై డీజీపీకి నివేదిక
-
కిడ్నీ రాకెట్పై డీజీపీకి నివేదిక
♦ వివరాలను పోలీస్బాస్కు పంపిన నల్లగొండ ఎస్పీ ♦ శ్రీలంక వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన దుగ్గల్? ♦ హైదరాబాద్లో మరొకరిని అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన సంచలన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర డీజీపీకి అందింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ రాకెట్కు సంబంధించి తాము వెలికితీసిన అన్ని అంశాలతో కూడిన నివేదికను డీజీపీ అనురాగ్శర్మకు పంపారు. ఇప్పటికే చాలావరకు దర్యాప్తులో తేలిందని, అయితే, కిడ్నీలు అమ్ముకున్న వారు పలు రాష్ట్రాల్లో ఉన్నందున అక్కడకు వెళ్లి వారిని తీసుకువస్తే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని కూడా ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తున్న నేపథ్యంలో కొలంబో వెళ్లి విచారణ జరిపేందుకు ప్రభుత్వంతో తమకు అనుమతి ఇప్పించాలని కూడా నల్లగొండ ఎస్పీ దుగ్గల్ కోరినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈ కిడ్నీ రాకెట్ వివరాలు హైదరాబాద్ చేరడంతో దర్యాప్తు మరింత వేగిరం అవుతుందని భావిస్తున్నారు. అదుపులో మరొకరు? ఇక, ఈ రాకెట్లో సూత్రధారి అయిన మరొకరిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రాకెట్లో అరెస్టయిన నల్లగొండ పట్టణానికి చెందిన కస్పరాజు సురేశ్తో పాటు మరో ముగ్గురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఏయే రాష్ట్రాల్లో కిడ్నీ కుంభకోణం లింకులున్నాయో విచారించేందుకు నల్లగొండకు చెందిన ఓ పోలీసు బృందం హైదరాబాద్కు వెళ్లింది. అక్కడ విచారణలో భాగంగా నాంపల్లికి చెందిన ఓ యువకుడిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రాకెట్లో కీలకంగా భావిస్తున్న ఇతను ఇచ్చే సమాచారం కూడా దర్యాప్తును వేగిరం చేయనుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. -
తొలిరోజు సీఎం కేసీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బిజీబిజీగా గడిపారు. సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు సందడి నెలకొంది. ఉదయం నుంచే పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు సీఎంను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన పండితులు సీఎంను ఆశీర్వదించారు. సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను సీఎం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, చందూలాల్, తుమ్మల, ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి, మహేందర్రెడ్డి, జోగురామన్న, తలసాని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు సీఎంను కలిశారు. లక్ష్యానికి తగిన విద్యుత్ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఈ ఏడాది తొలి సమీక్ష నిర్వహించారు. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పగటిపూట తొమ్మిది గంటలు, ఇతర వర్గాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఈ ఏడాది చివరి నాటికి మరో 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యానికి తగినట్లుగా పనులు చేయాలని ఆదేశించారు. భూపాలపల్లిలో 600 మెగావాట్ల యూనిట్ను ఈనెల 5న ప్రారంభించడంతో పాటు ఏప్రిల్ నాటికి జైపూర్ నుంచి సింగరేణి ప్లాంట్ ద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఈ ఏడాది చివరినాటికి అందుతుందని... ఏప్రిల్ నాటికే 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో బీహెచ్ఈఎల్ ద్వారా నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు విద్యుత్ అధికారులు పనిచేస్తున్నారని అభినందించారు. టీజీవో డైరీ ఆవిష్కరణ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, టీజీవో నేత మమతతో పాటు సంఘం నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్కు శుభాకాంక్షలు సీఎం కేసీఆర్ శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలన్నీ విజయవంతం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
హైదరాబాద్ వచ్చివెళ్లిన ఆసియా అంద్రాబీ
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద కశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్ మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆసియా అంద్రాబీ గత ఏడాది హైదరాబాద్కు వచ్చి వెళ్లారా..? అవుననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి పోలీసు, నిఘా వర్గాలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుం బాన్ని పరామర్శించి వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గత శనివారం పట్టుబడిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్లు సలావుద్దీన్కు బంధువులు కావడం, ఆసియాను కలవాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పడంతో ఇప్పుడీ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ ‘అంద్రాబీ వచ్చి వెళ్లినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఐసిస్ యువకుల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకుని విచారిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బుధవారం వార్షిక విలేకరుల సమావేశం నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. నల్లగొండలో పుట్టి సిమిలో చేరి నుంచి నేషనల్ స్థాయికి ‘ఎదిగి’ ఆ సంస్థ మాజీ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సలార్కు జాతీయ స్థాయిలో సంబంధాలు ఉండేవి. అప్పట్లోనే ఇతడికి అంద్రాబీతో పరిచయం ఏర్పడింది. 2011లో అరెస్టు తరువాత.. విడుదలై నగరంలోనే నివసించాడు. గత ఏడాది అక్టోబర్లో నల్లగొండ నుంచి కారులో వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అంద్రాబీ హైదరాబాద్కు వచ్చి అతడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 2012లోనూ అంద్రాబీ ఓసారి హైదరాబాద్ వచ్చివెళ్లారని సమాచారం. సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ‘ఐసిస్ త్రయం’ ఈమెను కలిశారా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. ఐసిస్ త్రయాన్ని తమ కస్టడీలోకి తీసుకున్న తరవాత ఈ కోణంలోనూ ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు. పాక్ అనుకూల వాదిగా ముద్రపడ్డ అంద్రాబీ ఈ ఏడాది సెప్టెంబర్లో కశ్మీర్లో పాకిస్థాన్ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. అంద్రాబీ బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ వచ్చి సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. అయితే ఐసిస్ సహా ఏ ఉగ్రవాద సంస్థకూ తాను మద్దతుకాదని, కాశ్మీర్ కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు పుడుతున్నాయని స్పష్టం చేశారు. -
'ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు'
-
ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: డీజీపీ
హైదరాబాద్ : వేర్పాటువాది అసియా ఆంద్రాబి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి వస్తున్న వార్తలపై డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఆంద్రాబీ హైదరాబాద్ పర్యటనపై వార్తలు వస్తున్న మాటల వాస్తవమేనని ఆయన అన్నారు. అయితే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు ఖచ్చితమైన సమాచారం లేదన్నారు. ఆమె రాకను ధ్రువీకరించాల్సి ఉందని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. కాగా కశ్మీర్ వివాదాస్పద మహిళ నేత ఆంద్రబీ గతేడాది హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. సిమి వ్యవస్థాపకుడు సలావుద్దీన్ కుటుంబాన్ని ఆమె కలిసినట్లు తెలుస్తోంది. ఇక నాగపూర్లో పట్టుబడిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఆంద్రాబిని కలిశారనే దానిపై తమవద్ద సమాచారం లేదన్నారు. ఇటీవల ఐసిస్లో చేరేందుకు యత్నించిన ముగ్గురు హైదరాబాదీ యువకులు ఆమెను కలిసినట్లు వార్తలు వినవస్తున్నాయి. -
అన్ని పోలీస్స్టేషన్లకూ వీసీ సౌకర్యం
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పోలీసుస్టేషన్లనూ వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్లతో పాటు పోలీసుస్టేషన్లనూ వీసీ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించాం. శాంతిభద్రతలు, ట్రాఫిక్ స్థితిగతులతో పాటు నేర స్థలాల పర్యవేక్షణ, నేరగాళ్ల విచారణ, అనుమానితుల గుర్తింపు తదితర అంశాల్లో వీసీ విధానం కీలకపాత్ర పోషిస్తుంది' అని అన్నారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ... కమిషనరేట్లోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతో పాటు డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారుల సహా మొత్తం 150 మంది వీసీని వినియోగించుకునే అవకాశం ఇచ్చాం. ఈ విధానంతో నేరుగా కొత్వాలే క్షేత్రస్థాయిలో హోంగార్డుతోనూ సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని అన్నారు. -
11 మంది డీఎస్పీలకు బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ అనురాగ్శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో దాదాపు ఎనిమిది మంది వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఎస్.మల్లారెడ్డిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డీఎస్పీగా, పి.సంజీవ్కుమార్ను నిజామాబాద్ డీటీసీగా, ఎంఏ రెహమాన్ను ఆదిలాబాద్ ఎస్బీ డీఎస్పీగా నియమించారు. మిగతా డీఎస్పీలందరికీ కూడా హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. -
ముగిసిన ఖురేషీ అంత్యక్రియలు
హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమాం మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ అంత్యక్రియలు బుధవారం మిశ్రీగంజ్లో ముగిశాయి. పాతబస్తీ పంచమొహల్లాకు చెందిన ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం మక్కా మసీదుకు తరలించి నమాజ్-ఏ-జనాజా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు అత్యధిక సంఖ్యలో మక్కా మసీదుకు చేరుకొని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మిశ్రీగంజ్ వరకు కొనసాగిన అంతిమ యాత్ర అనంతరం అబ్దుల్లా షా సాబ్ దర్గా వద్ద అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్శర్మతో పాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు పలువురు మత పెద్దలు, అధికార అనధికార ప్రముఖులు మక్మా మసీదుకు చేరుకొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. బుధవారం మక్కా మసీదులో మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ భౌతిక కాయాన్ని చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు -
నక్సలిజంతో అంతర్గత భద్రతకు ముప్పు
డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: దేశంలో వామపక్ష తీవ్రవాదం కారణంగా అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతోందని డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి స్థానిక పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలు కూడా నిత్యం సంఘర్షణ చేస్తున్నాయన్నారు. దేశంలో నక్సలైట్ల తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం కోసం సోమవారం పోలీస్ అకాడమీలో నక్సల్, తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల పోలీసులకు ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను అనురాగ్శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐబీ, గ్రేహౌండ్స్, పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్ల నక్సల్స్ను ఎదుర్కోగలిగామన్నారు. శిక్షణ తరగతుల్లో కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడులకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు. -
మెదక్ జిల్లా ఎస్పీతో మాట్లాడతా: డీజీపీ
జర్నలిస్టులపై నమోదైన కేసులపై డీజీపీకి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసుల విషయమై జిల్లా ఎస్పీ సుమతిని పిలిచి మాట్లాడుతానని డీజీపీ అనురాగ్శర్మ చెప్పారు. జర్నలిస్టులపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం డీజీపీ అనురాగ్శర్మ దృష్టికి తీసుకెళ్లింది. ‘సాక్షి’ దినపత్రిక సిద్ధిపేట జోన్ ఇన్చార్జి ప్రభాకర్తో పాటు జిల్లాలో ఏడాది కాలంలో 17 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని బృందం సభ్యులు చెప్పారు. మంగళవారం ఈమేరకు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ఎస్పీ సుమతి జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించారు. డీజీపీ అనురాగ్శర్మ స్పందిస్తూ.. మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసులన్నింటినీ విచారిస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. డీజీపీని కలసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు ఎంవీ రమణ తదితరులున్నారు. -
చైనా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా దేశవాళీ టపాసులను మాత్రమే విక్రయించాలని వ్యాపారులకు డీజీపీ అనురాగ్శర్మ స్పష్టం చేశారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాటిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఒక ప్రకటన హెచ్చరించారు. డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సమాచారం మేరకు రాష్ట్రంలోకి అక్రమ మార్గంలో విదేశీ టపాసులు, ముఖ్యంగా చైనాకు చెందినవి వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. విదేశాల నుంచి టపాసులు దిగుమతి చేసుకోవాలంటే విదేశీ వర్తక సమాఖ్య నుంచి అనుమతి తీసుకోవాలని, అయితే అలాంటి అనుమతులు తీసుకున్న దాఖలాలు ఏ ఒక్కటీ లేవన్నారు. చైనా టపాసులను వ్యాపారులు అమ్మితే తాత్కాలిక లెసైన్సు రద్దు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అన్ని జిల్లాల్లోని టపాసుల దుకాణాలను తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఖైదీల మసాజ్ సెంటర్ ప్రారంభం
జైళ్లశాఖ సంస్కరణలను అభినందించిన డీజీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్గూడ జైలు వద్ద ప్రకృతి చికిత్సాలయ తరహాలో ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్ను డీజీపీ అనురాగ్శర్మ ప్రారంభించారు. ఖైదీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి, వారిచేత కేరళ మాదిరిగా ప్రకృతి చికిత్సలందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఖైదీల ములాఖత్ కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటం కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్లాంజ్ను కూడా డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ములాఖత్ విషయంలో జైళ్లశాఖ అవలంభిస్తున్న నూతన పద్ధతిని పరిశీలించారు. ములాఖత్కు వచ్చే వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రతీ ఒక్కరి పూర్తి వివరాల సేకరణ, ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా ఫోటో తీసే విధానం పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. జైళ్లశాఖ ఖైదీలకు కల్పిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. చంచల్గూడ వద్ద నిర్వహిస్తున్న పెట్రోల్బంక్ను పరిశీలించారు. జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ నూతన సంస్కరణల ద్వారా సమకూర్చుకుంటున్న వైనం, సిబ్బంది పనితీరును అనురాగ్శర్మ ప్రత్యేకంగా అభినందించారు. -
అనురాగ్ శర్మకు మాతృవియోగం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాతృవియోగం కలిగింది. అనురాగ్ శర్మ తల్లి సుశీల (82) బుధవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం డీజీపీ నివాసానికి వెళ్లి అనురాగ్ శర్మను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు నేతలు డీజీపీని పరామర్శించినవారిలో ఉన్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18 వేల మంది పోలీసులు అవసరమవుతారని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో జరిగే పుష్కరాలకు స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలు, కర్ణాటక నుంచి పోలీసులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎస్పీలు, సంబంధిత డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు జిల్లాల్లో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా, లక్షల సంఖ్యలో భక్తులు వ చ్చే అవకాశముందని ఆయన చెప్పారు. స్థానిక భాషల్లో భక్తులకు సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖమ్మం జిల్లాలో కోయ ప్రజలు వాడే భాషలో సూచనలు అందించాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్ భగవత్, శాంతి భద్రతల అదనపు డీజీపీ సుదీప్ లక్తకియా , కమ్యూనికేషన్స్ అదనపు డీజీపీ రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల బందోబస్తుకు 18 వేల మంది పోలీసులు
-పుష్కర స్నానాలకు తరలిరానున్న లక్షలాది మంది భక్తులు -స్థానిక భాషల్లోనే భక్తులకు సూచనలు ఇవ్వాలన్న డీజీపీ -బందోబస్తుపై ఐదు జిల్లాల ఎస్పీలు, డీఐజీలతో డీజీపీ అనురాగ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14వ తేదీ నుంచి జరుగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18వేల మంది పోలీసులు అవసరమవుతారని గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో జరిగే పుష్కరాలకు స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలు, కర్నాటక నుంచి పోలీసులను రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు. డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎస్పీలు, సంబంధిత డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు జిల్లాల పరిధిలో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా, లక్షల సంఖ్యలో భక్తులు వ చ్చే అవకాశాలున్నాయని తెలిపారు. భద్రాచలం, ధర్మపురి, కాలేశ్వరం, బాసరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయని అన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని , పబ్లిక్ అడ్రస్ సిస్టంను అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేసి భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. స్థానిక భాషల్లో భక్తులకు సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కోయ ప్రజలు వాడే భాషలో సూచనలు అందించాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటలిజెన్స్ ఐజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ గత పుష్కరాల సమయంలో అదిలాబాద్ ఎస్పీగా తాను భగవంతుని సేవలో భక్తులు... భక్తుల సేవలో పోలీసులు’ అనే శీర్షికతో బ్యానర్లు ఏర్పాటు చే సిన విషయాన్ని గుర్తు చేశారు. భక్తులకు సేవలు అందించే మంచి అవకాశం పోలీసులకు ఇదని పేర్కొన్నారు. శాంతి భద్రతల అదనపు డీజీపీ సుదీప్ లక్తకియ మాట్లాడుతూ భద్రతా పరంగాపోలీసు శాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. వీరికి వసతి, భోజనం ఏర్పాట్లు సరిగా చూడాలని ఎస్పీలను ఆదేశించారు. స్ట్రాంగ్ బ్యారికేటింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూడాలన్నారు. వీఐపీ భద్రతా కూడా ముఖ్యమేనని, క్రైం పార్టీ, ఆర్ముడ్ పికెట్స్, కంట్రోల్ రూమ్స్, వాచ్ టవర్స్ ఏర్పాటు చేసుకోవాలని లక్తకియా సూచించారు. కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి కావలసిన హ్యాండ్ సెట్స్, రిపీటర్స్తో పాటు కమ్యూనికేషన్స్కు సంబంధించిన అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని పుష్కరాల కోసం వినియోగించుకొని అనంతరం తమ కార్యాలయంలో అందజేయాలని అన్నారు. వీడియో కన్ఫెరెన్స్లో ఐజీ నవీన్ చంద్, సంజయ్ కుమార్ జైన్, డీఐజీ గంగాధర్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్తో డీజీపీ, ఏసీబీ డీజీ సమావేశం
-
కేసీఆర్తో డీజీపీ, ఏసీబీ డీజీ సమావేశం
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు వ్యవహారం గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు తాజా పరిణామాలపై వీరు...కేసీఆర్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. అలాగే ఈ కేసులో పురోగతితో పాటు, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి అధికారులు వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సెక్షన్-8, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. -
అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు: డీజీపీ
నల్లగొండ: నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ ఘటనాస్థలిని డీజీపీ అనురాగ్శర్మ గురువారం పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే బస్టాండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. బస్సులో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానితులుగా కనిపించటంతో వారిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయన్నారు. దుండగులు వాడిని తూటాలను బట్టి, ఏపీ, బీహార్కు చెందిన ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నామన్నారు. 7.65 బుల్లెట్లను ఉత్తర భారతంలో కొన్ని ముఠాలు నాటు తుపాకుల్లో వాడుతుంటాయని అనురాగ్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఈ కాల్పుల వెనుక మావోయిస్టుల హస్తం ఉందనుకోవటం లేదని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ మొగులయ్య కోలుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా...పోలీసులపై కాల్పులు జరిపిన పారిపోతూ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వెళుతున్న జెడ్పీటీసీ దొరబాబు వాహనంపై కూడా కాల్పులకు పాల్పడినట్లు డీజీపీ తెలిపారు. ఆయన భుజంలోకి తూటా దూసుకు వెళ్లిందని ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. -
'అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు'
-
పరుగు ఇక 3 కిలోమీటర్లే!
పోలీసు నియామకాల్లో సంస్కరణల దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో భారీ సంస్కరణలు రాబోతున్నాయి. దేహదారుఢ్య పరీక్షల సరళీకృతం.. సివిల్స్, పబ్లిక్ సర్వీసు కమిషన్ తరహాలో ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు.. అభ్యర్థుల మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో పరిశీలన... రాష్ట్ర పోలీసుల నియామకాల్లో రాబోతున్న భారీ మార్పులివి. పోలీసు నియామకాల్లో సంస్కరణలపై డీజీపీ అనురాగ్ శర్మ పంపిన ఈ ప్రతిపాదనలను... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. ⇒ ఇటీవలి కాలంతో వివాదాస్పదమైన ‘ఐదు కిలోమీటర్ల పరుగు (5 కేఎం రన్)’ను ఉపసంహరించుకోనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో ఐదు కిలోమీటర్ల పరుగును నిర్వహించేవారు. పోస్టులు తక్కువగా ఉండడం, వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడడంతో అభ్యర్థుల వడపోత కోసం గత ప్రభుత్వాలు ఈ కఠిన పరీక్ష పెట్టేవి. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఈ పరుగు పరీక్షలో పాల్గొని కొందరు అక్కడికక్కడే ప్రాణాలు విడవడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగింది. దీంతో 5 కిమీ పరుగును మూడు కిలోమీటర్లకు కుదించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ⇒ అభ్యర్థుల వడపోత కోసం ఇక నుంచి ముందుగానే సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. తొలుత అభ్యర్థులకు బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగ్గిన అభ్యర్థులకు మళ్లీ వ్యాస రూప(సబ్జెక్టివ్) పరీక్ష (మెయిన్స్) నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యను బట్టిన మెయిన్స్లో నెగ్గిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేహదారుఢ్య పరీక్షల్లో పరుగు తగ్గింపు మినహా ఇతర ఏ మార్పులూ ఉండవు. ⇒ పోలీసు ఉద్యోగం మానసిక ఒత్తిడితో కూడినది. సెలవులు, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మానసిక స్థితి బలంగా లేనివారు తీవ్ర ఒత్తిడికిలోనై సంయమనాన్ని కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంటుంది. ప్రధానంగా టీఎస్ఎస్పీ, ఏఆర్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై కాల్పులు జరపడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగంలో చేరకముందే అభ్యర్థుల్లోని మానసిక బలం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై మానసిక నిపుణులతో పరీక్షలు జరిపించి పరిశీలించనున్నారు. దేహదారుఢ్య పరీక్షల తర్వాత అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు. -
‘తెలంగాణ’లో షూటింగులకు వెసులుబాటు
‘‘అవుడ్డోర్ షూటింగుల కోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకునే విషయంలో కొన్నేళ్లుగా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మకు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైతేనే పోలీసుల అనుమతిని తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలుగు సినీ నిర్మాతలందరికీ శుభవార్తే’’ అని తెలంగాణ ఫిల్మ్ అండ్ టి.వి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణగౌడ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘సాధారణంగా సినిమాల షూటింగులు ఎఫ్డీసీ అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతుంటాయి. ఆ అనుమతినే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వర్తింపజేయాలని కోరాం. దానికీ ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ అందరికీ ఆదేశాలు జారీ చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్కుమార్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎం.శ్రీనివాస్, రేష్మీ పాల్గొన్నారు. -
సమగ్ర సర్వేలో పాల్గొన్నడిజిపి అనురాగ్ శర్మ
-
పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు: డీజీపీ
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా జీపీఎస్ విధానంపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్లోని ఆస్కిలో శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతార్జతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసింగ్, జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినున్నట్టు చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్కు రక్షక్ వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేయడం వల్ల నేరం జరిగిన ప్రాంతానికి క్షణాల్లో చేరుకునేందుకు వీలుంటుందన్నారు. నగరంలో ఎక్కడ నేరం జరిగినా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరుతుందని, తద్వారా నేరస్థుడు ఎక్కడ ఉన్నా పట్టుకోవచ్చని తెలిపారు. జీపీఎస్ విధానాన్ని మొదట హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నగర కమిషనర్ మహేందర్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా పనిచేద్దాం
పోలీసు అధికారుల సంఘం నేతలతో డీజీపీ అనురాగ్శర్మ హైదరాబాద్: పోలీసు ప్రతిష్టను పెంచే విధం గా సమష్టిగా పని చేద్దామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలో వివిధ విభాగాల సంఘం నాయకులు డీజీపీని కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పోలీసుల సమస్యలు చాలా వరకు తనకు తెలుసునని, తన పరిధిలో ఉన్న వాటి ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పా రు. ప్రభుత్వ స్థాయిలో ఉన్న వాటిని ముఖ్యమంత్రి, హోంమంత్రిల దృష్టికి తీసుకెళుతాన ని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ జిల్లాల పోలీసు సంఘాల అధ్యక్షులు, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆర్మ్డ్ రిజర్వు విభాగాల సంఘం నేతలు ఉన్నారు. పలువురు అదనపు డీజీల బాధ్యతల స్వీకరణ మంగళవారం పలువురు అదనపు డీజీ స్థాయి అధికారులు బాధ్యతలను స్వీరించారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్యనారాయణ్, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఆక్టోపస్, పోలీసు స్పోర్ట్స్ విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది, ఎస్పీఎఫ్, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ తేజ్దీప్ కౌర్ మీనన్, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్కుమార్ సింగ్, అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్లు ఉన్నారు. వీరితోపాటు ఐజీ స్థాయి అధికారులు వి.నవీన్చంద్, స్వాతి లక్రా, చారుసిన్హా, సౌమ్యమిశ్రా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అమిత్ గార్గ్ తదితర అధికారులు కూడా బాధ్యతలను స్వీకరించిన వారిలో ఉన్నారు. -
తొలి సీఎంకు పూర్ణకుంభ స్వాగతం
సచివాలయంలో డీ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ నల్ల పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు సీ బ్లాక్ వద్ద ఉద్యోగులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత ముఖ్యమంత్రి చాంబర్లో బాధ్యతల స్వీకరణ తెలంగాణ ప్రభుత్వ రాజముద్రికపై తొలి సంతకం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి సచివాలయానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు అక్కడ పూర్ణకుంభ స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12.13 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయనకు వేదపండితులు మంత్రోచ్ఛారణలు, జయజయధ్వానాలతో అధికారులు, ఉద్యోగులు ‘డీ’ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ పరచి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ, తొలి డీజీపీ అనురాగ్శర్మ, ఇతర ఐఏఎస్ అధికారులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, అధ్యక్షురాలు మమత, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, ఎ.పద్మాచారి తదితర ఉద్యోగులు కేసీఆర్కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. మింట్కాంపౌండ్వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధానద్వారం ద్వారా ఆయన లోపలికి ప్రవేశించారు. పరేడ్గ్రౌండ్స్ నుంచి ప్రత్యేకంగా బుల్లెట్లపై ఎర్రదుస్తుల్లో ఉన్న కాన్వాయ్ కేసీఆర్ వాహనానికి ముందు రాగా.. ఆయన సచివాలయానికి వచ్చారు. ‘డీ’ బ్లాక్ నుంచి నల్లపోచమ్మ గుడివరకు నడుస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అమ్మవారిని పూజించారు. పూజ నిర్వహించిన అనంతరం ‘సీ’ బ్లాక్ ముందు ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు రెడ్కార్పెట్పైనే ముఖ్యమంత్రి నడుస్తూ వచ్చారు. అక్కడ తెలంగాణ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పలు ప్యాకేజీలు తమ మదిలో ఉన్నప్పటికీ, మనకు ప్రస్తుతం చట్టాలు, జీవోలు లేనందున వాటిని ప్రకటించడం లేదన్నారు. ఉద్యోగుల సర్వీ సు నిబంధనలు సరళీకృతం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నవ తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు మాట ఇచ్చినట్టు గంటపాటు అధికంగా పనిచేస్తే మరింత సంతోషిస్తానని ఆయన పేర్కొన్నారు. రాజముద్రకు ఆమోదం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ రాష్ట్రప్రభుత్వ రాజముద్రను ఆమోదిస్తూ కేసీఆర్ తొలిసంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అందించిన ఫైలుపై పురోహితులు సూచించిన ముహూర్త సమయంలో మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ఈ సంతకం చేశారు. ఆ తరువాత కేబినెట్ సహచరులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.