వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి | E - way bills are mandatory For the business transaction | Sakshi
Sakshi News home page

వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి

Published Sat, May 7 2016 5:42 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి

వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో జరిగే వ్యాపారానికి సంబంధించి ఈ-వేబిల్లులను వాణిజ్యపన్నుల శాఖ తప్పనిసరి చేసింది. దొంగ వేబిల్లులతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా యథేచ్చగా సాగుతుండడంతో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనను అమలులోకి తెచ్చినప్పటికీ, వ్యాపార వర్గాలు ఆచరణలో పెట్టడం లేదు.

ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు కమిషనర్ క చ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ-వేబిల్లును రెండు గంటల్లో రద్దు చేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆన్‌లైన్ లాగిన్ అయ్యేటపుడు డీలర్లందరూ వారి వ్యాపారాలకు సంబంధించి పాన్‌కార్డు వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement