కంచన్బాగ్ భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో మరోసారి పేలుడు సంభవించింది. శనివారం జరిగిన ఈ పేలుడు ...
హైదరాబాద్ : కంచన్బాగ్ భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో మరోసారి పేలుడు సంభవించింది. శనివారం జరిగిన ఈ పేలుడు ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.