విమానాల ఆలస్యం ప్రయాణికులకు చిరాకును తెప్పించింది.
శంషాబాద్: విమానాల ఆలస్యం ప్రయాణికులకు చిరాకును తెప్పించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కోల్కతాకు మంగళవారం ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రెండు ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు విమానాలు 11.30 గంటల తర్వాత బయలుదేరతాయని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు.