నల్లగొండ: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను అంతం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగాన్ని తలపెట్టిన ట్లుగా అనిపిస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే దురాలోచన ఏ పార్టీకి కూడా న్యాయం చేయదనే విషయాన్ని సీఎం గుర్తెరగాలని చెప్పారు. వలస రాజకీయాలను ప్రోత్సహించకుండా మంత్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.