హైదరాబాద్ : జీవో నెంబర్ 123, 124లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 123, 124 లను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు.
గాంధీభవన్లో పండుగ చేసుకున్నారు..
Published Wed, Aug 3 2016 7:56 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement