![జగదీశ్ మార్కెట్లో కార్డన్సెర్చ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41451497188_625x300.jpg.webp?itok=WgalPM62)
జగదీశ్ మార్కెట్లో కార్డన్సెర్చ్
హైదరాబాద్ సిటీ: అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని అణువణువు జల్లెడ పట్టారు. రూ.లక్ష నగదుతో పాటు 57 బైక్లను, సుమారు 200 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.