వరంగల్ చరిత్ర మార్చే మరో ఘట్టానికి తెరలేవనుంది.
రాష్ట్రం నుంచి బతుకుదెరువుకు వలస వెళ్లిన చేనేత కార్మికులు తిరిగొచ్చే అవకాశాన్ని ఈ మెగా టెక్స్టైల్ పార్కు కల్పించనుంది. 2014లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఈ పార్కుకు శంకుస్థాపన ద్వారా నెరవేరబోతోంది. పార్కులో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు తగిన వసతు లు కల్పించి, పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం ఇప్పటికే 1,190 ఎకరాల భూమి సేకరించారు. ఇందుకు ముందుకు వచ్చిన రైతులు, చొరవ తీసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కడియం ధన్యవాదాలు తెలిపారు.