
ఎస్సారెస్పీకి భారీగా వరద ప్రవాహం
ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది.
సింగూరులోకి 3,135 క్యూసెక్కులు, నిజాంసాగర్లోకి 1,765, ఎల్లంపల్లికి 12,724, కడెంలోకి 3,130 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. ఇక కృష్ణాబేసిన్లో ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టికి 27వేలకు పైగా క్యూసెక్కులు, నారాయణపూర్కు 18,171 క్యూసెక్కులు వస్తుండగా, శ్రీశైలానికి 4,687, సాగర్కు 907, జూరాలకు 9,766 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి.