కూలి కోసం వెళ్లి.. | missing case rigistered in sydabad police station | Sakshi
Sakshi News home page

కూలి కోసం వెళ్లి..

Published Thu, Jan 12 2017 7:37 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

missing case rigistered in sydabad police station

సైదాబాద్‌(హైదరాబాద్‌ సిటీ): కూలి పని కోసం వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ నీలం రాజశేఖర్‌రెడ్డినగర్‌కు చెందిన ఎన్‌. రేణుక(41) ఈ నెల 7న కూలీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త హరినాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement