నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం | Motkupalli Narasimhulu about tdp leaders arrests | Sakshi
Sakshi News home page

నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం

Published Mon, Oct 10 2016 2:59 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం - Sakshi

నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం

టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన సందర్భంగా ఇళ్లలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అత్యంత అప్రజాస్వామికమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అరెస్టయిన వారిలో ఉగ్రవాదులు, టైస్టులు లేరని.. సీఎం పర్యటన సాకుతో తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

సీఎం పర్యటన పేరుతో పోలీసులు ఆలేరు పట్టణంలో షాపులు బంద్ చేయించడం, కనబడిన వారిపై చేయి చేసుకోవడం చూస్తుంటే టీఆర్‌ఎస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఖండిస్తున్నామని, పండగ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కడమే పరిపాలన అని కేసీఆర్ అండ్ కో భావిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement