కిషన్రెడ్డిని తొలగించండి: బీజేపీ ఎమ్మెల్యే Raja singh takes on G kishan reddy | Sakshi
Sakshi News home page

కిషన్రెడ్డిని తొలగించండి: బీజేపీ ఎమ్మెల్యే

Published Tue, Dec 1 2015 1:55 PM | Last Updated on Sat, Aug 11 2018 7:03 PM

కిషన్రెడ్డిని తొలగించండి: బీజేపీ ఎమ్మెల్యే - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాసినట్లు రాజాసింగ్ మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే అధ్యక్ష పదవిలో మరొకర్ని నియమించాలని ఆ లేఖలో అమిత్ షాను కోరినట్లు రాజాసింగ్ వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement