G Kishan Reddy
-
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్షోర్ మినరల్ బ్లాక్లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్షోర్ ప్రాంతాలలో మైనింగ్ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్గా ఎదగడమే లక్ష్యం ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం
గుంటూరు, సాక్షి: రాష్ట్రానికి కొత్త రైళ్లు వచ్చేశాయి. మూడు రైళ్లను శుక్రవారం గుంటూరు స్టేషన్ నుంచి ప్రారంభించనుంది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా ఇవి పట్టాలపై ఎక్కనున్నాయి. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
నిరుద్యోగులకు వెన్నుపోటు
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. ఇదే ధర్నా చౌక్లో ఏళ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే వారికి ఎదురుచూపులే మిగిలాయి. సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగభృతి ఏమైందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వస్తుందేమోనని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే కేసీఆర్ వారికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసుల పేరిట నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. కొన్ని పరీక్షలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదో కేసీఆర్ చెప్పాలన్నారు. 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే వారిని గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని, వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను కిషన్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీ ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తూ బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యువకులు నేడు కళ్లు తెరిచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేస్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది. కాబట్టి ఈ రెండు పార్టీలను యువత క్షమించదు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులు, యువత బీజేపీకి మద్దతు తెలిపాలి..’ అని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమిలి అంటే జంకెందుకు?: బండి జమిలి ఎన్నికలంటే కేసీఆర్ కుటుంబానికి అంత జంకెందుకని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, సుమన్, పోలీస్ కిష్టయ్యవంటి యువకుల బలిదానాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో కేసీఆర్ సర్కార్ను గద్దె దించేదాకా పోరాడుదామని యువతకు సంజయ్ పిలుపునిచ్చారు. నవంబర్తో తెలంగాణకు పట్టిన మకిలి వీడుతుంది: తరుణ్ఛుగ్ ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతను సెంటిమెంట్తో రెచ్చగొట్టి 1200 మంది యువత ప్రాణాలు కల్వకుంట్ల కుటుంబం బలిగొన్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆంధ్రా పాలకులే ఉద్యోగాలు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ నవంబర్తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్..నువ్వు ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? దళిత బంధు ఏది? ఎందరికి ఇచ్చావు?’ అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు మురళీధర్రావు, జి.విజయరామారావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రారెడ్డి, డి.ప్రదీప్కుమార్, డా.జి.మనోహర్రెడ్డి, శాంతికుమార్, గీతామూర్తి, గూడూరు నారాయణరెడ్డి, నాగూరావు నామాజీ, బండ కార్తీకరెడ్డి, డా.గౌతంరావు, శ్యాంసుందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీకి దిశానిర్దేశం రైతులకు భరోసా..
సాక్షి హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్షా బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అధ్యక్షతన ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న ‘రైతు గోస–బీజేపీ భరోసా’ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆదివారం మధ్యా హ్నం 3 గంటల తర్వాత ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు అమిత్షా చేరుకుంటారు. ఈ సభలో రైతుల సమస్యలను ప్రస్తావించడంతోపాటు పరిష్కారానికి బీజేపీ ఏం చేయనుందనే అంశాన్ని వెల్లడిస్తారు. త్వరలో జరగ నున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు భారీగా జనసమీకరణతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ కేడర్ పాల్గొనేలా చేయడం ద్వారా సభ సక్సెస్ చేసి సత్తా చాటాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా రైతులను అధిక సంఖ్యలో సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు యాత్రలపై రాష్ట్రనేతలతో సమావేశం అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనకు నిర్దేశించిన సమయం తక్కువగా ఉండడంతో భద్రాచలంలో శ్రీరాముల వారి దర్శనం, అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం రద్దయినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. సభ అనంతరం ఖమ్మంలోనే బీజేపీ రాష్ట్రస్థాయి కోర్ కమిటీ మీటింగ్లో అమిత్ షా మాట్లాడనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. బాసరలోని సరస్వతి అమ్మవారి దేవాలయం, జోగుళాంబ అమ్మ వారి గుడి, భద్రాచలం శ్రీరాముల దేవాలయం నుంచి.. వచ్చేనెల 7 తర్వాత ముఖ్యనేతలు 3 బస్సుయాత్రలు చేపట్టి సెప్టెంబర్ 17న ముగించి భారీ సభ నిర్వహించే అంశంపై అమిత్షాతో రాష్ట్రనేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా అమిత్షా సమక్షంలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతరనేతలు చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. బహిరంగ సభ విజయవంతం కోసం.. సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు సర్వశక్తులొడ్డాయి. కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న బీజేపీ అగ్ర నేత జిల్లాకు వస్తుండడం ఇదే ప్రథమం కావడంతో నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో ఖమ్మం కాషాయమయంగా కనిపిస్తోంది. సభా ప్రాంగణంలో అమిత్షా, ప్రధాని మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ శనివారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. సభకు ‘రైతు గోస..బీజేపీ భరోసా’ అని నామకరణం చేశారు. భారీ బందోబస్తు.. అమిత్షా సభ కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం అధికారులతో సమీక్షించారు. సీఆర్పీఎఫ్ అధికారులు బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు. రైతుల ఇబ్బందులు తొలిగేలా ఖమ్మం సభలో ప్రకటన : బీజేపీనేత ప్రేమేందర్రెడ్డి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు భరోసా కల్పించి, వారి ఇబ్బందులు తొలగించే విధంగా బీజేపీ నాయకత్వం ఖమ్మం సభలో రైతు భరోసా ప్రకటన చేయనున్నదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు అమిత్ షా షెడ్యూల్ ఇలా.... – ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.25 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.50 నిముషాలకు ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు –అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు –3.40 నిమిషాలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ బహిరంగసభ ప్రాంగణానికి వస్తారు –3.45 నిమిషాల నుంచి సాయంత్రం 4.35 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు –అక్కడి కాలేజీ ప్రాంగణంలోనే 4.40 నిముషాల నుంచి సాయంత్రం 5.30 దాకా పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు –సాయంత్రం 5.50 నిమిషాలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 6.20 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు –సాయంత్రం 6.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
కేసీఆర్ సర్కార్ది రియల్ ఎస్టేట్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని భూములతోపాటు రైతుల భూములకూ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలనను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. గ్రామాల్లో ధరణి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇవ్వకుంటే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములను అమ్ముతోందని. ఇదేమిటని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి, హైదరాబాద్ సమీపంలోని విలువైన భూములను కావాల్సిన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిర్మల్లో నిలదీస్తే దాడులా? నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరిట భూమాయ జరుగుతోందని.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. నిర్మల్లో సోఫీనగర్ ఇండ్రస్టియల్ జోన్ను రెసిడెన్షియల్గా మార్చేందుకు జీవో తెచ్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురి తల పగిలి గాయాలయ్యాయని చెప్పారు. నిర్మల్లో మహేశ్వర్రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నాయకురాలనే గౌరవం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే అణచివేస్తారా? ఆదిలాబాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిపైనా లాఠీచార్జి చేసి, బట్టలు చించారని కిషన్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి సూర్యాపేటకు వెళితే అక్కడి బీజేపీ నేతలను అరెస్టు చేశారన్నారు. సీఎం, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం ఏర్పడిందని.. వారి అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండేది నాలుగు నెలలేనని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పక్షపాతం మంచిది కాదని హితవు పలికారు. పోలీసులు మహిళలనూ కొట్టారు: ఈటల తెలంగాణలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని ఆరోపించారు. లంబాడీ మహిళల పట్ల కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్లో పనిచేసే బొమ్మ శరత్లను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయటి ప్రాంతాల్లో తిప్పుతూ విపరీతంగా కొట్టారని.. హుజూరాబాద్లో చెల్పూరు సర్పంచ్ మహేందర్ను అలాగే కొట్టి హింసించి, పైశాచికానందనం పొందారని ఆరోపించారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. -
వారిది ముక్కోణపు ప్రేమ కథ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలది ముక్కోణపు ప్రేమ కథ (ట్రయాంగిల్ లవ్స్టోరీ) అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, మూడూ కుటుంబ, అవినీతి పార్టీలేనని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పేరిట ఢిల్లీలో ఈ మూడు పార్టీలు ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘ఈ పార్టీలు గతంలో కలిశాయి.. ఇప్పుడూ కలిశాయి.. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాయి..’ అని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఒకే తాను ముక్కలే.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా మూడు పార్టీలకు వేసినట్లే. బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదు. భవిష్యత్తులోనూ కలవదు. ఈ మూడు పార్టీలపై పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం..’ అని కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో 4 వేల కిసాన్సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల రిటైల్ షాపులను గురువారం నుంచి ‘ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలు’గా మార్చుతున్నట్టు కిషన్రెడ్డి చెప్పారు. ఒకే దేశం.. ఒకే ఎరువు అనే నినాదంతో, భారత్బ్రాండ్పేరుతో గురువారం నుంచి ఎరువుల సరఫరా అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. తొలిదశలో 1.25 లక్షల షాప్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్ షాపులు కిసాన్సేవా కేంద్రాలుగా మారతాయని చెప్పారు. ఈ మేరకు శామీర్పేటలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. ప్రతి నెల రెండో ఆదివారం ‘కిసాన్ కీ బాత్’ రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకేచోట అందించేందుకు వీలుగా ఎరువుల రిటైల్షాపులను ప్రధానమంత్రి కిసాన్సేవా కేంద్రాలుగా కేంద్రం మార్చుతోందని కిషన్రెడ్డి తెలిపారు. ఎరువులు, భూసార, విత్తన పరీక్షల కోసం వేర్వేరు చోట్లకు రైతులు వెళ్లకుండా అన్ని రకాల సేవలు..ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో లభిస్తాయని వివరించారు. సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, కిసాన్సమ్మాన్యోజన వంటి కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. రైతు సమస్యలపై ‘కిసాన్కీ బాత్’ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతి నెల రెండో ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నేడు రైతుల ఖాతాల్లోకి ‘కిసాన్ సమ్మాన్’ నిధులు 14వ విడత పీఎం కిసాన్సమ్మాన్నిధులను గురువారం ఉదయం ప్రధాని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణలోని సుమారు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. -
ఆయనే ఇక తెలంగాణలో బీజేపీ గేమ్ఛేంజర్!
తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్రెడ్డి సీనియర్ లీడర్. ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. కానీ, ఎన్నికల దృష్ట్యా ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా బీజేపీ అధిష్టానం భావించింది. బీఆర్ఎస్ను, కేసీఆర్ అండ్ కోను దూకుడు స్వభావంతో ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న బండి సంజయ్ను తప్పించి.. సౌమ్యుడైన కిషన్రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ ఈజ్ ద రైట్ ఛాయిస్ అని కాషాయం పార్టీ ఒక అంచనాకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తే.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ ఓ గందరగోళంలోకి కూరుకుపోయిందనే భావన బీజేపీ హైకమాండ్లో నెలకొంది. అదే టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో అప్రమత్తమైంది. వీటికి తోడు బండి చుట్టూరా నెలకొన్న వివాదాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడం, కీలక నేతల నుంచి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ తరుణంలోనే బండిని సైడ్ చేస్తూనే.. నేతల మధ్య ఎలాంటి అంసతృప్తి లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వివాదరహితుడైన కిషన్రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ► ఆరంభం నుంచి బీజేపీతోనే కిషన్రెడ్డి ప్రయాణం కొనసాగుతోంది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తిస్తూ క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఈ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి కిషన్రెడ్డి. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘంగా పార్టీతో అనుబంధం తర్వాత ఈ హోదా దక్కింది. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నారాయన. ► వీటన్నింటికి తోడు.. ఆరేళ్లపాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగించినా అనుభవమూ ఉంది. ఆ సమయంలో ఆయన వివాదాల్లేకుండా పార్టీని ముందుకు నడిపించారు. అన్నింటికంటే ముఖ్యమైంది.. ప్రత్యర్థులపై సహేతుకమైన విమర్శలు గుప్పించడంలో కిషన్రెడ్డి దూకుడునే ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కేసీఆర్కు పదునైన చురకలనే అంటిస్తారాయన. అందుకే.. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్గా బీజేపీ భావిస్తోంది. ఆయన నాయకత్వంపైనే పూర్తి భరోసా పెట్టుకుంది కూడా. జోడు పదువులు? గతానికి భిన్నంగా ఒకరికి ఒకే పదవి అనే అంశంపై బీజేపీ అధినాయకత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి చోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్రమంత్రి పదవితో పాటు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అలా.. కిషన్రెడ్డికి కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది. మోదీతోనూ ప్రత్యేక అనుబంధం.. ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమైందన్న చర్చ గతంలో జోరుగా నడిచింది కూడా. కిషన్రెడ్డి కంప్లీట్ ప్రొఫైల్ జననం : జూన్ 15, 1964 తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్ రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్ 1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు 1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 2004: మొదటిసారిగా హిమాయత్నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2009, 2014: అంబర్పేట ఎమ్మెల్యే 2018: అంబర్పేట అసెంబ్లీ ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓటమి 2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం.. కేంద్ర మంత్రి పదవి 2023, జులై 5: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇదీ చదవండి: బండి సంజయ్ను ఎందుకు తప్పించారు? -
తెలంగాణకు కిషన్రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరి
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యూహంలో భాగంగా.. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణకు కొత్తగా జి. కిషన్రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది. అలాగే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని సైతం తీసుకుంది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్ పేరును ప్రకటించారు. కిందటి ఏడాది మేలో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ కొట్టారు. పంజాబ్లో జాతీయవాదం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకే తాను పార్టీ మారానంటూ ఆ టైంలో ప్రకటించుకున్నారాయన. ఇక.. జార్ఖండ్ బీజేపీ చీఫ్గా బాబూలాల్ మారాండి పేర్లను ప్రకటించారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారాయన. కిషన్ రెడ్డి గురించి.. జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం. (ఆనాటి అమెరికా పర్యటనలో కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ) కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక 2012 జనవరి 19న మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు హోంశాఖ సహాయ మంత్రిగా చేయడం వల్ల ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం పురంధేశ్వరి గురించి..రాజకీయ ప్రస్థానం దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్ 22, 1959లో జన్మించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. 14, 15వ లోక్సభకు రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె.. ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది. 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బీజేపీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. -
చేతగాక పారిపోయిన వ్యక్తా.. మా భవిష్యత్తు తేల్చేది!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలో తేల్చాల్సింది తెలంగాణ ప్రజలేగానీ.. అసమర్థుడైన రాహుల్గాంధీ కాదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందంటూ ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మిడిమిడి జ్ఞానంతో, ఏమాత్రం అవగాహన లేకుండా రాహుల్ చేసిన ఉపన్యాసం విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏ పార్టీ ఖతం అవుతుందనేది నాలుగు నెలల్లో రాహుల్కు అర్థం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని.. రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసు లాంటివని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక.. కాంగ్రెస్ పార్టీని నడపలేనంటూ, చేతగానితనంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన రాహుల్ గాందీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘2018లో తెలంగాణ ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. 12 మంది బీఆర్ఎస్లో చేరారు. కొందరు అమ్ముడుపోతే, మరికొందరు పదవుల కోసం పార్టీ ఫిరాయించారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ కట్టగట్టుకొని బీఆర్ఎస్లో విలీనం చేసిన చరిత్ర రాహుల్గాందీకి గుర్తుకులేదా?’’అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు ‘బీ టీం’ అనేది ప్రజలకు తెలుసు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకుని, పక్కా ప్రణాళికతో బీజేపీపై కుట్రకు పాల్పడుతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి పనిచేశాయని.. ఎవరికి ఎవరు బీ టీం అనేది ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని.. రాహుల్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే రాజకీయాల్లోకి వచ్చారు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటుందని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నామని కిషన్రెడ్డి తెలిపారు. ఈ నెల 8న వరంగల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం కలసి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు నడుస్తామని కిషన్రెడ్డి వెల్లడించారు. గతాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై విమర్శలు గత నెలలో పట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్తో కలసి పాల్గొన్న అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను కలవడం వెనక వాళ్ల బంధమేంటో అర్థమవుతోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్లోనే నాయకుడిగా ఎదిగారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్తో కలసి పనిచేసిన విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే.. బీజేపీపై రాహుల్గాంధీ అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరమని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో కలసి బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదని, భవిష్యత్లోనూ కలసి పనిచేయబోమని చెప్పారు. తెలంగాణలో మజ్లిస్ ను పెంచిపోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అయితే.. దానితో కలసి ఊరేగుతున్న చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. -
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర సర్కారు తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ నిధులు ప్రాజెక్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్కు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్, జాతీయ నాయకులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు. కాజీపేట అయోధ్యపురంలో పీఓహెచ్, వ్యాగన్ల తయారీ కేంద్ర నిర్మాణ ప్రాంతం, బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో మోదీ విజయసంకల్ప సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తదితరులతో కలిసి కిషన్రెడ్డి మాట్లాడారు. ‘బయ్యారం’ఏమైందో కేసీఆర్ చెప్పాలి.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివిధ కారణాలతో సాధ్యం కాలేదని, దీంతో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్తో పాటు అదనంగా వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్రెడ్డి చెప్పారు. ఈ నెల 8వ తేదీలోగా దీనికి భూమి కేటాయింపు కూడా పూర్తవుతుందన్నారు. కాగా సుమారు రూ.5,587 కోట్ల వ్యయంతో వరంగల్ను కలిపే, పలు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీదేనని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.26 వేల కోట్ల మేరకు ఖర్చవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని, సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, భూసేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు. అధ్యక్షుడి మార్పుపై ఎవరైనా చెప్పారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్రెడ్డి నేరుగా స్పందించకుండా జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా మీకు చెప్పారా.. అందరం వేదికపై కలిసే ఉన్నాముగా.. ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది.. అలాంటిదేమీ లేదు’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కిరాణ దుకాణం లాంటిది.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంటేనే ద్రోహం, కుట్రలకు ప్రతిరూపమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందో అన్న భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అల్లూరి’ చరిత్రను భావితరాలకు చెప్పాలి
మాదాపూర్: అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆయన చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలని కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా సన్నాహక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, క్షత్రియ సేవా సమితితో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నుంచి అల్లూరిసీతారామరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సమితి సభ్యులను అభినందించారు. ఢిల్లీలోనూ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుందన్నారు. నటుడు కృష్ణ అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయకపోతే తనలాంటి వారికి ఆయన గొప్పతనం తెలిసేది కాదన్నారు. తన జీవితంలో ఎక్కువ సార్లు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినట్లు తెలిపారు. ఆ పేరులోనే త్యాగం, స్ఫూర్తి, సాహసం ఉన్నాయన్నారు. భావితరాలకు కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. గిరిజనులను సంఘటితం చేసిన అల్లూరికి దక్కుతుందని, ఆయన పోరాట వీరుడే కాక ఆధ్యాత్మిక వేత్తగా పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో అనేక మార్పులను తీసుకువచ్చారన్నారు. మంచి, చెడు వివరించి వారిని సంఘటితం చేశారన్నారు. పోరాటాల్లోనూ నైతిక విలువలు పాటించారని, చెప్పి మరీ దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లే వారన్నారు. అల్లూరి సీతారామరాజు పై కార్టూన్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి దేశప్రధాని మోదీ, ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ము హాజరుకానుండటం సంతోషకరమన్నారు. ఏ గిరిజనుల కోసం ఆయన పోరాటం చేశాడో అదే గిరిజన మహిళ నేడు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని, ఆయన జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ రావడం గర్వకారణమన్నారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సినీనటుడు మురళీమోహన్లతో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి వివక్ష లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపడం లేదని.. వివిధ రూపాల్లో రాష్ట్రానికి గణనీయంగా నిధులు అందాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మోదీ అన్ని రాష్ట్రాలకూ ప్రధానమంత్రి అని, ఏ రాష్ట్రానికీ తక్కువ నిధులు ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రంగాలు, పథకాలు, కేటాయింపులను పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే అధిక కేటాయింపులు దక్కాయన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో గుజరాత్ కన్నా తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహకారాన్ని అందిస్తోందన్నారు. శనివారం హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో.. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు వివిధ శాఖలు, రంగాలవారీగా వివిధ రూపాల్లో అందజేసిన నిధులు, రుణాలు, వివిధ సంస్థలకు చేసిన కేటాయింపుల వివరాలను కిషన్రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట వీడియోతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకం కాదు తనది రాజకీయ పార్టీ కార్యక్రమమో, ఒక ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజెంటేషనో కాదని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యమని కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను అధికారిక డాక్యుమెంట్ల ద్వారా రాష్ట్ర ప్రజల పరిశీలనకోసం అందుబాటులో ఉంచుతున్నట్టు వివరించారు. కేంద్రం ఇంత చేస్తున్నా ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రంలో కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అండగా నిలుస్తామన్నారు. కిషన్రెడ్డి ప్రజెంటేషన్లో పేర్కొన్న గణాంకాలివీ.. ► కేంద్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో ఇచ్చిన నిధులు రూ.1.78 లక్షల కోట్లు ► కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో చేసిన ఖర్చు రూ.4.99 లక్షల కోట్లు ► వేస్ అండ్ మీన్స్ అలవెన్సులు, ఓడీలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అనేక సార్లు ఆర్బీఐ అందించిన సహకారం రూ.2.31 లక్షల కోట్లు ► తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్రం చేసిన ఖర్చు (ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతుధర వంటివి) రూ.1.58 లక్షల కోట్లు ► 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి పరిహారంగా అందినది రూ.8,379 కోట్లు. 2020–22 మధ్య (కరోనా కాలంలో) ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణం (దీనిని కేంద్రమే భరిస్తుంది) కూడా కలిపితే రూ.15,329 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా 2014 నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో కేటాయించిన/విడుదలైన నిధులు సుమారు రూ.5లక్షల కోట్లు. ► 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు.. కేంద్రం, దాని ఆధ్వర్యంలోని సంస్థలు, పీఎస్యూల ద్వారా అందిన రుణాల మొత్తం (బడ్జెటేతర రుణాలతో సహా) దాదాపు రూ 7.5 లక్షల కోట్లు. ► రాష్ట్ర ప్రజలకు, వివిధ వర్గాలకు కేంద్రం ద్వారా అందించిన రుణాలు దాదాపు రూ.9.26 లక్షల కోట్లు సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ.నాగేశ్వర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వివిధ రంగాల వారీగా కేటాయింపులు/నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు.. – తెలంగాణలో 1947– 2014 మధ్య నిర్మించిన జాతీయ రహదారులకు సమానంగా గత తొమ్మిదేళ్లలోనే మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మించింది. – రోడ్ల కోసం చేసిన ఖర్చు రూ.1.08 లక్షల కోట్లు (2014–2022 మధ్య నిర్మించిన రోడ్ల పొడవు 2,500 కి.మీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు 2,269 కి.మీ). – హైదరాబాద్ రీజనల్ రింగ్రోడ్డు (348 కి.మీ) అంచనా వ్యయం రూ.21,201 కోట్లు – రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు రూ.32,823 కోట్లు – విద్యుత్, నీటిపారుదల కోసం రూ.23,937 కోట్లు – గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూ.34,090 కోట్లు – ఐటీ, డిజిటలీకరణకు రూ.7,479 కోట్లు రంగాలు, సంక్షేమ పథకాలకు.. – వ్యవసాయం, అనుబంధరంగాలు, పశు సంవర్థక, మత్స్యపరిశ్రమకు రూ.40,559 కోట్లు – రసాయనాలు, ఎరువులకు రూ.39,649 కోట్లు – ఆరోగ్యం, పారిశుధ్యం కోసం రూ.14,572 కోట్లు – జీవనోపాధి, కరోనా సమయంలో మద్దతు కింద రూ.38,256 కోట్లు – అడవులు, పర్యావరణం కోసం రూ.3,205 కోట్లు మానవాభివృద్ధి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వం కోసం – విద్య, క్రీడలకు రూ.18,657 కోట్లు – మహిళాశిశు సంక్షేమానికి రూ.8,031 కోట్లు – ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.2,802 కోట్లు – మైనారిటీలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,568 కోట్లు కేంద్ర శాఖల ఆధ్వర్యంలో ఖర్చు – రక్షణశాఖ నుంచి రూ.1.15 లక్షల కోట్లు, హోంశాఖ రూ.6,218 కోట్లు తెలంగాణలో వ్యయం – కేంద్రం తెలంగాణలో ఉన్న రక్షణ రంగ సంస్థలకు రూ.78 వేల కోట్లు ఇచ్చింది. 5 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ అప్పుల గణాంకాలివీ.. – రాష్ట్రం మొత్తంగా తీసుకున్న అప్పులు: రూ. 7,49,982 కోట్లు – పీఎఫ్సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో టాప్ తెలంగాణ – నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5వ స్థానం.. తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – ఆర్ఈసీ ద్వారా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు 1.31 లక్షల కోట్లు -
కర్ణాటక ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్పందించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వల్లే ఓటమిపాలైందని భావిస్తున్నట్లు తెలిపారాయన. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ వ్యతిరేకతకు బహుశా అక్కడి ఎమ్మెల్యేల పని తీరు కూడా కొంత కారణం కావొచ్చు. నరేంద్ర మోదీపై అక్కడి ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ.. ఫలితాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి. కానీ, పార్లమెంట ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ ఇక్కడి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. ఇక్కడ ప్రతిపక్షంగా మేం ప్రభుత్వ నిరంకుశ పాలనను, పనితీరును ఎండగడుతున్నాం. కాబట్టి, తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం అని తెలిపారాయన. ఇదీ చదవండి: కాంగ్రెస్ విక్టరీ.. సంక్షేమ హామీలు పని చేశాయి -
కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొనటంపై కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్కు చెంపపెట్టు: కిషన్రెడ్డి -
సహనానికి హద్దుంటుంది.. టీఆర్ఎస్కు కేంద్రమంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందని, కనీస నైతిక, మానవతా విలువలు, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట సమాధి కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. ఆయన మీద ఎందుకు ఈ అక్కసు’అని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగడం ద్వారా అన్ని పరిమితులు, లక్షణరేఖను టీఆర్ఎస్ దాటి దిగజారిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారని, తమ సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపెడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలతో తొండి చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. దత్తత అంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు.. ‘ఒక ముఖ్యమంత్రి ఉపఎన్నికలో ఒక గ్రామానికి ఇన్చార్జీగా ఉండటమనేది గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇస్తారు. ఆ తరువాత మర్చిపోతారు’అని కిషన్రెడ్డి విమర్శించారు. ‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ పెడతామని తాము ఎప్పుడు హామీ ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ కడతామని కేసీఆర్, కేటీఆర్లే హామీ ఇచ్చారని కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణలో కమిషన్లు లేకుండా కాంట్రాక్ట్లు లేవని, కల్వకుంట్ల కుటుంబం దోచుకోని రంగం లేదని, ఉద్యమకారులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు వదిలి పెట్టే సమయం వచ్చిందన్నారు. ‘మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు. కోర్ట్కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఇష్ట ప్రకారం గుర్తుల కేటాయింపు జరగదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది’అని కిషన్రెడ్డి అన్నారు. -
ఏడాది పాటు విమోచన దినోత్సవాలు
రసూల్పుర : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరైన సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులోభాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారం పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కిషన్రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహరాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే హాజరవుతారని చెప్పారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్లతో పాటు మొత్తం 12 సైనికదళాలు (రెండు మహిళా బృందాలతో సహా) ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో అమిత్షా పాల్గొని దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, చక్రాల కుర్చీలు, కృత్రిమ తయారీ పరికరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డా, ప్రకాశ్రెడ్డి, రాకేశ్, శ్రీవర్ధన్, రాముయాదవ్, చింతల రాం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు -
జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్పేట్: ప్రధాని మోదీ జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించే అవకాశా లున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్స వాలను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ బన్సీలాల్ పేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ ఇప్పటికే ఏపీలో ట్రైబల్ మ్యూజియం పనులు మొదలుకాగా, ఇక్కడ అలాంటి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీసం స్థలం కూడా కేటాయించ లేదన్నారు. సీఎం కేసీఆర్ ‘భారత్ రాష్ట్రీయ సమితి’ పెట్టబోతు న్నారన్న దానిపై స్పందించాలని విలేకరులు కోరగా.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు, దేశాన్ని పంచుకోవాలనుకుంటు న్నారని కిషన్రెడ్డి ఆరో పించారు. కేసీ ఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడంలో తప్పులేదన్నారు. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే వారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అలగే రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబపాలనను అంతమొందించడానికి, ఫామ్ హౌస్ పాలన పోవడానికి ప్రజలు బీజేపీకి అండగా ఉండాలని కోరారు. -
స్వల్పకాలంలో అనితరసాధ్య ప్రగతి..!
ప్రజాసేవలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే అనేక రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. మహమ్మారి సమయంలో టీకాల సరఫరాలో చూపిన చొరవ, సుపరిపాలన కోసం చేపట్టిన అనేక సంస్కరణలు, పేదలకు అన్ని విధాలుగా అండగా ఉండటం ఈ ఎనిమిదేళ్లలో ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి. అలాగే సహకార సమాఖ్య వ్యవస్థను పరిరక్షిస్తూ, రాష్ట్రాలకు అందవలసిన పన్నుల వాటాను కేంద్రం సక్రమంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచింది. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. 9 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు, 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరిగింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్పై వేస్తున్న పన్నును తగ్గించుకొని ప్రజలకు ఉపశమనం కలిగిం చాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మే 21న పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో పెట్రోల్పై లీటరుకు రూ. 9.5, డీజిల్పై లీటరుకు రూ. 7, వంటగ్యాస్పై రూ. 200 చొప్పున తగ్గింది. గత 2021 నవంబర్లో కూడా పెట్రోల్పై లీటర్కు రూ. 5, డీజిల్పై లీటర్కు రూ. 10 చొప్పున తగ్గించింది. గత ఆరు నెలల్లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. ఇలా రెండు సార్లు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం మీద రూ. 2.20 లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. 2014–22 వరకు 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అభివృద్ధి వ్యయం రూ. 90.9 లక్షల కోట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం 8 సంవత్సరాలలో ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలపై ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 24.85 లక్షల కోట్లు. మూలధన సృష్టి కోసం రూ. 26.3 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రజాసేవలో మోదీ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సేవ, సుపరిపాలన, గరీబ్ కల్యాణ్ అనే మూడు ప్రాథమిక సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. సేవ విష యానికి వస్తే, మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ టీకా పరిశో ధన నుండి దాని సరఫరా వరకు ముందుండి నడిపించిన విధానం గురించీ, ఆయన చూపిన చొరవ, అవిశ్రాంత కృషి గురించీ చెప్పు కోవాలి. రెండవది సుపరిపాలన కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు. మూడవదీ, అత్యంత ముఖ్యమైనదీ పేదలకు అండగా ఉండటమే. సహకార సమాఖ్య ద్వారా... మౌలిక వసతుల కల్పన, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేపట్టిన అనేక రకాల పథకాలు... అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు జరగాలని ప్రధాని భావించారు. అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని నిర్ధరించారు. అందరూ సమష్టిగా కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమని భావించారు. కో–ఆపరేటివ్ ఫెడరలిజం ఫ్రేమ్ వర్క్ను కొనసాగించడంలో భారత ప్రభుత్వం అన్ని అంశాలలో కృషి చేస్తుంది. ఇది స్థూల, సూక్ష్మ స్థాయులు రెండింటిలోనూ చూడవచ్చు. కేంద్ర పన్నుల వికేంద్రీకరణ రూపంలో గరిష్ఠ మొత్తంగా నిధులను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేసేలా నిరంతరంగా చర్యలు తీసు కుంటూనే ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 42%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 41% కేంద్రం పన్నులలో ఆయా రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నది. అంటే కేంద్రం వసూలు చేసిన 40% కంటే ఎక్కువ పన్నులు ముందుగా రాష్ట్రాలకు నేరుగా తిరిగి వెళ్తాయి. గతంలో 13వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు 32% వాటా ఉంటే, ప్రస్తుత 42% వాటా – అంటే 10% అదనంగా రాష్ట్రాలకు ప్రభుత్వం ఉదారంగా అందిస్తున్నది. నిధుల అధిక వికేంద్రీకరణ ఫలితంగా, భారత ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించిన 9 బడ్జెట్లలో భాగంగా రాష్ట్రాలకు సుమారు రూ. 57 లక్షల కోట్లు బదిలీ చేస్తోంది. సేవా, మౌలిక సదుపాయల కల్పన కోసం ‘మిషన్ – మోడ్’ ఫోకస్ ద్వారా కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన నిధులలో 42% నేరుగా రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న 58% నిధులను ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే ప్రశ్న చాలామంది పదే పదే లేవనెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాథమికంగా మౌలిక సదుపాయాలను అందించడంలో నిమగ్నమై ఉంది. ‘ప్రధానమంత్రి గతిశక్తి’లో భాగంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఉమ్మడి రవాణా, జల మార్గాలతో పాటు లాజిస్టిక్స్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏడు అభివృద్ధి రంగాల అభివృద్ధికి సమన్వయం కోసం పునాది వేసింది. కేవలం రోడ్లు, రైల్వేల అభివృద్ధి మాత్రమే కాకుండా వైద్య, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ లాంటి అనేక రంగాలలో సదుపాయాల కల్పనలో దేశం ‘ఆత్మ నిర్భర్’ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం జరుగుతోంది. పేద ప్రజల కనీస అవసరాలపై చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా ‘గరీబ్ కల్యాణ్’ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచారు. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. దేశ వ్యాప్తంగా 9 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లను అందించాం. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం అర్హులందరికీ 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేయడం జరిగింది. 3 వేలకు పైగా హాస్పిటల్స్ను ఈ పథకంలో చేర్చి ప్రజలకు వైద్యాన్ని సులభతరం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలలో, ప్రభుత్వ రంగంలోని 132 వైద్య కళాశాలలు, అలాగే ప్రైవేట్ రంగంలో 77 వైద్య కళాశాలలు ఆమోదం పొందాయి. మోదీ ప్రభుత్వం నిరుపేదల సాధికారత కోసం పనిచేస్తోంది. కోవిడ్ – 19, దాని తర్వాత వచ్చిన ఇబ్బందుల సమయాల్లో దేశంలో 80 కోట్ల మందికి రూ. 3 లక్షల 60 వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా అందచేయడం జరిగింది. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అన్ని విధాల కృషి చేస్తున్నారు. ధాన్య సేకరణ సీజన్లలో 1 కోటి 31 లక్షల మంది రైతుల నుండి దాదాపు 900 లక్షల మెట్రిక్ టన్నుల వరినీ, 50 లక్షల మంది రైతుల నుండి 430 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలనూ కొనుగోలు చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది. శాంతి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, రాజ కీయ ప్రమేయం ప్రముఖంగా అవసరమయ్యే దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు చాలావరకు పరిష్కారానికి నోచుకున్నాయి. జమ్మూ– కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఫలితంగా ‘ఒకే దేశం, ఒక రాజ్యాంగం’ చిరకాల ప్రతిష్ఠాత్మక లక్ష్యం నెరవేరింది. ఈశాన్య ప్రాంతం శాంతి యుత వాతావరణం చూడగలుగుతోంది. ఈశాన్య ప్రాంతంలో మిలి టెంట్ల కారణంగా ఏర్పడే ఉద్రిక్త సంఘటనలు 74% తగ్గాయి, పౌరుల మరణాలు 84% తగ్గాయి. మనం శాంతిపై దృష్టి పెడుతూనే మన దేశ రక్షణకు సంబంధించిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకున్నాం. దానితో పాటు మన రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పెంపొం దించుకున్నాం. ఉరీ, బాలాకోట్ వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పాం. వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద భారతదేశం వివిధ కార్య క్రమాల ద్వారా స్మరించుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో మనం చూడాలనుకునే సుసంపన్నమైన, బలమైన భారతదేశం కోసం విధాన పరమైన నమూనాలను నిర్ణయించేందుకు ఇది అవకాశం ఇస్తుంది. గత 8 సంవత్సరాలలో గణనీయమైన విజయాలను మోదీ ప్రభుత్వం సాధించింది. పైనచెప్పినవి ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘మనం గమ్యస్థానానికి చేరేముందు ఎన్నో మైళ్ల దూరం ప్రయా ణించాల్సి ఉంటుంద’న్న ప్రధానమంత్రి మాటలు మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం, రండి! వ్యాసకర్త: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి -
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్మినార్లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్మినార్ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్మినార్ కట్టడపు కాంప్లెక్స్లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్మినార్ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్మినార్ కాదు.. సూర్య గోపురం!! -
అంతర్జాతీయ చైతన్య గీతిక
భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మానవాళికి యోగా ఒక సాధనమైంది. మరో 50 రోజుల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ రోజు అందరం సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 మే నెలలో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. 2014 నవంబర్లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 2016 జూన్లో అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... యోగా విషయంలో భారతదేశం మేధా సంపత్తి హక్కులను (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) తీసుకోలేదనీ, భారతీయ జ్ఞానసంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందనీ పేర్కొన్నారు. ‘యోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజ లందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక’ అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు. ఇది అందరి ఆస్తి యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్ వరకు, దక్షిణాన ఉన్న కేప్టౌన్ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్హాగన్ వరకు ప్రతి నగరం యోగాలోని శక్తినీ, రోగనిరోధక సామర్థ్యాన్నీ గుర్తించి వినియో గంలోకి తీసుకొచ్చింది. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ... ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది. ఎన్డీయే కృషి యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ... ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం. 2014కి ముందు అప్పటి ప్రభుత్వ హయాంలో లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు లేవనెత్తిన రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే... యోగా, సంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన ఉదాసీనత, నిర్లక్ష్యం ఎలాంటివో చక్కగా అర్థమవుతాయి. 2007 ఆగస్టులో లోక్సభలో ‘అమెరికాకు చెందిన పేటెంట్స్, ట్రేడ్ మార్క్ ఆఫీసు వారు యోగాపై మేధా సంపత్తి హక్కులను అమెరికా ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. యోగా భారతీయ సనాతన సంప్రదాయ విధానం అయినందున, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిం చిందా, లేదా?’ అన్న ప్రశ్న వచ్చింది. నాటి ప్రభుత్వం ‘ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలేమీ లేదు’ అని సుస్పష్టంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా 2014 ఫిబ్ర వరిలో, అంటే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యేం దుకు కొద్దిరోజుల ముందు, నాటి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... మార్చి 2009లో యోగాపై ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ ఇంతవరకు తమ నివేదికను సభకు అందజేయలేదని తెలిపింది. గత ప్రభుత్వాలు యోగా, భారతీయ సనాతన వ్యవస్థ విష యంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తే... ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు దక్కేలా కృషి చేసింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే! ఎనిమిదో వేడుకకు సిద్ధం మరో 50 రోజుల్లో అంటే జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భమిది. ఏడాదికేడాది యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గతేడాది కరోనా నేపథ్యంలో మన దేశంలో 15 కోట్లకు పైగా మంది అంతర్జాతీయ యోగా ఉత్సవం నాడు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సాధనకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మన స్వాతంత్య్ర సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఘనకీర్తిని స్మరించుకోవడం, అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చేస్తున్నాం. మన సంస్కృతీ సంప్రదాయాలనూ, వైభవోపేతమైన చరిత్రనూ, ఘనమైన వారసత్వ సంపదనూ కాపాడుకునేందుకు నడుం బిగిస్తున్నాం. కలిసి చేద్దాం యోగా! మన చరిత్రనూ, మన సనాతన జీవన విధానాలనూ చెరిపేసేందుకు జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తుచేసుకుంటూ, వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకొనేందుకూ ఇంతకు మించిన మరో సందర్భం ఏముంటుంది! ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. అయితే దీన్ని మరపురాని ఘట్టంగా మార్చేందుకు ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యోగా ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోట్లాది మంది జీవితాల్లో ఓ భాగంగా మారిన యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలతో పాటు జాతీయ చైతన్య భావన జాగృతమైంది. రండి, అందరూ కలసి రండి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజు మీ ఇంట్లో, మీ బస్తీలో, మీ వాడల్లో, గ్రామాలలో, విద్యా సంస్థలలో, మీ కార్యాలయాలలో యోగా చేయండి. సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. మన వారసత్వ సంపదను మన జీవితాలలో నిత్యకృత్యంగా మార్చుకుందాం. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా
ఢిల్లీ: కేంద్రమంత్రి కిషన్రెడ్డి కరోనా బారిన పడ్డారు. చిన్నపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కిషన్రెడ్డి తెలిపారు. తనకు కరోనా రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు కిషన్రెడ్డి ట్వీటర్ ద్వారా వెల్లడించారు. అన్ని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. I have tested positive for COVID-19 today with mild symptoms. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. I request all those who have recently come in contact with me to isolate themselves and get tested. — G Kishan Reddy (@kishanreddybjp) January 20, 2022 -
సాయిధరమ్ తేజ్ను పరామర్శించిన కేంద్ర మంత్రి
Union Minister Kishan Reddy Met Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్లోని సాయిధరమ్ తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు సాయిధరమ్ తేజ్. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. రెండు నెలల క్రితం సాయిధరమ్ తేజ్ బైక్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుమారు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం తన బర్త్డే రోజు డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్ ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి అనేక మంది సాయిధరమ్ తేజ్ను వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. ఇటీవల సాయిధరమ్ తేజ్ తన ఫ్యాన్స్కు ఆడియో ద్వారా సందేశం పంపిన సంగతి తెలిసిందే. Thank you @Kishanreddybjp Garu for making time to affectionately visit me at home despite your busy schedule and for your warm and kind words. Wishing you a great year ahead. pic.twitter.com/Lne2XNv4uJ — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 1, 2022 ఇదీ చదవండి: ఫ్యాన్స్కు సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్ -
సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..? సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్ ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్ ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి. సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్రెడ్డి ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్ రెడ్డి. -
Telangana: ‘యునెస్కో’కు మరో 25 ప్రతిపాదనలు
సాక్షిప్రతినిధి, వరంగల్: పురాతన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున రామప్పకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో మరో 25 పర్యాటక ప్రాంతాలను యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతామని కిషన్రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మంత్రి శ్రీనివాస్గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2016 నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని, అయితే అప్పుడు పలు దేశాలు తిరస్కరించాయన్నారు. ఆయా దేశాలతో విదేశాంగ శాఖ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడి, వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేసేలా చేశారని తెలిపారు. ఇందులోభాగంగా 17 దేశాలు రామప్పకు జై కొట్టాయన్నారు. తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం పరిరక్షించుకోవాలని, నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. తర్వాత కిషన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు వేయిస్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి నుంచి కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు వెళ్లారు. టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. -
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే!
ఈశాన్య రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. ఈ ప్రాంతంలోని స్థానిక ఉత్పత్తుల తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్య ప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారతదేశం ఇవాళ్టికి 75 కోట్ల జనాభాకు టీకాలు వేసే కార్యక్రమానికి చేరువైంది. పర్యాటక రంగానికి ఇంతకన్నా ఉత్తేజమిచ్చే అంశం మరొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే– అంతర్జాతీయ విమానయానంపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచ పర్యాటక రంగం పూర్వస్థాయిలో ఊపందుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా మన జనాభాలో అత్యధిక శాతానికి టీకాలు వేయడం పూర్తవుతుంది. కాబట్టి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మనకిదే అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఈశాన్య భారత రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సు ప్రారంభ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య భారతంలోని ‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు ప్రధానమంత్రి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అవి శ్రాంతంగా కృషిచేశారు. ఇందులో మొదటిది– నరేంద్రమోదీ నాయకత్వంలో పలు ఒప్పందాలపై సంతకాల ఫలితంగా వివిధ తిరుగుబాటు బృందాలు హింసకు వీడ్కోలు పలికి దేశ ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దారితీయడం జరిగింది. దీనితో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకోగా, ప్రధాని నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సకాలంలో తగిన చర్యలు తీసుకుంటూ వాటి అమలులో అడ్డంకులను తొలగిస్తూ వచ్చారు. చివరగా నేటి శాంతియుత వాతావరణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ అనేవి పర్యాటకులను ఆకర్షించడమేగాక వ్యాపార నిర్వహణలో ఆసక్తిగలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దోహదపడింది. ఈ నేపథ్యంలో రెండురోజులపాటు సాగే సదస్సు పర్యాటక అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలో అనుసంధాన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భాగస్వాములందరి మధ్య సమన్వయంపై కూడా దృష్టి సారిస్తుంది. అలాగే ఈశాన్య భారతంలో సామర్థ్య వికాస కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి పథకాలు సహా సాహస క్రీడల సంబంధిత యాజమాన్యం, నిర్వహణ, భద్రత ప్రమాణాలు వంటివాటితోపాటు డిజిటల్ ప్రోత్సాహం–విపణి సంబంధిత అంశాలను కూడా ఈ సెమినార్ పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానమంత్రి 2019లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులనుంచి ప్రసంగిస్తూ– మన దేశం 2022లో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకునే నాటికి పౌరులలో ప్రతి ఒక్కరూ కనీసం 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. తూర్పున మయన్మార్, పడమట బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్–చైనా సరిహద్దులుగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. అంతేగాక దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ జాతులు, సంస్కృతులు, భాషా వైవిధ్యానికి ఈ రాష్ట్రాలు పట్టుగొమ్మలు. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం... రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పర్యాటక రంగం 78 ఉద్యోగాలను సృష్టించగలదు. ఆ మేరకు మన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు సృష్టించగల సామర్థ్యం పర్యాటకానికి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 2019–20లో ఉపాధి అవకాశాల సృష్టికి సంబంధించి పర్యాటక రంగంవాటా 15.34 శాతంగా నమోదైంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థలో మొత్తం 7 కోట్ల 90 లక్షల మేరకు ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిం చింది. ఈ రంగానికిగల ఉపాధి కల్పన సామర్థ్యాన్ని ఈశాన్య ప్రాంతంలో చోదకశక్తిగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈశాన్య ప్రాంత వాస్తవికతను పరిరక్షించుకుంటూనే ఈ కృషిని మనం సుస్థిరంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా అపారమైన ప్రకృతి సహజ వారసత్వానికి నెలవు కాబట్టి పర్యావరణ, గ్రామీణ, సాహస క్రీడా పర్యాటకానికి ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఈశాన్య ప్రాంతంలో తేయాకు, ఆరోగ్య, చలనచిత్ర పర్యాటకాల వంటి చెప్పుకోదగిన అనేక పర్యాటక అనుభవాలను పొందే వీలుంది. ఇక ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన 100 రకాల వెదురు జాతులు ప్రకృతి సహజంగా లభించడం ఆసక్తికర అంశం. సాంబ్రాణి కడ్డీలు, వెదురు చాపలతోపాటు పుల్లలు, బద్దలు వంటివి లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సౌభాగ్యం దిశగా వీటి తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. అసోంలో ‘మూగా పట్టు’... నాగాలాండ్ ‘నాగా మిరప’... ఏదైనా కావచ్చు.. వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచం మొత్తానికీ అందించాల్సి ఉంది. ఈ సమావేశం నిర్వహణకు ఇంతకన్నా అనువైన సమయం మరొకటి లేదు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఇతివృత్తం కింద వివిధ కార్యక్రమాలు సాగుతుండగా, భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకోనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ మన దేశ సుసంపన్న సంస్కృతి, చరిత్ర, స్పష్టాస్పష్ట వారసత్వాన్ని చాటేవిగా ఉంటున్నాయి. మన దేశ ప్రాచీన మూలాలు, విస్తృత నాగరికతా వారసత్వాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి కూడా ఇదొక అవకాశం. అలాగే అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న నవభారత స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికీ ఇదే అదను. అంతేకాకుండా మౌలిక సదుపాయాల వృద్ధిపైనా గట్టిగా దృష్టి సారించడం అవశ్యం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు... ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన భారతదేశ పండుగలను దృశ్యరూపం కల్పించడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ పండుగలు వాస్తవంగా మనను ఓ నాగరిక దేశంగా నిర్వచిస్తూ– ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ భావనను ప్రోదిచేస్తాయి. ఈ ప్రాంతానికిగల మృదువైన శక్తిని ప్రోత్సహించడానికి పర్యాటకం ఒక కీలక ఉపకరణం. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల, ప్రపంచ ప్రజానీకంతో అనుసంధానించే సాధనం కూడా. పర్యాటకాన్ని అత్యున్నత దృష్టితో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్యప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారత్ వంటి దేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది సుసంపన్న వారసత్వం... సహజ లేదా పర్యావరణ వైవిధ్యం లేదా సందర్శకులు పాలుపంచుకోగల కార్యకలాపాలు వంటివాటిలో ఏదో ఒకటిగా ఉండవచ్చు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడమే మా లక్ష్యం. జి. కిషన్రెడ్డి వ్యాసకర్త కేంద్ర పర్యాటక–సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
ఈశాన్య రాష్ట్రాల్లో 20 విమానాశ్రయాలు
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి పెద్ద ఊపును ఇవ్వడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఇరవై విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గువాహటిలో సోమ, మంగళవారాల్లో ‘అష్టలక్ష్మి’(8 రాష్ట్రాలు) ఈశాన్య రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.,. వ్యాక్సినేషన్ ముగిసేలోగా వసతుల కల్పన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే మనం టూరిజంపై అధికంగా ఆధారపడక పోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు భారత్లో టీకా కార్యక్రమం వేగంగా అమలవుతోంది. అధికశాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ముగిసేలోగా పర్యాటకరంగ అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల మెరుగునకు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకునేందుకు, బ్రాండింగ్ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశాం. పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలు ఇక్కడి గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో భిన్నమైనవి. వినూత్న శైలితో సాగే వీరి పండుగలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడి జలపాతాలు కూడా అందమైన పరిసరాలతో ప్రకృతి రమణీయతతో విలసిల్లుతుంటాయి. లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. స్విట్జర్లాండ్ బదులు ఇక్కడే సినిమా షూటింగులు జరపొచ్చు. ఇలా ఇక్కడ పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఇక్కడ పెద్దసంఖ్యలో సినిమాల చిత్రీకరణ జరిగేలా చొరవ తీసుకుంటాం. త్వరలో ఇక్కడ పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. పామాయిల్, ఇతర రంగాల్లో పెట్టుబడులు రాబడతాం. ఉపాధి కల్పన ద్వారా ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. సమస్యలను అధిగమించాం ఈశాన్య రాష్ట్రాలను 35 ఏళ్ల పాటు చొరబాట్లు, తీవ్రవాద గ్రూపుల సమస్యలు పట్టి పీడించాయి. రోజులు, నెలల తరబడి రాష్ట్రాల మధ్య రోడ్ల మూసివేత వంటివి కొనసాగేవి. ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఘనమైన చరిత్ర, విభిన్న జాతులు, తెగల జీవనశైలి ఇలా అనేక అద్భుతమైన అంశాలెన్నో ఉన్నా.. పైన పేర్కొన్న సమస్యల కారణంగా సరైన మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, ఇలా ఏవీ అందుబాటులో లేక పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైంది. గత ఏడేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ఆ సమస్యలు అధిగమించాం. ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చాం. రోడ్డు, రైలు కనెక్టివిటీ పెరిగింది. దీంతో పర్యాటకరంగ అభివృద్ధికి గట్టి చర్యలు చేపడుతున్నాం. -
స్ట్రెయిట్ టాక్ విత్ జి.కిషన్ రెడ్డి
-
సూర్యాపేటలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర
-
బోనాలను కేంద్ర జాబితాలో చేరుస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బోనాలను కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్రెడ్డి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బంగారం బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కిషన్రెడ్డి సందర్శించారు. బోనాల కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఢిల్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు; హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్రెడ్డి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కాగా ఏడు సంవత్సరాలుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తాను. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. -
Kishan Reddy: ఆ ఓటమితోనే కలిసొచ్చిన అదృష్టం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు గంగాపురం కిషన్రెడ్డి జాక్పాట్ కొట్టారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనా.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల ఆదరణ చూరగొన్న కిషన్రెడ్డి.. ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంతో రెండేళ్లలోనే కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ కేంద్రంలో పదవులు నిర్వర్తించినా.. సహాయ మంత్రి హోదాకే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించడం కూడా కిషన్రెడ్డి ప్రమోషన్కు కలిసొచ్చిన అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు ప్లస్ పాయింటైంది. సున్నిత మనస్తత్వం.. కార్యకర్తలతో మమేకం కావడం కూడా ఆయనకు ఎదుగుదలకు కారణంగా చెప్పవచ్చు. మార్నింగ్ వాక్తో మమేకం.. కిషన్రెడ్డి మొదటి నుంచీ మార్నింగ్ వాక్తో ప్రజలతో మమేకమయయ్యేవారు. కోవిడ్ ఉద్ధృతి సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా గాంధీ, కింగ్కోఠి, టిమ్స్ ఆస్పత్రుల్లో పర్యటించారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొరతను నివారించారు. వివాదరహితుడిగా కిషన్రెడ్డికి పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ.. కోవిడ్ ఇతర కారణాలతో చనిపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించేవారు. బీజేపీ సీనియర్ నేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్రావులతో సన్నిహితంగా ఉండి వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. వారి మార్గదర్శకత్వంలోనే నగరంలో పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డారు. ఒదిగి ఉండటంతోనే ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. అదృష్టం తలుపుతట్టింది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, వాజ్పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్రెడ్డి.. విద్యార్థి దశలోనే అప్పటి జనతా పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చదువు కొనసాగించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004 హిమాయత్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభన తర్వాత అంబర్పేట నుంచి 2009, 2014లలో రెండుసార్లు గెలుపొందారు. 2018లో ఇదే స్థానం నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాలుగోసారి అనూహ్యంగా ఓటమిని చవిచూసిన ఆయనకు సికింద్రాబాద్ లోక్సభ స్థానం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడమే తరువాయి అమాత్య పదవి వరించింది. మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో పూర్తిస్థాయి కేబినెట్ హోదా లభించడంతో రాష్ట్ర బీజేపీ కేడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఆయనకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించారు. -
రైతు బిడ్డ నుంచి కేబినెట్ మంత్రిగా కిషన్రెడ్డి ప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ విస్తరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేసింది. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించింది. కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోం సహాయ మంత్రిగా పనిచేస్తున్న జీ.కిషన్రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పించింది. ఆయన కేబినెట్ మంత్రిగా బుధవారం పదవి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రైతు బిడ్డ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదిగారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి కుటుంబ, రాజకీయ ప్రొఫైల్.. కుటుంబ నేపథ్యం: ► జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి 1964, మే 15న జన్మించారు. ► కిషన్రెడ్డి తండ్రి స్వామి వ్యవసాయ రైతు ► రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం ఆయన స్వస్థలం. ► టూల్ డిజైనింగ్లో డిప్లోమా పూర్తిచేశారు. ► 1995లో కావ్యతో కిషన్రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం వైష్ణవి, తన్మయ్. రాజకీయ ప్రస్థానం.. ► 1977లో జనతాపార్టీలో కిషన్ రెడ్డి చేరారు. ► 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో చేరారు. ► 1980లో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవీ చేపట్టారు. ► 1983లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ► 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను అధిష్టించారు. ► 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవి చేపట్టారు. ► 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ► 2009 ఎన్నికల్లో నియోజకవర్గం మారింది. అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2010, మార్చి 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► 2014 ఎన్నికలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ► 2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ► ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రి 2019 ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆయనకు హోంశాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించారు. బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కిషన్రెడ్డికి కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించారు. -
బెంగాల్లో హింసకు ముందే ప్లాన్..!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నిజ నిర్ధారణకు ‘కాల్ ఫర్ జస్టిస్ సంస్థ’ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించింది. ఎన్నికల తర్వాత జరిగిన హింస ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని నివేదికలో పేర్కొంది. అంతేగాక హింసాకాండను నివారించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డిని కలిసిన 5 గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ నివేదికను సమర్పించింది. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో కేరళ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బోస్, జార్ఖండ్ మాజీ డీజీపీ నిర్మల్ కౌర్, ఐసీఎస్ఐ మాజీ అధ్యక్షుడు నిసార్ అహ్మద్, కర్ణాటక ప్రభుత్వ మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎం.మదన్గోపాల్ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై నిజనిర్ధారణ చేసేందుకు ఈ కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి నుంచి 200కి పైగా ఫోటోలు, 50కి పైగా వీడియోలను విశ్లేషించి 63 పేజీల నివేదికను సిద్ధం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కమిటీ గుర్తించింది. ఎన్నికల అనంతర హింస ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని పేర్కొంది. అమాయక ప్రజలపై నేరస్తులు, మాఫియా డాన్లు, క్రిమినల్ గ్యాంగ్స్ దాడి చేసి హింసకు పాల్పడ్డారని కమిటీ పేర్కొంది. ఈ నివేదికను త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అందించనున్నట్లుహోంశాఖ సహాయమంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. -
ప్రగతిభవన్లో ద్రోహులు.. రోడ్డున ఉద్యమకారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ నల్లగొండ టూటౌన్: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం పార్టీతో చెట్టపట్టాలేసుకుని ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులు రోడ్లపై ఉంటే, ఉద్యమద్రోహులు ప్రగతిభవన్కు చేరుకున్నారని ధ్వజమెత్తారు. హన్మకొండ, నల్లగొండలో శనివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారాయని విమర్శించారు. సచివాలయానికి రావడం లేదంటే సచివాలయాన్నే కూల్చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఒక్క ఆసుపత్రి కట్టలేదని, కేసీఆర్ కట్టడు, కేంద్రం కడతామంటే సహకరించరని ఆరోపించారు. 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైల్వే ఓవర్ హాలింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. బీబీనగర్లోని మెడికల్ కాలేజీకి ప్రభుత్వం భూములను ఇవ్వలేదని, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను తెచ్చామని, దాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే అర్హతలేదని, ఇష్టారాజ్యంగా కొందరు మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. వరంగల్ మామునూరులో స్థలాన్ని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కేంద్ర పాలిత’ యోచన లేదు
ఖైరతాబాద్ (హైదరాబాద్): జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఎలా తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం సీఎం కేసీఆర్కు ఉందని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుల సమావేశం ఖైరతాబాద్ సరస్వతి విద్యామందిర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రేటర్ ఎన్నికల సమయంలో మాకు ఎంఐఎంతో పొత్తులేదన్నారు. మేము అనుకుంటే సీఎంను గద్దె దించుతామని ఎంఐఎం చెప్పుకొచ్చింది. మరి కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిపించుకున్నారో ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్లో పాలన ఎలా ఉండాలి.. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరుండాలనేది దారుస్సలాంలో నిర్ణయమవుతోంది’అని అన్నారు. అప్పుల రాష్ట్రంగా... ‘తెలంగాణను వ్యతిరేకించిన వారు మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తయా రైంది. ప్రజలు ఓటుతో కేసీఆర్ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడితే.. అది నా చెప్పుతో సమానమంటారు. ఇది ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమే. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాం తంగా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ రాంచందర్రావు గెలుపు ఖాయమని’కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర బీజేపీ మంగళవారం 4 రాష్ట్రాలకు ఇన్చార్జులను నియమించింది. తమిళనాడుతోపాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు కూడా ఎన్నికల ఇన్చార్జుల నియామకం చేపట్టింది. -
వాజ్పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం
పాలకులకు మహత్తర శక్తిని చ్చేది ప్రజాభిప్రాయం. తిరుగు లేని ప్రజాభిప్రాయమే ప్రజా స్వామ్యానికి శ్రీరామరక్ష. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ మైనా తాను చేసిన మంచి పనుల ఆధారంగా ప్రజల మనసు గెలిచి తిరిగి అధికారంలోకి రావాల నుకోవడం పరిణత ప్రజా స్వామిక లక్షణం. మనదేశంలో 1990ల మధ్యవరకూ కాంగ్రెస్ ప్రభు త్వాలు పలుమార్లు ఏర్పాటయ్యాయి. ఇవి తమ పనితీరు ఆధారంగా కాక, స్వాతంత్య్ర పోరాటానికి తామే నాయకత్వం వహించామని ప్రచారం చేసుకుని సాను భూతి పొందడంతోపాటు, ప్రతిపక్షాల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎన్నికవుతూ వచ్చాయి. 1975–77 మధ్యకాలంలో ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజా స్వామ్యం పీక నులిమి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితి ప్రజల మనోభావాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది. 1990లో ఆర్థిక సరళీకరణ, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సాంకేతికత కారణంగా వివిధ సమాచార వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వార్తల్లోని వాస్తవాలను గుర్తించడం మొదలు పెట్టారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీలకు తాము అనుకున్నట్టే అంతా జరగాలన్న పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇలాంటి దశలోనే సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం తాను చేసింది ప్రజలకు చెప్పుకోవడంతోపాటు ప్రజలు కూడా ప్రభుత్వాలు ప్రకటించిన మార్పులు జరిగాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించ డమే వాజ్పేయి సుపరిపాలనకు నిదర్శనం. వ్యూహాత్మక దృష్టి, పారదర్శకతను పెంపొందించడం, ప్రభుత్వాన్ని జవాబు దారీగా నిలబెట్టడం అనే మూడు విస్తృతమైన అంశాలు సుపరిపాలనకు ఆధారం. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాజ్పేయి వ్యూహాత్మక దృష్టి కారణంగా మౌలిక వసతుల కల్పన జోరందుకుంది. రహదారుల రంగ చరిత్రగతిని మారుస్తూ, స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాలకు అనుసంధానత పెరిగి ఉపాధి అవకాశాలు ముమ్మరమయ్యాయి. బాల్యదశ నుంచే మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో సర్వశిక్షా అభియాన్ తెచ్చారు. దీనిద్వారా పాఠశాల విద్యను నిర్ణీతకాల వ్యవధిలో సార్వత్రికంగా మార్చేందుకు ముందడుగు పడింది. పోఖ్రాన్లో అణుపరీక్షలను నిర్వ హించాలన్న భారతదేశ నిర్ణయం, ఆ తర్వాత అణ్వా యుధ వ్యాప్తి నిరోధక కూటమిలో చేరడం వంటివి వాజ్పేయి దూరదృష్టి, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనాలు. పాలకులు తమ ప్రవర్తన విషయంలో ఎంత బాధ్యతతో వ్యవహరించాలో దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాథ్యూ తెలియ జెప్పారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ, వారి ప్రవర్తన విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి; తమ పాలకులు చేసే ప్రతి చట్టం గురించి తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంటుందని స్పష్టం చేశారు. 2002 తర్వాతే వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శక పాలనకు మూలస్తంభంలాంటి, సమాచార హక్కు చట్టానికి పూర్వ రంగంలాంటి ద ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 తెచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారిత్వం దిశగా వాజ్పేయి ఎంతో ముందుచూపుతో తీసుకున్న పలు నిర్ణయాలు పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపా డాయి. ప్రజాధనాన్ని కాపాడటం, దాన్ని సద్వినియోగం చేయడం పాలకుల బాధ్యత. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, ప్రజాధనం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదనీ, ఉన్నదల్లా పన్ను చెల్లింపుదారుల ధనమేననీ అంటారు. అందువల్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యతకు పెద్దపీటవేస్తూ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టాన్ని తేవడం ద్వారా, వ్యవస్థాగతంగా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికీ, తద్వారా ఆర్థిక లోటును క్రమంగా తగ్గించడానికీ ప్రయత్నం జరిగింది. వాజ్పేయి సుపరిపాలనా విధానాల ప్రభావం, నరేంద్ర మోదీ మొదటి, రెండవ విడత ప్రభుత్వాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ ఒప్పందాన్ని చట్ట రూపంలో తేవడం, ఆర్టికల్ 370ని విజయవంతంగా రద్దు చేయడం, మహిళలకు, షెడ్యూలు కులాలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కనపెట్టడం ఇందుకు నిదర్శనం. అందరికీ సమాన అవకాశాలు, ఒకేరకమైన చట్టాలు వర్తించే అంశాలపై ప్రధానమంత్రి దృష్టిపెట్టడం వాజ్పేయి సుపరిపాలనా విధానంలోని మరో కోణాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంగా చెప్పుకోవచ్చు. జన్ధన్ యోజన వంటి విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2.57 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని 70 కోట్లకుపైగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ అయ్యేట్టు చూడటం జరిగింది. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం నేరుగా సహాయం చేయగలిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పారదర్శక పాలన, మెరుగైన శాసన విధానాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాయి. కాలం చెల్లిన చట్టాలు ఎన్నింటినో మోదీ సర్కారు రద్దుచేసింది. మోదీ పిలుపునిచ్చిన సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదం సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. జి.కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి; సుపరిపాలన దినోత్సవం -
‘టీఆర్ఎస్తో ఏ దోస్తీ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్తో బీజేపీకి ఏ దోస్తీ లేదని, ప్రజా సమస్యలపై వారితో కుస్తీ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్తో బీజేపీ ‘గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’అన్నట్లుగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తప్పుబట్టారు. గత ప్రభుత్వాల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ పారీ్టలే మిత్రపక్షాలుగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు చురకలంటించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా అనేక జాతీయ రహదారులు అభివృద్ధికి నోచుకోవట్లేదని, త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నెల 21న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలోని 370 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రూ.3,717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటే రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవున రూ.9,440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు భూమి పూజ చేసి పునాది రాయి వేయనున్నారని వెల్లడించారు. భారతమాల పరియోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 35 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి జరుగుతున్నాయని, ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని కిషన్రెడ్డి వివరించారు. దేశానికి అంకితం చేయనున్న 6 ప్రాజెక్టులివే.. 1) జాతీయ రహదారి–163పై యాదగిరిగుట్ట–వరంగల్ మధ్య నిర్మించిన 99 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి. 2) జాతీయ రహదారి 163పై మన్నెగూడ–రావులపల్లి మధ్య నిర్మించిన 73 కి.మీ. రెండు లేన్ల రహదారి. 3) వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి–163పై 35 కి.మీ. రహదారి విస్తరణ. 4) వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి–353సీపై 34 కి.మీ. మేర రెండు లేన్లలో క్యారేజ్వే విçస్తరణ. 5) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎన్హెచ్–765డీలోని మెదక్ సెక్షన్ వరకు 63 కిలోమీటర్ల రహదారి విస్తరణ. 6) నకిరేకల్ నుంచిæ ఎన్హెచ్–365లోని తనంచెర్ల వరకు చేసిన 67 కిలోమీటర్ల రహదారి విస్తరణ. భూమి పూజ జరగనున్న 8 ప్రాజెక్టులివే.. 1) జాతీయ రహదారి–161పై కంది నుంచి రామ్సన్పల్లె వరకు 40 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 2) జాతీయ రహదారి–161పై రామ్సన్పల్లె నుంచి మంగ్లూరు వరకు 47 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 3) జాతీయ రహదారి–161పై మంగ్లూరు నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 4) జాతీయ రహదారి–363పై రేపల్లెవాడ నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 53 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 5) జాతీయ రహదారి–363పై మంచిర్యాల నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 42 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 6) జాతీయ రహదారి–365బీబీపై సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 59 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 7) నిర్మల్ జిల్లాలో జాతీయ రహదారి–61పై నిర్మల్–ఖానాపూర్ మధ్య 22 కి.మీ. రెండు లేన్ల రహదారి విస్తరణ, బలోపేతం. 8) నల్లగొండ జిల్లాలో 2020–21 సంవత్సరానికి ఎన్హెచ్ (ఓ) కింద నకిరేకల్ నుంచి ఎన్హెచ్–565పై నాగార్జునసాగర్ వరకు 85 కి.మీ. మేర రహదారి పెండింగ్ పనుల పూర్తి. -
దండియాత్ర నుంచి ఆత్మనిర్భర్ వరకు
సముద్రం నుంచి కొన్ని ఉప్పురాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన దండియాత్రకు పేద ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని ఆత్మనిర్భర్ రూపంలో మోదీ రూపొందించగలిగారు. అది 1856 నాటి సంగతి... అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మన దేశం నుంచి వచ్చే ఆదాయం మూడు కోట్ల బ్రిటీష్ పౌండ్ల కంటే తక్కువగా ఉండేది. ఇందులో పది శాతం వరకు ఉప్పుపై విధించిన పన్నులు, సుంకాల నుంచే వచ్చేవి. ఇప్పటి విలువతో చూస్తే అది దాదాపు 3,000 కోట్ల రూపాయలతో సమానం. అయితే సగటు భారతీయుడు సంవత్సర ఉప్పు వినియోగానికి డబ్బులు చెల్లించాలంటే.. కనీసం రెండు నెలలు కష్టపడాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది. అప్పటికే ఉప్పు వాడకాన్ని పూర్తిగా వదులుకున్న మహాత్మాగాంధీ... 1930 ఏప్రిల్లో ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండికి దండయాత్ర చేశారు. సముద్రం నుంచి కొన్ని ఉప్పు రాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ప్రజలు మహాత్ముడి వెంట నడిచారు. ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. రాజకీయ స్వేచ్ఛ అనే ఆలోచనని ఆర్థిక స్వేచ్ఛతో అనుసంధానించడం కంటే అత్యుత్తమ మార్గం మరొకటి లేదని ఆయన వివరిం చారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఆర్థిక స్వేచ్ఛ, స్వావలంబన కోసం 1915లో సబర్మతి ఆశ్రమంలో ఖాదీ వినియోగంతోనే గాంధీజీ పోరాటం ప్రారంభమైంది. గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ అనే ఆలోచనలు, ఖాదీ వినియోగం, ఉప్పు పన్ను చట్టాల ఉల్లంఘన వంటివే స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. ఈ ప్రక్రియలో ప్రధాని, పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని రూపొందించగలిగారు. మహాత్మా గాంధీ జీవితం, ఆయన బోధనల నుండి ప్రేరణ పొందిన నరేంద్రమోదీ, ప్రధానిగా తన తొలి విడతలో ప్రారంభిం చిన స్వచ్ఛ్ భారత్ పథకం, పరిశుభ్రతకు, పారిశుద్ధ్యానికి ప్రతీకగా నిలిచింది. దీనిని ప్రజల ఉద్యమంగా మార్చినందున యుద్ధ ప్రాతిపదికన అనేక లక్ష్యాలను చేరుకోగలిగింది. నేటి భారతంలో రాజ కీయ స్వేచ్ఛ అందరికీ ఉన్నా, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇంకా కొంతమంది పేదలకు, అణగారిన వారికి ఒక కలగానే మిగిలిపోయింది. స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛ అనే స్తంభాలపైన మాత్రమే పేదలను మనం ఉద్ధరించగలం అన్న నిజాన్ని గ్రహించిన ప్రధాని...ఆత్మ నిర్భర భారత్కి రూపకల్పన చేశారు. 1970లో వచ్చిన ‘గరీబీ హటావో’ దేశంలో పేదరికాన్ని శాశ్వతం చేసిన నినాదం అయితే, దానికి పూర్తి విరుద్ధంగా పేదరికాన్ని తరిమి కొడుతూ, పేదల్లో సాధికారత పెంపొందిస్తూ, తమ విధిని వారే రాసుకునే వీలు కల్పించింది ఇప్పటి ఆత్మ నిర్భరత, స్వావలంబన అనే ఈ కార్యక్రమం. దీనితోపాటుగా ఇటీవల ప్రవేశపెట్టిన రైతుల సంక్షేమ చట్టం, కార్మిక హక్కుల సవరణ చట్టం, నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలు, రైతులకు ఆర్థిక స్వేచ్ఛని, ఉత్పత్తుల్ని అమ్ముకొనే అవకాశాలని కల్పించే చర్యలు. సూక్ష్మ వాగ్దానాలతో, నోటి మాటలతో రైతులని బలహీనపరిచే బదులు, ప్రధాని మన వ్యవసాయ రంగాన్ని పట్టి పీడుస్తున్న చట్టాల బంధాల నుండి విముక్తి చేసి, రైతులు తమ విధిని తామే సృష్టించుకునే స్వతంత్రతను, ప్రేరణని ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, కనీస మద్దతు ధర వంటి పథకాలు, రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్ని ప్రాంతాలలో అందుబాటులో వుంచి, పంటను, ఉత్పత్తులను కనీస ధరకు అమ్ముకునేందుకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరిచే అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతు ఉత్పత్తులను లాభదాయక మార్గంలో విక్రయించే అవకాశం ఉన్న వ్యవస్థను సృష్టించడం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తుల వాణిజ్య– వర్తక (ప్రోత్సాహం–సౌలభ్యం) చట్టం–2020 ప్రధాన లక్ష్యం. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ మార్కెట్ యార్డులలో మాత్రమే విక్రయించాల్సిన అవసరం ఉండదు. అంతర్–రాష్ట్ర లేదా తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎటువంటి వాణిజ్య, వ్యాపారంలోనైనా వారు పాల్గొనవచ్చు. ప్రభుత్వాలు గుర్తించిన మార్కెట్ యార్డ్ లోపల లేదా బయట అమ్ముకోవడానికి సంసిద్ధుడైన ఏ రైతుపైనా లేదా సంబంధిత వ్యాపారిపైన ప్రభుత్వం మార్కెట్ రుసుము లేదా సెస్ విధించరాదని ఈ చట్టం చెబుతోంది. పంట ఎంపిక ఒక ముఖ్యమైన అంశం కాగా, ధరలను ముందుగానే ఊహిం చగలగడం, పంట వేసే సమయంలోనే రైతు ఉత్పత్తుల కొనుగోలును నిర్ధారించి ఆందోళనను తొలగించడం వంటి చర్యల ద్వారా మనం రైతుల భవి ష్యత్తును కాపాడవచ్చు. రైతులను రక్షిస్తూ, వారికి అధికారాన్ని కల్పిస్తూ, న్యాయమైన, పారదర్శకమైన పద్ధతితో భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం వ్యవసాయ–వ్యాపార సంస్థలు, ప్రక్రియదారులు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు లేదా పెద్ద రిటైలర్లతో పరస్పరం అంగీకరించిన పారితోషిక ధరల చట్రంలో పాల్గొనడానికి రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా–వ్యవసాయ సేవల బిలు–2020 వీలు కల్పిస్తుంది. ఒప్పంద వ్యవసాయం అనే ఈ వినూత్న ఆలోచన ద్వారా రైతులు డిమాండ్కి అనుగుణంగా పంటలు పండించి, మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చివరగా, అత్యవసర వస్తువుల (సవరణ) బిల్లు–2020, ఈ చట్టం మూడు లక్ష్యాలను సాధిస్తుంది. మొదటిది– రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధర పొందేలా చేస్తుంది. రెండవది– నిల్వలు, బ్లాక్–మార్కెటింగ్ సాకుతో రైతులను, వ్యాపారులను వేధిస్తూ రాష్ట్ర పరిపాలనను బలహీనపరుస్తున్న అధికారుల అజమాయిషీని తగ్గిస్తుంది. ఇక మూడవది– పెద్ద ఎత్తున పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ చట్టం వ్యవసాయ వస్తువుల రవాణాను, స్వేచ్చాయుతంగా అమ్మడాన్ని నియంత్రిస్తుంది. స్వావలంబన ఆత్మనిర్భర భారత్ నిర్మాణం దిశగా ప్రధాన మంత్రి తన ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మొదటగా స్వావలంబన, ఆత్మనిర్భరత అనే సూత్రాలను ప్రకటించి తర్వాత దాని అమలుకు కావలసిన నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు. పార్లమెంట్ సమావేశాల్లో మన రైతుల అభివృద్ధి, సాధికారతకు చట్టాలను రూపొం దించారు. మోదీ ప్రభుత్వానికి ముందు చాలా ప్రభుత్వాలు గాంధీజీ నుండి ప్రేరణ పొందాయి కానీ మోదీలా ఆయన సందేశాన్ని స్వీకరించి నేటి కాలానుగుణంగా మాత్రం అమలు చేయలేకపోయాయి. వారు చేయలేకపోయిన దానిని చేసి చూపిస్తూ ప్రధాని మోదీ నిజమైన గాంధేయవాదిగా నిరూపించుకున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ, గ్రామీణాభివృద్ధి–నిజమైన దేశాభివృద్ది అనే స్ఫూర్తిని తీసుకుని సంపూర్ణ దేశాభివృద్ధిని సాధించటమే, మన మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి. (నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా) జి. కిషన్రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
12 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఐసిస్: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఐసిస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని యువత ఐసిస్వైపు ఆకర్షితులవుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. (చదవండి: పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి) -
నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ప్లాంట్లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్ఎఫ్సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు. తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్రెడ్డి ఆగ్రహం రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ గేటు ఎదుట టీఆర్ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్లో ట్రయల్రన్ నిర్వహిస్తామని, నవంబర్లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో ‘లోకల్ ఫైట్’ కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
వెంటిలేటర్ల సీల్ కూడా తీయలేదు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పారాసిటమల్తో కరోనా తగ్గిపోతుందన్న కేసీఆర్కు బీజేపీ సర్కార్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ‘రాష్ట్రానికి సీఎంగా ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూప్పకూలాయి. అయినా కేంద్రం అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసింది. ఇప్పటివరకు తెలంగాణకు 13.85 లక్షల ఎన్ –95 మాస్క్లు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్సీక్యూ మాత్రలు, లక్షలాదిగా ఆర్ఎన్ఏ టెస్ట్ కిట్లు, ఆర్టీ పీసీఆర్ కిట్లను కేంద్రం అందించింది. మొత్తం 1,400 వెంటిలేటర్లను రాష్ట్రానికి కేటాయిస్తే, కేవలం 647 వెంటిలేటర్లనే ఇచ్చిందని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన వాటిలో దాదాపు 500 వెంటిలేటర్లకు ఇంకా సీల్ కూడా తీయలేదు’అని విమర్శించారు. వాళ్లు తెలంగాణ బిడ్డలు కాదా...? ‘పీఎం కిసాన్ యోజనలో భాగంగా రెగ్యులర్గా ఇచ్చే రూ. 6 వేలు కాకుండా, అదనంగా మరో రూ. 2 వేలను కేంద్రం ఇచ్చింది. జన్ ధన్ యోజన స్కీం కింద మహిళల ఖాతాల్లో రూ. 5 వందలు చొప్పున మూడు నెలలు జమ చేసింది. కేంద్రం నుంచి లబ్ధిపొందిన రైతులు, మహిళలు, కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా?.. కేసీఆర్ ఖాతాలో వేస్తేనే రాష్ట్రానికి ఇచ్చినట్లా?. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వలస కార్మికులను ఆదుకునేందుకు రూ. 224 కోట్లు, కోవిడ్ అసిస్టెంట్ కింద రూ. 215 కోట్లు ఇచ్చాం. ప్రధాని అన్న కళ్యాణ్ యోజన కింద బియ్యం, పప్పు దినుసులు అందించాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం’అని అన్నారు. ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరు? ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. తెలంగాణలో ఎందుకు లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం ఆరోగ్యశ్రీలోనైనా కరోనా చికిత్సను ఎందుకు చేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ కిట్స్లో రూ. 6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని గుర్తు చేశారు. సచివాలయం కూల్చే విషయంలో ఉన్న శ్రద్ధ కోవిడ్ నివారణ మీద ఉంటే బాగుడేందని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల మాత్రం చాలా శ్రమిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తే అంశాలకు పార్లమెంట్లో సమాధానం చెబుతామన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందని కిషన్ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి
సాక్షి, విజయవాడ: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన కుటుంబాలకు రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) (విజయవాడ అగ్ని ప్రమాదం: తొమ్మిది మంది మృతి) -
ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, అడ్డగోలు బిల్లులు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇం దుకోసం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీ టింగ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలన్నారు. గాంధీ, ఫీవర్, కింగ్కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. గాంధీలో 200 వెంటిలేటర్లు ఉన్నా అందులో చేరేందుకు ప్రజలు ఎందుకు భయ పడుతున్నారో, ఎందుకు వెనుకడుగు వే స్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తాను గాంధీ ఆసుపత్రిని సందర్శించానని, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. అక్కడ పని చేసే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 50 లక్షల బీమా కవరేజి తప్పితే ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కరోనా ఆసుపత్రుల్లో ఖర్చుల కోసమే కేంద్ర ప్రభుత్వం రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి 1,220 వెంటిలేటర్లకు గాను 888 కేంద్రం పంపించిందన్నారు. అందులో 10 శాతం కూడా వినియోగించడం లేదన్నారు. రాష్ట్రానికి 7,44,000 మాస్క్లు, 2,41,000 పీపీఈ కిట్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబెట్లు పంపించిందన్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం 1,23,000 యాంటిజెన్ కిట్లను, 1,02,407 ఆర్టీపీసీఆర్, 52 వేల వీటీఏ కిట్లు పంపించిందన్నారు. టెస్టులు సరిగా చేయడం లేదని, వాటిని చేయాలని కేంద్ర బృందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాయన్నారు. వసతులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో తాను మాట్లాడుతున్నానని, తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉన్నందునే టిమ్స్ను ప్రారంభించలేదని చెప్పారన్నారు. తన చొరవతోనే రైల్వే ఆసుపత్రిని, సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో రెండు బ్లాకులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారన్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యం, పప్పు దినుసులు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ఇందుకోసమే రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. బియ్య పథకం కింద ప్రతి కిలోకు రూ. 31 కేంద్రం ఇస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలిచ్చేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో వాటి అమలును బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించానన్నారు.వరవరరావు విషయంలో చట్టప్రకారం ఏం చేయాలో ప్రభుత్వం అలాగే చేస్తుందన్నారు. గాంధీ ఆస్పత్రి సందర్శన గాంధీ ఆస్పత్రి: కరోనా సోకిన ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ఆయన ఆదివారం సందర్శించారు. డీఎంఈ రమేష్రెడ్డి, గాంధీ సూపరిం టెండెంట్ రాజారావు.. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలను ఆయనకు వివరించారు. -
మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్
హైదరాబాద్: మహానగరం మణిహారాలసమాహారంగా రూపుదాల్చుతోంది. ట్రా‘ఫికర్’ లేకుండా ఇప్పటికే నిర్మించిన ఫ్లైఓవర్లకు మరో రెండు ఫ్లై ఓవర్లు తోడుకానున్నాయి. ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించబోయే స్టీల్ బ్రిడ్జిని, రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు మరో బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్లతో కలసి మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహానగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్ విశ్వనగరంగా పురుడుపోసుకుంటోందని అన్నారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ దీర్ఘకాలికంగా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రూ.426 కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో చేపట్టిన రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.350 కోట్లతో 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి, రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు రూ.76 కోట్ల వ్యయంతో 900 మీటర్ల బ్రిడ్జి అందుబాటులోకి రానుం దని చెప్పారు. నగరంలో మరో రూ.6 వేల కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో పనులు నడుస్తున్నాయన్నారు. లాక్డౌన్ సమయంలో దాదాపు నాలుగురెట్ల వేగంతో కోట్లాది రూపాయల నిర్మాణపనులు పూర్తి చేశామని వివరించారు. హైదరాబాద్ రహదారులపై రద్దీ తగ్గాలనే ఉద్దేశంతో ఎస్ఆర్డీపీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొత్త లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు నిర్మించుకుంటూ ముందుకుపోతున్నామని వివరించారు. నిర్వహణ పటిష్టంగా ఉండాలని 710 కిలోమీటర్ల ముఖ్యమైన రోడ్లను సీఆర్ఎంపీ పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించామని చెప్పారు. భవిష్యత్లో రక్షణ రంగం స్థలాల అవసరం ఉంటుందని, నాగపూర్, రామగుం డం హైవేలపై సైతం 18 కిలోమీటర్ల మేర స్కైవేలు నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరిశీలిస్తోందని, దీనికి కేంద్రమం త్రి కిషన్రెడ్డి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్లో 36 కిలోమీటర్ల స్కైవేలు నిర్మిస్తే వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను విశ్వనగరంగా నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా, విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, కోవిడ్–19 కట్టడి గురించి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, ఇంకా కొన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కలసిమెలసి అభివృద్ధి చేసుకుందాం: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలకతీతంగా కలసిమెలసి అభివృద్ధి చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాహాళ్లకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ క్రాస్రోడ్స్కు మంచి పేరు ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాంతం’అని ఆయన అన్నారు. నగరంలోకి పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్ సమస్య ఉండొద్దని, పెట్టుబడుదారులు ఇప్పుడు బెంగళూరు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య కారణంగా భయపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో సువర్ణాధ్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పదవి చేపట్టాక దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. 130 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ 2.0 పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిందని, అంత్యోదయ స్ఫూర్తి వల్ల లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో మార్పు చోటుచేసుకుందని చెప్పారు. మోదీ నాయకత్వంలో రెండోసారి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలపై కిషన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో కేంద్రం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అనేక అంశాలకు ఈ ఏడాది పాలనలో పరిష్కారం దొరికిందన్నారు. అనంతరం పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రశ్న: కరోనా నిర్వహణలో కేంద్రం విఫలమైందన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏ దేశంతో పోల్చి చూసినా మనం మెరుగ్గా ఉన్నాం. కేసులు, మరణాలు, రికవరీ రేటులో మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ప్రధాని తీసుకున్న చర్యలే. ఆర్థిక ప్యాకేజీ, లాక్డౌన్.. ఇలా అన్ని చర్యలను చాలా దేశాలు అభినందించాయి. ప్రశ్న: లాక్డౌన్ ఫెయిలైందని భావించొచ్చా? జవాబు: లాక్డౌన్ను ఫెయిల్యూర్ అనలేం. వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చేవారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఒత్తిడి తెచ్చారు. దీంతో మానవీయ కోణంలో వలస కార్మికులను రైళ్లు, బస్సుల ద్వారా పంపాం. లాక్డౌన్ ఎత్తివేసినా, పొడిగించినా ఆ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రశ్న: పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా? జవాబు: కరోనా చికిత్సకు ఉద్దేశించిన ప్రత్యేక ఆస్పత్రుల్లో 5 శాతం కూడా వినియోగంలో లేవు. మేం 4,39,244 పడకలు సిద్ధం చేశాం. ఇందులో 80 వేల పడకలు మాత్రమే వినియోగించాం. ఇంకా 3.5 లక్షల పడకలు ఖాళీగానే ఉన్నాయి. 31 వేల వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఉత్పత్తి అవుతోంది. దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. ప్రశ్న: కరోనా టెస్టులకు ఫిక్స్డ్ చార్జీలు ఉన్నట్లుగా ప్రైవేటు ఆస్పత్రుల చార్జీలను నియంత్రించే ఆలోచన ఉందా? జవాబు: ఆయుష్మాన్ భారత్ కింద కరోనా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నాం. మీరు (విలేకరులు) చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. కార్పొరేట్ ఆస్పత్రులకు ముకుతాడు వేసి పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా రేట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకంజవేయం. ప్రశ్న: విరసం నేత వరవరరావు విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని వారి కుటుంబం కోరడంపై ఏమంటారు? జవాబు: తప్పకుండా. మానవీయ కోణంలో ఆలోచించి చట్టపరిధిలో తగినరీతిలో చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: తెలుగు రాష్ట్రాలకు కిషన్రెడ్డి ఈ ఏడాదిలో ఎలాంటి సేవ అందించారు? జవాబు: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్య నా దృష్టికి వచ్చినా స్పందించా. భవిష్యత్తులోనూ కృషి చేస్తా. ప్రశ్న: తెలంగాణలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేస్తారా? జవాబు: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదు. అవకాశం ఉంటే తప్పకుండా చేస్తుంది. మేం కూడా అందుకోసం పనిచేస్తాం. ప్రశ్న: రెండు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఎలాంటి చొరవ చూపనుంది? జవాబు: ఇది గత 70 ఏళ్లుగా ఉన్న సమస్య. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడూ ఉంది. రెండు రాష్ట్రాలూ పరస్పరం చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. -
షూటింగ్లకు త్వరలోనే అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా షూటింగ్లకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నామని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేరోజు తెరుచుకునేలా చూస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చారు. శనివారం తెలు గు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ రంగ ప్రముఖులతో ఈ సందర్భం గా చర్చించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృ ష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ప్రారంభం, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమా రిలీజ్, రీజినల్ జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ షూ టింగ్లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంటామని, అలాగే పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలి పారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెరిగేలా రీజి నల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సిని మా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం విద్యుత్తు శాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సీఎంలతో మాట్లాడి సాయం చేస్తా.. జమ్మూ కశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూ టింగ్లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక సమావేశం పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని సూచించారు. ప్రజలంతా ఈ కష్టకాలంలో రాజకీ య, మత, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా ఉం డాలని సూచించారు. కరోనా నుంచి బయటపడితే దేశం మళ్లీ పురోగతి సాధిస్తుందన్నారు. వీడియో కా న్ఫరెన్స్లో పాల్గొన్న సినీ ప్రముఖులను పేరుపేరు నా మంత్రి యోగక్షేమాలు అడిగారు. సినిమా ప్ర ముఖులు కూడా కిషన్ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తోందంటూ కితాబు ఇచ్చారు. -
లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ను రాష్ట్రాలు కఠినం గా అమలు చేయాలని, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘తెలుగు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నాను. ఒక్కరోజే 17 మంది జిల్లా కలెక్టర్లతో మాట్లాడాను. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాను. కంట్రోల్ రూమ్ బాధ్యతలు నాకు అప్పగించడం అదృష్టం. పౌర విమానయానం, పౌర సరఫరాలు, రవాణా విభాగాలు ఎప్పటికప్పుడు ఈ కంట్రోల్ రూమ్ నుంచి స్పందిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేక ఆంధ్రా–తెలంగాణ సరిహద్దుల్లో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. వేలాది మంది విద్యార్థులు సరిహద్దుల్లో గంటల తరబటి వేచి ఉండటం సరికాదు. నేను ఉభయ రాష్ట్రాలను కోరుతున్నా. ముఖ్యమంత్రులు, అధికారులు ఈ సమస్య తలెత్తకుండా చూడాలి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలను కూడా ఆదేశించాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి ఎవరూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలు, పోలీసులపై ఉంది. దీన్ని ఉల్లంఘించకూడదు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి. అలా జరిగితేనే విపత్తు నుంచి బయటపడతాం. ఎవరూ దీనిని తక్కువగా అంచనా వేయకూడదు. బీజేపీ కార్యకర్తలు ఐదు మందికి ఉపయోగపడేలా భోజన ప్యాకెట్లు తయారు చేసి ఆకలితో ఉన్నవారికి అందజేయాలని కోరుతున్నాం. ఎన్జీవోలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. పశు పక్ష్యాదుల ఆకలి తీర్చాలి. కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ప్రకటించింది. 80 కోట్ల ప్రజలకు ఈ ప్యాకేజీ మేలు చేస్తుంది. కోవిడ్–19తో పోరాడుతున్న ఆరోగ్య విభాగాల సిబ్బందికి రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించింది’ అని వివరించారు. -
ఆ లేఖ అందింది: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు తన వద్ద సమాచారం ఉందని ఆ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆ లేఖ హోంశాఖ కార్యదర్శికి అందింది. హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. ఆ వివరాలు నేను కూడా తెలుసుకుంటున్నా. ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ తగినంత భద్రత ఉంది. ఆయన ఏపీ ఎప్పుడు వెళ్లినా పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని సీఎస్ను కోరాం. అవసరమైతే ఈమేరకు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత విషయం’ అని పేర్కొన్నారు. లేఖ ఆయనే రాశారా? అని మీడియా ప్రశ్నించగా ‘మాకు తెలిసినంతవరకు ఆయనే (ఎస్ఈసీ) రాసినట్లు సమాచారం ఉంది’ అని బదులిచ్చారు. -
రైతులు నష్టపోయారు
సాక్షి, హైదరాబాద్ : కంది, పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపును ప్రదర్శించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలోని కంది, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ దిగుబడులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపి కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించిందన్నారు.ఆదివారం దిల్కుషా అతిథిగృహంలో నాఫెడ్, మార్క్ఫెడ్, సీసీఐ అధికారులతో కిషన్రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.కంది రైతులు దిగుబడులను విక్రయించే అంశంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై స్పందించిన కేంద్రం రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర దక్కేదని, కందులు క్వింటాలుకు రూ.5,800 ఇస్తున్నామని, కానీ ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు లేక చాలామంది రైతులు రూ.3,500 నుంచి రూ.4,000 వంతున అమ్ముకున్నారన్నారు.ఒక్కో రైతు కనిష్టంగా రూ.1,500 నష్టపోయారన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలో దాదాపు 25శాతం దిగుబడులను నాఫెడ్ కొనుగోలు చేసిందన్నారు. 51,625 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు.దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ ద్వారా చేపట్టామన్నారు.నాసిరరమైనా కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కరోనాపై అప్రమత్తం కరోనాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోందని కిషన్రెడ్డి తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకొస్తున్నామన్నారు. పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, కరోనాపై జాగ్రత్తల విషయంలో పార్లమెంటులో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర న్యాయ శాఖదేనని స్పష్టం చేశారు. ‘జమ్ము, కశ్మీర్ బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులతో ఆయన గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి, ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తానని, జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదని, అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచన చేస్తున్నామని వివరిం చారు. మే నెలలో జమ్మూ కశ్మీర్ ‘ఔట్ రీచ్’కార్యక్రమం అమలు చేస్తామని, కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్కు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు. ఢిల్లీ ఘర్షణలపై సిట్..: ‘ఢిల్లీలో ప్రశాంత వాతావర ణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా యి. కర్ఫ్యూ ఎత్తేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణకు ‘సిట్’(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది’అని కిషన్రెడ్డి వివరించారు. -
‘మెట్రో’పై కిషన్రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డిది అనవసర రాద్ధాంతం అని, ఆయనకు రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణపై ప్రేమ లేదని మరోమారు నిరూపించుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ కర్నె ప్రభాకర్ విమ ర్శించారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిషన్రెడ్డి వైఖరిని ఖండించారు. మెట్రో రైలుకు రూ.1,200 కోట్ల కేటాయింపు కేంద్రంతో కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని, అందులో కిషన్రెడ్డి మెహర్బానీ ఏమీ లేదని ప్రభాకర్ స్పష్టంచేశారు. మెట్రో ప్రారంభానికి సంబంధించిన ప్రతీ ప్రకటనలోనూ ప్రధాని మోదీ ఫొటోను వేయడాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం నుంచి తెలంగాణకు ఏదైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే పౌర సన్మానం చేస్తామని ప్రభాకర్ ప్రకటించారు. -
లవ్ జిహాద్కు నిర్వచనం లేదు
న్యూఢిల్లీ: ‘లవ్ జిహాద్’ అనే మాటకు ప్రస్తుత చట్టాల్లో ఎటువంటి నిర్వచనం లేదని, కేంద్ర సంస్థలేవీ లవ్ జిహాద్కు సంబంధించిన కేసులను విచారణ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి కేరళ కాంగ్రెస్ నాయకుడు బెన్నీ బెహనా అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దక్షిణాదిలో లవ్ జిహాద్ కేసులు నమోదు చేశాయా అని బెన్నీ బెహనా అడిగారు. అదేవిధంగా, ఎన్నార్సీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మంగళవారం ఎయిర్క్రాఫ్ట్ చట్ట ఉల్లంఘనుల నుంచి భారీ జరిమానా వసూలు చేయడం సహా పలు ప్రతిపాదనలతో ఎయిర్క్రాఫ్ట్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.1కోటికి ప్రభుత్వం పెంచింది. (చదవండి: అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?) -
కుల ప్రభావం లేనప్పుడే స్వరాజ్యం
రాజేంద్రనగర్: మహాత్మాగాంధీ చెప్పినట్లుగా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఎన్నికల్లో డబ్బు, కుల, మత ప్రభావం ఉండకూడదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. గురువారం రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ)లో అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం గ్రామాల నుంచి యువకులు, ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి ఎన్నిక అవుతున్నారన్నారు. అనంతరం పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామాలు అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సులో కమిషనర్లు అంతా సమగ్రంగా చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలను అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్, ఏకే చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్కరికీ నష్టం జరిగినా సీఏఏ సవరణకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల హైదరాబాద్లోనే కాదు.. దేశంలోని ఏ ముస్లింకు నష్టం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఇది ఏ మతానికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరిగినా ఆ చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే విపక్షాలు సీఏఏపై విషం చిమ్ముతున్నాయని దుయ్యబట్టారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) పైనా విషప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డితో గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) బషీర్బాగ్లోని దేశోద్ధారకభవన్లో మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఇందులో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. దేశం నుంచి ఏ ఒక్కరినీ పంపించబోం సీఏఏతో దేశంలోని 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ సమస్య ఉండదని కిషన్రెడ్డి చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మైనారిటీలు ఇబ్బందులు పడుతూ భారత్కు వచ్చిన హిందు, క్రైస్తవ, సిక్కు, బౌద్ధులకు మనదేశంలో పౌరసత్వం ఇచ్చి వారికి తోడ్పాటును అందించమే చట్టం లక్ష్యమన్నారు. అది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఈ దేశం నుంచి ఏ ఒక్కరిని పంపించేది ఉండదన్నారు. ప్రతిపక్షాల వాదనలను ముస్లిం లు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. సీఏఏ అమలుపై సీఎంలతో సమావేశం సీఏఏను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతామని, సీఎంలతో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని కిషన్రెడ్డి చెప్పారు. జనాభా లెక్కల కోసం వచ్చే వారిని తిప్పి పంపండి, కొట్టి పంపం డి అని కొంతమంది చెప్పడం సరికాదన్నారు. రాహుల్గాంధీ, మమతా బెనర్జీ ఇంటికి వెళ్లాలంటే వివరాలు ఇచ్చి, అనుమతి తీసుకొని వెళ్లాల్సిందే తప్ప, వారి ఇళ్లలోకి కిటికీల నుంచి, గోడలు దూకి వస్తే ఒప్పుకుంటారా? దేశం కూడా అలాంటిదే.. దొంగ దారిలో వచ్చే వారిని ఎలా అనుమతిస్తామని ప్రశ్నించారు. అస్సాం, బెంగళూరులో డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మరిన్ని సంస్కరణలు మోదీ ప్రభుత్వం సంస్కరణల ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కిషన్రెడ్డి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు విప్లవాత్మక నిర్ణయమని, త్వరలో కేంద్ర మంత్రులు జమ్మూ కశ్మీర్లో పర్యటించబోతున్నారన్నారు. కశ్మీర్లో ముందు జాగ్రత్త చర్యగా కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, ఇప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం ఉందన్నారు. అక్కడ తొలిసారిగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని.. అరెస్టయిన నేతలను వీలైనంత తొందరలోనే విడుదల చేస్తామన్నారు. ఇతర దేశాల్లోని భారతీయ ఆస్తుల ధ్వంసం సంఘటనల్లో ఎన్ఐఏ వెళ్లి దర్యాప్తు చేసేలా చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం మనపై ఉండదని, ఆయిల్ ధరలపై ప్రభావం ఉండవచ్చన్నారు. మున్సిపోల్స్లో అన్ని చోట్లా పోటీ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాలని నిర్ణయించామని కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాల పెత్తనం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ మిత్రపక్ష ఎంఐఎం ఎజెండాను అమలు చేస్తోందన్నారు. ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏపీ రాజ ధాని అంశం పూర్తిగా ఆ రాష్ట్ర పరిధిలోనిదేనన్నా రు. హైదరాబాద్ని దేశ రెండో రాజధాని చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ను ఆదరాబాదరగా రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారన్నారు. దానివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదన్నారు. దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నామన్నారు. ఇండియన్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే 2020 క్యాలెండర్ను కిషన్రెడ్డి ఆవిష్కరించారు. -
అప్పుడే బీజేపీలో చేరుతా; అలా అయితే వద్దు
సాక్షి, అనంతపురం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనంతరపురంలో సోమవారం పర్యటించారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కిషన్ రెడ్డిని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకున్న మరుక్షణం బీజేపీలో చేరుతానని ఆయన వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా దివాకర్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసులతో సతమతమవుతున్న జేసీ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అందుకనే బీజేపీ నేతలతో ఆయన టచ్లో ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇక అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ను జేసీ ఆదివారం కలిశారు.‘‘బీజేపీ మన పార్టీ....అందుకే నాకు అభిమానం’’ అని అన్నారు. సత్యకుమార్కు బొకే అందించి మాట కలిపారు. (చదవండి : పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి) బీజేపీ పునరావాస కేంద్రం కాదు.. సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎవరికీ పునరావాస కేంద్రం కాదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం అన్నారు. ‘మోదీ, అమిత్షా నాయకత్వం నచ్చితేనే.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి.అంతేగాని కేసుల్నించి తప్పించుకోవడానికి, మీ సొంత ప్రయోజనాలకోసమో, షరతులు పెట్టి మాత్రం బీజేపీలో చేరకండి’అని హితవు పలికారు. (చదవండి : జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ ) -
సీఏఏను అమలు చేసి తీరతాం
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదని, ఇది శరణార్థుల కోసం ఉద్దేశించిన చట్టం అని కేంద్ర హోం సహయ మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఇది దేశంలో ఏ ఒక్క ముస్లింకు, మరే ఇతర మతస్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వామపక్షాలు, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను విభజించే పద్ధతిలో రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని ధర్నాలు, నిరసనలు చేసినా సీఏఏను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఏఏకు మద్దతుగా సోమవారం ప్రజా ప్రదర్శన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానులు ఆయా దేశాల్లో ఉన్న మైనార్టీలపై మతదాడులు జరగకుండా రక్షణ కల్పించాలని చేసుకున్న ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ దేశాలుగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్ఎస్తో పాటు మేధావులకు సీఏఏపై జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ సైతం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు వస్తే చర్చించడానికి సిద్ధమన్నారు. ఎన్పీఆర్కు డాక్యుమెంట్ తప్పనిసరి కాదు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో (ఎన్పీఆర్) వివరాల నమోదుకు డాక్యుమెంటు ఇవ్వాలన్న నిబంధన లేదని జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్పీఆర్పై అవగాహన లేక రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగణన (సెన్సెస్) ప్రక్రియనే అప్డేట్ చేసి ఎన్పీఆర్ పేరిట వివరాలు సేకరిస్తున్నట్లు వివరించారు. సోమవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనగణన వల్ల సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికే అందుతాయన్నారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదు.. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని, వారిపై దాడులు చేయడం వల్ల 200 మంది ఆస్పత్రి పాలయ్యారని కిషన్రెడ్డి తెలిపారు. దీనికి తోడు నిరసనల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం చేశారని, ఆస్తులకు నష్టం చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు. ఆస్తులకు నష్టం చేకూర్చిన వారి నుంచి రికవరీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లనే దేశ విభజన జరిగిందని ఆరోపించారు. పాకిస్తాన్కు వంతపాడే రీతిలో ఎంఐఎం నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నిర్వహించిన సభకు తెలంగాణ మంత్రులు ఎలా హజరయ్యారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంఐఎం తోక పార్టీగా మారిం దని విమర్శించారు. కేసీఆర్ ఒవైసీ ఒత్తిడికి లొంగిపోతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీలు సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
జి. కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మనం మన జీవితకాలంలో ఎవరి గురించి అయితే ఆలోచించకూడదని అనుకుంటామో వారి గురించిన ఆలోచనల్లోకి మనకు తెలియకుండానే వెళ్లిపోయామని గ్రహించినప్పుడు ఒక్కసారిగా ఎక్కడో దారి తప్పినట్లుగా అయిపోతాం. మనం తిన్నగానే ఉంటాం. దారీ తిన్నగానే ఉంటుంది. ఆగి చూస్తే.. మన ఆలోచనల్లో లేని ఆ వ్యక్తి దారి మధ్యలోకి వచ్చి తలకిందులుగా నిలబడి ఉంటాడు! రేవంత్రెడ్డి గురించి ఆలోచించకూడదనే అనుకున్నాను. కానీ ఎంతటివాళ్లయినా ఆలోచన కోల్పోయి తన గురించి ఆలోచించేలా చేసుకుంటాడు అతడు! కాంగ్రెస్ డీఎన్ఏ అది. దారి వెంట మనిషిని ఊరికే పోనివ్వదు కాంగ్రెస్. ఆపుతుంది. ఆగకుండా పోతుంటే పిలుస్తుంది. పిలుస్తున్నా వినిపించుకోకుంటే.. ‘ఒక చట్టం తెచ్చారు తెలుసా? అంటుంది. అయినా పట్టించుకోకుండా వెళుతుంటే.. ‘ఆ చట్టాన్ని నీ కోసమే తెచ్చారు’ అంటుంది. ‘నీ కోసం’ అనే మాట వినగానే ఆ మనిషి ఆగిపోతాడు. ‘నీ కోసం’ అన్న దగ్గరే ఆగిపోతాడు. అప్పుడు రేవంత్రెడ్డిని అక్కడికి పంపుతుంది కాంగ్రెస్. ‘నీ కోసం’ అంటే ఏంటో ఆ మనిషికి వివరంగా చెప్పి రమ్మని పంపుతుంది. చట్టంలో ఏముందో ఆ మనిషికి చెప్పడు రేవంత్రెడ్డి. చట్టంలో ఏముందని చెప్పడానికి కాంగ్రెస్ తనను పంపిందో అది చెప్తాడు. ‘‘రేవంత్రెడ్డి ఇక్కడ దారి కాచి అందర్నీ అటకాయిస్తున్నాడు సార్..’’ అని హైద్రాబాద్ నుంచి మళ్లీ ఫోన్!! ‘‘అటకాయించి ఏం చేస్తున్నాడు?’’ అని అడిగాను. ‘‘పాకిస్తాన్లో పుట్టిన ఒక వ్యక్తి ఐఎస్ఐ లో ట్రైనింగ్ తీసుకుని హిందువుగానో లేక సిక్కుగానో మారువేషంలో ఇండియా వచ్చి, ఇండియా పౌరసత్వం తీసుకుని, రాజకీయాల్లో చేరి, ఎంపీ అయి, ఐఎస్ఐ ఇచ్చిన లక్ష కోట్లతోనో, రెండు లక్షల కోట్లతోనో ఎంపీలందర్నీ కొనేసి, ప్రధాన మంత్రి అయిపోయి, ప్రధాని అయ్యాక జమ్మూకశ్మీర్ను పాకిస్తాన్కు, పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్కు ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటని అందర్నీ ఆపి ఆపి అడుగుతున్నాడు సార్’’ అన్నాడు ఆ ఫోన్ చేసిన మనిషి. ‘‘నువ్వెవరు?’’ అన్నాను. ‘‘నేను ఈ దేశ పౌరుడిని సార్. భారతీయుడిని. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉన్నా కూడా వాటిని పరపర చింపి నోట్లో వేసుకుని.. ‘వేర్ ఆర్ యువర్ డాక్యుమెంట్స్’ అని ఢిల్లీ వాళ్లొచ్చి ఇంగ్లిష్లో అడుగుతారని రేవంత్రెడ్డి చెబుతున్నాడు సార్’’ అన్నాడు! ‘‘ఆర్ అండ్ బీ వాళ్లకు చెప్పకపోయావా?’’ అన్నాను. ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘ఇలాంటి వాళ్లందరూ రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తారు. వాళ్లకోమాట చెబితే దారి మధ్యలో అడ్డంగా ఉన్నవాటిని క్రేన్లతోనో, బుల్డోజర్లతోనో తొలగించి దారిని క్లియర్ చేస్తారు’’ అని చెప్పాను. ‘‘థ్యాంక్యూ సార్’’ అన్నాడు. ‘సరే’ అని ఫోన్ పెట్టేయబోతుంటే మళ్లీ ‘‘సార్..’’ అన్నాడు. ‘‘చెప్పు’’ అన్నాను. ‘‘సార్.. నేను నా దేశంలోనే ఉంటాను కదా సార్’’ అన్నాడు! ‘‘మనం మన దేశంలోనే ఉంటాం. మన దేశంలోకి వచ్చినవాళ్లు మన దేశంలోనే ఉంటారు. మన దేశంలోకి రాబోతున్నవాళ్లూ మన దేశంలోనే ఉంటారు. సరేనా’’ అన్నాను. ‘‘మరి చట్టం ఎందుకు సార్?’’ అన్నాడు! రేవంత్రెడ్డి ఏ లెవల్లో అటకాయిస్తున్నాడో అర్థమైంది. ‘‘లేనివాళ్లకు ఇవ్వడానికి చట్టం గానీ, ఉన్నవాళ్ల నుంచి తీసుకోడానికి కాదయ్యా. నిశ్చింతగా ఉండు’’ అని చెప్పాను. -మాధవ్ శింగరాజు -
రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రోహింగ్యాల వివరాలను సేకరిస్తున్నామని, రాష్ట్రంలో 6 వేల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఈ లెక్కలు తేలాయని, అందులో కొంత మందికి ఆధార్ కార్డులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మందగమనం విషయంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్ర బడ్జెట్ తగ్గిందని, బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం ఏర్పడిందంటూ అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం వచ్చిందనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఇది ఆర్థిక మాంద్యం కాదని, ఆర్థిక మందగమనమని పేర్కొన్నారు. కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని, రాష్ట్రం పాటించడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల వినియోగం తగ్గిందని, భారత ఆర్థిక వ్యవస్థపైనా కొంత ప్రభావం పడిందన్నారు. అందుకే వృద్ధి రేటు కొంత తగ్గిందని, వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. పెట్టుబడులు పెం చేందుకు అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. మూలధనం కింద బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇస్తున్నామని చెప్పారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచుతున్నామన్నారు. కార్పొరేట్ పారిశ్రామిక రంగానికి 10 శాతం పన్ను తగ్గించడం గత 20 ఏళ్లలో మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక మాం ద్యం నుంచి మన దేశాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంటేæ మన్మోహన్ సింగ్ హయాంలో 5.6 శాతం ఉందన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి జీడీపీ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉంటే నాలుగేళ్లలో 2.7 ట్రిలియ న్ డాలర్లకు చేరుకుందన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలకు బ్యాంకులు ఈ నగదును ఉపయోగించవచ్చని తెలిపారు. దేశ వ్యాప్తంగా సమస్యలపై పోలీసు, ఫైర్, మెడికల్, మహిళల వేధింపు లు తదితర అన్నింటిపై ఫిర్యాదు చేసేందుకు డయ ల్ 112 నంబర్ని తీసుకొస్తున్నామని కిషన్రెడ్డి తెలిపారు. దానిని ఢిల్లీలో ప్రారంభించామని, ప్రయోగాత్మకంగా అక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డయల్ 100, 101 ఉండవన్నారు. -
పరుగులెత్తనున్న ప్రగతి రథం
నాలుగు నెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతోంది. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, మూలధనలబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబడులరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి తయారీ కంపెనీలు భారత్కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆర్థికరంగ వృద్ధి కోసం మోదీ ప్రభుత్వం నాలుగు నెలలుగా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. మరో అయిదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా తక్షణ కార్యాచరణను ముమ్మరం చేసింది. గత అయిదేళ్ల పాలనలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించగా, ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు ఊతం ఇచ్చింది. 2015లోనే మేకిన్ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహమి చ్చారు. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టులు, ఓడరేవుల అభివృద్ధి అనుసంధానం వల్ల పలు కంపెనీలు ఏర్పడ్డాయి. మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్లో తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు నాలుగునెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతుంది. బ్యాంకులకు మూలధన వనరులకింద రూ. 70 వేల కోట్లు అందించడం, విదేశీ రుణాలకు అవకాశం, డాలర్లలో చెల్లింపులకు, రూపాయి బాండ్లు జారీకి సడలింపులు ఇచ్చింది. గృహనిర్మాణం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు , ఎగుమతుల రంగాలకి ప్రోత్సాహకాలు ఇచ్చింది. సర్ఛార్జి తొలగించి పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చింది. తాజాగా కార్పొరేట్ రంగానికి విధించే పన్నును 10 శాతం వరకు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత 28 ఏళ్లలో ఈ స్థాయిలో పన్ను తగ్గించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో కార్పొరేట్ పన్ను 35 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గింది. కనీస ప్రత్యామ్నాయ పన్నుగా విధించే 18.5 శాతం పన్నును 15 శాతానికి కుదించారు. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టు ఫోలియో మదుపుదారులకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీలపన్ను, మూలధన లబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. కొత్త కంపెనీలకు కార్పొరేట్ రంగంలో 2023 మార్చి 31 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు ఆదాయపు పన్ను 15 శాతంగా ఉంటుంది. ఈ సంస్థలు ఎలాంటి కనీస ప్రత్యామ్నాయ పన్ను వంటివి చెల్లించనవసరం లేదు. కార్పొరేట్లు దేశీయ కంపెనీలు అయితే ఎలాంటి ప్రోత్సాహకాలు తీసుకోకుండా 22 శాతం పన్నులు చెల్లించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పన్ను కూడా వారిపై విధించరు. ఇలాంటి సంస్థలకు అన్ని నుంకాలు, సెస్సులు కలిపి 25.17శాతంగా పన్నులు ఉంటాయి. దేశీయ ఉత్పత్తిరంగ సంస్థలకు మార్కెట్ వసతి కల్పించేందుకు మెగా మార్కెట్ జాతాలు నిర్వహిస్తారు. ఇన్ని ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబుడలరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థికరంగం బలోపేతం దేశీయ కంపెనీలకు విత్త సహాయం కావాలంటే బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. 2017 వరకు దేశంలో ఈ పరిస్థితి లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు బ్యాంకుల వద్ద భారీగా అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా తిరిగి చెల్లించకపోవడంతో రానిబాకీలు బాగా పెరిగాయి. ఇలాంటి నిరర్ధక ఆస్తులను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసింది. బ్యాంకులకు రుణం చెల్లించక ఎగవేసిన వారు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఇదికాక పెద్దమొత్తంలో నగదు బ్యాంకుల వద్ద కాక కొద్దిమంది వద్ద మాత్రమే ఉండిపోయింది. దానిని బయటకు తీసుకువచ్చేందుకు పెద్దనోట్ల రద్దును 2017లో అమలు చేసి నగదును బ్యాంకుల వద్దకు తీసుకువచ్చారు. బ్యాంకులకు మరింత ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు రూ.70 వేల కోట్లు ఇచ్చారు. బ్యాంకులకు మరింత శక్తిని కల్పించే క్రమంలో గత నెలలోనే పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చారు. అలాగే ఇకపై 27 ప్రభుత్వరంగ బ్యాంకుల స్థానంలో 12 బ్యాంకులు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వం మార్కెట్లో రూ. 5 లక్షల కోట్లు ద్రవ్య నిధి జారీ చేయడానికి అడ్వాన్స్గా రూ. 7 లక్షల కోట్లు జమచేస్తుంది. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ వ్యాపారులు, ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులు మొదలైన వారికి లాభం కలుగుతుంది. బ్యాంకు రుణగ్రహీతలందరికీ లాభం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్ఆర్ తగ్గించడానికి రేట్లలో కోత విధించాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా రుణ ఉత్పాదనలకు సంబంధించిన రెపో రేటు, ఔటర్ బెంచ్ మార్కు ఏర్పాటు చేయటం, ఆగిపోయిన గృహ నిర్మాణాల కోసం ఒక ప్రత్యేక గవాక్ష విభాగం ద్వారా సహాయం అందిస్తారు. దీని కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. 2020 మార్చి 31 వరకూ ఇబ్బందుల్లో ఉన్న ఏ ఎంఎస్ఎంఈని ఎన్పీఏగా ప్రకటించరు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్, వ్యక్తిగత రుణాలు తీసుకునేవారి ముఖాముఖీ సమావే శాలు జరుగుతాయి. ఇందులో బ్యాంకుల ద్వారా రుణగ్రహీతలకు భారీగా నగదు అందుతుంది. తయారీ కంపెనీల వరుస కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటిం చిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి తయారీ కంపెనీలు భార త్కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తయారీ రంగంలో ఎగుమతుల్లో ప్రథమస్థానంలో ఉన్న చైనా ఇప్పుడు సంక్షోభంలో ఉంది. రెండేళ్లుగా చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న వ్యాపార పోరాటమే దీనికి కారణం. ఇదొక్కటే కాదు చైనాలో ఉన్న అమెరికా కంపెనీలన్నీ త్వరలో అక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు రానున్నాయి. ఇలా చైనాను విడిచే కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూడనున్నాయి. నైపుణ్యం, తక్కువ వేతనంలో లభించే పనివారు చైనాకంటే భారత్లో లభ్యమైనా, అధిక పన్నులు ఉండటం వల్ల భారత్ పోటీ పడలేకపోయింది. ప్రస్తుతం పన్నుల తగ్గింపుతోపాటు మౌలికవసతులు కల్పించడంతో ఇక భారత్, త్వరలో చైనాకు ప్రత్యామ్నాయ తయారీ రంగంగా రూపుదిద్దుకోనుంది. దేశీయంగా ఉపయోగం దేశంలో పెట్టుబడుల రూపంలో ఒక పెద్ద మొత్తం మన ఆర్థ్ధికవ్యవస్థలో చేరుతుంది. ఈ పెట్టుబడి ముఖ్యంగా తయారీ రంగంలో, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇల్లు, వాహనాలు, వినియోగవస్తువుల కొనుగోలును ప్రోత్సహించేందుకు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సీ), నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎఫ్సి)కి అదనంగా ఇచ్చే రూ. 20 వేల కోట్ల సహాయాన్ని రూ. 30 వేల కోట్లకు పెంచుతారు. బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థ, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సీ), విస్తారంగా భూములు కొనడం కోసం పాక్షిక రుణ భద్రతా పథకం ఏర్పాటు, ఎగుమతుల రుణాలు రూ. 38 వేల కోట్ల నుంచి రూ. 68 వేల కోట్లకు పెంపు, ఎగుమతి రుణాలపై బీమా పరిధి పెంపు వంటి ప్రోత్సాహకాలు అమలు చేస్తారు. తక్కువ పన్నుల విధానం, అనుమతుల మంజూరులో మౌలిక మార్పులు తెస్తారు. కొత్త ప్రాజెక్టుల రూపంలో ద్రవ్య పెట్టుబడి జరుగుతుంటే దీనివల్ల తయారీరంగపు యూనిట్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దీనివల్ల ముందుముందు మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. ఆర్థికవ్యవస్థకు లాభం కలుగుతుంది. తయారీ రంగంలో అధిక పెట్టుబడులు వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో కార్మికుల వేతనాన్ని పెంచుతాయి. ప్రజలు వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడతారు. దాంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉత్పాదకత పెరగడంతోపాటు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. వారి ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు వీలు కలుగుతుంది. జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి -
మాటలతోనే మభ్యపెడుతున్నారు..
సాక్షి, మహబూబ్నగర్ : పాలమూరు ప్రజలు కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మాటలతో వారి కడుపు నింపుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన వివిధ రంగాల ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పక్కనే కృష్ణానది పారుతున్నా.. వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. ఇక్కడి ప్రజలు పనులు లేక వలసలు వెళుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చింతమడకపై ఉన్న ప్రేమ పాలమూరుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. గతంలో తాను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో పాలమూరు నుంచి పోరు యాత్ర ప్రారంభించడం జరిగిందని, ఇక్కడి ప్రజల కష్టాలు తనకు తెలుసన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతివంతమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందని, యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఉండొద్దని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. పాలమూరు నుంచి మొట్ట మొదటి సారిగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ : పి.చంద్రశేఖర్ దేశంలో సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తుందని మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ ఆరోపించారు. ట్రిబుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు భద్రత, స్వేచ్ఛ వచ్చిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం గ్రామాల్లో చెట్టు చనిపోతే సర్పంచి పదవికి తలాక్ చెబుతున్నారని విమర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రేమతో పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న మోదీ, అమిత్షాల వంటి సమర్థవంతమైన నాయకులు దేశానికి అవసరమన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో మిగులు విద్యుత్ దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. దేశంలోని 18 వేల గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వెలుగులు నింపామని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించిన ఘనత తమదేనన్నారు. తెలంగాణలో ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, ఆస్పత్రులకు బాకీలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి -
ఉగ్రవాదుల డేటాబ్యాంక్!
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే చట్టాన్ని తీసుకొచ్చామని, అలాంటివారి డేటా బ్యాంక్ను తయారు చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి(యూఎన్)తో కలసి జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదుల డేటాబ్యాంక్ను రూపొందిస్తామని తెలిపారు. లైంగిక, సైబర్, ఇతర నేరాలకు పాల్పడేవారి డేటాబ్యాంక్ను సైతం తయారు చేస్తున్నామని, భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు, బ్యాంకురుణాలు లభించవని స్పష్టం చేశా రు. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానించే ప్రక్రియ 90 శాతం పూర్తి అయిందని, ఏ పోలీసుస్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చని అన్నారు. బంగ్లాదేశ్సహా ప్రపంచంలోని చాలాదేశాలు తమ పౌరులకు స్మార్ట్ గుర్తింపుకార్డులు జారీచేశాయని, మనదేశంలో సైతం అలాంటివి జారీ చేస్తే బాగుంటుందని అన్నారు. స్మార్ట్కార్డు ద్వారా పౌరుల సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుందని, అయితే, ఆధార్కార్డునే సరిగ్గా అమలు చేయనీయడం లేదని, స్మార్ట్కార్డులను తెస్తే అంగీకరించే పరిస్థితులు లేవన్నారు. సరిహద్దులకు సైబర్ ఫెన్సింగ్ దేశ సరిహద్దులకు మానవరహిత రక్షణ కల్పించేందుకు సైబర్ టెక్నాలజీతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని, ఇండో–పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ‘హై టెక్నికల్ సర్వెలైన్స్ సిస్టం’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా భూమి, నీరు, గాలి, భూగర్భంలో నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని, చొరబాటుదారులను ఏరివేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా చైనా సరిహద్దులో ఏం జరుగుతుందో తామే ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కూర్చొని ప్రత్యక్షంగా చూసుకోవచ్చని పేర్కొన్నారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తులపై సైబర్ దాడులు జరగకుండా ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సైబర్నేరాలు పెద్దఎత్తున పెరిగే అవకాశమున్నందున కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి కోసం హోంశాఖలో వుమెన్ సేఫ్టీ డివిజన్ను ఏర్పాటు చేశామని కిషన్రెడ్డి తెలిపారు. మహిళలపై సైబర్ నేరాల నిర్మూలనకు, ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలను నియంత్రించేందుకు జాతీయస్థాయిలో హిమ్మత్ పేరుతో 112 అత్యవసర కాల్ సదుపాయాన్ని ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది కాశ్మీర్లో ప్రశాంతత నెలకొందని, ప్రజలు రోడ్లమీద స్వేచ్ఛగా తిరుగుతున్నారని కిషన్రెడ్డి అన్నా రు. కాశ్మీర్లోని చాలాప్రాంతాల్లో శనివారం కర్ఫ్యూ ఎత్తివేశామని, ప్రజలందరూ సంతోషంగా బక్రీద్, ఇతర పండుగలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సదస్సు అనంతరం కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆరి్టకల్ 370 రద్దుపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ హెచ్చరించిన నేపథ్యంలో అంతర్గతంగా, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పాకిస్తాన్ చెప్పినంత తేలికగా భారతదేశంలో ఏదైనా చేసే పరిస్థితులు లేవని చెప్పారు. ఆర్టికల్ 370 కారణంగా దేశానికి జరుగుతున్న నష్టాన్ని పూరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల జమ్మూకాశ్మీర్తోపాటు దేశానికీ ప్రయోజనం కలుగుతుందని పేర్కొ న్నారు. ఆరి్టకల్ 370 రద్దుతో అక్కడికి పరిశ్రమలు వస్తాయని, స్థానికులకు ఉద్యోగాలొస్తాయన్నారు. ఇక నుంచి అక్కడ భారతీయ చట్టాలు అమలవుతాయన్నారు. పీఎం జాగ్రత్తగా మాట్లాడమన్నారు ఎవరి దగ్గర ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే తమను హెచ్చరిస్తున్నారని కిషన్రెడ్డి తెలిపారు. స్నేహి తులే కదా అని వారి వద్ద క్యాజువల్గా మట్లాడినా రికార్డు చేసే అవకాశముండటంతో అప్రమత్తతతో ఉండాల్సి వస్తోందన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పారు. -
మన విద్యార్థులు పదిలం
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్ను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందులో చదువుతున్న 135 మంది తెలుగు విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ జమ్మూకశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఎన్ఐటీలోని 5,000 మంది విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులతో సమన్వయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బలగాల రక్షణలో ముందుగా జమ్మూ పట్టణానికి తరలిస్తున్నామని, అక్కడి నుంచి వివిధ రవాణా మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఎలాంటి ఆందోళన చెందరాదని కోరారు. తెలంగాణ విద్యార్థుల జాబితాను బండి సంజయ్.. కిషన్రెడ్డికి అందజేశారు. మరోవైపు ఈ అంశంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీనగర్లోని తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతూ తనకు మెసేజ్లు పంపుతున్నారని, అయితే విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సాయం కావాల్సిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని 011–233820141, 919968299337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులతో భవన్ అధికారుల సంప్రదింపులు ఎన్ఐటీ విద్యార్థులతో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి సంప్రదింపులు జరిపారు. విద్యార్థులను జమ్మూ వరకు చేర్చేందుకు ఎన్ఐటీ అధికారులు నాలుగు బస్సులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు విద్యార్థులు జమ్మూ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారిని 3 బస్సుల్లో ఢిల్లీకి చేర్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారని, వారితో సమన్వయం చేస్తున్నామని ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. విద్యార్థులు ఢిల్లీ చేరగానే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. -
విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో చదువుతున్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో, రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను క్షేమంగా స్వస్థలాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావులు ప్రతి క్షణం కిషన్ రెడ్డికి సహాయంగా ఉంటున్నారు. -
ఒకేసారి 3 కీలక బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి ఒకే రోజు మూడు కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ –2008ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును, అలాగే మానవ హక్కుల చట్టం –1993ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఇలా బిల్లులను ప్రవేశపెట్టడాన్ని విపక్ష సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, శశిథరూర్, ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు వ్యతిరేకించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును వ్యతిరేకించారు. సంస్థలుగా కాకుండా వ్యక్తులు గానూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నిర్బంధించేందుకు వీలుగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, తీవ్రవాది అనే పేరుతో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మిగిలిన బిల్లులపైనా విభిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయా సభ్యులు వ్యతిరేకించారు. అయితే మంత్రి కిషన్రెడ్డి ఆయా విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించబోదని, సంస్థలను నిషేధించినా వాటి నుంచి విడిపోయి బయటకు వచ్చి వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం తేవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆధార్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఆధార్ను స్వచ్చందంగా ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే ఆధార్ సవరణ బిల్లు–2019ను రాజ్యసభ ఆమోదించింది. గత వారం ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఫోన్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ధ్రువీకరణకు ఆధార్ వివరాలను వాడుకునేందుకు తాజా ప్రతిపాదనల్లో ప్రభుత్వం వీలు కల్పించింది. -
మూడేళ్లలో 733 మందిని మట్టుబెట్టాం
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో గత మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మంగళవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018లో 257 మంది, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందిచినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 16 వరకు 113 ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ మడేళ్లలో జమ్మూ కశ్మీర్లోని 112 మంది పౌరులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భద్రతా బలాలు నిరంతరం సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్బ్లాక్లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
కిషన్రెడ్డికి కీలక శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. -
లాభమే తప్ప... నష్టమేం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్సరళి తమకు కలసివస్తుందని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన సికింద్రాబాద్ స్థానాన్ని కచ్చితంగా గెలవడంతోపాటు అదనంగా ఒకట్రెండు స్థానాలు బోనస్గా లభిస్తాయని అంచనా వేస్తున్నారు. నరేంద్రమోదీ చరిష్మాతోపాటు పోటీ చేసిన అభ్యర్థుల పలుకుబడి, జాతీయపార్టీగా సానుకూలత వెరసి మంచి ఫలితాలు వస్తాయని, గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లశాతం కూడా పెరుగుతుందని కమలంపార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు ఆదిలాబాద్, నిజామాబాద్లలో కూడా గట్టిపోటీ ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదింట ప్రభావం..! రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను ఐదుచోట్ల పార్టీ పక్షాన గట్టిపోటీ ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్లలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొన్నామని, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిష్మాకు తోడు పార్టీకి ఉన్న బలం, నమో మంత్రం కలిసి వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్లో కూడా గణనీయంగా ఓట్లు తెచ్చుకుంటామని చెబుతున్న బీజేపీ నేతలకు నిజామాబాద్లో క్రాస్ఓటింగ్ ఆశలు రేకెత్తిస్తోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు తమకే క్రాస్ అయ్యాయని బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్లో ఓటర్లు అధికసంఖ్యలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు పార్టీ నేతలు అంచనాకు వచ్చారు. సికింద్రాబాద్ బరిలో నిలిచిన కిషన్రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఈసారి సానుభూతి ఓట్లు తమకు అనుకూలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పట్టణ ఓటర్లు ఎక్కువశాతం బీజేపీకే ఓట్లు వేశారన్న ధీమాతో పార్టీ ఉంది. మహబూబ్నగర్లోనూ మాజీమంత్రి డీకే అరుణకు ఉన్న పార్టీ కేడర్తో, కాంగ్రెస్ నుంచి కూడా ఓట్లు భారీగా వేశారని భావిస్తున్నారు. కరీంనగర్లోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి మొదటి నుంచి ఉన్న ఓటు బ్యాంకుతోపాటు టీఆర్ఎస్పట్ల ఉన్న వ్యతిరేకత బాగా కలిసి వచ్చిందని, భారీగా ఓట్లు వస్తాయని పార్టీవర్గాల పేర్కొంటున్నాయి. బలీయశక్తిగా ఎదుగుతామా? లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి బీజేపీ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తమ ఓటుబ్యాంకు రెట్టింపు అవుతుందని, భవిష్యత్తులో పోటీ తమకు, టీఆర్ఎస్కేనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి మంచి నాయకత్వం వస్తుందని, కొత్తగా బలమైన నేతలు తెరపైకి వస్తారని, మళ్లీ ఎలాగూ మోదీ ప్రధాని అవుతారు కనుక పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం గమనార్హం. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొంటున్నారు. -
సికింద్రాబాద్ బరిలో కిషన్రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై దిగ్భ్రాంతికి గురైన తెలంగాణ బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై ఆశగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా ఏడు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి సిట్టింగ్ సీటైన సికింద్రాబాద్తోపాటు నగర ఓటర్లున్న మల్కాజిగిరి స్థానంపై ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది.సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తాను బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే, మంగళవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2004లో హిమాయత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత 2009, 2014లో అంబర్పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోయిన ముఖ్యమైన నేతలలో ఆయన కూడా ఒకరు. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో నిలవాలని గతంలోనే కిషన్రెడ్డి ప్రణాళిక రచించుకున్నప్పటికీ శాసనసభ ఎన్నికలు ముందస్తుగా రావడంతో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్పేయి, మోదీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ దత్తాత్రేయకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చని, కిషన్రెడ్డి వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇతర పార్టీల నేతలకు స్వాగతం..! ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు కూడా బీజేపీ స్వాగతం పలుకుతోంది. మహబూబ్నగర్ నుంచి టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత ఏపీ జితేందర్రెడ్డికి ఆ పార్టీ టికెట్ దొరక్కపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. పెద్దపల్లి నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ నేతకు టికెట్ దక్కనిపక్షంలో తమ వద్దకే చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్ తదితర స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ప్రముఖులెవరూ ఆసక్తి కనబరచడం లేదు. మల్కాజిగిరి నుంచి రాంచందర్రావు మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి న్యాయవాది, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావును పోటీ చేయించేందుకు బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. రాంచందర్రావు 2018 శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ జంటనగరాల పరిధిలో ఉండడంతో అర్బన్ ఓటర్లు మోదీ నాయకత్వంపై సానుకూల దృక్పథంతో ఓటు వేస్తారని బీజేపీ ఆశిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి జనార్దన్రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, జహీరాబాద్ నుంచి సోమాయప్ప స్వామీజీ, మహబూబ్నగర్ నుంచి శాంతికుమార్ పేర్లు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. -
‘కత్తిని ఈ మధ్యే చూస్తున్నాను’
సాక్షి, హైదరాబాద్: రామాయణంపై, సీతారాముల పవిత్ర బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్పై బీజేపీ శాసనపక్ష నేత కిషన్రెడ్డి మండిపడ్డారు. ప్రచారం కోసం కొందరు వ్యక్తులు మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘కొందరు స్వయం ప్రకటిత మేధావులు రాముడి మీద, రామాయణం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామ’ని హెచ్చరించారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారు మరో మతంపై ఇలా నోరు జారగలరా..! అని ప్రశ్నించారు. ‘కత్తి మహేశ్ను ఈ మధ్యే చూస్తున్నాను. నువ్ ఏమన్నా మాట్లాడుకో. కానీ, దేవుళ్ల మీద, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద’ని అన్నారు. హిందువులను కించ పరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
టీఆర్ఎస్ కూడా అలా చేయాలి
సాక్షి, హైదరాబాద్: 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభ పక్ష నేత జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీ వేసిన మరో ముందడుగని పేర్కొన్నారు. అసెంబ్లీ మీటింగ్ హాల్లో బుధవారం వారు మీడియాతో మట్లాడారు. పంటల సాగు వ్యయానికి 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను స్థిరీకరిస్తామని గత లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ అన్నారు. రైతుల సంక్షేమానికై బీజేపీ కట్టుబడి ఉందనీ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పుడెందుకు నోరుమెదపరు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులపై మాట్లాడే రాజకీయ పార్టీలు రైతుల సంక్షేమానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కిషన్రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికై పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల మాదిరిగా పంటలకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్ పాలన
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని శాసనసభలో బీజేపీ పక్షనేత జి.కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే పరిస్థితులు లేవు. కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, బాధ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు ఇనుప సంకెళ్లు వేశారు. ఇప్పుడు రైతుల చేతులకు బంగారు సంకెళ్లు వేస్తున్నారు. వర్గీకరణపై పోరాడిన మంద కృష్ణను రెండుసార్లు జైలుకు పంపారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారు. కలాలకు, కళాకారులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసి బంగారు తెలంగాణ సాధిస్తారా?’అని ప్రశ్నించారు. నేతల భాషపైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై అధికారులతో చర్చించి వీలై నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
ఫిరాయింపులను ఎన్నడూ సమర్థించం
పార్టీలు మారిన చట్టసభల సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని, అలా చేయకుండా మరోపార్టీలో చేరితే వారిపై తప్పక చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేయాలనే అంశంలో బీజేపీ వైఖరి మారదన్నారు. ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని, ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదన్నారు. చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదని, అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామని బీజేపీ అధిష్టానం తమకు ఎన్నడూ చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త ఒరవడి సృష్టించిన ఘనత వైఎస్సార్దేననీ.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఫించన్లు.. ఇలా జీవితం పట్ల జనంలో నమ్మకం కలిగించిన గొప్ప మనిషి ఆయన అంటున్న కిషన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... పాతికేళ్లుగా మీ ఆకారంలో మార్పులేదు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? రహస్యం ఒక్కటేనండి. గత పదిహేనేళ్లుగా నా నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక బస్తీలో పర్యటిస్తున్నాను. అలాగే తప్పకుండా ఉదయం పూట నడుస్తాను. ఇంట్లో కూడా ఆహారం మీద నియంత్రణ ఉంటుంది. ఇంట్లో ఉదయం పూట ఒకే ఒక జొన్న రొట్టె తింటాను. తిని బయటకు వెళితే రాత్రి 11 గంటలకే మళ్లీ ఇంటికి వస్తాను. నాకు ఇంట్లో ప్రధాన ప్రత్యర్థులు నా పిల్లలే. స్కూల్ ఫంక్షన్కు రమ్మని, ఇతరత్రా అడుగుతుంటారు. అంతకుమించి నా శ్రీమతిని ఇంకా ఇబ్బంది పెట్టి ఉంటాను. మద్యాహ్నం బయట తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. రాత్రి ఇంటికి వస్తే మళ్లీ రొట్టె తింటాను. అప్పటికే పిల్లలు నిద్రపోయి ఉంటారు. ఆమెను కూడా లేపకుండా నేనే ఏదో ఒకటి పెట్టుకుని తినేస్తాను. పేదింట్లో తిన్నా, స్టార్ హోటల్లో తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. ఇదే నా ఆరోగ్య రహస్యం. రాష్ట్రం కోసం రథయాత్రలు చేశారు. తెలంగాణ ఇప్పుడెలా ఉంది? తెలంగాణ ప్రజలు ఇవ్వాళ సంతృప్తిగా లేరు. టీఆర్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ప్రచారాలు చేసినా ప్రజల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఇంతమందిమి తెలంగాణ కోసం బలిదానాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా? మావాళ్లు ఇంతమందిమి చనిపోయింది ఆ కుటుంబ పెత్తనం కింద పనిచేయడం కోసమా? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగిన తెలంగాణలో నిజాం ఆలోచనా విధానంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆలోచన ప్రజల్లో ఉంది. అన్ని వర్గాల్లో తెలియని అసంతృప్తి. ఎస్టీ యువతలో అసంతృప్తి, రైతుల్లో అసంతృప్తి, నిరుద్యోగ యువత, పట్టణ పేదప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. శాసనసభా పక్ష నేత అయిన మీకే కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదా? కోదండరామ్కే ఈ రోజువరకు అప్పాయింట్మెంట్ లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉదయం అడిగితే సాయంత్రానికి అప్పాయింట్మెంట్ ఇచ్చేవారు. వైఎస్సార్ అయితే చాలామందిమి వెళితే గేటువద్దకే వచ్చి కలిసి మాట్లాడేవారు. అంత గొప్ప సంప్రదాయం పాటించేవారాయన. ఆంద్రాపాలకులే సీఎంలుగా ఉన్నప్పుడు వాళ్ల చాంబర్లో రాజకీయనేతలే కాదు. వామపక్ష భావాలున్న ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి నాయకులు, కార్మిక నేతలు, కుల సంఘాల నేతలు కూడా స్వేచ్చగా వెళ్లి కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క ఘటన అలాంటిది కేసీఆర్ చాంబర్లో జరిగిందేమో చూడండిమరి. ఎవ్వరినైనా సరే కేసీఆర్ కలిసే ప్రసక్తే లేదు. దశాబ్దాలుగా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టు కార్మిక నేతలను కూడా కేసీఆర్ కలవడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛపై మీ అభిప్రాయం? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికాస్వేచ్ఛపై ఎలాంటి నియంత్రణ అమల్లో ఉండిందో అలాంటి స్థితిని తెలంగాణ కొంతకాలం క్రితం చవిచూసింది. కొన్ని టీవీ చానెళ్లనే మూసివేయించారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారు. పది కిలోమీటర్ల పరిధిలో మాకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే భూమిలోకి తొక్కుతాను అన్న ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎప్పుడైనా చూశామా? కానీ దీనికి వ్యతిరేకంగా ఒక్క పేపర్ మాట్లాడలేదు. ఒక్క టీవీ కూడా మాట్లాడలేదు. తెలంగాణ మొత్తంగా ఒక బ్లాక్ మెయిలింగ్ వాతావరణం, నియంత్రత్వ వాతావరణం ఆవరించింది. ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు ఉన్నప్పటికీ యాజమాన్యాలు చెప్పాయి కాబట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేకపోయారు. అందర్నీ నేను దారిలోకి తెచ్చుకున్నాను కదా. నాకు వ్యతిరేకంగా రాసేదెవరు ఇప్పుడు అని ఇప్పటికీ కేసీఆర్ దర్పంగా అంటున్నారు.? టీవీల్లో ఏదైనా చర్చ జరుగుతుంటే, ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేసి ఆ చర్చ ఇక ఆపేయ్ అని ఆదేశిస్తుంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయి? సర్వేల ఫలితాల గురించి ఎవరేం చెప్పుకున్నా, ఒకటి మాత్రం నిజం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ తప్పదు. మేం అధికారంలోకి రావడం కష్టసాధ్యమైన కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం మెజారిటీ రాదు. ఫిరాయింపుల మీద బీజేపీకి ఒక నిర్దిష్ట వైఖరి ఏమైనా ఉందా? ఫిరాయింపులు చాలా తప్పు. అలా పార్టీలు మారితే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలనేది మా విధానం. అలా రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీల సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు? వెంకయ్య నాయుడు ఇటీవలే ఫిరాయింపులపై స్పష్టమైన ప్రకటన చేస్తూ నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేస్తామని చెప్పారు. ఆ విషయంలో మా పార్టీ వైఖరి మారదు. మారబోదు కూడా. ఓటుకు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను టీడీపీ కొనబోయి దొరికిపోతే కేంద్రంలో బీజేపీ వాళ్లే కేసీఆర్కీ చంద్రబాబుకీ రాజీ చేశారని వార్తలు? ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందే. ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదు. రేవంత్ రెడ్డి డబ్బు ఇస్తూ దొరికిపోయినట్లుగానే, చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదు. అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యత. మా అధిష్టానం మాత్రం కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామనే మాట ఇంతవరకు మాకు చెప్పలేదు. అది నిజం కాకపోవచ్చు. ఈ విషయం మీద నిజం ఏమిటన్నది చెప్పాల్సింది కేసీఆర్, చంద్రబాబులే. విభజన హామీలు అమలు చేయలేదంటూ చంద్రబాబు మోదీని భ్రష్టుపట్టించారు. అయినా మీరు మౌనంగా ఉంటున్నారే? మిత్రపక్షం కాబట్టి మేము సంయమనంతో ఉంటున్నాం. మేం కూడా వారిలాగా మీడియాకు ఎక్కలేం కదా. దేశంలో ఏయే రాష్ట్రాలకు ఎంతమేరకు కేటాయింపులు ఉన్నాయో ఆ మేరకు కేటాయింపులు జరుపడంలో కేంద్రం ఎవరికీ అన్యాయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఏమేం జరగాలో ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు కాకపోవచ్చు కానీ ఆ తన బాధ్యతను నెరవేర్చడంలో కేంద్రం వెనక్కి తగ్గదు. కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోంది. మాకోసం పథకాలు ప్రకటించారట కదా. పేపర్లలో బాగానే చూసుకుంటున్నాంలే అంటూ జనం ఈసడించుకుంటున్నారు. పైకి చెప్పేదొకటి. లోపల చేసేదొకటిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం జనంకు బాగానే అర్థమవుతోంది. (కిషన్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ రైతులకు రుణమాఫీ ఏమైంది: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్రెడ్డి అన్నారు. తీవ్రమైన కరువు ప్రకటించిన కారణంగా రైతులు రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్నారని, అయితే వారికి రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. రుణమాఫీ నోటీసులు వచ్చిన వారికి కూడా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీకి చక్రవడ్డీ కలిపి లక్షా యాబై వేలు కూడా దాటిందని చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్కే బ్లాక్డే: కిషన్రెడ్డి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తుంటే, కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ మాత్రమే ఆందోళన చెందుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్రెడ్డి అన్నారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా కాంగ్రెస్ పార్టీ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తమ కడుపుమంటను బయట పెట్టుకున్నారని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాస్తూ పెద్దనోట్ల రద్దును బ్లాక్ డే గా ప్రకటించారని కిషన్రెడ్డి ఆరోపించారు. ఎన్నో కుంభ కోణాలకు పాల్పడిన కాంగ్రెస్పార్టీకే తప్ప దేశప్రజలకు బ్లాక్డే కాదని అన్నారు. -
కిషన్రెడ్డికి అమిత్ షా క్లాస్!
నల్లగొండ: బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడు జి. కిషన్రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. కిషన్రెడ్డిని తన గెస్ట్హౌస్కు పిలుపించుకుని ఆయనను మందలించినట్టు సమాచారం. పిలుస్తున్నా వేదికపైకి ఎందుకు రాలేదని, అలగాల్సిన అవసరం ఏముందని కిషన్రెడ్డిని అమిత్ షా అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎవరికి వారు కాదు, పార్టీ కోసం పనిచేయాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న అమిత్ షా మంగళవారం ఉదయం వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దళితవాడకు దీన్దయాళ్ పేరు పెట్టారు. తర్వాత చిన్న మాదారంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడారు.