-
రాజసింగ్కు బెదిరింపు కాల్స్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తమ ఫ్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్న రాజాసింగ్నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్గా రాజాసింగ్నే కొనసాగించారు. రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను ప్రమాణ స్వీకారం చెయ్యను.. ఎమ్మెల్యే రాజాసింగ్
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు. ఇక రేపు(శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వ్యవహరించునున్న నేపథ్యంలో రాజా సింగ్ చేసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంతకంటే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ కిషన్రెడ్డితో సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు. -
కాంగ్రెస్ పై రాజాసింగ్ కామెడీ..
-
ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: రాజాసింగ్
-
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, రాజాసింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు. -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ అర్బన్లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్ఛార్జి క ళ్లెం బాల్రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రాజాసింగ్
-
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్
-
లిక్కర్ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్లోని కత్రియ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్ వరల్డ్కప్ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్మెన్గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు.. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ తప్పదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కోసమే కేఏ పాల్ పోటీచేయడం లేదా? రేవంత్రెడ్డి -
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
-
యోగిని, నన్ను చంపేస్తారట: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారాయన. ఫోన్లో చంపుతాం.. నరుకుతాం అని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కాల్స్ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ త్వరలో నా నియోజకవర్గానికి వస్తున్నారు. మా ఇద్దరినీ కలిపి చంపుతామని ఇప్పుడు భయపెడుతున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారాయ. -
కాళేశ్వరంతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద చిల్లుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈరోజు ఆ అనుమానాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ బృందం వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజాసింగ్లతో కలసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరచుకున్నారు. మూడేళ్లలో ప్రాజె క్టు కుంగడం నిజంగా ఇంజనీరింగ్ అద్భు తమే. కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివి, సూపర్ ఇంజనీర్ అవతారమెత్తి, ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు. అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపుహౌజ్లు మునిగి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతోంది. లోపాలన్నీ బయటపడుతున్నాయి’’అని కిషన్రెడ్డి విమర్శించారు. ఏటా 400 టీఎంసీలు ఎత్తిపోసి రైతులకు ఇస్తామన్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై తక్షణమే డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశామని కిషన్రెడ్డి చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదలవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులూ పర్యటించారని తెలిపారు. 27న మరోసారి రాష్ట్రానికి అమిత్షా రానున్నారని, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తారని వెల్లడించారు. దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకుంటామని చెప్పారు. నేతలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కొన్నిరోజులుగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పాలక పార్టీ ఒత్తిడికి అధికారులు తలొగ్గవద్దని కోరారు. -
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్లో రాజాసింగ్ పేరు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’ -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement