raja singh
-
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
నేను బీజేపీకి అవసరం లేదనుకుంటా?: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
గోషామహల్లో ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన వేళ గోషామహల్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. గోషామహల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11.54 గంటలకు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉస్మానియ ఆసుపత్రి నిర్మాణంపై ముందుకెళ్లాలని స్థానికుల సూచిస్తున్నారు.మరోవైపు.. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్..‘ఇక్కడ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలి. గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు, మార్చురీ వాసన వస్తుందని పక్కనే ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అక్కడున్న ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అక్కడి ప్రజల గోడును వినండి. నేను కుంభమేళాలో ఉన్నందున నేటి కార్యక్రమానికి హాజరుకాలేపోతున్న అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ..‘ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకోవడం మంచిదే. కానీ, గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో కాదు. ఊపిరాడకుండా ఉండే ఇరుకు ఇండ్లు, రోడ్ల మధ్య ఆసుపత్రి నిర్మాణం సరికాదు. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు నదులను తలపిస్తాయి. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
లక్ష్మీబాంబులు కొనొద్దు.. కాల్చొద్దు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేళ.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘హిందూ దేవతల బొమ్మలు ఉంటే పటాకులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనద్దు. ఇది హిందువుల దేవుళ్లను హిందువుల చేతే కాల్చివేసే కుట్ర’’ అంటూ దీపావళి ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అలాగే..ఈ దీపావళి నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని సూచించారు.ఇదీ చదవండి: వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం -
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్అరెస్ట్పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్ -
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్కు బిగుస్తున్న ఉచ్చు! -
ఇదేం పద్దతి.. కేటీఆర్పై రాజాసింగ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పని పాట లేక కేంద్రంలో కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మంచి ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉంది ఇలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: లా అండ్ ఆర్డర్పై కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్లో ఉద్రిక్తత -
లంచాలకు మరిగారు.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరం. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం. తాన్యా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.హైదరాబాద్లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు నేను చూపిస్తా. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు. కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి’’ అని రాజాసింగ్ సూచించారు.కాగా, సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతి చెందినవారిని తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తాన్యా సోని స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్గా పని చేస్తున్నారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్లో అన్వేషించి సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
రాజసింగ్కు బెదిరింపు కాల్స్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తమ ఫ్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్న రాజాసింగ్నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్గా రాజాసింగ్నే కొనసాగించారు. రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను ప్రమాణ స్వీకారం చెయ్యను.. ఎమ్మెల్యే రాజాసింగ్
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు. ఇక రేపు(శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వ్యవహరించునున్న నేపథ్యంలో రాజా సింగ్ చేసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంతకంటే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ కిషన్రెడ్డితో సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు. -
కాంగ్రెస్ పై రాజాసింగ్ కామెడీ..
-
ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: రాజాసింగ్
-
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, రాజాసింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు. -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ అర్బన్లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్ఛార్జి క ళ్లెం బాల్రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రాజాసింగ్
-
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్
-
లిక్కర్ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్లోని కత్రియ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్ వరల్డ్కప్ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్మెన్గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు.. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ తప్పదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కోసమే కేఏ పాల్ పోటీచేయడం లేదా? రేవంత్రెడ్డి -
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
-
యోగిని, నన్ను చంపేస్తారట: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారాయన. ఫోన్లో చంపుతాం.. నరుకుతాం అని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కాల్స్ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ త్వరలో నా నియోజకవర్గానికి వస్తున్నారు. మా ఇద్దరినీ కలిపి చంపుతామని ఇప్పుడు భయపెడుతున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారాయ. -
కాళేశ్వరంతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద చిల్లుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈరోజు ఆ అనుమానాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ బృందం వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజాసింగ్లతో కలసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరచుకున్నారు. మూడేళ్లలో ప్రాజె క్టు కుంగడం నిజంగా ఇంజనీరింగ్ అద్భు తమే. కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివి, సూపర్ ఇంజనీర్ అవతారమెత్తి, ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు. అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపుహౌజ్లు మునిగి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతోంది. లోపాలన్నీ బయటపడుతున్నాయి’’అని కిషన్రెడ్డి విమర్శించారు. ఏటా 400 టీఎంసీలు ఎత్తిపోసి రైతులకు ఇస్తామన్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై తక్షణమే డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశామని కిషన్రెడ్డి చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదలవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులూ పర్యటించారని తెలిపారు. 27న మరోసారి రాష్ట్రానికి అమిత్షా రానున్నారని, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తారని వెల్లడించారు. దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకుంటామని చెప్పారు. నేతలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కొన్నిరోజులుగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పాలక పార్టీ ఒత్తిడికి అధికారులు తలొగ్గవద్దని కోరారు. -
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్లో రాజాసింగ్ పేరు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’ -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ -
ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే గో షామహల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్క నాటారు. అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఖాయమన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటకు మాట
-
ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం డ్రామా
కరీంనగర్ రూరల్: కేసీఆర్కు దమ్ముంటే తన కొడు కు కేటీఆర్ను సీఎంగా ప్రకటించాలని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగ ర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభ కార్యక్రమంలో సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రా మపంచాయతీ కార్మికులు, వైద్యశాఖ సిబ్బందితోపాటు పలు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు సంజయ్ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయ న మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని దుయ్యబట్టారు. కొడుకు వైఖరి చూసే కేసీఆర్ ఆయన్ని సీఎంగా ప్రకటించడంలేదని ఎద్దేవాచేశారు. కేటీఆర్ను సీఎంగా ప్రకటించిన వెంటనే ఒక్క ఎమ్మె ల్యే కూడా బీఆర్ఎస్లో ఉండరని చెప్పారు. కేటీఆర్ దమ్ముంటే గోషామహల్లో రాజాసింగ్పై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆర్టీసీకి ఉన్న లక్షకోట్ల ఆస్తులను దోచుకునేందుకే సీఎం విలీనం డ్రామా ఆ డుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం గవర్నర్ ప్రయతి్నస్తే సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎవరికీ అ భ్యంతరం లేదని, కమిటీలు, ఉత్తర్వుల పేరిట కాలయాపన చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రయతి్నస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ధూల్పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ను కోరారు. గుడుంబా నిషేధం తర్వాత ధూల్పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజాసింగ్పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు హైకమాండ్ తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు. చదవండి: సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు -
గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి ప్రజల ఓటు ఎవరికీ..?
గోషామహల్ నియోజకవర్గం గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాదోడ్ పై 17734 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. గతంలో రాదోడ్ బిజెపిలోనే ఉండారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కాని ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఐ నేత ముకేష్ గౌడ్ 25217 ఓట్లతో మూడు స్థానంలో నిలిచారు. రాజాసింగ్ కు 61854 ఓట్లు రాగా, ప్రేమ్ సింగ్ రాదోడ్ కు 44120 ఓట్లు వచ్చాయి. రాజాసింగ్ 2014లో కూడా భారీ గా 46793 ఓట్ల ఆధిక్యతతో ముకేష్ పై గెలిచారు. 2014లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ప్రేమకుమార్ ధూత్కు 6312 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి ముకేష్ 1989, 2004లలో మహారాజ్గంజ్ నుంచి 2009లో గోషామహల్ నుంచి గెలిచారు. 2007 నుంచి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సభ్యునిగా ఉంటూ, తిరిగి గెలిచి వ్కెఎస్ క్యాబినెట్లోనూ ఆ తరువాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి క్యాబినెట్లోనూ ఉన్నారు. 1983లో టిడిపి పక్షాన గెలిచిన పి. రామస్వామి, 1994లో బిజెపి తరుపున చట్టసభకు నెగ్గారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1985లో గెలిచిన జి. నారాయణరావు సభాపతి పదవిబాధ్యతలు నిర్వహించారు. మహారాజ్గంజ్లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, సంయుక్త సోషలిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి. మహారాజ్ గంజ్ లో ఎనిమిదిసార్లు బిసిలు గెలవగా,వారిలో ముగ్గురు గౌడ, నలుగురు మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఒకసారి వెలమ, మరోసారి పిట్టి గెలుపొందారు. కాగా గోషా మహల్ లో మూడుసార్లుగా బిసి నేతలే ఎన్నికయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
డీజీపీకి రాజాసింగ్ ట్వీట్.. నా పరిస్థితే ఇలా ఉంటే.. వారి సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి ఆదివారం ట్వీట్ చేశారు. పాస్ పోర్ట్ కోసం మే 25నదరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఎందుకు చేయలేదని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ను ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా పాస్పోర్టు వెరిఫికేషన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీశారు. ఓ ప్రజా ప్రతినిధిగా తనకే ఇంత ఆలస్యం జరిగితే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే రాజాసింగ్ ట్వీట్పై డీజీపీ స్పందిస్తారో లేదో చూడాలి. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు పది నెలలైంది. అయితే ఎమ్మెల్యేపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని బండి సంజయ్ , విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL — Raja Singh (@TigerRajaSingh) July 30, 2023 -
కిషన్రెడ్డిపై జిట్టా సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్ ఆదేశాలతోనే సస్పెండ్ చేశారు’
నాంపల్లి (హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, సస్పెన్షన్కు గురైన బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, శనివారం ఆయన గన్పార్కు ఎదుట విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్చుప్ కావడానికి కారణమేమిటి? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్ను ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కిషన్రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీల నేతలతో కిషన్రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత కేసును నిర్వీర్యం చేశారని, ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా వ్యాఖ్యానించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు -
మంత్రి హరీశ్ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కలిశారు. దాంతో రాజా సింగ్ బీఆర్ఎస్లోకి వెళుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిన రాజా సింగ్ ఖండించారు. ‘నేను బీఆర్ఎస్లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్ రావును కలిశాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ధూల్పేటలో మోడల్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ను కోరాను’ అని తెలిపారు. చదవండి: తాత-మనవడు: సీఎం కేసీఆర్ను నిలదీద్దాం, రా.. హిమాన్షు! -
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్పై విజయశాంతి ట్వీట్
-
బీజేపీలో మరో ట్విస్ట్.. రాజాసింగ్పై విజయశాంతి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్పై ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ గారి సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్ గారితో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం. pic.twitter.com/OeqbAj4hJL — VIJAYASHANTHI (@vijayashanthi_m) June 29, 2023 కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని వివరించారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్పై స్పందిస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్ -
బీజేపీకి కొత్త టెన్షన్.. బీఆర్ఎస్తో టచ్లో ఐదుగురు నేతలు!
తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఆయనతో ప్రచారం చేయించారు. ఇక్కడ మాత్రం సస్పెన్షన్ ఎత్తేయమని అడిగినా పట్టించుకోవడంలేదు. గోషామహల్లో కమలం పార్టీకి దిక్కులేకుండా పోయింది. ఇంతకీ రాజాసింగ్ సస్పెన్షన్ మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఏమంటున్నారు?.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. నిరంతరం కాంట్రవర్సీ ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కాంట్రవర్సీలే ఆయన్ను కటకటాల్లోకి కూడా నెట్టాయి. వివాదాస్పద ప్రకటనల కారణంగానే పార్టీ హైకమాండ్ రాజాసింగ్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్మే ఎలాగూ తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో, నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఈ అవకాశంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోషామహల్ను స్వాధీనం చేసుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. పార్టీ నాయకత్వం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ నియోజకవర్గంలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. గోషామహల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్కు పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడంలేదు. ఒక పక్కన ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరంగా ఉండటం, మరోవైపు పోటీ చేస్తానంటున్న నేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గోషా మహల్లోని బీజేపీ కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు బీజేపీ కార్పోరేటర్లు.. అధికార పార్టీ నేతలతో టచ్లో ఉంటూ పనులు చేయించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. గోషామహల్లో లైన్ క్లియర్ చేస్తే పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విక్రమ్ గౌడ్ మొరపెట్టుకుంటున్నా కమలం పార్టీలో ఆలకించే నాథులే లేరు. ఇక్కడేమో రాజాసింగ్ మీద పార్టీ సస్పెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడంతో పార్టీలోనే హాట్ టాపిక్గా మారింది. రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని హైకమాండ్కు సిఫారసు చేసినా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు. రాజాసింగ్ విషయంలో త్వరలోనే పార్టీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ జెండాను రాజాసింగే మోస్తారా? విక్రమ్ గౌడ్ చేతికిస్తారా? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది? -
రాజాసింగ్పై సస్పెన్షన్ త్వరలో ఎత్తివేత!: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ త్వరలోనే ఎత్తివేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. నిజాంకాలేజీ మైదానంలో ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్స్ను తిలకించడానికి వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించే మీడియాను ప్రభుత్వం నిషేధిస్తోంది. మరో ఐదు నెలలు ఆగితే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధించబోతున్నారు. ప్రజలు అల్లాడుతుంటే.. ప్రజాధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేసీఆర్కు దమ్ముంటే.. తన పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఓపీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో హైదరాబాద్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరమని, సమష్టిగా పని చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి క్రీడలే ఉదాహరణ అని సంజయ్ తెలిపారు. పంటనష్టపోయి రైతులు ఏడుస్తుంటే.. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే.. చూస్తూ అవసరం లేకపోయినా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓ వర్గం మీడియా తనపైనా అసత్య ప్రచారం చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Karnataka: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. సీఎం ఆయనే! -
నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులతో తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలకు గురువారం లేఖలు రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, తనపై, తన కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తనకు పలు బెదిరింపు కాల్స్ రావడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భారీ భద్రత కలి్పంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్ -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్
-
ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం
-
ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ నూతన సచివాలయం వద్ద గోషామహల్ ఎమ్మెల్యేను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాజాసింగ్ను కొత్త సెక్రటేరియట్లోకి అనుమతించలేదు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి చర్చలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను ఆహ్వానించారని అన్నారు. తలసాని ఆహ్వానం మేరకు తాను సెక్రటేరియట్కు వచ్చినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది.. రాజాసింగ్ను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
టీడీపీలో చేరడంపై రాజాసింగ్ క్లారిటీ
-
‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు. ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణం ఇదే?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తుగా రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది నేను హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొంటాను. కానీ, ఈసారి మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ తర్వాత జరిగినే విధ్వంసాలు, అనర్థాలకు నేను మాత్రం బాధ్యుడిని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, గౌలిగూడ టు తాడ్బండ్ హనుమాన్ జయంతి విజయ యాత్రకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్బజార్, కాచిగూడ ఎక్స్రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్రోడ్డు మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది. -
బండి సంజయ్ దేనికి భయపడడు..!
-
ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు
హైదరాబాద్: గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయత్ర సందర్భంగా రాజాసింగ్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐ వీరబాబు ఫిర్యాదు చేశారు. దాంతో అఫ్జల్గంజ్ పీఎస్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేసే కార్యక్రమంలో ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్ : జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన శోభాయాత్ర (ఫొటోలు)
-
డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. పలు ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
బండి సంజయ్పై అలా మాట్లాడడం సరికాదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో కీలక నేతల మధ్య మాటల వేడిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్లు చేశాడంటూ వార్త ప్రచారంలో ఉంది. అయితే.. మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడటం పద్దతి కాదని రాజాసింగ్ సూచించారు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడొచ్చని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని.. ప్రభుత్వం వచ్చే అవకాశమూ ఉందని, ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం సరికాదని చెప్పారు రాజాసింగ్. అలాగే.. అరవింద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే.. ఏవో ఫ్లోలో అన్న మాటలపై విమర్శలు గుప్పించడం సరికాదని, ఆలోచన చేయాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను రాజా సింగ్ సమర్థిస్తూ అరవింద్కు సూచించారాయన. -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
ఎమ్మెల్యే రాజాసింగ్కు తెల్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
అబిడ్స్: తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్లో ఉందో చూడాల్సి ఉందన్నారు. -
ఈ రాజకీయాలు టార్చర్ అనిపిస్తున్నాయి: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నేతలెవరైనా సరే ప్రజాదరణ ఉన్నంత వరకే రాజకీయాల్లో ఉంటామంటూ పేర్కొన్నారాయన. మెదక్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఛత్రపతి శివాజీలా బతకాలని.. శంభాజీ చనిపోవాలన్నదే తన కల అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ రాజకీయాలు టార్చర్లా అనిపిస్తున్నాయని పేర్కొన్నారాయన. -
ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
ఆబిడ్స్ (హైదరాబాద్): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తన వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
Political Corridor: గోషామహల్ జెండా ఎవరిది?
-
బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్.. వీడియో హైలైట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చారు. ఈ క్రమంలో రాజాసింగ్ను అసెంబ్లీ వద్ద పోలీసులు సరదాగా ఆపి ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదన్నారు. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, రాజాసింగ్ వాహనం ఇప్పటికే పలుమార్లు మొరాయించిన విషయం తెలిసిందే. అంతుకు ముందు శుక్రవారం రాజాసింగ్.. ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్ను డీసీఎంలో అసెంబ్లీకి తీసుకువచ్చారు. -
ప్రగతిభవన్కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు కాగా రాజాసింగ్ బుల్లెట్ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు. దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు. -
రాజాసింగ్కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్హాట్ పోలీసులు.. రాజాసింగ్కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరోసారి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు అయ్యింది. ఈ నెల 6వ తేదీన రాజాసింగ్.. అయోధ్యపై ఓ పోస్ట్ చేశారు. రాజాసింగ్ పోస్ట్పై మంగళహాట్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్ప వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ నోటీసు ఇచ్చారు పోలీసులు. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే.. సదరు చర్యపై ఆయన తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో.. ఐపీసీ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదు అయ్యి.. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కావడంతో జైలుకు వెళ్లారు. ఆ బెయిల్పై వచ్చిన ఆయన మరోసారి ఇలా కేసును ఎదుర్కొంటున్నారు . ఆయనపై మంగళహాట్ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. -
రాజాసింగ్కు పోలీసుల షోకాజ్ నోటీసులు
అబిడ్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళ్హాట్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పీడీ యాక్ట్పై జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ తన ఫేస్బుక్లో ఒక కామెంట్ చేశారని, దానిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యా య వాది కరుణాసాగర్ త్వరలోనే పోలీసులకు తగు సమాధా నం ఇస్తామని తెలిపా రు. రాజాసింగ్ రెచ్చ గొట్టే కామెంట్ చేయలేద న్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వ డం దురదృష్టకరమని రాజాసింగ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రేమ్సింగ్ చేసిన అప్పీలు మంగళవారం.. జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. కొన్ని డాక్యుమెంట్లు అందజేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఈ విచారణ వాయిదా వేసే క్రమంలో ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఈ కేసు వినాలన్నా గ్రహాలన్నీ అనుకూలించాలి’అని (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను జనవరి, 2023కు వాయిదా వేసింది. చదవండి: TRS Party: ఎదురుదాడికి టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ -
బీజేపీలో బిగ్ ట్విస్ట్.. రాజాసింగ్ రూట్ ఎటు?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైల్ నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. కాషాయ పార్టీ మాత్రం ఇంకా సస్పెన్షన్ వేటుపై ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. రాజాసింగ్పై బీజేపీ హై కమాండ్ ఆలోచనేంటి ? నియోజకవర్గానికే పరిమితం అవుతురా? కొత్త వేదిక ఏర్పాటు చేసుకుంటారా? బెయిల్ వచ్చింది కానీ! కాంట్రవర్సీ కామెంట్స్తో కటకటాలపాలైన రాజాసింగ్ బెయిల్పై బయటకు వచ్చినా.. బీజేపీ అధిష్టానం మాత్రం సస్పెన్షన్ వేటు ఫైల్ను ఎత్తేయలేదు. దీంతో, రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆలోచనలో పడ్డారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో రాజాసింగ్ గురించి చర్చించారట. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కూడా తప్పుపట్టారట. రాజాసింగ్పై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్నప్పటికీ సస్పెన్షన్పై అధిష్టానం ఇప్పట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. మా మాట వినండి సార్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇటీవల రాజాసింగ్ భార్య కలిశారు. అంతకుముందే రాజాసింగ్ పార్టీకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. ఇక, రాజాసింగ్పై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలతో రాజాసింగ్కు విభేదాలున్నాయి. అదే ఇప్పుడు రాజాసింగ్కు, పార్టీకి మధ్య అగాధం పెంచుతున్నాయి. కేంద్రంలోనూ రాజాసింగ్కు సపోర్గ్గా నిలిచే వారు ఉన్నప్పటికీ బహిరంగంగా బయటకు రాలేకపోతున్నారు. పార్టీ పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? రాజాసింగ్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తనపై వేటు తొలగించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సన్నిహితులతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా?. బీజేపీకి వ్యతిరేకం కాకుండా సొంతంగా ఒక కొత్త వేదిక ఏర్పాటు చేసుకోవాలా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రాజాసింగ్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నా భద్రతకు ముప్పు ఉంది : ఎమ్మెల్యే రాజాసింగ్
-
ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ.. ‘నా లైఫ్ డేంజర్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని లేఖలో ఐజీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న తన వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. నా భద్రతకు ముప్పు ఉంది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి లేదా?. లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నలు సంధించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్లు తనపై దాడి చేసే అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన లైఫ్ డేంజర్లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందన్నారు. వెంటనే కొత్త వాహనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు తన వాహనంలో వెళ్తుండగా కారు మొరాయించడంతో రాజాసింగ్ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. కాగా, పీడీ యాక్ట్లో భాగంగా రాజాసింగ్ జైలుకు వెళ్లి.. ఇటీవలే కోర్టు ఆదేశాల అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.