raja singh
-
Raja Singh: అలా చేస్తేనే బీజేపీ అధికారంలోకి లేకపోతే కష్టం
-
బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ కమిటీనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని ఆరోపించారు. మరోవైపు.. తాను అధ్యక్ష పదవిలో రేసులో లేనంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తారు. అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్లాగే ఉంటారు. సెంట్రల్ కమిటీనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగింది. మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు. తెలంగాణలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘నేను రాష్ట్ర అధ్యక్షుడు పదవి రేసులో లేను. రాష్ట్ర అధ్యక్ష పదవి రావాలని కూడా కోరుకోవడం లేదు. నాకు కేంద్ర మంత్రి పదవిని అమిత్ షా ఇచ్చారు. ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కాషాయపార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. స్థానిక బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. -
ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ వదిలిపోతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్. -
పాత సామాను ఎవరు? రేవంత్ కేసీఆర్ ఒక్కటేనా !
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్
సాక్షి,హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి సోమవారం(ఫిబ్రవరి 24) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.గతంలోనూ రాజాసింగ్కు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
నేను బీజేపీకి అవసరం లేదనుకుంటా?: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
గోషామహల్లో ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన వేళ గోషామహల్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. గోషామహల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11.54 గంటలకు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉస్మానియ ఆసుపత్రి నిర్మాణంపై ముందుకెళ్లాలని స్థానికుల సూచిస్తున్నారు.మరోవైపు.. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్..‘ఇక్కడ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలి. గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు, మార్చురీ వాసన వస్తుందని పక్కనే ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అక్కడున్న ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అక్కడి ప్రజల గోడును వినండి. నేను కుంభమేళాలో ఉన్నందున నేటి కార్యక్రమానికి హాజరుకాలేపోతున్న అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ..‘ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకోవడం మంచిదే. కానీ, గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో కాదు. ఊపిరాడకుండా ఉండే ఇరుకు ఇండ్లు, రోడ్ల మధ్య ఆసుపత్రి నిర్మాణం సరికాదు. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు నదులను తలపిస్తాయి. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
లక్ష్మీబాంబులు కొనొద్దు.. కాల్చొద్దు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేళ.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘హిందూ దేవతల బొమ్మలు ఉంటే పటాకులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనద్దు. ఇది హిందువుల దేవుళ్లను హిందువుల చేతే కాల్చివేసే కుట్ర’’ అంటూ దీపావళి ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అలాగే..ఈ దీపావళి నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని సూచించారు.ఇదీ చదవండి: వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం -
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్అరెస్ట్పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్ -
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్కు బిగుస్తున్న ఉచ్చు! -
ఇదేం పద్దతి.. కేటీఆర్పై రాజాసింగ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పని పాట లేక కేంద్రంలో కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మంచి ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉంది ఇలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: లా అండ్ ఆర్డర్పై కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్లో ఉద్రిక్తత -
లంచాలకు మరిగారు.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరం. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం. తాన్యా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.హైదరాబాద్లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు నేను చూపిస్తా. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు. కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి’’ అని రాజాసింగ్ సూచించారు.కాగా, సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతి చెందినవారిని తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తాన్యా సోని స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్గా పని చేస్తున్నారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్లో అన్వేషించి సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
రాజసింగ్కు బెదిరింపు కాల్స్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తమ ఫ్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్న రాజాసింగ్నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్గా రాజాసింగ్నే కొనసాగించారు. రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను ప్రమాణ స్వీకారం చెయ్యను.. ఎమ్మెల్యే రాజాసింగ్
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు. ఇక రేపు(శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వ్యవహరించునున్న నేపథ్యంలో రాజా సింగ్ చేసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంతకంటే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ కిషన్రెడ్డితో సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు. -
కాంగ్రెస్ పై రాజాసింగ్ కామెడీ..
-
ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: రాజాసింగ్
-
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, రాజాసింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు. -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ అర్బన్లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్ఛార్జి క ళ్లెం బాల్రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రాజాసింగ్
-
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్
-
లిక్కర్ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్లోని కత్రియ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్ వరల్డ్కప్ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్మెన్గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు.. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ తప్పదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కోసమే కేఏ పాల్ పోటీచేయడం లేదా? రేవంత్రెడ్డి -
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
-
యోగిని, నన్ను చంపేస్తారట: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారాయన. ఫోన్లో చంపుతాం.. నరుకుతాం అని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కాల్స్ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ త్వరలో నా నియోజకవర్గానికి వస్తున్నారు. మా ఇద్దరినీ కలిపి చంపుతామని ఇప్పుడు భయపెడుతున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారాయ. -
కాళేశ్వరంతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద చిల్లుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈరోజు ఆ అనుమానాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ బృందం వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజాసింగ్లతో కలసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరచుకున్నారు. మూడేళ్లలో ప్రాజె క్టు కుంగడం నిజంగా ఇంజనీరింగ్ అద్భు తమే. కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివి, సూపర్ ఇంజనీర్ అవతారమెత్తి, ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు. అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపుహౌజ్లు మునిగి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతోంది. లోపాలన్నీ బయటపడుతున్నాయి’’అని కిషన్రెడ్డి విమర్శించారు. ఏటా 400 టీఎంసీలు ఎత్తిపోసి రైతులకు ఇస్తామన్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై తక్షణమే డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశామని కిషన్రెడ్డి చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదలవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులూ పర్యటించారని తెలిపారు. 27న మరోసారి రాష్ట్రానికి అమిత్షా రానున్నారని, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తారని వెల్లడించారు. దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకుంటామని చెప్పారు. నేతలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కొన్నిరోజులుగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పాలక పార్టీ ఒత్తిడికి అధికారులు తలొగ్గవద్దని కోరారు. -
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్లో రాజాసింగ్ పేరు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’ -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ -
ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే గో షామహల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్క నాటారు. అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఖాయమన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటకు మాట
-
ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం డ్రామా
కరీంనగర్ రూరల్: కేసీఆర్కు దమ్ముంటే తన కొడు కు కేటీఆర్ను సీఎంగా ప్రకటించాలని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగ ర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభ కార్యక్రమంలో సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రా మపంచాయతీ కార్మికులు, వైద్యశాఖ సిబ్బందితోపాటు పలు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు సంజయ్ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయ న మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని దుయ్యబట్టారు. కొడుకు వైఖరి చూసే కేసీఆర్ ఆయన్ని సీఎంగా ప్రకటించడంలేదని ఎద్దేవాచేశారు. కేటీఆర్ను సీఎంగా ప్రకటించిన వెంటనే ఒక్క ఎమ్మె ల్యే కూడా బీఆర్ఎస్లో ఉండరని చెప్పారు. కేటీఆర్ దమ్ముంటే గోషామహల్లో రాజాసింగ్పై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆర్టీసీకి ఉన్న లక్షకోట్ల ఆస్తులను దోచుకునేందుకే సీఎం విలీనం డ్రామా ఆ డుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం గవర్నర్ ప్రయతి్నస్తే సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎవరికీ అ భ్యంతరం లేదని, కమిటీలు, ఉత్తర్వుల పేరిట కాలయాపన చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రయతి్నస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ధూల్పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ను కోరారు. గుడుంబా నిషేధం తర్వాత ధూల్పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజాసింగ్పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు హైకమాండ్ తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు. చదవండి: సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు -
గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి ప్రజల ఓటు ఎవరికీ..?
గోషామహల్ నియోజకవర్గం గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాదోడ్ పై 17734 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. గతంలో రాదోడ్ బిజెపిలోనే ఉండారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కాని ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఐ నేత ముకేష్ గౌడ్ 25217 ఓట్లతో మూడు స్థానంలో నిలిచారు. రాజాసింగ్ కు 61854 ఓట్లు రాగా, ప్రేమ్ సింగ్ రాదోడ్ కు 44120 ఓట్లు వచ్చాయి. రాజాసింగ్ 2014లో కూడా భారీ గా 46793 ఓట్ల ఆధిక్యతతో ముకేష్ పై గెలిచారు. 2014లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ప్రేమకుమార్ ధూత్కు 6312 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి ముకేష్ 1989, 2004లలో మహారాజ్గంజ్ నుంచి 2009లో గోషామహల్ నుంచి గెలిచారు. 2007 నుంచి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సభ్యునిగా ఉంటూ, తిరిగి గెలిచి వ్కెఎస్ క్యాబినెట్లోనూ ఆ తరువాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి క్యాబినెట్లోనూ ఉన్నారు. 1983లో టిడిపి పక్షాన గెలిచిన పి. రామస్వామి, 1994లో బిజెపి తరుపున చట్టసభకు నెగ్గారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1985లో గెలిచిన జి. నారాయణరావు సభాపతి పదవిబాధ్యతలు నిర్వహించారు. మహారాజ్గంజ్లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, సంయుక్త సోషలిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి. మహారాజ్ గంజ్ లో ఎనిమిదిసార్లు బిసిలు గెలవగా,వారిలో ముగ్గురు గౌడ, నలుగురు మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఒకసారి వెలమ, మరోసారి పిట్టి గెలుపొందారు. కాగా గోషా మహల్ లో మూడుసార్లుగా బిసి నేతలే ఎన్నికయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
డీజీపీకి రాజాసింగ్ ట్వీట్.. నా పరిస్థితే ఇలా ఉంటే.. వారి సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి ఆదివారం ట్వీట్ చేశారు. పాస్ పోర్ట్ కోసం మే 25నదరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఎందుకు చేయలేదని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ను ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా పాస్పోర్టు వెరిఫికేషన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీశారు. ఓ ప్రజా ప్రతినిధిగా తనకే ఇంత ఆలస్యం జరిగితే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే రాజాసింగ్ ట్వీట్పై డీజీపీ స్పందిస్తారో లేదో చూడాలి. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు పది నెలలైంది. అయితే ఎమ్మెల్యేపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని బండి సంజయ్ , విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL — Raja Singh (@TigerRajaSingh) July 30, 2023 -
కిషన్రెడ్డిపై జిట్టా సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్ ఆదేశాలతోనే సస్పెండ్ చేశారు’
నాంపల్లి (హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, సస్పెన్షన్కు గురైన బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, శనివారం ఆయన గన్పార్కు ఎదుట విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్చుప్ కావడానికి కారణమేమిటి? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్ను ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కిషన్రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీల నేతలతో కిషన్రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత కేసును నిర్వీర్యం చేశారని, ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా వ్యాఖ్యానించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు -
మంత్రి హరీశ్ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కలిశారు. దాంతో రాజా సింగ్ బీఆర్ఎస్లోకి వెళుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిన రాజా సింగ్ ఖండించారు. ‘నేను బీఆర్ఎస్లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్ రావును కలిశాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ధూల్పేటలో మోడల్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ను కోరాను’ అని తెలిపారు. చదవండి: తాత-మనవడు: సీఎం కేసీఆర్ను నిలదీద్దాం, రా.. హిమాన్షు! -
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్పై విజయశాంతి ట్వీట్
-
బీజేపీలో మరో ట్విస్ట్.. రాజాసింగ్పై విజయశాంతి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్పై ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ గారి సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్ గారితో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం. pic.twitter.com/OeqbAj4hJL — VIJAYASHANTHI (@vijayashanthi_m) June 29, 2023 కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని వివరించారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్పై స్పందిస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్ -
బీజేపీకి కొత్త టెన్షన్.. బీఆర్ఎస్తో టచ్లో ఐదుగురు నేతలు!
తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఆయనతో ప్రచారం చేయించారు. ఇక్కడ మాత్రం సస్పెన్షన్ ఎత్తేయమని అడిగినా పట్టించుకోవడంలేదు. గోషామహల్లో కమలం పార్టీకి దిక్కులేకుండా పోయింది. ఇంతకీ రాజాసింగ్ సస్పెన్షన్ మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఏమంటున్నారు?.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. నిరంతరం కాంట్రవర్సీ ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కాంట్రవర్సీలే ఆయన్ను కటకటాల్లోకి కూడా నెట్టాయి. వివాదాస్పద ప్రకటనల కారణంగానే పార్టీ హైకమాండ్ రాజాసింగ్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్మే ఎలాగూ తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో, నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఈ అవకాశంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోషామహల్ను స్వాధీనం చేసుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. పార్టీ నాయకత్వం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ నియోజకవర్గంలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. గోషామహల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్కు పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడంలేదు. ఒక పక్కన ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరంగా ఉండటం, మరోవైపు పోటీ చేస్తానంటున్న నేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గోషా మహల్లోని బీజేపీ కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు బీజేపీ కార్పోరేటర్లు.. అధికార పార్టీ నేతలతో టచ్లో ఉంటూ పనులు చేయించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. గోషామహల్లో లైన్ క్లియర్ చేస్తే పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విక్రమ్ గౌడ్ మొరపెట్టుకుంటున్నా కమలం పార్టీలో ఆలకించే నాథులే లేరు. ఇక్కడేమో రాజాసింగ్ మీద పార్టీ సస్పెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడంతో పార్టీలోనే హాట్ టాపిక్గా మారింది. రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని హైకమాండ్కు సిఫారసు చేసినా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు. రాజాసింగ్ విషయంలో త్వరలోనే పార్టీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ జెండాను రాజాసింగే మోస్తారా? విక్రమ్ గౌడ్ చేతికిస్తారా? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది? -
రాజాసింగ్పై సస్పెన్షన్ త్వరలో ఎత్తివేత!: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ త్వరలోనే ఎత్తివేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. నిజాంకాలేజీ మైదానంలో ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్స్ను తిలకించడానికి వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించే మీడియాను ప్రభుత్వం నిషేధిస్తోంది. మరో ఐదు నెలలు ఆగితే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధించబోతున్నారు. ప్రజలు అల్లాడుతుంటే.. ప్రజాధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేసీఆర్కు దమ్ముంటే.. తన పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఓపీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో హైదరాబాద్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరమని, సమష్టిగా పని చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి క్రీడలే ఉదాహరణ అని సంజయ్ తెలిపారు. పంటనష్టపోయి రైతులు ఏడుస్తుంటే.. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే.. చూస్తూ అవసరం లేకపోయినా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓ వర్గం మీడియా తనపైనా అసత్య ప్రచారం చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Karnataka: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. సీఎం ఆయనే! -
నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులతో తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలకు గురువారం లేఖలు రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, తనపై, తన కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తనకు పలు బెదిరింపు కాల్స్ రావడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భారీ భద్రత కలి్పంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్ -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్
-
ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం
-
ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ నూతన సచివాలయం వద్ద గోషామహల్ ఎమ్మెల్యేను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాజాసింగ్ను కొత్త సెక్రటేరియట్లోకి అనుమతించలేదు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి చర్చలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను ఆహ్వానించారని అన్నారు. తలసాని ఆహ్వానం మేరకు తాను సెక్రటేరియట్కు వచ్చినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది.. రాజాసింగ్ను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
టీడీపీలో చేరడంపై రాజాసింగ్ క్లారిటీ
-
‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు. ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణం ఇదే?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తుగా రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది నేను హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొంటాను. కానీ, ఈసారి మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ తర్వాత జరిగినే విధ్వంసాలు, అనర్థాలకు నేను మాత్రం బాధ్యుడిని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, గౌలిగూడ టు తాడ్బండ్ హనుమాన్ జయంతి విజయ యాత్రకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్బజార్, కాచిగూడ ఎక్స్రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్రోడ్డు మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది. -
బండి సంజయ్ దేనికి భయపడడు..!
-
ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు
హైదరాబాద్: గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయత్ర సందర్భంగా రాజాసింగ్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐ వీరబాబు ఫిర్యాదు చేశారు. దాంతో అఫ్జల్గంజ్ పీఎస్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేసే కార్యక్రమంలో ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్ : జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన శోభాయాత్ర (ఫొటోలు)
-
డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. పలు ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
బండి సంజయ్పై అలా మాట్లాడడం సరికాదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో కీలక నేతల మధ్య మాటల వేడిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్లు చేశాడంటూ వార్త ప్రచారంలో ఉంది. అయితే.. మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడటం పద్దతి కాదని రాజాసింగ్ సూచించారు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడొచ్చని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని.. ప్రభుత్వం వచ్చే అవకాశమూ ఉందని, ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం సరికాదని చెప్పారు రాజాసింగ్. అలాగే.. అరవింద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే.. ఏవో ఫ్లోలో అన్న మాటలపై విమర్శలు గుప్పించడం సరికాదని, ఆలోచన చేయాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను రాజా సింగ్ సమర్థిస్తూ అరవింద్కు సూచించారాయన. -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
ఎమ్మెల్యే రాజాసింగ్కు తెల్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
అబిడ్స్: తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్లో ఉందో చూడాల్సి ఉందన్నారు. -
ఈ రాజకీయాలు టార్చర్ అనిపిస్తున్నాయి: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నేతలెవరైనా సరే ప్రజాదరణ ఉన్నంత వరకే రాజకీయాల్లో ఉంటామంటూ పేర్కొన్నారాయన. మెదక్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఛత్రపతి శివాజీలా బతకాలని.. శంభాజీ చనిపోవాలన్నదే తన కల అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ రాజకీయాలు టార్చర్లా అనిపిస్తున్నాయని పేర్కొన్నారాయన. -
ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
ఆబిడ్స్ (హైదరాబాద్): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తన వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
Political Corridor: గోషామహల్ జెండా ఎవరిది?
-
బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్.. వీడియో హైలైట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్ బండిపై వచ్చారు. ఈ క్రమంలో రాజాసింగ్ను అసెంబ్లీ వద్ద పోలీసులు సరదాగా ఆపి ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదన్నారు. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, రాజాసింగ్ వాహనం ఇప్పటికే పలుమార్లు మొరాయించిన విషయం తెలిసిందే. అంతుకు ముందు శుక్రవారం రాజాసింగ్.. ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్ను డీసీఎంలో అసెంబ్లీకి తీసుకువచ్చారు. -
ప్రగతిభవన్కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు కాగా రాజాసింగ్ బుల్లెట్ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు. దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు. -
రాజాసింగ్కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్హాట్ పోలీసులు.. రాజాసింగ్కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరోసారి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు అయ్యింది. ఈ నెల 6వ తేదీన రాజాసింగ్.. అయోధ్యపై ఓ పోస్ట్ చేశారు. రాజాసింగ్ పోస్ట్పై మంగళహాట్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్ప వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ నోటీసు ఇచ్చారు పోలీసులు. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే.. సదరు చర్యపై ఆయన తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో.. ఐపీసీ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదు అయ్యి.. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కావడంతో జైలుకు వెళ్లారు. ఆ బెయిల్పై వచ్చిన ఆయన మరోసారి ఇలా కేసును ఎదుర్కొంటున్నారు . ఆయనపై మంగళహాట్ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. -
రాజాసింగ్కు పోలీసుల షోకాజ్ నోటీసులు
అబిడ్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళ్హాట్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పీడీ యాక్ట్పై జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ తన ఫేస్బుక్లో ఒక కామెంట్ చేశారని, దానిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యా య వాది కరుణాసాగర్ త్వరలోనే పోలీసులకు తగు సమాధా నం ఇస్తామని తెలిపా రు. రాజాసింగ్ రెచ్చ గొట్టే కామెంట్ చేయలేద న్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వ డం దురదృష్టకరమని రాజాసింగ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రేమ్సింగ్ చేసిన అప్పీలు మంగళవారం.. జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. కొన్ని డాక్యుమెంట్లు అందజేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఈ విచారణ వాయిదా వేసే క్రమంలో ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఈ కేసు వినాలన్నా గ్రహాలన్నీ అనుకూలించాలి’అని (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను జనవరి, 2023కు వాయిదా వేసింది. చదవండి: TRS Party: ఎదురుదాడికి టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ -
బీజేపీలో బిగ్ ట్విస్ట్.. రాజాసింగ్ రూట్ ఎటు?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైల్ నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. కాషాయ పార్టీ మాత్రం ఇంకా సస్పెన్షన్ వేటుపై ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. రాజాసింగ్పై బీజేపీ హై కమాండ్ ఆలోచనేంటి ? నియోజకవర్గానికే పరిమితం అవుతురా? కొత్త వేదిక ఏర్పాటు చేసుకుంటారా? బెయిల్ వచ్చింది కానీ! కాంట్రవర్సీ కామెంట్స్తో కటకటాలపాలైన రాజాసింగ్ బెయిల్పై బయటకు వచ్చినా.. బీజేపీ అధిష్టానం మాత్రం సస్పెన్షన్ వేటు ఫైల్ను ఎత్తేయలేదు. దీంతో, రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆలోచనలో పడ్డారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో రాజాసింగ్ గురించి చర్చించారట. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కూడా తప్పుపట్టారట. రాజాసింగ్పై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్నప్పటికీ సస్పెన్షన్పై అధిష్టానం ఇప్పట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. మా మాట వినండి సార్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇటీవల రాజాసింగ్ భార్య కలిశారు. అంతకుముందే రాజాసింగ్ పార్టీకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. ఇక, రాజాసింగ్పై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలతో రాజాసింగ్కు విభేదాలున్నాయి. అదే ఇప్పుడు రాజాసింగ్కు, పార్టీకి మధ్య అగాధం పెంచుతున్నాయి. కేంద్రంలోనూ రాజాసింగ్కు సపోర్గ్గా నిలిచే వారు ఉన్నప్పటికీ బహిరంగంగా బయటకు రాలేకపోతున్నారు. పార్టీ పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? రాజాసింగ్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తనపై వేటు తొలగించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సన్నిహితులతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా?. బీజేపీకి వ్యతిరేకం కాకుండా సొంతంగా ఒక కొత్త వేదిక ఏర్పాటు చేసుకోవాలా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రాజాసింగ్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నా భద్రతకు ముప్పు ఉంది : ఎమ్మెల్యే రాజాసింగ్
-
ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ.. ‘నా లైఫ్ డేంజర్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని లేఖలో ఐజీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న తన వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. నా భద్రతకు ముప్పు ఉంది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి లేదా?. లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నలు సంధించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్లు తనపై దాడి చేసే అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన లైఫ్ డేంజర్లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందన్నారు. వెంటనే కొత్త వాహనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు తన వాహనంలో వెళ్తుండగా కారు మొరాయించడంతో రాజాసింగ్ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. కాగా, పీడీ యాక్ట్లో భాగంగా రాజాసింగ్ జైలుకు వెళ్లి.. ఇటీవలే కోర్టు ఆదేశాల అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో ఎమ్మెల్యే రాజాసింగ్కు అవస్థలు
-
రాజాసింగ్ రిమాండ్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ పిటిషన్ను లోయర్కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కేసులో విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, రాజాసింగ్ తరపున సీనియర్ న్యాయవాది దామోదర్రెడ్డి వాదనలు వినిపించారు. లోయర్కోర్టు రిమాండ్ను తిరస్కరించిన మరుసటిరోజే... రాజాసింగ్పై పీడీ యాక్ట్ మోపి జైలుకు పంపారని, 77 రోజులు కారాగారంలో ఉంచారని దామోదర్రెడ్డి తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడం ఆక్షేపణీయమన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని లోయర్ కోర్టు తప్పుబట్టిందని వివరించారు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కూడా ఇది విరుద్ధమని నివేదించారు. అనంతరం ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రతీ కేసులో 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇదే తరహాలో ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోందని, ఆ కేసులో 41ఏ నోటీసులకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఈ కేసులోనూ ముందుకు పోవచ్చని చెప్పారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు విచారణ సుప్రీంకోర్టులో సోమవారం ఉన్నందున.. రాజాసింగ్ రిమాండ్ కేసును వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
Hyderabad: పీడీ యాక్ట్ కొట్టివేత.. ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ/అబిడ్స్: పీడీ యాక్ట్ కేసులో ఆగస్టు 25న అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఆయనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. దాదాపు రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ‘మతపరంగా అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించొద్దు. న్యాయవాది, పిటిషనర్తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే జైలుకు వెళ్లాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’అని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఈ షరతులతో పాటు క్రైం నంబర్ 261/2022లో కిందికోర్టు ఇచ్చిన ఆంక్షలు వర్తిస్తాయి. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజాసింగ్పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, పిటిషనర్ తరఫున న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. ‘రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఒక హత్య కేసు కూడా ఉంది. మంగళ్హాట్ పీఎస్లో ఇప్పటికీ రౌడీషీట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. పీడీ యాక్ట్ నమోదు కేసులో 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జీవో 90ని జారీ చేసింది. రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని అడ్వయిజరీ బోర్డు కూడా సమర్ధించింది’అని ఏజీ వాదించారు. తప్పుడు ఆరోపణలతో పీడీ యాక్ట్ నమోదు... ‘రాజాసింగ్పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్కు పంపేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో కావాలని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ప్రవక్త గురించి రాజాసింగ్ మాట్లాడినట్లుగా తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోలోని ఆ వాయిస్ రాజా సింగ్ది కాదు. అసలు ఆయన మహ్మద్ ప్రవక్త గురించి ఏమీ మాట్లాడలేదు. రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఆధారాలు లేవన్నారు. పీడీ యాక్ట్ను రద్దు చేయాలి’అని రవిచందర్ వాదనలు వినిపించారు. సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలు వద్దకు కుటుంబసభ్యులు, రాజాసింగ్ తరఫు న్యాయవాదితో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో భార్య, మనుమడు, న్యాయవాది కారులో జైలులోనికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రాజాసింగ్ బయటికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజాసింగ్ జైలు నుంచి ధూల్పేట్లోని ఆయన నివాసానికి రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికి సంబరాలు చేశారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్ నివేదన
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భార్య టి.ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ను 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టేయాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. రాజాసింగ్పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్కు పంపేందుకు నిరాకరించిందని గుర్తుచేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారని చెప్పారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’.. 34 మందిపై చర్యలు! సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం.. గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించారన్నారు. ప్రవక్తను రాజాసింగ్ ‘ఆకా’అనే పదంతో ఉచ్ఛరించారనడాన్ని న్యాయవాది వ్యతిరేకించారు. ఆకా అంటే పెద్ద అన్న అని అర్థమని చెప్పారు. ప్రవక్త గురించి రాజాసింగ్ తప్పుడుగా మాట్లాడినట్లు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని, అసలు ఆ వీడియోలోని వాయిస్ ఆయనది కాదన్నారు. 50 ఏళ్ల వ్యక్తి 6 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆగస్టు 22న రాజాసింగ్ మాట్లాడారని చెప్పారు. రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ను రద్దు చేయాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్ కుమార్ గత వారం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు నేడు కొనసాగనున్నాయి. -
పీడీ యాక్ట్పై రాజాసింగ్ అప్పీల్ తిరస్కరణ
-
ఎమ్మెల్యే రాజాసింగ్కు షాక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్కు భారీ షాక్ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది. రాజాసింగ్పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ. -
రాజాసింగ్ ఎపిసోడ్కు త్వరలోనే ఎండ్ కార్డ్?
తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్. ఓ వివాదం కారణంగా ఆయనపై పార్టీ వేటు వేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్పై బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడిందా? రాజాసింగ్ వివరణతో పార్టీ సంతృప్తి చెందిందా? సస్పెన్షన్ను ఎత్తివేసే ఆలోచన చేస్తోందా? రాజాసింగ్ ఎపిసోడ్కు త్వరలోనే ఎండ్ కార్డ్.! గ్రేటర్ హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్కు త్వరలోనే ఎండ్ కార్డ్ వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. నార్త్ ఇండియన్ అయిన రాజాసింగ్ హైదరాబాద్లోని ఉత్తరాదివారితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ఇష్యూలో రాజాసింగ్ చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ఆ తర్వాత రాజాసింగ్ విడుదల చేసిన వీడియో అగ్నికి ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం మరింత ముదరకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ హైకమాండ్. అసలుకే మోసం జరిగిందా? రాజాసింగ్ సస్పెండ్ చేయడంతో కట్టర్ హిందువులు పార్టీకి దూరమవుతారనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో త్వరలోనే ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలంటూ కొన్ని రోజులుగా హిందూ సంఘాల సైతం డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ కేడర్లో, హిందూ సంఘాల్లో రాజాసింగ్కు పెరుగుతున్న మద్దతు చూసి.. బీజేపీ నాయకత్వం అంతర్మథనంలో పడింది. పీడీ యాక్ట్పై వ్యతిరేక గళం కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో హిందు దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానిస్తారని రాజాసింగ్ ముందు నుంచే చెబుతూ వచ్చారు. హైదరాబాద్లో ఫారుఖీ ప్రోగ్రామ్ను నిర్వహిస్తే ఆందోళన చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. రాజాసింగ్, హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత నడుమ మునావర్ ఫారుఖీ షోను నిర్వహించారు. షో ముగిసిన తర్వాత రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయడంపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అందుకే పీడీ యాక్ట్పై పార్టీ శ్రేణులు వ్యతిరేక గళం విప్పుతున్నాయి. ఇప్పటికే విజయశాంతి ఓ ప్రకటనలో రాజాసింగ్కు మద్ధతిచ్చారు. వివరణ ఓకే అయితే సవరణే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి కమలనాథులు ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్కు వివరణ ఇచ్చేందుకు 10 రోజుల సమయం ఇచ్చింది బీజేపీ హైకమాండ్. కానీ రాజాసింగ్ జైల్లో ఉండటంతో రిప్లై ఇవ్వలేకపోయారు. పార్టీ నుంచి గడువు తీసుకుని రాజాసింగ్ షోకాజ్ నోటీసుకు స్పందించారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని, హిందువులకు సేవ చేసే అవకాశాన్ని తిరిగి కల్పించాలని సంజాయిషీ నోటీస్కు సమాధానంలో కోరారు. ఈ తరుణంలో కమలం పార్టీ అగ్రనేతలు తమ నిర్ణయాన్ని పునసమీక్షించుకునే అవకాశం ఉందని గోషామహల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజాసింగ్కు సంబంధించి బోలెడు పోస్టర్లు అక్కడ వెలిశాయి. -
ఇంకా ఎన్ని రోజులు.. రాజాసింగ్ కేసులో ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాజాసింగ్పై నమోదైన పీడీ యాక్ట్ కేసులో కౌంటర్ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. గడువిచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే చివరి అవకాశమని, వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే.. తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా, సెప్టెంబర్ 25న రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాబాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రామచందర్రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక జీపీ ముజీబ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. దాదాపు 100 కేసుల్లో రాజాసింగ్ నిందితుడిగా ఉన్నారన్నారు. కౌంటర్ అఫిడవిట్ 1650 పేజీలు ఉందని, సంతకం కోసం పంపించామని చెప్పారు. మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 28వ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తున్నామని చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే..
సాక్షి, హైదరాబాద్: హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంనేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధంగా ఉన్నారని, ఆయన భార్య టీ.ఉషాబాయి పేర్కొన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం కష్టపడి పనిచేసే రాజాసింగ్ అదే ధర్మం కోసం జైలు పాలయ్యారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాభాయి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజాసింగ్ జైలులో ఉన్న ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా ఉంటూ కొండంత ధైర్యం ఇస్తున్నారని అన్నారు. రాజాసింగ్, ఆయన కుటుంబం ఎప్పుడూ అనాథ కాదని, హిందూ సమాజం అంతా మా కుటుంబానికి అండగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేసేవారి పట్ల రాజాసింగ్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే అన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, ఆయన చేతిలో ఉండేది కమలం జెండాయేనని ధర్మం కోసం ఆయన ఎన్ని బాధలైనా భరించడానకి సిద్ధంగా ఉన్నారు. -
రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నాలుగు సార్లు గడువిచ్చామని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఈసారి గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. చదవండి: వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉద్రిక్తత -
పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు
సాక్షి హైదరాబాద్: తనపై క్రమశిక్షణా చర్య తీసుకుంటూ పంపించిన నోటీస్లో పేర్కొన్నట్లు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ సమాధానమిచ్చారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించనందున తన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్యకార్యదర్శి ఓం పాథక్కు లేఖ రాశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆగస్ట్ 23న రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. 10 రోజుల్లో నోటీస్కు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. పీడీయాక్ట్పై అరెస్టయి జైలులో ఉన్నందున సోమవారం నోటీస్కు సమాధానమిస్తూ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై.. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సాగిస్తున్న అరాచకాలనే ప్రశ్నించాను తప్ప ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు. నేను పంపిన వీడియోలోనూ ఏ మతాన్ని కించపరచలేదు. పార్టీ ఎమ్మెల్యేగా 8 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్లను కించపరచలేదు’అని ఈ లేఖలో పేర్కొన్నారు. -
బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న బీజేపీ అధిష్టానం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి అప్పట్లో కోరారు. ఈ క్రమంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ సోమవారం సమాధానం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కుట్రపూరితంగా తనపై 100 కేసులు పెట్టాయని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చదవండి: రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్ ‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. హిందులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు.’ అని బీజేపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. చదవండి: విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు -
బీజేపీలో హాట్టాపిక్.. రాజాసింగ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి!
రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం, వివాదాస్పదమే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కక్కలేక.. మింగలేక ఇబ్బందిపడుతున్నారు. రాములమ్మ మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారు?.. కక్కలేక మింగలేక కమలం.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలో అర్థంకాక, కేడర్ను సముదాయించలేక తెలంగాణ బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అప్పటివరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటూ పీడీ యాక్ట్ పెట్టి.. చర్లపల్లి జైలుకు పంపింది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు. సస్పెన్షన్ తొలగించే విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడొస్తారు సర్..? రాజాసింగ్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. రాజాసింగ్ జైల్లో ఉండటంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా నిరసనలు, బందులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రాజాసింగ్ను బీజేపీ నుండి సస్పెండ్ చేసినా కార్యకర్తలు మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలపైన ఆయన ఫొటోలను తీసివేయడం లేదు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ల మీద కూడా రాజాసింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. టైగర్ ఎక్కడ..? పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వారం క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు రాజాసింగ్ను విడుదల చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ సస్పెండ్ చేసినా కార్పొరేటర్లు మాత్రం ఆయనకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్లో తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కల్పించారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. స్లోగన్స్ ఇచ్చారు. దీంతో బండి సంజయ్ జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. బండి సంజయ్ ఎక్కడా కూడా రాజాసింగ్ పేరును ప్రస్తావించలేదు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పేరు చెబుతూ మాట్లాడలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేసినా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ బ్యానర్ మీద ఆందోళన చేయలేని స్థితి. అలాగని పార్టీ రాజాసింగ్ను సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కోసం ఏమీ చేయలేమని కేడర్కు చెప్పలేని సంకట పరిస్థితి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాత్రం రాజాసింగ్కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తుండగా.. విజయశాంతి పార్టీ లైన్ దాటి నేరుగా రాజాసింగ్ను సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడంపై పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తం మీద రాజాసింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజాసింగ్ను దూరం చేసుకోలేరు. అలాగని హైకమాండ్ ఆదేశాలను అతిక్రమించలేరు. -
పీడీ యాక్ట్ బోర్డు ఎదుట ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదు అయిన పీడీ యాక్ట్పై అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ బోర్డ్ చైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ సాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జరిగిన విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదిలా ఉంటే.. ముహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే.. ‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు’ అంటూ మరో వీడియోను అరెస్ట్కు ముందు రిలీజ్ చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజాసింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలని రాజాసింగ్ తరపు న్యాయవాదుల్ని కోరింది. -
రాజాసింగ్కు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ జేబీ పార్డీవాలా ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాస నం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలంది. -
నా భర్తకు జైల్లో వసతులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ శాసనసభ్యుడు, తన భర్త రాజాసింగ్కు జైలులో సౌకర్యాలు కల్పించాలని టి.ఉషాభాయ్ కోరారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో పీడీ యాక్ట్ కింద రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో ఉంటున్న రాజాసింగ్కు సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. రాజాసింగ్కు జైల్లో మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, టీవీ వంటి సౌకర్యాలు అందజేసేందుకు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయా లని పిటిషనర్ తరఫు న్యాయవాది కె. కరుణసాగర్ నివేదించారు. ప్రజలు, కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ వాదనలు వినిపించేందు కు గడువు కావాలని రాష్ట్ర ప్రభు త్వ తరఫు న్యాయవాది శ్రీకాంత్రెడ్డి కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. -
రాజాసింగ్ బెయిల్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 25న రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది. చదవండి: పాతబస్తీ క్షుద్రపూజల కలకలం -
Hyderabad: రాజాసింగ్ అరెస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే భార్య
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్కు భంగం కలిగిస్తున్నారని చెప్పి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి వీలుగా గత నెల 26న జీవో 1651ను జారీ చేశారని చెప్పారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేసే ముందుకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 41ఎ నోటీసు ఇవ్వాలని, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41ఎ నోటీసు ఇవ్వాలన్న నిబంధనను పోలీసులు ఉల్లంఘించారని చెప్పారు. రాజాసింగ్కు ఆ విధమైన నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసినందున రిమాండ్కు పంపేందుకు కింది కోర్టు అంగీకరించలేదని వివరించారు. ‘కొందరి’ని సంతృప్తి పరిచేందుకే రాజాసింగ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్ట్యాక్స్ రద్దు -
బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు మహ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో రాజాసింగ్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో సమాధానం చెప్పాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ కోరింది. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, రాజాసింగ్ జైలులో ఉండటంతో ఆయన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి గురువారం మెయిల్ పంపించారు. ఈ సందర్భంగా లేఖలో సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం ఇవ్వాలని రాజాసింగ్ కుటుంబ సభ్యులు కమిటీని కోరినట్టు తెలుస్తోంది. కాగా, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన 10 రోజుల గడువు రేపటితో(శుక్రవారం) ముగియనుంది. దీంతో, రాజాసింగ్ భార్య.. ఇలా మరికొంత సమయం కావాలని కోరారు. ఇది కూడా చదవండి: రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? -
రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట బెయిల్ వచ్చినా, రెండోసారి మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాని బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఎందుకని? హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదంగా మారి భారతీయ జనతా పార్టీ వేటుకు గురయ్యారు. మరోవైపు మొదటిసారి జరిగిన పొరపాటును సరిచేసుకుని పీడీ యాక్ట్ పెట్టి మరీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్న రాజాసింగ్ను ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనపై గతంలోనే ఉన్న రౌడీ షీట్ ఆధారంగా బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకుల నుంచి పెద్దగా స్పందన కానరావడంలేదు. ప్రవక్త మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను కూడా పార్టీ సస్పెండ్ చేశారు కమలనాథులు. ఇప్పుడు మునావర్ కామెడీ షో తో రాజాసింగ్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. దీంతో అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు రాజాసింగ్ను పార్టీ సస్పెండ్ చేసింది. సాధారణంగా ఏవైనా ఆందోళనలు చేసినపుడు అరెస్టులు జరిగితే పార్టీ నేతలు వెంటనే రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తారు. అయితే రాజాసింగ్ విషయంలో మాత్రం బీజేపీ ఆయన్ను పూర్తిగా వదిలించుకున్నట్లుగా కనిపిస్తోంది. తొలినుంచీ పార్టీ నాయకులతో విభేదిస్తూ.. పార్టీ విధానాలకు భిన్నంగా నడుచుకునే రాజాసింగ్ అంటే పలువురు నేతలు కోపంగానే ఉంటారనేది అందరికీ తెలిసిందే. రాజాసింగ్ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతోనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు ఎమ్మెల్యే మీద ఆగ్రహంతో ఉన్నపుడు మనకెందుకులే అనుకున్న రాష్ట్ర నాయకులు కూడా రాజాసింగ్ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ను దూరంగా ఉంచితేనే ప్రస్తుతానికి పార్టీకి మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. కాని తనకు పార్టీ కంటే ధర్మమే ముఖ్యమంటున్నారాయన. పార్టీ అధిష్టానానికి తాను సంపూర్ణంగా వివరిస్తూ త్వరలో లేఖ రాస్తానని చెప్పుకుంటున్నారు రాజాసింగ్. కాగా, బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ భార్య మెయిల్ చేశారు. రేపటితో(సెప్టెంబర్2) రాజాసింగ్కు పార్టీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి మెయిల్ చేశారు. రాజాసింగ్ జైలు ఉండటంతో మరికొంత సమయం ఇవ్వాలని మెయిల్లో పార్టీ క్రమశిక్షణా కమిటీని కోరినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసిన బీజేపీ.. ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ప్రశాంతంగా నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్
-
హైదరాబాద్: MIM నేత కషఫ్పై పీడీయాక్ట్
-
హైదరాబాద్లో మరో నేతపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్:సోషల్మీడియాలో తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న ఓల్డ్ మలక్పేటకు చెందిన యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాదర్ఘాట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఓల్డ్మలక్పేటకు చెందిన అబ్దాహు ఖాద్రీ అలియాస్ కసఫ్ తన ట్విట్టర్ ఖాతాలో తరచూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్ట్లు పెట్టేవాడు. ఈనెల 22, 23న బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి చర్యల వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు వాహనాలపై, వేటు వ్యక్తుల వాహనాలపై పలువురు దాడులు జరిగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కసఫ్పై గతంలోనూ నగరంలోని మీర్చౌక్, చాదరఘాట్, సీసీఎస్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. అతడి విద్వేష పూరిత, రెచ్చగొట్టే వీడియోలు, నినాదాలు ప్రజల భద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళవారం చాదర్ఘాట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని అదుపులోకి తీసుకుని చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కసఫ్ గతంలో ఎంఐఎం సోషల్మీడియా కన్వీనర్గా పని చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్న కారణంగా పార్టీ అతడిని దూరంగా పెట్టినట్లు తెలిసిందని ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. -
రాజాసింగ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆదిలాబాద్ బంద్ కు పిలుపు
-
చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్పై ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, రాజాసింగ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో ఉగ్రవాద ఖైదీలున్న నేపథ్యంలో రాజాసింగ్ను ప్రత్యేక బ్యారెక్లో వసతి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్పై నమోదు చేసిన పీడీ యాక్ట్ను రివోక్ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాజాసింగ్ అరెస్ట్లో పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్ ప్రపోజర్స్ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించనుంది. నెలలోపు రాజాసింగ్ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్ను ఆయన లాయర్లు ములాఖత్ ద్వారా ఇప్పటికే కలిశారు. కాగా, పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. రాజాసింగ్ అభిమానులు, హిందూ సంఘాలు.. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. ఇక, భైంసాలో బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
రాజాసింగ్ అరెస్ట్ ఎఫెక్ట్.. షాపులు, పాఠశాలలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్పై రౌడీషీట్ ఉన్నట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ను అందించినట్టు కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: రాజా సింగ్పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి? -
BJP MLA Raja Singh: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
హైదరాబాద్జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాలన్నిటిలోనూ కుల సమీకరణాలకంటే మత సమీకరణాలే కీలకం కానున్నాయి. అన్ని పార్టీలకు హిందుత్వమే కీలకం కానుంది. మజ్లిస్ను ఓడించాలంటే హిందుత్వతోనూ ముందుకు సాగాలని కమలనాథులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. గెలుపునకు వారి ఓట్లే కీలకం గతంలో కాంగ్రెస్కు కంచుకోటలా ఉన్న గోషామహాల్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి కంచుకోటగా మారింది. గోషా మహల్ను వశం చేసుకునేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్లో ఎలాగైనా పాగా వేయాలని అన్ని పార్టీలు తహ తహలాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా అంతే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లే కీలకం కాబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా హిందూ ఓట్లే రాజాసింగ్ను గెలిపించాయని చెప్పక తప్పదు. గోషామహాల్ ఏరియాలో బేగం బజార్ అత్యంత కీలకం. ఇక్కడ షాపుల యజమానులందరూ మార్వాడీలే. ఇక్కడ ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశం ఉంది. అలాగే యాదవ, బెస్త, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు అన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 16 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితే గెలుస్తామనే ధీమాను కాంగ్రెస్, టిఆర్ఎస్ లు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఆయనపై నమోదైన కేసులు.. బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వెరసి రాజాసింగ్ రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాంగ్రెస్నేత ముఖేష్ గౌడ్ మృతి చెందడంతో... ఆ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. ఫిషర్మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ , అంజన్ కుమార్ యాదవ్ చిన్న కొడుకు అరవింద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసే అవకాశం ఉంది. (చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! ) ఖైరతాబాద్లో కాంగ్రెస్ నుంచి ఎవరు? ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. అన్ని రంగాలకు చెందిన వీఐపీలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా.. ఫిలింనగర్ మురికివాడలు, బస్తీలు కనిపిస్తాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే కాలనీ సహా అనేక రంగాల కీలక కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పి. జనార్థనరెడ్డి ఉన్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ మృతి, 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత దానం టిఆర్ఎస్లో చేరి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఖైరతాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి దానం నాగెందర్ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఏస్పీ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ ఈసారి టిక్కెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్ రెడ్డి ఈసారి కచ్చితంగా తనకే టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మధ్యే టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకే టిక్కెట్ అని చెబుతున్నారు. (చదవండి: సెప్టెంబర్ 7కు హైదర్నగర్ భూముల కేసు వాయిదా) సర్వేతో భయపడుతున్న కాలేరు అంబర్పేటలో రెండుసార్లు వరుసగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విజయం సాధించగా... గత ఎన్నికల్లో కిషన్రెడ్డి మీద టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాక్ ఎక్కువగానే ఉంది. దీంతో హిందూ, ముస్లిం ఎజెండాలో బీజేపీ ఈజీగా బయటపడుతుందని కమలనాధులు లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాలేరు వెంకటేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ తనకే టిక్కెట్ వస్తుందని కాలేరు వెంకటేష్ భావిస్తున్నారు. అయితే సర్వేలో మంచి మార్కులు వచ్చిన సిట్టింగ్ లకే మళ్ళీ టిక్కెట్ అనడంతో కాలేరుకు సర్వే భయం పట్టుకుందట. ఇక్కడ పార్టీ ఓట్బ్యాంక్తో పాటు.. మైనారిటీ ఓట్లతో గెలవవచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో దింపితే అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు లైన్ లో ఉన్నారు. అయితే వీహెచ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని అదిష్టానం ముందు మెలిక పెట్టారట వీహెచ్. ఫైనల్గా వీహెచ్ ఆశీర్వాదం ఉన్న వారికి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినందున ఇక్కడ కాంగ్రెస్ స్థానంలో టీజేఎస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళిందనే ఆందోళన కనిపిస్తోంది. (చదవండి: ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?) -
అదే జరిగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే!
ఓ నేరం చేసి అరెస్టు కావడం..బెయిల్ పొంది బయటకు రావడం.. మళ్ళీ అదే ‘దందా’ కొనసాగించడం.. నగర కమిషనరేట్ పరిధికి చెందిన అనేకమంది రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లు, సాధారణ దొంగల పంథా ఇది. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి పోలీసు విభాగం పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు నిర్బంధం) చట్టాన్ని వినియోగిస్తోంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఓ ఎమ్మెల్యేని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకుని జైలుకు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం అప్పట్లో ఎక్సైజ్ విభాగమే... నాటుసారా తయారీ–విక్రయం, మాదక ద్రవ్యాల అక్రమరవాణా–అమ్మకం, బందిపోటు దొంగతనాలు, మనుషుల అక్రమ రవాణా, భూ కబ్జాలు, గూండాయిజం.. ఈ తరహా నేరాలతో రెచ్చిపోతున్న వారిని నియంత్రించే ఉద్దేశంతో 1986లో పీడీ యాక్ట్ను అమల్లోకి తీసుకువచ్చారు. ఓసారి ఈ చట్టం కింద అదుపులోకి తీసుకుంటే, ప్రభుత్వం ఆమోదిస్తే 12 నెలల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే ఉంచవచ్చు. ఆరు కేటగిరీలకు చెందిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉన్నా.. ఒకప్పుడు కేవలం నాటుసారా కేసుల్లో ఎక్సైజ్ విభాగం మాత్రమే దీన్ని వినియోగించేది. చాలా అరుదుగా మాత్రమే పోలీసు విభాగం ప్రయోగించేది. రాష్ట్రం ఏర్పడటంతో మారిన విధానం పీడీ యాక్ట్ను మెజిస్టీరియల్ అధికారాలున్న జిల్లా కలెక్టర్ లేదా పోలీసు కమిషనర్ మాత్రమే వినియోగించగలరు. నగరంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని 2014లో నగర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం స్పెషల్ బ్రాంచ్లో సంయుక్త పోలీసు కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ, న్యాయ సలహాదారుతో సహా 12 మంది సిబ్బందిని ఈ సెల్కు కేటాయించారు. పీడీ యాక్ట్ ప్రయోగ ప్రతిపాదనల్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి, దాని పరిధిలోకి వచ్చే వారిపై యాక్ట్ ప్రయోగానికి కొత్వాల్కు సిఫారసు చేయడం వీరి విధి. రాజాసింగ్ వ్యవహారంలోనూ ఈ విభాగం సిఫారసు ఆధారంగానే పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేస్తే.. నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేసి కేసులు నమోదైన వారిపై ఈ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. ఏదైనా పోలీసుస్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ ఈ తరహా నిందితులను గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదిస్తారు. దీన్ని ఏసీపీ సమీక్షించిన తర్వాత డీసీపీ ద్వారా కొత్వాల్కు చేరుతుంది. ఆయన పూర్వాపరాలు పరిశీలించాల్సిందిగా పీడీ సెల్ను ఆదేశిస్తారు. ఆ సెల్ ఒకే అని నివేదిక ఇస్తే, ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ అతను అప్పటికే జైల్లో ఉంటే అక్కడే ఇస్తారు. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని ప్రభుత్వం సమర్ధించాల్సి ఉంటుంది. ఈ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తి పూర్తి వివరా లను ప్రభుత్వానికి పంపడం ద్వారా 12 రోజుల్లోగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆపై కేసు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డుకు వెళ్తుంది. ఈ బోర్డు సదరు వ్యక్తి/ కుటుంబీకుల వాదనను విని, నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నిర్ణయాన్ని సమర్ధించడమో, లోపాలుంటే తిరస్కరించడమో చేస్తుంది. ఆ తర్వాత అప్పీల్ హైకోర్టులోనే ఉంటుంది. నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం 5 జోన్లు (ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్), 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. 2014 నుంచి పీడీ యాక్ట్ ప్రయోగాల్లో అత్యధికం పశ్చిమ మండల పరిధిలోనే జరిగాయి. రాజాసింగ్ కూడా ఈ మండల పరిధిలోని నివాసే కావడం గమనార్హం. కాగా, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్)కు తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్కాలర్ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల సంచలన ప్రకటన.. రాజా సింగ్పై పీడీ యాక్ట్ -
BJP MLA Raja Singh: అరెస్ట్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ /చార్మినార్/అబిడ్స్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్ చేయడంతో ధూల్పేట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీసులు రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం వెస్ట్జోన్ పోలీసులతో పాటు టాస్్కఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజాసింగ్ ఇంటి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజాసింగ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ధూల్పేటతో పాటు గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చార్మినార్ వద్ద బలగాల పహారా రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి దుకాణాలను మూసివేయించగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మూసివేశారు. ఫీల్ఖానా, బేగంబజార్, కోల్సివాడి, ఛత్రి, మిట్టికాషేర్, సిద్దిఅంబర్ బజార్, బర్తన్బజార్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. రాజాసింగ్ అరెస్టుతో ఎంజే మార్కెట్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్, టీఆర్ఎస్లు కక్షతోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బేగంబజార్, జాంబాగ్, ధూల్పేట్, మంగళ్హాట్, చుడీబజార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాజాసింగ్ అరెస్టుపై చర్చించుకోవడం కనిపించింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రాజాసింగ్ అభిమానులు ఈ రోజు గడిస్తే చాలు! శుక్రవారం.. సాధారణ పరిస్థితుల్లోనే నగర పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాంటిది ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పాతబస్తీలోనే కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరం సోమవారం రాత్రి నుంచి అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకూడదని నిర్ణయించారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని పోలీసు స్టేషన్ల పరిధితో పాటు మిగిలిన చోట్లా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగం బజార్లో భారీగా మోహరించిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు.. బారికేడ్లు, సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద ఉన్న సిబ్బందికి తోడు అత్యవసర సమయాల్లో వి«నియోగించడానికి స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్ను సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను కనిపెట్టి, వెంబడించడానికి మఫ్టీల్లో ఉండే షాడో పారీ్టలు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి నగరంలోని ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్లో ఉంచారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల వెంట కొన్ని రిజర్వ్ టీమ్స్ ఉంటాయి. ఇవి సదరు అధికారి వెంటే ఉంటూ అవసరమైన చోటకు వెళ్తాయి. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అణువణువు నిఘా ఉంచి, చిత్రీకరించడానికి వీడియో, డిజిటల్ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పీస్ కమిటీలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అత్యంత అప్రమత్తంగా.. బందోబస్తు, భద్రత ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలోని ప్రాంతాలతో పాటు మిగిలిన చోట్లా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. దీనికి సంబంధించి కమిషనర్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నగర అధికారులతో పాటు బందోబస్తు కోసం జిల్లాలు, ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులు హాజరయ్యారు. ఇందులో శుక్రవారం అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. అత్యంత సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు సోమవారం రాత్రి నుంచి నిరసనలు చోటు చేసుకున్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలు ఇతర వ్యవహారాలను పసిగట్టడానికి వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం కంట్రోల్ రూమ్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాజాసింగ్ అరెస్టును నిరశిస్తూ దుకాణాలు మూసివేత బోసిపోయిన పాతబస్తీ: పాతబస్తీలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచీ సాయంత్రం ఎలాంటి నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు జరగలేదు. శాలిబండ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మజ్లిస్ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన రోడ్లపైకి వచ్చి రాజాసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దక్షిణ మండలం పోలీసులు లాఠీ చార్జి చేశారు. విషయం తెలుసుకున్న శాలిబండ మజ్లిస్ కార్పొరేటర్ ముజఫర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. రెండు మూడు రోజులుగా పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ వద్ద సందర్శకుల సందడి తగ్గింది. చిరు వ్యాపారాలు వెలవెలబోయాయి. నయాపూల్, మదీనా, మీరాలంమండి, పత్తర్గట్టి, గుల్జార్హౌజ్, చార్కమాన్, లాడ్బజార్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాతబస్తీలో ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రాంతాలను బట్టి ఏర్పాట్లు.. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బందోబస్తులో ప్రాంతాల స్థితిగతులను బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు, ఉద్రేకాలకు తావు లేని చోట్ల సాధారణ స్థాయి పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, సోదాలు, నాకాబందీలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా గల్లీలు, మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారుజామున సైతం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజేష్ మెడికల్ హాల్ వద్ద పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు. బుధవారం మొఘల్పురా వద్ద పోలీసు వాహనం ధ్వంసానికి సంబంధించి స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. (చదవండి: రాజా సింగ్పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?) -
30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్బోర్డుకు 65 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఏపీ వక్ఫ్బోర్డు చైర్మన్ ఖాదర్బాషా చెప్పారు. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏపీలో వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తమ పాలకవర్గం కృషిచేస్తోందన్నారు. విజయవాడలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. బుధ, గురువారాల్లో విజయవాడలో జరిగిన బోర్డు సమావేశంలో 150 అంశాలను చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నామని, అందుకోసం పెండింగ్లో ఉన్న 220 కమిటీలు వేశామని చెప్పారు. దర్గా (దౌలత్)లకు సంబంధించి ఈ 2 రోజుల్లో 200 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వక్ఫ్ భూముల్లో సుమారు వందవరకు కమర్షియల్ ఆస్తులు ఉన్నాయన్నారు. వాటినుంచి వక్ఫ్బోర్డుకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు తన అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సీఎం కమిటీ ఏర్పాటు చేశారన్నారు. వక్ఫ్ కేసులకు సంబంధించి కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటవుతోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే, వక్ఫ్బోర్డు సభ్యుడు హాఫీజ్ఖాన్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్ని కఠినంగా శిక్షించాలన్నారు. -
ఎమ్మెల్యే రాజా సింగ్పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేసిన ఆయన వ్యాఖ్యలు భాగ్యనగరంలో అలజడి సృష్టించాయి. గత వారం రోజుల్లో రెండు సార్లు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈసారి ఆయనపై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్పై రౌడీషీట్ ఉండటంతో పీడి యాక్ట్ నమోదు చేసినట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈక్రమంలో పీడీ యాక్ట్ హాట్ టాపిక్ అయింది. ఇంతకూ పీడీ చట్టం అంటే ఏంటి? దీనిని ఎలాంటి సందర్బాల్లో ఉపయోగిస్తారు.. అసలు ఈ చట్టం ఉద్ధేశం ఏంటో తెలుసుకుందాం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) ను మన దేశంలో 1950లో అమల్లోకి తీసుకొచ్చారు. పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు అమలు చేసే చట్టం ఇది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు. విద్వేషపూరిత ప్రసంగం, అల్లర్లు, విచక్షణారహిత హింస, తీవ్రవాదం, అంతర్రాష్ట్ర దొంగలు, హంతకులు, ఆన్లైన్ మోసగాళ్లు, వ్యభిచార నిర్వహణ, మాదక ద్రవ్యాల ముఠాలు.. ఇలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై దీన్ని ప్రయోగిస్తారు. ప్రజల భద్రతలకు హాని కలిగించడం.. సమాజానికి ముప్పుగా పరిణమించే వారిపై ఈ చట్టాన్ని బ్రహ్మాస్త్రంగా వినియోగిస్తారు. నేరాల అదుపునకు విచారణ అవసరం లేకుండా వ్యక్తులను కట్టడి చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో మరిన్ని తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్కాలర్ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. అయితే పీడీ చట్టంపై విమర్శలూ ఎక్కువే. వ్యవస్థీకృత నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగానికి గురవుతూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. తీవ్రమైన నేరాలు చేసి.. సమాజ భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్నవారిపై ఉపయోగించాల్సిన ఈ యాక్ట్ను చిల్లర దొంగతనాలు, చిట్టీల వ్యాపారాలు, వ్యభిచార నేరాలకు పాల్పడినవారిపైనా ప్రయోగించి పోలీసులు విమర్శలు ఎదుర్కొన్న దాఖలాలున్నాయి. క్రిమినల్ లా ప్రకారం వారిని విచారించి శిక్షించాల్సింది పోయి పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలులో పెట్టడమే లక్ష్యంగా దీన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువే. నిర్బంధమే లక్ష్యంగా ఈ చట్టాన్ని వినియోగించడం రాజ్యాంగంలోని అధికరణ 21కి విరుద్ధమే! (క్లిక్: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా) -
ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్
-
హైదరాబాద్ సీపీ సంచలన ప్రకటన.. రాజా సింగ్పై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ను అందించినట్టు కమిషనర్ వెల్లడించారు. కాగా, ఈనెల 22న ఓ యూట్యూబ్ చానల్లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. చదవండి: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్ -
ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? అని మండిపడ్డారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రుష్టిస్తున్న హింసకాండనుంచీ విముక్తి పొందాలని అసిద్దం. — Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022 దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామన్నారు. చదవండి: Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా? — Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022 ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్లోని ఆయన ఇంట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజాసింగ్కు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. చదవండి: Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
-
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్లోని ఆయన ఇంట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజాసింగ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. అరెస్టుకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మంగళ్హట్ పీఎస్లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో 505(2), 171, రెడ్విత్ 171 సెక్షన్లు , షాహినాయత్గంజ్ పీఎస్లో క్రైమ్ 71/2022లో 153(ఏ). 295 (ఏ), 504, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్హాట్ పోలీసులు కోరారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ -
మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్
-
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోము: హోం మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముస్లిం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలు పాతబస్తీలో మోహరించాయి. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ తాజాగా మీడియాతో మాట్లడుతూ.. ‘‘శాంతియుత వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదు. బీజేపీ అయినా.. ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రాజాసింగ్కు మరో షాక్ -
రాజాసింగ్కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి?
BJP MLA Raja Singh.. సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్కు తాజాగా మరో ఊహించని షాక్ తగిలింది. పోలీసులు మరోసారి రాజాసింగ్కు నోటీసులు పంపించారు. పాత కేసులకు సంబంధించి రెండు కేసుల్లో 41(A) సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలకు సంబంధించి రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళ్హట్, షాహినాయత్గంజ్ పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళ్హట్ పీఎస్లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో, షాహినాయత్గంజ్ పీఎస్లో క్రైమ్ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. ఇక, రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను మళ్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్ -
ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తాను చేసిన వీడియోలో ఏ మతాన్నీ కించపర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాను మాట్లా డలేనని తెలిపారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సమాధానం ఇస్తానని చెప్పారు. తాను ఇచ్చే వివరణతో పార్టీ సంతృప్తి చెందు తుందని, బీజేపీ తనను వదులుకోబోదని భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా స్వామి పరిపూర్ణా నంద బుధవారం రాజాసింగ్ నివాసానికి వెళ్లి కలిశారు. రాజాసింగ్ను పరామర్శించి, అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అరెస్ట్, అనంతరం విడుదల, కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. -
Telangana: రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎవడో జోకర్ ఏదో మాట్లాడాడు. ఆ జోకర్కు ఈ సన్నాసులు పోలీసుల కాపలా పెట్టి అనుమతినిచ్చారు. ఆ జోకర్ మాట్లాడిన దానిపై రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడతారు. ఇంతకూ ఈ రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారు? తెలంగాణను తగలబెట్టి శ్మశానాలను ఏలాలని బీజేపీ అనుకుంటోందా? కేసీఆర్ ఏం చేయదల్చుకున్నారు? ఇంతటి విద్వేషాలను రెచ్చగొట్టి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం భావ్యమా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ నేతలు మల్లురవి, చిన్నారెడ్డి, అనిల్, శంకర్ నాయక్, ప్రీతం, రోహిణ్రెడ్డిలతో కలిసి ఆయన మీడియా భేటీలో మాట్లాడారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగింది. ఆ పార్టీకి పంజాబ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సీఎం కేజ్రీవాల్ను కేసీఆర్ కలిశారు. ఇద్దరూ కలిసి పంజాబ్ కూడా వెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఆయా పార్టీలకు ఆర్థిక తోడ్పాటునందించి తనకు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుటుంబస భ్యుల ఇళ్లపై సీబీఐ, ఈడీ ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ ఐటీ దాడులు చేసి వ్యాపార సంస్థలను బెంబేలెత్తిస్తోందని రేవంత్రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్ని కలు రాగానే సుమధుర, వాసవి, ఫీనిక్స్ సంస్థలపై దాడులు మొదలయ్యాయన్నారు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదని, బీజేపీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అని అన్నారు. ప్రియాంక మార్గదర్శనం మునుగోడు అభ్యర్థిని నెలాఖరు వరకు ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజులు అటూ ఇటు అవుతుందని రేవంత్ చెప్పారు. ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు కూడా ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రియాంకాగాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడించారు. -
Raja Singh: చేటు తెచ్చిన మాటలు!.. 2018లో ఒకే ఒక్కడు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరి.. రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఓ వర్గంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఆ వర్గం వారు తరచూ నగర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. బక్రీద్ సందర్భంగానూ ఆయన ప్రత్యేకంగా యువకులతో గోరక్షక దళాలు ఏర్పాటు చేసి నగరానికి ఆనుకొని ఉన్న టోల్గేట్లు, నగరంలోకి ప్రవేశించే అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై గస్తీ ఏర్పాటు చేస్తారని.. ఓ వర్గం వారిపై దాడులకు పాల్పడతారన్న అపవాదు ఆయనపై ఉంది. ఈ విషయంలోనూ ఆయనపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నగరంలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీకి రాజాసింగ్ తీరుతో కొన్నిసార్లు మేలు జరగ్గా.. మరికొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2018లో ఒకే ఒక్కడు.. రాజాసింగ్ రెండుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో అంబర్పేట్ బరిలో నిలిచిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ముషీరాబాద్ బరిలో నిలిచిన ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్లు టీఆర్ఎస్ వేవ్ కారణంగా ఓడిపోయినా.. రాజాసింగ్ గెలిచి సత్తా చాటారు. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
రాజాసింగ్ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్యే: అసదుద్దీన్ ఒవైసీ
-
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ
-
‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’
సాక్షి, సూర్యాపేట: రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని.. బీజేపీ నాయకుల కుట్రల వెనుక కేంద్ర పెద్దల హస్తముందని మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో నడవదన్నారు. బీజేపీ తన వికృత రూపం బయట పెడుతుందని మండిపడ్డారు. చదవండి: స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్ తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ నాయకుల లక్ష్యమన్నారు. బీజేపీ నాయకులు చట్ట సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఎంపీ ఆరోపిస్తే తెలంగాణలో ఎందుకు దాడులు చేస్తున్నారు. బీజేపీ నేతల అరాచకాలను మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని జగదీష్రెడ్డి అన్నారు. -
స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
BJP MLA Raja Singh: రాజాసింగ్కు బెయిల్.. నాంపల్లి కోర్టు ఏం సూచించిందంటే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ సాక్షితో మాట్లాడారు. రాజాసింగ్ రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ వాదనలు వినిపించామని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయాలంటే 41 సీఆర్పీసీ నోటీసులు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే రాజాసింగ్కు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. తమ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసిందని కరుణ సాగర్ చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం ఎమ్మెల్యేకు సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వీడియోకు సంబంధించి న్యాయస్థానంలో ఎలాంటి వాదనలు జరగలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటివరకు పోలీసులు కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. కేవలం రాజసింగ్ రిమాండ్ను రిజెక్ట్ చేయాలని తమ వాదనలు వినిపించామని, 20 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలకతీర్పు వెల్లడించిందన్నారు. చదవండి: BJP MLA Raja Singh: రాజాసింగ్కు రిమాండ్ వ్యవహారంలో ట్విస్టు! -
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ మంజూరు
-
BJP MLA Raja Singh: రాజాసింగ్కు రిమాండ్ వ్యవహారంలో ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రాజాసింగ్ రిమాండ్ను రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. 41 సీఆర్పీసీపై 45 నిమిషాలపాటు ఇరువర్గాలు వాదనలు కొనసాగించాయి. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించనందుకు రాజాసింగ్ రిమాండ్ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. చదవండి: రాజీ’ ఎరుగని రాజా సింగ్.. దేశవ్యాప్తంగా కేసులే కేసులు -
రాజాసింగ్ సస్పెన్షన్పై కిషన్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయనను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాజాసింగ్ ఏం మాట్లాడారనే విషయం కూడా తనకు తెలియదన్నారు. యూట్యూబ్లో ఆయన మాట్లాడిన వీడియో చూసేందుకు ప్రయత్నించానని కానీ, ఎక్కడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. కాగా.. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని రాజాసింగ్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు 14 రోజుల రిమాండ్
-
హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చాంద్రాయణగుట్ట, మలక్పేట్, చార్మినార్ వెళ్లే దారులతో పాటు చంచల్గూడ జైలు పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాజాసింగ్పైపై 12 కేసులు నమోదవడం గమనార్హం. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. చదవండి: Raja Singh Suspension: ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. అంతకముందు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. రాజాసింగ్కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. -
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. రాజాసింగ్కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. ఇదిలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. మంగళవారం ఒక్కరోజే ఈ బీజేపీ ఎమ్మెల్యేపై 12 కేసులు నమోదవడం గమనార్హం. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలింపు
-
‘రాజీ’ ఎరుగని రాజా సింగ్.. దేశవ్యాప్తంగా కేసులే కేసులు
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు. పోలీసులు ఇప్పటికే రాజాసింగ్ను అరెస్టు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. అయితే రాజాసింగ్కు వివాదాలు కొత్తేం కాదు. ఆయనపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. ► రాజాసింగ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014 నుంచి హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ► 2015లో ఓ పెళ్లి వేడుకలో డీజేను ఆపేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి రాజాసింగ్ మొదటిసారి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యూజిక్ ప్లే చేస్తే ఆపేందుకు వెళ్లిన పోలీస్పై దాడి చేశాడు. దీంతో రాజాసింగ్పై కేసు నమోదైంది. ► అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓ వర్గం విద్యార్థులు ప్రకటించినప్పుడు రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను రక్షించేందుకు ప్రాణలైనా అర్పిస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు. ► 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై మొత్తం 43 కేసులు నమోదైనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, విద్వేష ప్రసంగాలు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి కేసులు తనపై ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ► 2020లో రాజాసింగ్ను ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్బుక్ లేబుల్ చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్లో విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆయనపై నిషేధం విధించింది. రోహింగ్యా ముస్లింలపై, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. ► 2022 ఏప్రిల్లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. భారత్ త్వరలోనే హిందూ దేశంగా మారుతుందని ఆయన పాట కూడా పాడారు. ► గతవారం హైదరాబాద్లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని బెదిరించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ► తాజాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా అగ్గిరాజేశారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. -
బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్
-
ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా..
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్తో రాజాసింగ్పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్ .. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. కాగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై మజ్లిస్ నేతలు, మైనార్టీలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్లలో ఫిర్యాదులు చేశారు.దీంతో యూట్యూబ్ నుంచి రాజాసింగ్ వీడియోను పోలీసులు తొలగించారు. కొనసాగుతున్న కేసుల పరంపర బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజాసింగ్పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు చోట్ల, హైదరాబాద్లో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళ్హాట్, బహదూర్పురా, బాలానగర్, డబీర్పూర, సంగారెడ్డి నిజామాబాద్లో రాజాసింగ్పై కేసులు ఫైల్ చేశారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మజ్లీస్ నేతల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో రాజాసింగ్ను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే.. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
-
Telangana: హీటెక్కిన స్టేట్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి పరిణామమూ రాజకీయ చర్చకే దారితీస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నాటి నుంచి మొదలైన సెగ, రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులు, మరోవైపు దర్యాప్తు సంస్థల దాడులతో గత వారం రోజులుగా రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య ఓ రకంగా యుద్ధమే నడుస్తోంది. ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు మునుగోడు కేంద్రంగా జరిగిన రెండు పార్టీల బహిరంగ సభలు, అంతకుముందే వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మద్యం స్కాం, వాసవి.. సుమధుర రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు తాజాగా ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐటీ దాడులతో అలజడి రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. వాసవి, సుమధుర రియల్ ఎస్టేట్ సంస్థలపై గత వారంలో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు హైదరాబాద్తో పాటు ఈ రెండు కంపెనీలకు చెందిన 20 చోట్ల ఏకకాలంలో జరిపిన దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఈ కంపెనీలతో సంబంధాలున్నాయని టీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన మద్యం స్కాం ప్రకంపనలు రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయి. ఈ కేసు కూడా సీఎం కేసీఆర్ కుటుంబం వైపు మళ్లింది. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉందని, ఆమె ద్వారానే నగదు చేతులు మారిందని బీజేపీ నేతలు ఆరోపించడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. తాజాగా మంగళవారం ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడులు కూడా చర్చనీయాంశమయ్యాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆ సంస్థపై ఐటీ దాడులు చేయగా, ఈ కంపెనీతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు మొదలయ్యాయి. ధర్మదీక్షకు సిద్ధమైన సంజయ్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో హస్తం ఉందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేపీ నేతలు సోమవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కవితపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు మంత్రులు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసుల నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలోనే ధర్మదీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేశారు. పనిలో పనిగా అసలు సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదని, ఉద్రిక్తతలకు కారణమవుతున్నందున ఈ పాదయాత్రను నిలిపివేయాలని చెబుతూ గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం దీక్షలకు బీజేపీ సిద్ధమవుతోంది. తన పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తానని, ఈనెల 27న హనుమకొండలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభ జరుగుతుందని బండి సంజయ్ ప్రకటించడంతో.. రాష్ట్రంలో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. రాజాసింగ్ వీడియోతో రచ్చ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గానికి చెందిన ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్లో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇలావుండగా టీఆర్ఎస్, బీజేపీలు రెండూ రాజకీయ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఢిల్లీ మద్యం స్కాంలో కేసీఆర్ కుమార్తె ప్రమేయం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీని ప్రశ్నిస్తోంది. కేసీఆర్ కుటుంబానికి సంబంధాలున్న రియల్ సంస్థలపై కేవలం ఐటీ దాడులకే పరిమితమై మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని, గల్లీలో కుస్తీలు పట్టినట్టు నటిస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని విమర్శిస్తుండటం గమనార్హం. .8 నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఇక, హైదరాబాద్లోని పలు పీఎస్లలో రాజాసింగ్పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: పార్ట్-2 కూడా ఉంది.. చావడానికైనా రెడీ: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్